India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన గౌస్ ఆలం కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని మర్యాదపూర్వకంగా కలిశారు. కరీంనగర్ కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి పూల మొక్కను అందజేశారు. అనంతరం కరీంనగర్ జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు అధికారులు చర్చించారు.
కరీంనగర్ జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్ ఎగ్జామ్లో భాగంగా సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ 2 ప్రశాంతంగా ముగిసినట్లు సోమవారం జిల్లా విద్యాధికారులు తెలిపారు. ఇంటర్ పరీక్షలకు 15,381 మంది విద్యార్థులకు గాను 15,059 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్షలకు 322 మంది విద్యార్థులు హాజరు కాలేదని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో జమ్మికుంట 38.3°C, గంగాధర 37.6, ఖాసీంపేట 37.2, కొత్తపల్లి-ధర్మారం 37.0, తాంగుల, ఇందుర్తి 36.4, ఈదులగట్టేపల్లి 36.3, వీణవంక 36.2, నుస్తులాపూర్ 36.0, రేణికుంట 35.4, బురుగుపల్లి, పోచంపల్లి 35.0, చిగురుమామిడి 34.9, గుండి 34.8, అర్నకొండ 34.5, గంగిపల్లి, మల్యాల 34.4, గట్టుదుద్దెనపల్లె 34.3, బోర్నపల్లి 34.1, తాడికల్ 34.0°C గా నమోదైంది.
ప్రతి సోమవారం కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం సోమవారం నుంచి యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా రద్దు చేయబడిన ప్రజావాణిని తిరిగి సోమవారం నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రజలు తమ అర్జీలను సమర్పించాలని సూచించారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో కప్ సాధించిన టీమ్ ఇండియాకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అభినందనలు తెలిపారు. టీమిండియా..అన్ స్టాపేబుల్, అన్ బీటేబుల్, అన్ ఫర్గటబుల్.. కంగ్రాట్యులేషన్స్ టు ద మెన్ ఇన్ బ్లూ..ఫర్ మేకింగ్ ది నేషన్ ప్రౌడ్ అని ట్విటర్లో పోస్ట్ చేశారు. భారత జట్టు ఛాంపియన్స్గా ఆవిర్భవించడం గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నిధులు రూ.11,000 కోట్లను మంజూరు చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని మంథని, చొప్పదండి, ధర్మపురి, జగిత్యాల, మానకొండూర్, పెద్దపల్లి, రామగుండంలో నిర్మిస్తున్న ప్రతి స్కూల్కు రూ.200 కోట్ల నిధులను కేటాయించింది.
కరీంనగర్ నూతన పోలీస్ కమిషనర్గా గౌస్ ఆలం ఆదివారం భాద్యతలు స్వీకరించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన పోలీసు ఉన్నతాధికారుల బదిలీల్లో భాగంగా ఆదిలాబాద్ ఎస్పీగా పనిచేసిన ఆయన కరీంనగర్ పోలీస్ కమిషనర్గా వచ్చారు.
KNR జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో మల్యాలలో 40.5°C నమోదు కాగా, జమ్మికుంట 40.0, గుండి 39.7, కొత్తపల్లి-ధర్మారం, ఈదులగట్టేపల్లి 39.1, నుస్తులాపూర్ 38.8, బురుగుపల్లి 38.3, ఖాసీంపేట, KNR 38.1, తాంగుల 38.0, గంగాధర 37.9, వీణవంక 37.8, ఇందుర్తి 37.7, గంగిపల్లి 37.4, గట్టుదుద్దెనపల్లె, పోచంపల్లి 37.3, కొత్తగట్టు 37.2, తాడికల్ 37.1, దుర్శేడ్లో 36.7°C గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి
మహిళలు ఉన్నత చదువులు చదివి, ఆర్థిక ప్రగతి సాధిస్తేనే సమాజం అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. మహిళలు తప్పనిసరిగా చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. చదువుతోనే సమాజంలో గౌరవం, గుర్తింపు వస్తాయన్నారు.
కరీంనగర్ బీజేపీలో ఎమ్మెల్సీ గెలుపు ఉత్సాహం కొనసాగుతోంది. నగరంలో వివిధ ప్రాంతాల్లో శనివారం బండి సంజయ్ను విరాట్ కోహ్లీ పోలుస్తూ ఫ్లెక్సీలను అభిమానులు ఏర్పాటు చేశారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపును క్రికెట్లో టీమ్ ఇండియా గెలుపుతో బండి సంజయ్ అభివర్ణించారు. బండి సంజయ్ని బీజేపీలో కోహ్లీగా అభివర్ణిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
Sorry, no posts matched your criteria.