India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కరీంనగర్ జిల్లా సిపిఐ కార్యదర్శి పంజాల శ్రీనివాస్ నియామక మయ్యారు. మేడ్చల్ మల్కాజ్గిరి లో నిర్వహించిన CPI 4వ రాష్ట్ర మహాసభల్లో పార్టీ శ్రేణులు ఆయనకు నియామక ఉత్తర్వులు అందించారు. తన నియామకానికి సహకరించిన సీనియర్ నాయకులు, పార్టీ నేతలకు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. రాబోవు రోజుల్లో మరింత ఉత్సాహంతో ప్రజా సమస్యల పరిష్కారాని కోసం పోరాటాలు చేస్తామని శ్రీనివాస్ తెలిపారు.
జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని, ఆ దిశగా లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ సహకరించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ పథకం అమలుపై కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో హౌసింగ్, ఆర్ అండ్ బీ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. పైలెట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నూరు శాతం పూర్తి చేయాలని, గృహప్రవేశాలకు సిద్ధం చేసేలా చూడాలని కలెక్టర్ సూచించారు.
KNR పోలీస్ కమిషనరేట్లో మిలాద్ ఉన్ నబి పండుగ సందర్భంగా నగరంలోని మర్కజీ మిలాద్ కమిటీ, సున్నీ మర్కజీ మిలాద్ కమిటీ, మదరసా అన్వార్ ఉల్ ఉలూమ్ కమిటీల పెద్దలతో పోలీసు కమిషనర్ గౌష్ ఆలం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబి పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని కమిటీ సభ్యులను కోరారు. పండుగలకు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సోదరుడు కవ్వంపల్లి రాజేశం ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. దీంతో శనివారం ఆయన చిత్రపటానికి కార్మిక & బొగ్గుగనుల శాఖా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను, మృతుడు రాజేశం కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపర్చారు.
యువ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మట్టి గణపతులను పూజిద్దాం! పర్యావరణాన్ని కాపాడుదాం!! అని మట్టి గణపతులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ రూపొందించిన పోస్టర్ను శనివారం కలెక్టర్ సమావేశ మందిరంలో కలెక్టర్ పమేలా సత్పతి ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంటింటా మట్టి గణపతి విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మట్టి గణపతులను ప్రతిష్టించాలని కోరారు.
కరీంనగర్లోని ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో నేడు బీఈడీ పరీక్షల సమయంలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. పరీక్షా కేంద్రంలోనే డిగ్రీ విద్యార్థుల కోసం డీజే సౌండ్తో ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ శబ్ద కాలుష్యం వల్ల పరీక్ష రాసే విద్యార్థులు, ముఖ్యంగా గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అభ్యంతరాలు చెప్పినప్పటికీ సౌండ్ను నియంత్రించకపోవడంతో విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు.
గణేష్ నవరాత్రులు, మిలాద్ ఉల్ నబీ పండుగలను దృష్టిలో ఉంచుకుని కలెక్టరేట్ ఆడిటోరియంలో శాంతి కమిటీ సభ్యులతో అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ.. ఈసారి నగరంలో సుమారు 3300 గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నిర్వాహకులు గణేష్ మండప వివరాలను పోలీస్ వెబ్సైట్లో నమోదు చేయాలని సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ ఉల్ నబీ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ ఉల్ నబీ పండుగ నేపథ్యంలో శాంతి కమిటీ సభ్యులతో, ఏర్పాట్లపై అధికారులతో కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీ గౌస్ ఆలం, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, ఆర్డీవో మహేశ్వర్ తదితరులున్నారు.
జాతీయ క్రీడా దినోత్సవ వారోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా సప్తగిరి కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక, అంగన్వాడీ చిన్నారులకు ఆటలు పోటీలు నిర్వహించారు. అంగన్వాడీ చిన్నారులు, ప్రాథమిక పాఠశాల విద్యార్థుల రన్నింగ్ పోటీని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జెండా ఊపి ప్రారంభించారు. రన్నింగ్ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం సాధించిన విద్యార్థులకు కలెక్టర్ మెడల్స్ ప్రదానం చేశారు.
CPI జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, నల్గోండ మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డికి శనివారం CPI జిల్లా కార్యాలయంలో నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సురవరం సుధాకర్ రెడ్డి దేశానికి, పార్టీకి చేసిన సేవలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.