Karimnagar

News June 29, 2024

వేములవాడ మున్సిపాలిటీలో రూ.101కు దహన సంస్కారాలు

image

వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో శనివారం జరిగిన పాలకవర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. పట్టణంలో మరణించిన వారి దహన సంస్కారాలను మూలవాగు ప్రాంతంలోని వైకుంఠధామంలో 101 రూపాయలకే నిర్వహించాలని మున్సిపల్ ఛైర్‌పర్సన్ రామతీర్థపు మాధవి అధ్యక్షతన పాలకవర్గం సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. వైకుంఠ రథం, కట్టెలు, డీజిల్, నీటిసరఫరాను రూ.101కే అందించనున్నట్లు తెలిపారు.

News June 29, 2024

కొండగట్టు చేరుకున్న పవన్ కళ్యాణ్

image

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ కొండగట్టు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పవన్ కళ్యాణ్ ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పవన్‌ను చూసేందుకు భారీగా అభిమానులు, పార్టీ శ్రేణులు, నాయకులు కార్యాకర్తలు తరలివచ్చారు.

News June 29, 2024

పెద్దపల్లి: గట్టు సింగారం గుట్టపై అస్థిపంజరం

image

పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామ పంచాయతీ పరిధిలోని గట్టు సింగారం గుట్టపై గుర్తు తెలియని వ్యక్తి అస్థిపంజరాన్ని గ్రామస్థులు గుర్తించారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శి రవి బసంత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ స్వామి ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. ఎవరిది అనేది తెలియాల్సి ఉంది.

News June 29, 2024

కరీంనగర్: అత్యాచార నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్ష

image

బాపట్ల జిల్లా చిలుకపాడుకు చెందిన దాసరి అంజి కరీంనగర్ జిల్లాకు చెందిన బాలికను అత్యాచారం చేశాడు. కేసును విచారించిన KNR పోక్సో కోర్టు జడ్జి వెంకటేశ్ నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.10,000 జరిమానా విధించారు. అంజి పెళ్లి చేసుకుంటానని బాలికను నమ్మించి 2013లో అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు 2016లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేరం రుజువవ్వడంతో శుక్రవారం కోర్టు తీర్పునిచ్చింది.

News June 29, 2024

స్వచ్ఛ కరీంనగర్‌గా తీర్చిదిద్దుదాం: ప్రఫుల్ దేశాయ్

image

కరీంనగర్‌ను స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దుదామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, (మున్సిపల్ కమీషనర్) ప్రఫుల్ దేశాయ్ పిలుపునిచ్చారు. వర్షాకాలం నేపథ్యంలో వాతావరణంలో సంభవిస్తున్న మార్పుల వల్ల ప్రజలు సీజనల్ వ్యాధులకు గురయ్యే అవకాశం ఉన్నదని జిల్లా ప్రజలందరు అప్రమత్తతతో, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. మన ఇంటి చుట్టు, పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవడం మనందరి బాధ్యత అని సూచించారు.

News June 29, 2024

KNR: విద్యార్థులది గ్రేట్ అచీవ్ మెంట్: కలెక్టర్

image

ఇటీవల నిర్వహించిన పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 483 మంది విద్యార్థులు ఉండగా 432 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. 51 మంది హాజరు కాలేదని చెప్పారు. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో 432 మంది విద్యార్థుల్లో 418 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. జిల్లాలో 96.76 శాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమన్నారు.

News June 29, 2024

సిరిసిల్ల: ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్

image

సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని సర్దాపూర్‌లో గల ఈవీఎం గోదామును కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం తనిఖీ చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా పరిశీలించి, రిజిస్టర్లో సంతకం చేసి అధికారులకు, భద్రతా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఆర్డిఓ రమేష్, తహసీల్దార్ షరీఫ్, ఎన్నికల విభాగం అధికారులు ఉన్నారు.

News June 28, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ తంగళ్లపల్లి మండలంలో ప్రభుత్వ పాఠశాలను పరిశీలించిన సిరిసిల్ల కలెక్టర్.
@ ధర్మపురి పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్.
@ ఎల్లారెడ్డిపేట మండలంలో బైక్ ఢీకొని బాలుడికి తీవ్ర గాయాలు.
@ కోరుట్ల పట్టణంలో ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన లారీ.
@ ఇబ్రహీంపట్నం మండలంలో దాడికి పాల్పడి చోరీ చేసిన ముగ్గురి అరెస్ట్.
@ కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌ను కలిసిన ఎంపీ ధర్మపురి అరవింద్.

News June 28, 2024

షియా మత పెద్దలతో మంత్రి పొన్నం సమావేశం

image

పవిత్ర మాసంలో నిర్వహించే కార్యక్రమాలకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీతో కలిసి వివిధ శాఖల అధికారులు, షియా మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. మొహర్రం కార్యక్రమాలు నిర్వహించే అశుర్ కానాల వద్ద పికెటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అశుర్ ఖానాల పరిసర ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాలన్నారు.

News June 28, 2024

KNR: తల్లి ప్రేమ.. కొడుకు కోసం ఆటో డ్రైవర్‌గా 55ఏళ్ల మహిళ

image

మనవళ్లు, మనవరాళ్లతో ఉండాల్సిన సమయంలో జీవనోపాధికోసం ఆటో నడుపుతూ జీవితాన్ని కొనసాగిస్తోంది కరీంనగర్ జిల్లా కొత్తపెల్లికి చెందిన ఉమా. భర్త కాలం చేయడంతో భర్త వృత్తినే తన వృత్తిగా మలుచుకుంది. 55ఏళ్ల వయసులో ప్రతిరోజు ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తోంది. ఆటోలు ఎక్కువ కావడంతో గిరాకీ తక్కువగా అవుతుందన్నారు. బిడ్డ, కొడుకుకు పెళ్లై పిల్లలు ఉన్నారని, కొడుకు కిడ్నీలు పాడవడంతో ఆటో నడుపుతున్నామని చెప్పింది.