India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరీంనగర్ మండలం నగునూరులోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో లైబ్రేరియన్గా పని చేస్తున్న డాక్టర్ ఆర్.లలిత మద్రాస్ లైబ్రరీ అసోసియేషన్ బెస్ట్ ఉమన్ లైబ్రేరియన్ అవార్డుకు ఎంపికయ్యారు. ఇటీవల చెన్నైలో జరిగిన నేషనల్ లైబ్రేరియన్ డే వేడుకల్లో అవార్డును అందుకున్నారు. కళాశాలలో లలితను ప్రిన్సిపల్ మాలతి ఆధ్వర్యంలో అధ్యాపక బృందం సన్మానించింది. వైస్ ప్రిన్సిపల్ సమత, అధ్యాపకులు పాల్గొన్నారు.
సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ గ్రామ శివారులో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. గ్రామ శివారులో రోడ్డుకు అడ్డంగా మొఖంపై గాయాలతో మృత్యువాత పడ్డాడు. వీర్నపల్లి మండలానికి చెందిన సయ్యద్ ఇమామ్(60)గా పోలీసులు గుర్తించారు. ఇతడిని ఎవరైనా చంపారా..? లేక ప్రమాదవశాత్తు చనిపోయాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వర్షాకాలం నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. ఇప్పటికే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ అధికారులు అవగాహన కల్పించినప్పటి డెంగీ, మలేరియా, టైఫాయిడ్ బారిన పడుతున్నారు. జ్వరం వచ్చిన తర్వాత తలనొప్పి, వాంతులు, కండరాలు, కీళ్లనొప్పులు మొదలగు లక్షణాలు ఉంటే ఆస్పత్రికి వెళ్లాలని వైద్యాధికారులు తెలిపారు. సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచిస్తున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ ముగింపు వేడుకలు అట్టహాసంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు జిల్లాలలో పతాకావిష్కరణ చేసే అతిధులను రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్లో మంత్రి శ్రీధర్ బాబు, జగిత్యాలలో ప్రభుత్వ విప్ లక్ష్మణ్, పెద్దపల్లిలో రాష్ట్ర మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ శారద, సిరిసిల్లలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పతాకావిష్కరణ చేయనున్నారు.
ఢిల్లీలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఐదుగురికి ఆహ్వానం అందింది. ఇందులో వీణవంక మండలం ఘన్ముక్ల మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ వేణుగోపాల్ రెడ్డి, 10వ తరగతి విద్యార్థి శ్రీకాంత్, పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన మహమ్మద్ అల్టీ షాహన్ , మోడల్ స్కూల్ టీచర్ సుజాత, ఓదెల మోడల్ స్కూల్ 10వ తరగతి విద్యార్థి అభిజ్ఞ కు ఆహ్వానం అందించారు.
సెంట్రల్ ఆర్మూడ్ పోలీస్ ఫోర్స్కు నిర్వహించిన రివ్యూ సమావేశం ఢిల్లీలో కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్తో కలిసి రివ్యూ సమావేశంలో ఉన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నాయకత్వంలో సెంట్రల్ ఆర్మూడ్ పోలీస్ ఫోర్స్ అద్భుతంగా పనిచేస్తుందని కొనియాడారు. సీఏపీఎఫ్ వారి పనితనం గర్వించదగ్గ విషయమని అన్నారు.
జగిత్యాల జిల్లాలో బీసీ నిరుద్యోగ యువతకు ఉపాధి నైపుణ్య శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సాయిబాబా ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు వెబ్ సైట్ tgbestudycircle.cgg.gov.inలో ఈ నెల 24 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 10th, ఇంటర్ పాసైన 18 నుంచి 25 ఏళ్ల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 0878-2268686 నెంబర్ ను సంప్రదించాలన్నారు
పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ సోషల్ మీడియా అకౌంట్ హాకింగ్కు గురైంది. ఈ విషయాన్ని ఆయన ఒక ప్రకటనలో స్వయంగా వెల్లడించారు. తన అకౌంట్ నుంచి వచ్చే మెసేజ్లకు ప్రజలు, అధికారులు, తనకు తెలిసిన వారెవరు స్పందించవద్దని సూచించారు. ఫేక్ మెసేజ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని శ్యాం ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.
జగిత్యాల జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 141 డెంగ్యూ కేసులు నమోదైనట్లు డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.శ్రీనివాస్ ‘Way2News’ ద్వారా ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. వర్షాకాలం వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల జాగ్రత్తగా ఉండాలని అన్నారు. జ్వరం వచ్చిన వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులను సంప్రదించాలి అని సూచించారు.
సింగరేణిలో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే క్రమశిక్షణ చర్యల కింద కార్మికులకు, ఉద్యోగులకు కలర్ కార్డుల విధానాన్ని యాజమాన్యం గత కొన్ని నెలల క్రితం ప్రవేశ పెట్టిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ AITUC RG -1 బ్రాంచి కార్యదర్శి పోషం అన్నారు. దీంతో కార్మికులు ఆందోళనకు గురవుతున్నారని కలర్ కార్డుల విధానం రద్దు చేయాలని AITUC గత నెలలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టగా యాజమాన్యం నేడు రద్దుచేసినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.