Karimnagar

News August 15, 2025

KNR నగరపాలక సంస్థలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం

image

కరీంనగర్ నగరపాలక సంస్థలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ముఖ్యఅతిథిగా హాజరవగా, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సువార్త, డిప్యూటీ కమిషనర్లు వేణుమాధవ్, ఖాదర్ మొయినుద్దిన్, సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

News August 15, 2025

KNR: టెక్నాలజీపై కానిస్టేబుళ్లకు ట్రైనింగ్

image

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు టెక్నాలజీ వినియోగంపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఐటీ కార్యాలయంలో పోలీసులు ఉపయోగించే సాఫ్ట్వేర్లు, అప్లికేషన్లు, సాంకేతిక పరిజ్ఞానంపై ఈ శిక్షణ కొనసాగింది. పోలీసులకు సవాల్‌గా మారిన టెక్నాలజీ మోసాల నియంత్రణకు ఈ శిక్షణ ఉపయోగపడనుంది. ఈ శిక్షణ కార్యక్రమం కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఆధ్వర్యంలో జరిగింది.

News August 15, 2025

KNR: ఈనెల 17న జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు

image

ఈనెల 17న జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలను జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ క్రీడా పాఠశాలలో ఉదయం 8 గంటల నుంచి నిర్వహించనున్నామని అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నందెల్లి మహిపాల్ తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ చాటే క్రీడాకారులను ఈనెల 30, 31 తేదీల్లో మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు విశ్వవిద్యాలయంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నామన్నారు.

News August 15, 2025

7 టీఎంసీలకు చేరిన ఎల్ఎండీ రిజర్వాయర్

image

కరీంనగర్ పరిధిలోని దిగువ మానేరు జలాశయం 7 TMCలకు చేరింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ నుంచి కాలువల ద్వారా ఎల్ఎండీలోకి 2068 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఎల్ఎండీ పూర్తి నీటి సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా గురువారం రాత్రి వరకు 7.110కు చేరింది. రాబోయే రెండు, మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలపడంతో ఎల్ఎండీలోకి భారీగా వరదనీరు వచ్చే అవకాశం ఉంది.

News August 15, 2025

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ LOGO మార్పు!

image

KNR పోలీస్ కమిషనరేట్ లోగోను మార్చినట్లు CP గౌస్ ఆలం తెలిపారు. కొత్త లోగోను మార్చాలన్న ఉన్నతాధికారుల సూచన మేరకు ఆయన దీనిని గురువారం ఆవిష్కరించారు. శాంతి భద్రతల సంరక్షణలో నిబద్ధతను సూచించేలా ఈ లోగోను రూపొందించారు. WHO DARES WINS (ధైర్యం చేసేవాడే గెలుస్తాడు) అనే క్యాప్షన్‌తో ఈ సరికొత్త లోగోను డిజైన్ చేశారు. అశోక చక్రం, నాలుగు సింహాల చిహ్నం దేశభక్తిని, శక్తిని, ప్రజల పట్ల నిబద్ధతను ప్రతిబింబిస్తాయి.

News August 15, 2025

KNR: భూ సేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

image

ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్ట్ సంచాలకులు దుర్గాప్రసాద్, అడిషనల్ కలెక్టర్ లక్ష్మి కిరణ్, రెవిన్యూ డివిజనల్ అధికారులు మహేశ్వర్, రమేష్ బాబుతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి భూసేకరణ సమస్యలపై గురువారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. KNR జిల్లా మీదుగా వెళ్తున్న జాతీయ రహదారి 563 నిర్మాణం కోసం భూ సేకరణను వేగవంతం చేయాలని అన్నారు. ఈ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.

News August 14, 2025

KNR: సబ్ స్టేషన్ల నిర్మాణానికి స్థలాల పరిశీలన

image

కరీంనగర్ సిటీలో మూడు విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఎన్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ రమేష్ బాబు గురువారం పరిశీలించారు. నగరంలో ఇప్పుడు ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్లపై ఓవర్ లోడును తగ్గించేందుకు కొత్తగా మూడు సబ్ స్టేషన్లను నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో NPDCL డీఈ రాజం, ఈఈ శ్రీనివాస్, ఏడీఈ తదితరులు పాల్గొన్నారు.

News August 14, 2025

KNR: రూ.లక్షల్లో డబ్బు స్వాహా.. నిందితుడి అరెస్ట్

image

క్రెడిట్ కార్డ్‌ల ద్వారా కమీషన్ తీసుకోకుండా డబ్బులు ఇప్పిస్తానంటూ బాధితుల నుంచి రూ.లక్షల్లో డబ్బు వసూలు చేసిన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లికి చెందిన నేరెళ్ల అరుణ్‌ను హన్మకొండ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుడి నుంచి ట్రాన్సాక్షన్స్‌కి ఉపయోగించిన మానిటర్, CPU, స్వైపింగ్ మిషన్, రెండు సెల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.

News August 14, 2025

KNR: అతి భారీ వర్షాలపై విద్యుత్ వినియోగదారులకు సూచనలు

image

ఈ నెల 16 వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు, ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాలని ఎస్ఈ రమేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి విద్యుత్ సమస్యలు తలెత్తినా, 87124 88004 నంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. పునరుద్ధరణ బృందాలు 24 గంటల షిఫ్ట్ విధానంలో సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.

News August 14, 2025

KNR: అందరూ భాగస్వాములు కావాలి: సీపీ

image

‘నషా ముక్త్ భారత్ అభియాన్’ 5వ వార్షికోత్సవం సందర్భంగా కమిషనరేట్ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా KNR సీపీ గౌష్ ఆలం అధికారులతో కలిసి మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రతిజ్ఞ చేశారు. సీపీ మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు.