Karimnagar

News June 28, 2024

నితిన్ గడ్కరీని కలిసిన ఎంపీ ఈటల

image

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. మల్కాజ్గిరి పార్లమెంటు సమస్యలతో పాటు హుజురాబాద్ నియోజకవర్గంలోని సింగపూర్, రాంపూర్, రంగాపూర్, పెద్ద పాపయ్య పల్లి మీదుగా వేస్తున్న సర్వీస్ రోడ్డు నిర్మాణం వలన రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని కోరారు.

News June 28, 2024

సిరిసిల్ల: చిరుత దాడిలో లేగ దూడలు మృతి

image

సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో లేగ దూడలపై చిరుతపులి దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో లచ్చిరెడ్డి అనే రైతుకు చెందిన రెండు లేగ దూడలు మృతి చెందినట్లు సమాచారం. చిరుత సంచారంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో కూడా పలుమార్లు చిరుతపులి పాడి పశువులపై దాడులు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఫారెస్ట్ అధికారుల నుంచి ఇలాంటి సమాచారం లేదు.

News June 28, 2024

కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ అరవింద్

image

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను శుక్రవారం నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ మర్యాదపూర్వకంగా కలిశారు. రెండోసారి మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆమెకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ ‌కు సంబంధించి పలు అభివృద్ధి పనుల విషయం చర్చించారు.

News June 28, 2024

తప్పిపోయిన యువకుడి ఆచూకీ కోసం చర్యలు తీసుకోవాలి: MLC

image

జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మల్లేష్ వారం క్రితం ఓమాన్-యూఏఈ (మస్కట్-దుబాయి)దేశాల సరిహద్దులో తప్పిపోయాడని అతని కుటుంబ సభ్యులు MLC జీవన్ రెడ్డిని శుక్రవారం కలిసి సహాయాన్ని కోరారు. ఈ మేరకు స్పందించిన MLC మస్కట్, దుబాయిలలోని భారత రాయబారులు, కేంద్ర విదేశాంగ మంత్రి, ముఖ్యమంత్రి కార్యాలయానికి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి ‘X’ ద్వారా ట్వీట్ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.

News June 28, 2024

సిరిసిల్ల: మొన్న ప్రియుడు.. ఈరోజు ప్రియురాలు మృతి

image

సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసిన విషయం విదితమే. కాగా మొన్న ప్రియుడు.. ఈ రోజు ప్రియురాలు చనిపోయింది. గూడెం గ్రామానికి చెందిన <<13504961>>చందు<<>>, భాగ్యలక్ష్మి కరీంనగర్‌లోని ఓ పార్కులో ఈ నెల 24న పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రియుడు అక్కడే చనిపోగా.. ప్రియురాలు ఎల్లారెడ్డిపేటలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మరణించింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News June 28, 2024

కొండగట్టులో ఘనంగా జ్యేష్ఠాభిషేకం

image

ప్రముఖ కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రంలో శుక్రవారం జ్యేష్ఠాభిషేకంఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అష్టోత్తర శతకళశాలతో శ్రీ స్వామివారికి అభిషేకాలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ చంద్రశేఖర్, స్థానాచార్యులు కపిందర్, ప్రధాన అర్చకులు జితేంద్ర స్వామి, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవి స్వామి, సూపరింటెండెంట్ శ్రీనివాస్ శర్మ తదితరులు ఉన్నారు.

News June 28, 2024

కరీంనగర్: నియామకపత్రం అందుకున్నా ‘నో జాబ్’!

image

నియామకపత్రం అందుకున్నప్పటికీ ఓ అభ్యర్థిని ఉద్యోగానికి దూరమైంది. కరీంనగర్ (D) గంగాధర (M) నారాయణపూర్‌కు చెందిన భానుప్రియ గురుకులంలో PGT గణితం దివ్యాంగుల కోటాలో ఎంపికై నియామకపత్రం అందుకుంది. 40% వైకల్యం ఉన్నవారు దివ్యాంగులుగా అర్హులు కాగా ఆమెకు 68% ఉన్నట్లు సదరం క్యాంపులో గుర్తించారు.అయితే తాజా వైద్య పరీక్షల్లో 39% వైకల్యం ఉందని తేలడంతో ఆమె ఉద్యోగానికి అనర్హురాలంటూ తేల్చారు. న్యాయం చేయాలని కోరుతోంది.

News June 28, 2024

కరీంనగర్: నర్సింహులపల్లిలో అరుదైన విగ్రహం!

image

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నర్సింహులపల్లిలో నాలుగో శతాబ్దం నాటి సున్నపు రాతితో చేసిన 3 అంగుళాల ఎత్తున్న అరుదైన వరాహమూర్తి శిల్పాన్ని గుర్తించినట్లు తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. ఉత్తరాభిముఖుడైన ఈ మూర్తి అపురూపమైనదని శిల్పాన్ని పరిశీలించిన స్థపతి చరిత్రకారులు డా.ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. గతంలో ఇదే గ్రామంలో పురాతన రాతి పరికరాలు లభించినట్లు వారు గుర్తు చేశారు.

News June 28, 2024

కరీంనగర్: 4 వరకు బీ ఫార్మసీ పరీక్ష ఫీజు గడువు

image

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించే బీ ఫార్మసీ (ఎనిమిదో సెమిస్టర్) పరీక్ష ఫీజు గడువు జులై 4 వరకు ఉందని ఎస్‌యూ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ శ్రీ రంగ ప్రసాద్ ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుం రూ.300తో జులై 8 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News June 28, 2024

గోదావరిఖని: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

గోదావరిఖని పట్టణంలోని ఓ కాలనీలో కొనసాగుతున్న వ్యభిచార గృహంపై వన్ టౌన్ పోలీసులు గురువారం అర్ధరాత్రి ఆకస్మిక దాడి చేశారు. వ్యభిచార గృహం నిర్వాహకురాలితో పాటు నలుగురు విటులు, మరి కొందరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలం నుంచి జరుగుతున్న ఈ వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. దూర ప్రాంతాల నుంచి మహిళలు ఇక్కడికి వస్తున్నట్లు తెలుస్తోంది.