India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకంగా నిలిచే కరీంనగర్ జిల్లాలో మహిళ నేతలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా నిలుస్తున్నారు. రామడుగుకు చెందిన నేరెళ్ల శారద రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ మహిళ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్నరెడ్డి, BJP జిల్లా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీలతో పాటు నార్కోటిక్స్ వింగ్ ACP మాధవి, CI శ్రీలత తదితరులు మహిళలోకానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్ళే రైలు (12762) ఆది , గురువారాల్లో, తిరుపతి నుంచి కరీంనగర్ (12761)బుధ, శనివారాల్లో మాత్రమే నడుస్తుంది. ఈ రైలును ప్రతిరోజూ నడిపేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. ఈ రైలును తాను ఎంపీగా ఉన్నప్పుడు ఉత్తర తెలంగాణ ప్రజలు తిరుపతి వెళ్ళడానికి సులభతరంగా ఉంటుందని UPA ప్రభుత్వంలో ప్రారంభించినట్లు గుర్తు చేశారు.
మెట్పల్లి మండలం వెల్లుల్ల అనుబంధ గ్రామం రామచంద్రంపేటలో లక్కంపల్లి కిరణ్ అనే<<15688708>> నవ వరుడు సూసైడ్<<>> చేసుకున్న విషయం తెలిసిందే. రేపు అతని పెళ్లి జరగాల్సి ఉండగా ఇవాళ ఆయన ఆత్మహత్యకు పాల్పడడం వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. హెల్త్ ఇష్యూస్ ఉన్నా తమకు చెప్పలేదని పెళ్లి చేసుకుంటే సమస్యలు వస్తాయని భావించి సూసైడ్ చేసుకున్నట్లు మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది
జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో వరుడు కిరణ్ సూసైడ్ చేసుకున్నాడు. రేపు పెళ్లి జరగాల్సి ఉండగా ఈ రోజు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు కిరణ్ ఆత్యహత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు.
వేములవాడ రూరల్ మండలం పాజిల్ నగర్ అటవీ ప్రాంతంలో చిరుతపుడి దాడిలో లేగ దుడ మృతి చెందింది. గ్రామస్థుల కథనం ప్రకారం.. ఉప్పల నారాయణ అనే రైతు తన లేగ దూడ రోజు మాదిరిగానే పొలం వద్ద కొట్టంలో కట్టేశాడు. రాత్రివేళలో చిరుత పులి దాడి చేయడంతో దూడ మృతిచెందింది. పులి జాడ కోసం అటవీశాఖ అధికారులు అన్వేషిస్తున్నారు.
KNR జిల్లాలో ఎండలు దంచికొడుతున్నా.. రాత్రిళ్లు చలి వణికిస్తోంది. అనేక ప్రాంతాల్లో పగటి సమయంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. కానీ రాత్రయ్యే సరికి చలి విరుచుకుపడుతోంది. దీంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో జిల్లాలోని జమ్మికుంట మండలం కొత్తపల్లి-ధర్మారంలో 38.4°C గరిష్ట నమోదు కాగా, చొప్పదండి మండలం అర్నకొండలో 13.8°C డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
జమ్మికుంట-కరీంనగర్ వెళ్తున్న బస్సులో విషాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వీణవంక మండలం రెడ్డిపల్లికి చెందిన ఓదెలు అనే వ్యక్తి బస్సెక్కి కరీంనగర్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో బస్సులోనే గుండెపోటుతో మృతి చెందారు. కరీంనగర్ చేరుకున్న అనంతరం బస్సు కండక్టర్ ఆ వ్యక్తి మృతి చెందినట్టు గుర్తించారు. మృతుడు కరీంనగర్ ICICI బ్యాంకులో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు.
కరీంనగర్ సీపీగా విధులు నిర్వహించిన అభిషేక్ మహంతిని తెలంగాణ క్యాడర్ నుంచి ప్రభుత్వం రిలీవ్ చేసింది. భూకబ్జాలపై ఉక్కుపాదం మోపిన అధికారిగా అభిషేక్ మంచి పేరు పొందారు. ఆయన కుటుంబంలో ముగ్గురు ఐపీఎస్లు ఉన్నారు. తండ్రి రిటైర్డ్ ఐపీఎస్ ఏకే మహంతి ఎన్టీఆర్, చెన్నారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వివిధ హోదాలో పనిచేశారు. అన్న అవినాష్ మహంతి కూడా ఐపీఎస్ అధికారి.
KNR నూతన సీపీ గౌస్ ఆలం బిహార్లోని గయాలో జన్మించారు. IIT ముంబైలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. 2017 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన గౌస్ ఆలం శిక్షణలో పరేడ్ కమాండర్గా వ్యవహరించి బెస్ట్ అల్రౌండర్ అవార్డు సాధించారు. మొట్టమొదటగా ఏటూరునాగారం ASP విధులు నిర్వహించారు. అనంతరం ఖమ్మం OSDగా పనిచేశారు. 2022లో ములుగు SPగా పనిచేశారు. 2024 జనవరిలో ADB SPగా బాధ్యతలు స్వీకరించి.. 2025 MAR 7న KNRకు బదిలీపై వచ్చారు.
కరీంనగర్ జిల్లా లో నిర్వహిస్తున్న ఇంటర్ ఎగ్జామ్లో భాగంగా ఫస్టియర్ ఇంగ్లీష్ పేపర్ వన్ ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా విద్యాధికారులు తెలిపారు. ఇంటర్ పరీక్షలకు 18222 మంది విద్యార్థులకు 17767 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. పరీక్షలకు 455 మంది విద్యార్థులు హాజరు కాలేదని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.