India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరీంనగర్ జిల్లా మీదుగా వెళుతున్న జాతీయ రహదారి 563 నిర్మాణం కోసం భూసేకరణ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కరీంనగర్ కలెక్టర్ రెవిన్యూ డివిజనల్ అధికారులను ఆదేశించారు. భారత జాతీయ రహదారి సంస్థ, వరంగల్ ప్రాజెక్ట్ సంచాలకులు భరద్వాజ్, రెవిన్యూ డివిజనల్ అధికారులు మహేశ్వర్, రమేష్ బాబుతో సమావేశం నిర్వహించారు. భూసేకరణకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలను గురించి చర్చించారు.
కరీంనగర్ జిల్లా మీదుగా వెళుతున్న జాతీయ రహదారి 563 నిర్మాణం కోసం భూసేకరణ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కరీంనగర్ కలెక్టర్ రెవిన్యూ డివిజనల్ అధికారులను ఆదేశించారు. భారత జాతీయ రహదారి సంస్థ, వరంగల్ ప్రాజెక్ట్ సంచాలకులు భరద్వాజ్, రెవిన్యూ డివిజనల్ అధికారులు మహేశ్వర్, రమేష్ బాబుతో సమావేశం నిర్వహించారు. భూసేకరణకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలను గురించి చర్చించారు.
హుజూరాబాద్ పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో ఉన్న నిర్వాణ రెస్టారెంట్ సిబ్బందిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. నిన్న రాత్రి 11 గంటల సమయంలో రెస్టారెంట్లో భోజనం చేసిన అనంతరం కొందరు వ్యక్తులు సిబ్బందిపై చేయిచేసుకున్నారు. గాయపడిన సిబ్బందిని చికిత్స కోసం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా, దాడి చేయడానికి గాల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
కరీంనగర్ జిల్లాకు అవార్డు దక్కింది. సమాచార హక్కు చట్టం వారోత్సవంలో భాగంగా రాష్ట్ర సమాచార కమిషన్ నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి బెస్ట్ పెర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్ అవార్డును స్వీకరించారు. తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు.
MPTC, ZPTC ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ వెలువడుతుండడం, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం VC నిర్వహించారు. నామినేషన్ల దాఖలుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అప్పీల్ పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటీచేసే అభ్యర్థుల ప్రకటన వంటి ఎన్నికల ప్రక్రియను నిబంధనల ప్రకారం పకడ్బందీగా చేపట్టాలన్నారు.
హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 6 మండలాల్లో మొదటి దఫా స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. శంకరపట్నం 13, వీణవంక 14, ఇల్లందకుంట 9, జమ్మికుంట 10, HZB 12, సైదాపూర్(V) 12 మొత్తం 70 MPTC స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని ఆమె పేర్కొన్నారు. నేటి నుంచి 11వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 12న పరిశీలన. 15న ఉపసంహరణ. 23న ఎన్నికలు. నవంబర్ 11న కౌంటింగ్ ఉంటుంది.
ఆర్టీసీ KNR రీజియన్ పరిధిలో బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా SEP 27 నుంచి OCT 6 వరకు 10 రోజుల వ్యవధిలో మొత్తం రూ.4,76,75,040 ఆదాయం సమకూరిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. KNR-1 డిపో రూ.48,24,260, KNR-2 రూ.76,62,060, GDK రూ.73,78,280, HSNB రూ.28,37,800, HZB రూ.31,21,580, MNTY రూ.34,05,360, JGTL రూ.39,72,920, KRTL రూ.34,05,360, MTPL 39,72,920, SRCL రూ.36,89,140, VMWD రూ.34,05,360 ఆదాయం వచ్చింది.
కరీంనగర్ రూరల్ మండలం నగునూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ బుధవారం సందర్శించారు. జడ్పీహెచ్ఎస్లో బుధవారం బోధనలో భాగంగా 10వ తరగతి విద్యార్థులు నేర్చుకుంటున్న అంశాలను పరిశీలించారు. ఆంగ్ల పాఠం నేర్చుకుంటుండగా ప్రతి విద్యార్థితో ఆంగ్ల పాఠాన్ని చదివించారు. పాఠాలు చదవడంలో మెళకువలు నేర్పారు. అన్ని పాఠశాలల్లోని అన్ని తరగతుల్లో బుధవారం బోధన పకడ్బందీగా అమలు చేయాలన్నారు.
సద్దుల బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ఆర్టీసీకి అత్యధిక ఆదాయం వచ్చింది. ఇందుకు గాను KNR బస్ స్టేషన్ ఆవరణలోని KNR-1 & 2 డిపోలలోని సిబ్బందికి KNR RM బి.రాజు, డిప్యూటీ RMలు భూపతి రెడ్డి, మల్లేశం ఆధ్వర్యంలో మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా RM బి.రాజు మాట్లాడుతూ.. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు, సూపర్వైజర్లను అభినందించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన GOను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై నేడే హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం కలిపి 60 ZPTCలు, 646 MPTCలు, 1,216 GP స్థానాలున్నాయి. కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందా?, లేదా వ్యతిరేకంగా వస్తుందా? COMMENT.
Sorry, no posts matched your criteria.