Karimnagar

News September 7, 2024

పెద్ద‌పల్లి‌లో యువకుడి ఆత్మహత్య..

image

పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణంలోని రంగంపల్లికి చెందిన జంపయ్య శనివారం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వినాయక చవితి పండుగ పూట ఎల్లమ్మ చెరువులో జంపయ్య దూకి ఆత్మహత్యకు పాల్పడడంతో, ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. జంపయ్య మృతికి గల కారణాలు తెలియ రాలేదు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News September 7, 2024

కరీంనగర్: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం

image

తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్‌లో శనివారం పర్యటించారు. కరీంనగర్‌లోని ప్రకాశం గంజ్ వర్తక సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, వివిధ విభాగాల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

News September 7, 2024

గణపతి మొదటి పూజా కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి

image

కరీంనగర్ ప్రకాష్ గంజ్ లో గణపతి మొదటి పూజా కార్యక్రమంలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఆయనతో పాటు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

News September 7, 2024

కరీంనగర్ జిల్లాలో మళ్లీ వర్షం..

image

తెలంగాణ వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. కరీంనగర్, పెద్దపల్లి, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు.

News September 7, 2024

పెద్దపల్లిలో ప్రైవేట్ ఆంబులెన్సుల దందా!

image

పెద్దపల్లి జిల్లాలోని ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకుల దందా రోజురోజుకూ పెరుగుతోందని విమర్శలు వస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ఆంబులెన్సులు 6, ప్రైవేట్ అంబులెన్సులు 36 వరకు ఉన్నాయి. అయితే పేషెంట్లు చెప్పిన ఆసుపత్రులకు కాకుండా తమకు కమిషన్లు ఇచ్చే ప్రైవేట్ ఆసుపత్రులకు తరలిస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. పైగా రవాణా చార్జీలు విపరీతంగా తీసుకుంటున్నారని, అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

News September 7, 2024

కరీంనగర్: ప్రేమ పెళ్లి పేరుతో మోసం.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

image

ప్రేమ, పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి శారీరకంగా వాడుకుని రెండుసార్లు అబార్షన్ చేయించి తనను మోసం చేశాడని కరీంనగర్ మండలానికి చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మండలానికి చెందిన ఓ యువకుడు.. తనకు రెండుసార్లు అబార్షన్ చేయించాడని ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

News September 7, 2024

KNR: బంతి, చామంతి పూలకు భలే గిరాకి.. కిలో రూ.200

image

వినాయక చవితిని పురస్కరించుకొని కరీంనగర్లో మార్కెట్లో బంతి, చామంతి పూల రేట్లను అమాంతంగా పెంచేశారు. మామూలు రోజుల్లో కిలోకు రూ.50 ఉండే బంతి పూలకు రూ.100, చామంతి పూలకు రూ.200, గులాబీ పూలకు రూ.250-300 వరకు అమ్ముతున్నాయి. కరీంనగర్ మార్కెట్లో భారీగా కొనుగోలుదారులు, వినాయక మండపాల నిర్వాహకులు బారులు తీరడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.

News September 7, 2024

గోదావరిఖని: ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్ల మూసివేత

image

ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను అధికారులు శుక్రవారం మూసివేశారు. నాలుగు రోజులుగా 32 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదిలిన అధికారులు.. శుక్రవారం ఉదయం 12గేట్ల ద్వారా 64వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. మధ్యాహ్నానికి 2 గేట్లు మాత్రమే తెరిచి నీటిని విడుదల చేశారు. సాయంత్రం పూర్తిగా గేట్లు మూసివేశారు. ప్రస్తుతం ఎల్లంపల్లిలో 19.147 టీఎంసీల నీరు ఉంది.

News September 6, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ వేములవాడ మైనార్టీ గురుకులాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా.
@ సిరిసిల్లకు చెందిన గేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ మృతి.
@ మల్హర్ మండలంలో ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు.
@ ఓదెల మండలంలో ట్రాలీ ఆటో బోల్తా పలువురికి గాయాలు.
@ వినాయక పర్వదినాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలన్న జగిత్యాల అడిషనల్ కలెక్టర్.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వినాయక చవితికి ముస్తాబైన మండపాలు.

News September 6, 2024

గణేశ్ నవరాత్రులు ప్రశాంతంగా జరుపుకోవాలి: అడిషన్ కలెక్టర్

image

గణేశ్ నవరాత్రులు ప్రశాంతమైన వాతావరణంలో భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని అడిషనల్ కలెక్టర్ రాంబాబు అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఎలక్ట్రిసిటీ రోడ్ల మరమ్మత్తు విషయంలో ఉత్సవ కమిటీ సభ్యులు అధికారుల దృష్టికి తీసుకురాగా వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులకు ఆదేశించారు. మండపాల నిర్వహకులు పోలీసులు రెవెన్యూ సిబ్బంది ఇచ్చే సూచనలను పాటించాలన్నారు.