India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జాతీయ క్రీడా దినోత్సవ వారోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా సప్తగిరి కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక, అంగన్వాడీ చిన్నారులకు ఆటలు పోటీలు నిర్వహించారు. అంగన్వాడీ చిన్నారులు, ప్రాథమిక పాఠశాల విద్యార్థుల రన్నింగ్ పోటీని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జెండా ఊపి ప్రారంభించారు. రన్నింగ్ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం సాధించిన విద్యార్థులకు కలెక్టర్ మెడల్స్ ప్రదానం చేశారు.
CPI జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, నల్గోండ మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డికి శనివారం CPI జిల్లా కార్యాలయంలో నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సురవరం సుధాకర్ రెడ్డి దేశానికి, పార్టీకి చేసిన సేవలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా కరీంనగర్కు చెందిన కసిరెడ్డి మణికంఠ రెడ్డి ఎన్నికయ్యారు. మల్కాజిగిరిలో జరిగిన సీపీఐ రాష్ట్ర 4వ మహాసభలలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా విద్యారంగ సమస్యలపై అనేక పోరాటాలు చేసిన మణికంఠ రెడ్డిని ఎన్నుకోవడం పట్ల పార్టీ జిల్లా నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అభివృద్ధికి ఆయన కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
జూనియర్ విభాగాల్లో జిల్లాస్థాయి యోగాసన పోటీలు రేపు నిర్వహించనున్నట్లు TG యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ KNR యూనిట్ కన్వీనర్ ఎం.రమేష్ తెలిపారు. ప్రతిభ కనబర్చిన వారిని SEPలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ట్రెడిషనల్ యోగా, ఫార్వర్డ్ బైండ్, బ్యాక్ బెండ్ తదితర విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. క్రీడాకారులు శనివారం సా.6 గం.లోపు 8522920561ను సంప్రదించాలన్నారు.
దుర్శేడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శుక్రవారం సందర్శించారు. రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆమె ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. యూరియా అక్రమంగా నిల్వ ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. అనంతరం సంఘం ఆవరణలో ఆమె మొక్కలు నాటారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, సహకార సంఘం అధికారులు, సిబ్బంది ఉన్నారు.
విధి నిర్వహణలో అనారోగ్యానికి గురైన ఓ హోం గార్డుకి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అండగా నిలిచారు. కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో బ్లూ కోల్ట్స్ విధులు నిర్వహిస్తున్న హోంగార్డు శివకుమార్ హై బీపీ కారణంగా కంటి చూపు కోల్పోయారు. ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం రూ.1.5 లక్షల ఆర్థిక సహాయాన్ని సీపీ శుక్రవారం అందించారు. ప్రస్తుతం శివకుమార్కు కంటిచూపు వచ్చింది. కాగా, ఆయన నిన్ననే తిరిగి విధుల్లో చేరారు.
HZB నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలోకి చేరికల పరంపర మొదలైంది. జమ్మికుంట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు HZB MLA కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో BRSలో చేరగా.. మరోవైపు ఇదే మండలంలోని ఫ్యాక్స్ చైర్మన్, ఓ మాజీ సర్పంచ్ ప్రణవ్ సమక్షంలో కాంగ్రెసులో చేరారు. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే చేరికలు మొదలవడంతో నాయకులు ఏరోజు ఏ పార్టీలో ఉంటారో తెలియదు అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
దుర్షెడు అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. పూర్వ ప్రాథమిక విద్య నేర్చుకుంటున్న చిన్నారులతో ముచ్చటించారు. వారందరికీ రోజువారీగా అందించే భోజనాన్ని స్వయంగా వడ్డించారు. సిలబస్ ప్రకారం పూర్వ ప్రాథమిక విద్య బోధించాలని అంగన్వాడీ సిబ్బందిని ఆదేశించారు. క్రమం తప్పకుండా పిల్లల బరువు, ఎత్తు కొలవాలని అన్నారు. అనంతరం గర్భిణీలకు సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించారు.
వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు సబ్సిడీపై అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ స్మామ్–2025 పథకం కింద 2,822 బ్యాటరీ, మాన్యువల్ ఆపరేటెడ్ స్ప్రేయర్లు, 481 పవర్ స్ప్రేయర్లు, 188 రోట వేటర్లు, 32 సీడ్ కంఫెర్టిలైజర్ డ్రిల్లర్లు, ఇతర పరికరాలు ఉన్నాయన్నారు. చిన్న, సన్నకారు, మహిళా, SC, ST రైతులకు 50% సబ్సిడీ, ఇతర రైతులకు 40% సబ్సిడీ కల్పించనున్నట్టు తెలిపారు.
శంకరపట్నం మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన తడిగొప్పుల పోచయ్య కడుపు నొప్పితో బాధపడుతూ గురువారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం కుటుంబసభ్యులు గమనించి కేశవపట్నం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోచయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Sorry, no posts matched your criteria.