India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా సోమవారం కరీంనగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఉచిత గుండె వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. నగరంలోని రెనె హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈసీజీ, 2డి ఎకో, స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ, ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళనల కారణంగా వ్యాధులు పెరిగాయని, ప్రతి ఒక్కరూ రోజువారీ వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.

జిల్లాలో రిజర్వేషన్ల లెక్క తేలడంతో మహిళా రిజర్వేషన్లు వచ్చిన స్థానాల్లోనే పోటీ ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. సగం స్థానాలతో పాటు మిగిలిన జనరల్ స్థానాల్లోనూ పోటీచేసే అవకాశం ఉండటంతో ఈసారి పరిషత్ పోరులో మహిళలదే ఆధిపత్యం కనిపించనుంది. మహిళా రిజర్వేషన్ వచ్చిన స్థానాల్లో ఎవరిని బరిలో నిలపాలనే దానిపైనా చర్చలు మొదలయ్యాయి. ఇంట్లో తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, దగ్గరి బంధువులతోనూ మంతనాలు జరుగుతున్నాయి.

కరీంనగర్ జిల్లాలో నేడు నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. భారీ వర్ష సూచన, పలుచోట్ల సద్దుల బతుకమ్మ వేడుకల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, కలెక్టరేట్కు రావద్దని సూచించారు.

KNR ZP ఛైర్మన్ పదవిని బీసీ జనరల్ కేటాయించారు. KNR జిల్లాలో 15 ZPTCలు ఉన్నాయి. KNR <<17853256>>జెడ్పీ<<>> ఛైర్మన్ పదవికి చొప్పదండి, శంకరపట్నం, ఇల్లందకుంట, తిమ్మాపూర్, జమ్మికుంట, వీణవంక మండలాల్లో గెలిచే ZPTCలకే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా ఇక్కడి నుంచే ZP ఛైర్మన్గిరికి వెళ్లనున్నారు. ఇక పరోక్షంగా కొత్తపల్లి, గంగాధర, మానకొండూర్, హుజరాబాద్, గన్నేరువరం, చిగురుమామిడి నుంచి BCలు గెలిస్తే వారికే అవకాశం ఉంటుంది.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 65 ఐటీఐ సెంటర్లను ఉన్నత ప్రమాణాలతో ఆధునాతన సాంకేతిక కేంద్రాలు (ఏటీసీ)గా మార్చారు. ఈ కేంద్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం వర్చువల్గా ప్రారంభించారు. కరీంనగర్ ఐటీ టవర్స్ సమీపంలో ఏర్పాటు చేసిన ఏటీసీ ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పాల్గొన్నారు

కరీంనగర్ జిల్లాలోని మండలాల వారీగా ZPTC రిజర్వేషన్స్ ఇలా ఉన్నాయి. వీణవంక, ఇల్లందకుంట, చొప్పదండి మండలాలు బీసీ జనరల్, జమ్మికుంట, శంకరపట్నం, తిమ్మాపూర్ మండలాలు బీసీ మహిళలకు రిజర్వేషన్ అయ్యాయి. గన్నేరువరం, కొత్తపల్లి, గంగాధర జనరల్ కాగా, హుజురాబాద్, చిగురుమామిడి, మానకొండూర్ స్థానాలను జనరల్ మహిళకు కేటాయించారు. రామడుగు, కరీంనగర్ రూరల్ ఎస్సీ జనరల్ కాగా, సైదాపూర్ మండలాన్ని ఎస్సీ మహిళకు కేటాయించారు.

కరీంనగర్ జిల్లాలోని మండలాల వారీగా MPP రిజర్వేషన్స్ ఇలా ఉన్నాయి. కరీంనగర్ రూరల్, తిమ్మాపూర్, ఎస్సీ జనరల్ కాగా, సైదాపూర్ ఎస్సీ మహిలకు కేటాయించారు. కొత్తపల్లి, వీణవంక, హుజురాబాద్ జనరల్ కేటగిరిలో ఉన్నాయి. గంగాధర, మానకొండూరు, గన్నేరువరం జనరల్ మహిళకు రిజర్వేషన్ అయ్యాయి. జమ్మికుంట, చిగురుమామిడి, ఇల్లందకుంట స్థానాలు బీసీ జనరల్ కాగా, రామడుగు, చొప్పదండి, శంకరపట్నం, బీసీ మహిళలకు రిజర్వ్ చేశారు.

కరీంనగర్ జిల్లాలో ల్యాండ్ సర్వేయింగ్ అప్రెంటిషిప్ ముగిసిందని అధికారులు తెలిపారు. ఈమేరకు శనివారం జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో ల్యాండ్, సర్వే సెటిల్మెంట్ ఏడీ ప్రభాకర్ను జమ్మికుంట, హుజూరాబాద్ ట్రైనీ సర్వే అభ్యర్థులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఏడీ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్లు, ట్రైనింగ్ అభ్యర్థులు ఉన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని 15 ZPTC, MPP స్థానాల కోసం SC, ST, BC, మహిళ, జనరల్ రిజర్వేషన్లను వీడియో రికార్డింగ్ మధ్య నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిబంధనలను అనుసరిస్తూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో పూర్తి పారదర్శకంగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఖరారైన రిజర్వేషన్ల వివరాలను ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్కు కలెక్టర్ నివేదించనున్నారు.

డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం పరిధిలోని కరీంనగర్ ప్రాంతీయ శిక్షణ కేంద్రాన్ని ఆ సంస్థ వైస్ ఛైర్పర్సన్ శాంతి కుమారి సందర్శించారు. ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో ఇస్తున్న శిక్షణల వివరాలను కలెక్టర్ పమేలా సత్పతిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధికి కేంద్రంలో ఇచ్చిన శిక్షణ వివరాలు ఆమె తెలిపారు. సైన్ లాంగ్వేజ్ శిక్షణ గురించి శాంతి కుమారి అడిగి తెలుసుకున్నారు.
Sorry, no posts matched your criteria.