India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కథలాపూర్ మండలం కలిగోట గ్రామశివారులో నిర్మిస్తున్న సూరమ్మ ప్రాజెక్టును మంగళవారం సాయంత్రం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ఝా పరిశీలించారు. బుధవారం రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సూరమ్మ ప్రాజెక్టును సందర్శించనున్న నేపథ్యంలో ముందస్తుగా ఏర్పాట్లను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు.
రేపు నీటిపారుదల మరియు పౌర సరఫరాలశాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి, మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో నిర్వహించే గ్రామసభలో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం గంగాధర మండలంలో నిర్వహించనున్న గ్రామసభ పాల్గొంటారు. మంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణశాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ ఈనెల 24న కరీంనగర్లో పర్యటించనున్నారు. ఆయన పర్యటన సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్, మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ కరీంనగర్ పట్టణంలోని స్టేడియం కాంప్లెక్స్, హౌసింగ్ బోర్డు వాటర్ ట్యాంక్, కుమార్వాడి గవర్నమెంట్ స్కూల్, హౌజింగ్ బోర్డులో నిర్వహించబోయే బహిరంగ సభా స్థలి, డంప్ యార్డ్ను పరిశీలించారు.
సాంబానోవా సిస్టమ్స్ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు సమావేశం అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ ముందుకు వచ్చినందుకు ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. AI మౌలిక సదుపాయాల సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో కలిసి పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉన్నారన్నారు. ఈ కంపెనీ భాగస్వామ్యంతో తెలంగాణలో అత్యాధునిక AI టెక్నాలజీని వేగవంతం చేస్తామన్నారు.
సిరిసిల్ల చేనేత కార్మికులకు ప్రజా పాలన ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం స్వయం సహాయక సంఘాలకు అందించే యూనిఫాం చీరల ఆర్డర్ ఇచ్చి పెద్ద ఎత్తున పని కల్పించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు అందించే ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా అందరికీ ఒకే రంగు గల ఒక్కొకరికి ఒక్కో చీరను అందజేసేందుకు 4.24 కోట్ల మీటర్ల చీరల ఆర్డర్స్ అందజేసినట్లు పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు నేటి నుంచి ప్రభుత్వం మరోసారి దరఖాస్తులను స్వీకరిస్తోంది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే అర్హుల జాబితా అధికారులకు చేరింది. తమ పేర్లు రాలేదని కొందరు ఆందోళన వ్యక్తం చేయడంతో వారికి మరోసారి అవకాశమివ్వాలని గ్రామసభల్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తులను పరిశీలించి అర్హులను అధికారులు ఎంపిక చేయనున్నారు.
నేటి నుంచి నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కొరకు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్న సందర్భంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. నియోజకవర్గ పరిధిలోని మండల కాంగ్రెస్ అధ్యక్షులు, కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, గ్రామ కాంగ్రెస్ కమిటీ సభ్యులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ కమిటి సభ్యులు పాల్గొనాలని కోరారు.
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సంజీవయ్యనగర్లో ఓ చిన్నారి తల నీళ్ల బిందెలో ఇరుక్కుంది. ఎంత ప్రయత్నించినా బిందెలో నుంచి పాప తల బయటికి రాకపోవడంతో బిందెను జాగ్రత్తగా కత్తిరించి పాప తలను జాగ్రత్తగా బయటకు తీశారు. ఈ ఘటనలో పాపకు ఎలాంటి ప్రమాదం కాలేదు. ఇంత జరుగుతున్నా ఆ చిన్నారి ఏడవకుండా ధైర్యంతో ఉండడానికి చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.90,177 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.37,948 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.44,260, అన్నదానం రూ.7,969,వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రేపటినుండి గ్రామసభలు. @ మెట్పల్లి మండలంలో బాలిక అదృశ్యం.. కేసు నమోదు. @ భీమదేవరపల్లి మండలంలో గంజాయి సేవిస్తున్న నలుగురిపై కేసు. @ ముత్తారం మండలంలో ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య. @ వేములవాడ రాజన్న ఆలయ పరిసరాలలో పోలీసుల తనిఖీలు. @ ఇబ్రహీంపట్నం మండలంలో పురుగుల మందు తాగి వృద్ధుడి ఆత్మహత్య. @ గణతంత్ర దినోత్సవానికి పకడ్బందీ ఏర్పాటు చేయాలన్న జగిత్యాల అడిషనల్ కలెక్టర్.
Sorry, no posts matched your criteria.