Karimnagar

News April 11, 2025

కరీంనగర్: శిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం

image

కరీంనగర్ జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించుటకు ఆసక్తిగల వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు క్రీడా శాఖ తెలిపారు. జిల్లా క్రీడా శాఖ ఆధ్వర్యంలో మే 1 నుంచి 31 తేదీ వరకు వేసవి శిక్షణ శిబిరాలను జిల్లా వ్యాప్తంగా 10 గ్రామీణ ప్రాంతాలలో నిర్వహించేందుకు ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 20వ తేదీ లోపు అంబేద్కర్ స్టేడియంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News April 11, 2025

శంకరపట్నం: రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ మహిళ మృతి

image

శంకరపట్నం(M) తాడికల్ గ్రామశివారులో KNR-WGL ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. సైదాపూర్ మండలం గర్రెపల్లికి చెందిన కౌడగాని కిషన్ రావు, భార్య శోభ, కూతురు అశ్విని బైక్‌పై వెళ్తుండగా కారు ఢీకొట్టింది. దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. కరీంనగర్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శోభ చికిత్స పొందుతూ మృతి చెందింది. శోభ తమ్ముడు సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు SI రవి తెలిపారు.

News April 11, 2025

కరీంనగర్: ప్రవేశాల గడువు పెంపు

image

తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్ కళాశాల ప్రవేశాల దరఖాస్తు నెల 30 వరకు పొడిగించారు. అర్హత గల విద్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కరీంనగర్ జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ అధికారి డి. పవన్ కుమార్ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు కార్యలయంలో, 0878 2957085 ఫోన్‌లో సంప్రదించాలన్నారు. 

News April 11, 2025

KNR: సెర్ప్ సిబ్బందితో సమీక్షా సమావేశం

image

కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) ప్రపుల్ దేశాయ్ అధ్యక్షతన సెర్ప్ సిబ్బంది (DPMs/APMs/CCs & VOAs) తో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఐ.కె.పి ద్వారా చేపట్టబోయే (138) PPC లలో పారదర్శకంగా తూకం వేయాలని ఆదేశించారు. తేమ శాతాన్ని సరైన విధంగా చూస్తూ, తాలు లేకుండా కొనుగోలు చేయాలని, కొనుగోలుకు సంబంధించిన రికార్డ్‌ను డాటా ఎంట్రీని సకాలంలో పూర్తిచేయాలని అన్నారు.

News April 11, 2025

శంకరపట్నం: సన్న బియ్యం పథకం విప్లవాత్మకం: ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

image

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న బియ్యం పథకం అమలు చేయడం విప్లవాత్మకమని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శంకరపట్నం మండలం వంకాయగూడెం గ్రామంలో గురువారం సన్న బియ్యం లబ్దిదారుడు చలిగంటి గణేశ్ ఇంట్లో సన్న బియ్యంతో వండిన అన్నంతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్ సహపంక్తి భోజనం చేశారు.

News April 10, 2025

రామగుండంలో భూకంపం?

image

ఇటీవల వరుస భూకంపాలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం బ్యాంకాక్, మయన్మార్‌ దేశాల్లో భూకంపం దాటికి భారీగా ప్రాణనష్టం, ఆస్తినష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. అయితే, రామగుండంలో ఏప్రిల్ 10-17 మధ్య భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నట్లు Epic (Earthquake Research & Analysis) తెలిపింది. తమ పరిశోధన, విశ్లేషణ ప్రకారం రామగుండంలో భూకంపం సంభవించే అవకాశం ఉందని ట్విట్టర్‌లో పేర్కొంది.

News April 10, 2025

అన్నారం: హనుమాన్ దేవాలయంలో చోరీ

image

మానకొండూర్ మండలం అన్నారం చెరువు కట్ట పక్కన గల హనుమాన్ దేవాలయంలో చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. గత రాత్రి గుర్తుతెలియని దుండగులు తాళాలు పగలగొట్టి ఆలయంలోకి ప్రవేశించి హుండీలోని నగదుతో పాటు పది తులాల వెండిని దొంగిలించారని పేర్కొన్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News April 10, 2025

కరీంనగర్: బావిలో పడి చిన్నారి మృతి 

image

కరీంనగర్ రూరల్ మండలం బహదూర్ ఖాన్ పేటలో ట్రాక్టర్‌తో సహా ఓ చిన్నారి బావిలో పడి మృతి చెందిందని రూరల్ పోలీసులు తెలిపారు. ఆయన వివరాలు.. బొమ్మరెడ్డిపల్లెకు చెందిన జశ్విత(3) బంధువుల ఇంటికి బహుదూర్ ఖాన్ పేటకు వచ్చింది. వ్యవసాయ బావి వద్ద ట్రాక్టర్ సీటులో కూర్చుని తాళం తిప్పడంతో ట్రాక్టర్‌తో సహా బావిలో పడి మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News April 10, 2025

కరీంనగర్: కూతురిని చంపి తల్లి సూసైడ్

image

పెద్దపలి టీచర్స్ కాలనీలో <<16048255>>కూతురిని <<>>చంపి తల్లి సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాలు.. జూలపల్లి వాసి వేణుగోపాల్ రెడ్డితో KNR జిల్లా రామడుగు(M) వెదిరకు చెందిన సాహితి(26)కి పెళ్లైంది. రాత్రి వేణుగోపాల్ ఇంటికి వచ్చేసరికి కూతురు రితిన్యను చంపి భార్య ఉరేసుకుని కనిపించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 10, 2025

కరీంనగర్ వాసులారా.. మీ పిల్లలపై ఓ కన్నేయండి

image

వేసవి కాలం వచ్చింది అంటే చాలు చెరువులు, వాగులు, కాల్వల్లో పిల్లలు ఈత కొట్టడాన్ని మనం చూస్తూనే ఉంటాం. వీరిలో వేసవి తాపం తీర్చుకోవడానికి కొందరు, సరదా కోసం ఇంకొందరు, ఈత నేర్చుకోవడానికి మరికొందరు వెళ్తుంటారు. సరదా మాటున పొంచి ఉన్న ప్రమాదాన్ని గ్రహించకుండా నీటిలో దిగడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఓ కన్నేసి ఉంచాలని అధికారులు సూచిస్తున్నారు.