India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కలెక్టరేట్ కార్యాలయం సోమవారం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ పమేల సత్పతి మాట్లాడుతూ.. నెల రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలందరిని భాగస్వాములను చేయాలని అన్నారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు, చిన్నారులు తీసుకోవలసిన పోషకాహారం గురించి వివరించే ప్రదర్శనలు, సమావేశాలు, ర్యాలీలు, మేళా వంటివి ఏర్పాటు చేయాలన్నారు.
*ఇబ్రహీంపట్నం: వేములకుర్తిలో ఇంటిపై పిడుగు.
*బెజ్జంకి: తోటపల్లిలో చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు.
*గంగాధర: భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు.
*వెల్గటూర్: భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు
*ధర్మపురి: భారీ వర్షాలకు.. అప్రమత్తమైన పోలీసులు హెచ్చరికలు జారీ.
*పెగడపల్లి: తెగిపడిన రోడ్లు.. బయటకు రావద్దని పోలీసుల హెచ్చరికలు.
*గొల్లపల్లి: భారీ వర్షాలు.. ఆగిన రైతుల పనులు.
*కరీంనగర్: కలెక్టరేట్ ఏరియాలో భారీగా చేరిన వరద నీరు.
*శంకరపట్నం: అంబాలాపూర్ ఊరు చెరువుకు గండి.
*శ్రీరాంపూర్: నక్కల చెరువులో వ్యక్తి గల్లంతు.
*శంకరపట్నం: మానేరు డ్యామ్లో వ్యక్తి గల్లంతు.
*పెద్దపల్లి: భారీ వర్షాలకు స్తంభించిన జనజీవనం.
*ఎండపల్లి: చర్లపల్లి గ్రామంలో భారీ వర్షానికి కూలిన ఇల్లు.
*వీణవంక: మల్లారెడ్డిపల్లి గ్రామంలో కూలిన ఇల్లు.
*రామడుగు: భారీ వర్షాలకు ధ్వంసమైన వంతెనలు.
*గొల్లపల్లి: భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలు.
*వేములవాడ: రహదారిపై భారీగా నిలిచిన వాహనాలు.
*శంకరపట్నం: నీటిలో కొట్టుకుపోయిన బైకు.
*KNR: భారీ వర్షం.. ప్రజావాణి రద్దు.
*ఓదెల: కొమిర గ్రామంలో భారీ వర్షానికి కూలిన ఇల్లు.
*గంభీరావుపేట: సింగసముద్రం పెద్ద కాలువకు గండి.
*జగిత్యాల: భారీ వర్షం.. ప్రజావాణి రద్దు చేసిన కలెక్టర్.
*రామగుండం: భారీ వర్షం.. నీట మునిగిన రోడ్లు
*ధర్మపురి: గోదావరి నదిలో పెరిగిన నీటి వరద.
*జమ్మికుంట: పంట పొలాల్లోకి భారీగా చేరిన వరద నీరు.
*కరీంనగర్: నీట మునిగిన ప్రధాన రహదారులు.
*ఎల్లంపల్లి: ప్రాజెక్టు నుంచి నిలిచిపోయిన రాకపోకలు.
*చిగురుమామిడి: రికార్డు స్థాయి వర్షపాతం నమోదు.
*తంగళ్లపల్లి: మండెపల్లి గ్రామంలో భారీ వర్షానికి కూలిన ఇల్లు.
*మల్యాల: తెగిన రహదారి రాకపోకలు బంద్.
*సిరిసిల్ల: నీట మునిగిన పాత బస్టాండ్ ఏరియా.
@ గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న జగిత్యాల కలెక్టర్.
@ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సిటీ పోలీస్ యాక్ట్ అమలు.
@ జమ్మికుంటలో రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి.
@ బెజ్జంకి మండలంలో చేపల వేటకు వెళ్లి ఒకరు గల్లంతు.
@ ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, ధర్మపురి మండలాలలో పర్యటించిన జగిత్యాల కలెక్టర్, ఎస్పీ.
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.61,932 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.28,817, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.16,340, అన్నదానం రూ.16,775 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.
పదేళ్లపాటు సిరిసంపదలతో కళకళలాడిన సిరిసిల్ల మళ్లీ ఉరిశలగా మారుతోందని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నల పట్ల అనుసరిస్తున్న నేరపూరిత నిర్లక్ష్యం కార్మికుల ఉసురుతీస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నేతన్నలను పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. నేతన్నలకు ఉపాధి కల్పించే చర్యలు వెంటనే చేపట్టాలని కోరారు.
పెద్దపల్లి జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. సోమవారం ఆయన మంథని పట్టణంలోని గౌతమేశ్వర ఆలయ పరిసరాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీతో కలిసి పరిశీలించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కూడా నీరు విడుదలయ్యే అవకాశం ఉన్నందున మంథని పరిసర ముంపు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం
నర్మాల గ్రామంలోని ఎగువ మానేరు జలాశయం పూర్తిగా నిండి మత్తడి దుంకుతోంది. దీంతో సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ సందర్శించారు. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి జలకళను సంతరించుకుంది.
Sorry, no posts matched your criteria.