Hyderabad

News July 8, 2024

HYD: ఈ 3రోజులు వాహనాల పార్కింగ్ ఎక్కడంటే?

image

బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం సందర్భంగా నేటి నుంచి 3రోజులపాటు పార్కింగ్ చేయాల్సిన ప్రాంతాలను అధికారులు తెలిపారు. SRనగర్ టీ జంక్షన్ సమీపంలోని R&B కార్యాలయంలో, ఫుడ్ వరల్డ్ ఎక్స్‌రోడ్ సమీపంలోని GHMC గ్రౌండ్‌లో, రోడ్డు సైడ్ పార్కింగ్, నేచర్ క్యూర్ హాస్పిటల్ పార్కింగ్ యార్డ్‌లో, ఫతేనగర్ రైల్వే వంతెన కింద మాత్రమే వాహనాల పార్కింగ్‌కు అనుమతించారు.

News July 8, 2024

HYD: బస్తీ దవాఖానాల్లో యూరిన్ టెస్టులు చేయట్లే..!

image

ఒకవైపు సీజనల్ వ్యాధులు పెరిగిపోతుంటే​ బస్తీ దవాఖానాల్లో అన్నిరకాల టెస్టులు చేయట్లేదనే రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో మొత్తం 169 బస్తీ దవాఖానాలు ఉండగా.. యావరేజ్​గా ఒక దవాఖానకు 100 మంది పేషెంట్స్ వస్తున్నారు. మెజారిటీ బస్తీ దవాఖానాల్లో యూరిన్​ టెస్టులు చేయట్లేదు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని పలువురు పేషెంట్లు వాపోయారు.

News July 8, 2024

HYD: ‘నర్సింగ్ సిబ్బందికి జీతాలు లేవు’ 

image

T.I.M.S నుంచి డిప్యూటేషన్లపై ఉస్మానియా, నిలోఫర్, కోఠి మెటర్నిటీ, సరోజినీ, E.N.Tకి వెళ్లిన నర్సింగ్ సిబ్బందికి 4 నెలలు గడుస్తున్నా జీతాలు లేవని వారు వాపోతున్నారు. తాము జీతాలు లేకుండా ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. ఏప్రిల్ నుంచి జీతాలు ఇవ్వడం లేదని, ప్రభుత్వం స్పందించి తమకు జీతాలు ఇవ్వాలని కోరుతున్నారు.  

News July 8, 2024

HYD: నేటి నుంచి 3 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు

image

బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం సందర్భంగా నేటి నుంచి 3 రోజులపాటు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. గ్రీన్ ల్యాండ్స్, మాతా టెంపుల్, సత్యం థియేటర్ నుంచి ఫతేనగర్ వెళ్లే వాహనాలను ఎస్ఆర్ నగర్ టీ-జంక్షన్ నుంచి అభిలాష టవర్స్, బీకేగూడ ఎక్స్ రోడ్డు, శ్రీరామ్ ‌నగర్ క్రాస్ రోడ్డు, సనత్ ‌నగర్ మీదుగా ఫతేనగర్ రోడ్డు వైపు డైవర్ట్ చేస్తారు. వాహనదారులు సహకరించాలని అధికారులు కోరారు.

News July 7, 2024

HYD: విహార యాత్రలో విషాదం

image

విహార యాత్రలో విషాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. HYD అంబర్‌పేట్‌కు చెందిన ఐదుగురు యువకులు కలిసి ఈరోజు భద్రాచలానికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన సమయంలో హరీశ్ (28) అనే యువకుడు గల్లంతై చనిపోయాడు. నీళ్ల లోతును అంచనా వేయలేక హరీశ్ కొట్టుకుపోయాడని అక్కడి పోలీసులు తెలిపారు. విషయం తెలిసి హైదరాబాద్‌లోని కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.

News July 7, 2024

HYD: కూచిపూడి రంగ ప్రవేశం కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి

image

HYDలోని శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన మాలతి & శ్రీనాథ్ నాగభైరవ కుమార్తె అరుషి నాగ భైరవ కూచిపూడి రంగ ప్రవేశ కార్యక్రమంలో నేడు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా NV రమణ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ గేయ రచయిత, గాయకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్, పరిగి MLA రామ్మోహన్ రెడ్డి, పలువురు ప్రముఖులు ఉన్నారు.

News July 7, 2024

HYD: సెక్రెటేరియేట్ ముట్టడికి నిరుద్యోగులకు పిలుపు: R.కృష్ణయ్య

image

తెలంగాణలో నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య, బీసీ జన సభ ఆధ్వర్యంలో జులై 15న సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిస్తున్నామని ఎంపీ R.కృష్ణయ్య, బీసీ జన సభ చీఫ్ రాజారాం యాదవ్, కొంపెల్లి రాజు తెలిపారు. ఈరోజు వాల్ పోస్టర్‌ను సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వారు ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని, అందరం కలిసి పోరాటం చేసి తమ సత్తా ఏంటో సీఎంకు చూపిస్తామన్నారు.

News July 7, 2024

ఉత్తరాఖండ్‌లోనే ఆ ఇద్దరి అంత్యక్రియలు..! 

image

ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించుకుని అద్దెకు తీసుకున్న బైకులపై తిరిగి వస్తున్న ఇద్దరు HYD యాత్రికులపై కొండ చరియలు విరిగిపడడంతో చనిపోయిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ పద్మారావునగర్‌కు చెందిన సత్యనారాయణ(50), నిర్మల్ షాహి(36)తోపాటు మరో ఇద్దరు నార్త్ ఇండియా టూర్‌కి వెళ్లారు. ప్రమాదంలో వారి మృతదేహాలు బాగా డామేజ్ కావడం, ఓ వ్యక్తి తల కూడా దొరకకపోవడంతో అక్కడే అంత్యక్రియలు చేశారని తెలిసింది. 

News July 7, 2024

ఉప్పల్ శిల్పారామంలో ఆకట్టుకున్న భరతనాట్య ప్రదర్శన

image

HYD ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నిర్మల నృత్యనికేతన్ గురువు విజయలక్ష్మీ శిష్య బృందం భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. వినాయక స్తోత్రం, అన్నమాచార్య కృతి, రామదాసు కృతి, సరస్వతి కీర్తన, తరంగం, పురందరదాసు కీర్తన, జయదేవ అష్టపది, పదం, మంగళ హారతి అంశాల్లో  నృత్యం చేశారు. కార్యక్రమంలో హిమశ్రీ, కావ్య, రోషిత, తన్మయి, తన్విత, కీర్తియుక, శ్రీనిధి, సంజన ఉన్నారు.

News July 7, 2024

HYD: బాలికపై అత్యాచారం కేసులో నిందితుడి ARREST

image

HYD కీసరలో బాలిక(14)పై <<13578768>>బహదూర్‌పుర వాసి మహేశ్(25)<<>> అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. బాత్ రూమ్‌కు వెళ్లిన కూతురు ఎంతకీ తిరిగిరాకపోవడంతో తండ్రి వెతికాడు. DCMలో అచేతన స్థితిలో ఉన్న కూతురిని చూసిన తండ్రి విలపిస్తూ వెళ్లి మహేశ్‌ను పట్టుకునేందుకు యత్నించగా అతడు వ్యాన్‌తో సహా పారిపోయాడు. తండ్రి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు.