India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
@ కోనరావుపేట మండలంలో అంబులెన్స్ లో మహిళ ప్రసవం. @ ఎల్లారెడ్డిపేట మండలంలో బోల్తాపడిన ట్రాలీ ఆటో. @ కోరుట్ల మండలంలో రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. ఇద్దరికీ తీవ్ర గాయాలు. @ వేములవాడ బద్ది పోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ. @ కొండగట్టు అంజన్న ఆలయంలో తగ్గిన భక్తుల రద్దీ. @ జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్. @ కాంగ్రెస్ ప్రభుత్వం బీహార్ సంస్కృతిని తీసుకొస్తుందన్న గంగుల కమలాకర్.
వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా రూ.4 నుంచి 5లక్షలు పెంచిందన్నారు. పూర్తిగా దెబ్బతిన్న పంట పొలాలకు ఎకరానికి రూ.10వేల నష్టపరిహారం ఇస్తుందన్నారు. కంటింజెన్సీ ఫండ్ కింద వరద బాధిత ఒక్కో జిల్లాకు రూ.5కోట్లు అని, జిల్లాలో 24/7 పనిచేసేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేస్తామన్నారు.
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైన బద్దిపోచమ్మ ఆలయంలో మంగళవారం భక్తులు పోటెత్తారు. మంగళవారం సందర్భంగా బద్ది పోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించేందుకు వేకువ జామున భక్తులు బారులు తీరారు. భక్తిశ్రద్ధలతో నైవేద్యం సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
కరీంనగర్ జిల్లావ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు విద్యుత్ శాఖకు రూ.18.63 లక్షల నష్టం వాటిల్లిందని ఎస్ఈ వడ్లకొండ గంగాధర్ తెలిపారు. 31 విద్యుత్ స్తంభాలు, మూడు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పడిపోయాయన్నారు. వినియోగదారుల కోసం హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి 9440811444, 1912, 18004250028 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి పెరుగుతోంది. కడెం, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో గోదావరికి వరద పోటెత్తింది. దీంతో పుష్కర స్నాన ఘట్టాలు నీట మునిగాయి. సంతోషిమాత ఆలయంలోకి వరద నీరు చేరింది. వరద పరిస్థితిని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు, జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా జ్వర బాధితులు పెరుగుతున్నారు. PDPL జిల్లాలో ఆస్టులో 8918కి మందికి పైగా జ్వరాల బారిన పడ్దారు. ఇప్పటివరకు 67 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ప్రధాన ఆస్పత్రితో పాటు ఓ జనరల్ ఆస్పత్రి, 7పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఆరోగ్య కేంద్రాలు, పల్లె దవాఖానల్లో మందుల కొరత లేకుండా చూస్తున్నామని జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సోమవారం సాయంత్రం వరకు 2,51,250 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 73టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి 40 గేట్లు ఎత్తి 2.50లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు, కాకతీయ కాలువకు 3వేల క్యూసెక్కులు, వరద కాలువకు 7వేల క్యూసెక్కులు వీటిని విడుదల చేశారు.
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. గర్జనపల్లిలో పడిపోయిన పదిహేను విద్యుత్తు స్తంభాలను సెస్ సిబ్బంది సరి చేశారు. మూలవాగు, పెద్దవాగు పరివాహక ప్రాంతంలో పైరు కొట్టుకుపోతుండటంతో పంట పొలాలు కోతకు గురయ్యాయి. భారీగా ఇసుక మేటలు వేయడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. మరి మీ పొలం పరిస్థితి ఏంటో కామెంట్ చేయండి.
వర్షాలకు ఎల్ఎండీకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఆదివారం నుంచి మోయతుమ్మెద వాగు ద్వారా జలాశయంలోకి నీరు భారీగా వస్తోంది. దీంతో అధికారులు మధ్యమానేరు జలాశయం నుంచి నీటి విడుదలను నిలిపివేశారు. మధ్యమానేరు నుంచి ఎల్ఎండీకి సుమారు 8టీఎంసీల నీరు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతానికి వాగు ద్వారా 7600 క్యూసెక్కుల ఇన్ ఫ్లో జలాశయంలోకి వస్తుంది. ప్రస్తుతం 15.584 టీఎంసీల నీరున్నట్లు అధికారులు తెలిపారు.
కలెక్టరేట్ కార్యాలయం సోమవారం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ పమేల సత్పతి మాట్లాడుతూ.. నెల రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలందరిని భాగస్వాములను చేయాలని అన్నారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు, చిన్నారులు తీసుకోవలసిన పోషకాహారం గురించి వివరించే ప్రదర్శనలు, సమావేశాలు, ర్యాలీలు, మేళా వంటివి ఏర్పాటు చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.