Karimnagar

News January 28, 2025

కరీంనగర్: మా సమస్యను తీర్చండి.. ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ

image

ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పలు సమస్యల్ని KNR కలెక్టర్‌కు విన్నవించారు. HZBకు చెందిన వీరగోని రవళి భర్త చనిపోగా.. తన ఇంటిని అత్త, మామ, ఆడపడుచులు అమ్మారని పేర్కొంది. రోడ్డు విస్తరణ పేరుతో నిర్మాణాలు కూల్చివేతలు చేస్తున్నారని తీగలగుట్టపల్లికి చెందిన పలువురు ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారని ఇరుకుల్లకు గ్రామస్థులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

News January 27, 2025

కరీంనగర్: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజావాణి ఫిర్యాదులను వివిధ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించగా ప్రజావాణికి మొత్తం 298 దరఖాస్తులు రాగా ఇందులో అత్యధికంగా కరీంనగర్ నగర పాలిక సంస్థకు 45, కరీంనగర్ రూరల్ తహశీల్దార్ కార్యాలయానికి 18, కొత్తపెల్లి తహశీల్దార్ కార్యాలయానికి 13 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు.

News January 27, 2025

KNR: టాస్క్ ఆధ్వర్యంలో ఉచిత టెక్నికల్ శిక్షణ తరగతులు

image

ఉచిత టెక్నికల్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు టాస్క్ ప్రతినిధులు తెలిపారు. ఇంజినీరింగ్, డిగ్రీ ఉత్తీర్ణులై సాప్ట్‌వేర్ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న నిరుద్యోగ యువతకి టెక్నికల్ స్కిల్స్ కోసం ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ తరగతులకు హాజరు కావాలనుకున్న అభ్యర్థులు ఈ నెల 29 సాయంత్రం 5 గంటలలోపు KNR IT టవర్ లోని మొదటి అంతస్తులో గల టాస్క్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

News January 27, 2025

కరీంనగర్: కార్పొరేషన్ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ పమేలా సత్పతి

image

కరీంనగర్ నగరపాలక సంస్థ పాలకవర్గ పదవీకాలం ఈ నెల 28తో ముగియనుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకాధికారిగా కలెక్టర్ పమేలా సత్పతిని నియమించింది. ఆదివారం జమ్మికుంట, హుజురాబాద్, చొప్పదండి మున్సిపాలిటీల పాలకవర్గం పదవీకాలం ముగియడంతో ఆ మూడు మున్సిపాలిటీలకు అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ప్రపుల్ దేశాయ్‌ని నియమించింది.

News January 27, 2025

కాళేశ్వరం ఆలయ ఈఓ మారుతిపై వేటు

image

కాళేశ్వరం ఆలయంలో గత సోమవారం గర్భగుడి తలుపులు మూసేసి ప్రైవేట్ షూటింగ్ నిర్వహించడం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారి దుమారంలేపింది. భక్తులు, ప్రజా సంఘాల నేతలు పెద్ద ఎత్తున అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన దేవాదాయ శాఖ అధికారులు విచారణ చేపట్టి విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఆలయ ఈవో మారుతిపై వేటు వేస్తూ ఆలయ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తొలగిస్తూ దేవాదాయ శాఖ ఏడీసీ జ్యోతి ఉత్తర్వులు జారీ చేశారు.

News January 27, 2025

KNR: శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళలకు 59 రకాల పరీక్షలు: కలెక్టర్

image

మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో శుక్రవారం సభ నిర్వహిస్తున్నామని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. మహిళల ఆరోగ్యం, పోషకాహార స్థితిని మెరుగుపరిచేందుకు, సామాజిక సమస్యలు పరిష్కరించేందుకు ఈసభ తోడ్పాటునిస్తుందన్నారు. జిల్లాలో ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా మహిళలకు రూ.50వేల విలువైన చేసే 59రకాల వైద్యపరీక్షలను ఉచితంగా చేయిస్తున్నామన్నారు.

News January 26, 2025

KNR: సంక్షేమ హస్టల్లో మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం సరఫరా

image

కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 68 వేల 488 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం, ప్రతి నెల 396 టన్నుల సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని కలెక్టర్ పమేలా సత్పతి లిపారు. రాష్ట్ర ప్రభుత్వం డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచుతూ ప్రకటించిన కామన్ డైట్ మెనూను జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు.

News January 26, 2025

వీణవంక: ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య

image

కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో రమ్య (25) అనే వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రమ్య మృతికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనా స్థలానికి జమ్మికుంట రూరల్ సీఐ కిషోర్, వీణవంక ఎస్సై తిరుపతి చేరుకొని కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 26, 2025

KNR: రూ.500 సిలిండర్.. 1,43,899 మందికి లబ్ధి

image

మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కే వంట గ్యాస్ ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు కరీంనగర్ జిల్లాలో 1,43,899 సిలిండర్లు అందించామని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఈ పథకంలో ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చని ఈ సందర్భంగా తెలిపారు.

News January 26, 2025

KNR: రాజీవ్ ఆరోగ్యశ్రీలో 20,474 మందికి చికిత్స: కలెక్టర్

image

రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 20, 474 మంది పేదలకు ఉచిత చికిత్స అందించామని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. పథకంలో కొత్తగా 163 చికిత్సలను ప్రభుత్వం చేర్చింది. ఈ పథకం ద్వారా మొత్తం 1837 చికిత్సలకు ఉచిత వైద్యం అందుతోందన్నారు. హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలో ఉన్నత ప్రమాణాలను పాటించినందుకు నేషనల్ క్వాలిటీ ఎనురెన్స్ స్టాండర్డ్ అవార్డుకు ఎంపిక అయిందన్నారు.

error: Content is protected !!