India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉగాది నుంచి ప్రజలకు సన్నబియ్యం పంపిణి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రేషన్కార్డుల్లో పేర్లు నమోదై ఉన్న ప్రతి ఒక్కరికీ 6కిలోల చొప్పున బియ్యం సరఫరా చేయనున్నారు.కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,76,908 కుటుంబాలకు రేషన్ కార్డుల ద్వారా బియ్యం, నిత్యావసర వస్తువులను సరఫరా చేయనున్నారు. దీంతో 8,04,968 మంది సన్నబియ్యాన్ని పొందుతారు.
దివ్యాంగులకు జారీ చేయనున్న UDIDకార్డుల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి వైద్య, ఆరోగ్య అధికారులను ఆదేశించారు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని UDIDకార్డుల వైద్య పరీక్షల విభాగాన్ని కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. UDIDకార్డుల జారీలో భాగంగా వైద్య పరీక్షలకు వచ్చే దివ్యాంగులకు వసతులు కల్పించాలన్నారు. ర్యాంపు, టాయిలెట్స్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు.
జిల్లాలో ఐకెపి ఆధ్వర్యంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను 150కి పెంచుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సమీక్ష సమావేశం నగరంలోని స్వశక్తి భవన్లో శుక్రవారం నిర్వహించారు. కొనుగోళ్ల పట్ల ఏపీఎంలు, సెంటర్ ఇన్చార్జులు అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. ధాన్యం కొనుగోలు నమోదు ప్రక్రియ పకడ్బందీగా ఉండాలని పేర్కొన్నారు.
శుక్రవారం సభ ఒక పరిష్కారం లాంటిదని జిల్లా కలెక్టర్ ప్రమీల సత్పతి అన్నారు. శుక్రవారం రామడుగు మండలంలోని కొక్కేరకుంట గ్రామంలో ఏర్పాటు చేసిన శుక్రవారం సభలో ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ.. శుక్రవారం సభ ద్వారా పలు సమస్యలు పరిష్కారం అవుతాయని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, ఎంపీడీవో రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నుంచి రేషన్షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయనుంది. దీంతో కరీంనగర్ జిల్లా 2,77,323 మంది లబ్ధిదారులకు లబ్ధి జరగనుంది. ఇది వరకు రేషన్షాపుల్లో దొడ్డు బియ్యం పంపిణీ చేసేవారు. దీంతో చాలామంది లబ్ధిదారులు వాటిని అమ్ముకునేందుకు మొగ్గుచూపే వారు. ఇక నుంచి సన్నబియ్యం రేషన్ షాపుల్లో పంపిణీ చేయనుండటంతో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సెల్ఫ్ బ్రేక్ పడినట్టయ్యింది.
బాలుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలో జరిగింది. సాయికుమార్ (17) అనే బాలుడిని కత్తితో పొడిచి చంపిన దుండగుడు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్న మృతుడి బంధువులు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ తో పాటు వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి పమేలా సత్పతి సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో గురువారం ఈ సమావేశం నిర్వహించారు. బడ్జెట్ ఆదాయ వ్యయాల అంచనా నివేదికలను కలెక్టర్ పరిశీలించారు. అధికారులు కరీంనగర్ నగర అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు.
స్త్రీనిధిలో గత ఆర్థిక సంవత్సరంలో 115 శాతం రుణ పంపిణీ, 90 శాతం రికవరీ చేసినందుకు గాను DRDO కు అవార్డు వచ్చింది. మంత్రి సీతక్క చేతుల మీదుగా కరీంనగర్ జిల్లా అదనపు DRDO సునీత అవార్డు అందుకున్నారు. కరీంనగర్ DRDO అవార్డ్ అందుకోవడం పట్ల కలెక్టర్ పమేలా సత్పతి డిఆర్డిఓను, సిబ్బందిని అభినందించారు. పేద మహిళలకు స్త్రీనిధి ద్వారా మరిన్ని సేవలు అందించాలని అన్నారు.
ఢిల్లీలోని ఇందిరాభవన్లో రాహుల్ గాంధీ, మల్లికార్జునఖర్గే, KCవేణుగోపాల్ సమక్షంలో జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో SUDAచైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలోని 16 రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను ఆహ్వానించి పార్టీని బూతు స్థాయినుండి బలోపేతం చేయడానికి దిశానిర్దేశం చేశారు. జిల్లా అధ్యక్షుల సమస్యలు,అభిప్రాయాలు తీసుకున్నారు
డాక్టర్. బీ.ఆర్.అంబేడ్కర్ జయంతి, బాబు జగ్జీవన్ రావు జయంతిని పురస్కరించుకొని ప్రజాసంఘాల నాయకులు, జయంతి ఉత్సవాల కమిటీ సభ్యులతో జిల్లాధికారులతో కరీంనగర్ కలెక్టరేట్లో గురువారం సమావేశం నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ మాట్లాడుతూ.. వచ్చే నెల 5న బాబు జగ్జీవన్ రావ్ జయంతి, 14న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ప్రభుత్వం తరఫున ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.