Karimnagar

News August 9, 2024

కరీంనగర్: ఈనెల 8 నుంచి దరఖాస్తుల స్వీకరణ

image

తెలంగాణ ఓపెన్ స్కూల్ 2024-25 విద్యా సంవత్సరానికి ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు ఈనెల 8 నుంచి సెప్టెంబర్ 20 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు తెలిపారు. అడ్మిషన్ ఫీజును అందుబాటులో ఉన్న ఓపెన్ స్కూల్ కేంద్రాలలో ఆన్‌లైన్లో అడ్మిషన్ ఫీజు చెల్లించి ప్రవేశాలు పొందాలని కోరారు.

News August 8, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

* ఎల్లారెడ్డిపేట మండలంలో నలుగురు చిన్నారులపై వీధి కుక్కల దాడి.
* కొడిమ్యాల మండలంలో హత్య కేసులో ఇద్దరి అరెస్ట్.
* సిరిసిల్లలో వైభవంగా రాజశ్యామల కుంకుమార్చన.
* జగిత్యాల జిల్లాలో 124 డెంగ్యూ కేసులు నమోదు.
* వేములవాడలో ఎమ్మార్పీఎస్ భారీ బైక్ ర్యాలీ.
* జగిత్యాలలో జర్నలిస్టులు చేస్తున్న నిరసన దీక్షకు మద్దతు తెలిపిన ఎంపీ అరవింద్.
* జగిత్యాల జిల్లా ఇంటర్ బోర్డు అధికారిగా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ.

News August 8, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.1,12,370 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.48,248, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.50,000, అన్నదానం రూ.14,122, వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.

News August 8, 2024

కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో లక్ష పత్రి పూజలు

image

మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వర మక్తేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణ మాసం సందర్భంగా ఆలయంలో లక్ష్యపత్రి పూజలను గురువారం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. లక్ష పత్రి పూజలు చేయడం ద్వారా గురువారం రూ.85,000 ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు.

News August 8, 2024

సిరిసిల్ల: చిన్నారులపై వీధి కుక్కల దాడి

image

సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చిన్నారులపై వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ దాడి చేశాయి. ఈ ఘటనలో నలుగురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబీకుల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ప్రీతిష, వరుణతేజ, సహస్ర, వర్షిత్‌లు ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. గాయపడిన చిన్నారులను వెంటనే 108లో సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు.

News August 8, 2024

తడి, పొడి చెత్తను వేరు చేసేలా తల్లితండ్రులను ఒప్పించాలి: కలెక్టర్

image

తడి, పొడి చెత్తను వేరు వేరుగా చెత్తబుట్టల్లో వేసేలా పిల్లలు వారి తల్లి తండ్రులను ఒప్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. హుజురాబాద్ పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్‌లో ఏర్పాటు చేసిన స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పిల్లలకు ఈకో క్లబ్, మాస్టర్ ట్రైనర్లతో అవగాహన కల్పించాలని తెలిపారు. ఆగస్టు 15లోగా పిల్లలకు 3 జతల సాక్సుల, ఒక షూ జత అందిస్తామని తెలిపారు.

News August 8, 2024

కరీంనగర్ జిల్లాలో తగ్గిన ‘రియల్’ జోరు

image

కరీంనగర్ జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గుముఖం పడుతోంది. కొన్ని మాసాలుగా భూముల ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. భూములు అమ్ముడుపోక ఆర్థిక అవసరాలకు సదరు భూ పత్రాలతో అధిక వడ్డీకి ఫైనాన్స్ తీసుకుంటున్నారు. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉండగా.. భూ రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.20 కోట్ల ఆదాయం వచ్చేది. ప్రస్తుతం రోజుకు రూ.15 కోట్లు దాటట్లేదని తెలుస్తోంది.

News August 8, 2024

సిరిసిల్ల: చేప పిల్లల పంపిణీ లేనట్టేనా?

image

మత్స్యకారులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేప పిల్లలను వదులుతోంది. ఏటా ఆగస్టులో చేపపిల్లలు విడుదల చేయగా.. ఈసారి టెండర్లు కూడా ఖరారు కాలేదు. ఇప్పటికే అదును దాటుతోందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. కాగా, జిల్లాలోని ఎగువ, మధ్యమానేరు, అన్నపూర్ణ ప్రాజెక్టులతో పాటు 440 చెరువులు ఉన్నాయి. వాటి పరిధిలో 138 మత్స్య పారిశ్రామిక సంఘాలు ఉండగా.. 8,800 మంది మత్స్యకారులు సభ్యులుగా ఉన్నారు.

News August 8, 2024

మిడ్ మానేరుకు చేరిన 17.06 టీఎంసీల నీరు

image

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి రాజరాజేశ్వర (మధ్యమానేరు) జలాశయంలో గురువారం నాటికి 17.06 టీఎంసీల నీరు చేరిందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. జలాశయానికి ఎల్లంపల్లి నుంచి నంది, గాయత్రి పంపు హౌజ్, వరద కాలువ ద్వారా 6,500 క్యూసెక్కులు, మానేరు, మూల వాగు నుంచి 200 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని తెలిపారు. జలాశయం నుంచి అన్నపూర్ణ జలాశయానికి 6,462 క్యూసెక్కుల నీరు చేరినట్లు అధికారులు తెలిపారు .

News August 8, 2024

కరీంనగర్: బీఫార్మసీ ఫలితాలు విడుదల

image

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన బీఫార్మసీ 7,8వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు శాతవాహన విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి డా.శ్రీ రంగ ప్రసాద్ ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఫలితాలు www.satavahana.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని పరీక్షల నియంత్రణ అధికారి పేర్కొన్నారు.