Karimnagar

News August 21, 2025

KNR: ‘బ్యాంకర్లు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేయాలి’

image

ఆర్థిక మద్దతు పథకాల లక్ష్య సాధనకు బ్యాంకర్లు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం నిర్వహించిన సమావేశంలో కోరారు. 2024 ఏప్రిల్ నుంచి 2025 జూన్ వరకు రూ. 4314.88 కోట్ల రుణాలను మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర లక్ష్యాలలో 32.12 శాతం మాత్రమే పూర్తయిందని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు.

News August 21, 2025

KNR: గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై సీపీ సమీక్ష

image

రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లాలో శాంతిభద్రతల పర్యవేక్షణపై KNR CP గౌష్ ఆలం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విగ్రహాల ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

News August 20, 2025

KNR: శాతవాహన ఆచార్యునికి బెస్ట్ టీచర్ అవార్డు

image

రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ, తెలంగాణ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఉత్తమ ఉపాధ్యాయులను, ఆచార్యులను 2022-23 సం.కి అవార్డులను అందజేశారు. ఇందులో భాగంగా శాతవాహన విశ్వవిద్యాలయ ఉర్దూ విభాగ సహాయ ఆచార్యులు డా. నజీముద్దీన్ మునవర్‌ను ఎంపిక చేసి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ జాస్తి రవికుమార్ అభినందనలు తెలిపారు.

News August 20, 2025

HZB: ఆశావర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలిగా తాడూరి లత

image

హుజురాబాద్ మండలం చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పనిచేస్తున్న ఆశా వర్కర్స్ యూనియన్ ( సిఐటీయూ అనుబంధ) ఎన్నికలు బుధవారం హుజురాబాద్ పట్టణంలో జరిగాయి. ఈ ఎన్నికలకు జిల్లా సిఐటియు కార్యదర్శి ఎడ్ల రమేశ్, ఆశావర్కర్ల యూనియన్ జిల్లా కార్యదర్శి మారెళ్ళీ లత హాజరై ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. తాడూరి లత (కాట్రపల్లి) ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.

News August 20, 2025

KNR: పీహెచ్‌డీ పట్టాలు పొందిన అధ్యాపకులకు అభినందనలు

image

హైదరాబాద్ OUలో జరిగిన 84వ స్నాతకోత్సవంలో KNRలోని SRR ప్రభుత్వ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులు డా. రాపర్తి శ్రీనివాస్, డా. బండి అశోక్, డా. కీర్తి రాజేష్, డా. అందె శ్రీనివాస్‌లు డాక్టరేట్ పట్టాలు అందుకున్నారు. ఈ సందర్భంగా పట్టాలు పొందిన అధ్యాపకులకు కళాశాల ప్రిన్సిపల్ కే.రామకృష్ణ, TGCGTA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.కడారు సురేందర్ రెడ్డి, అధ్యాపకులు అభినందనలు తెలిపారు.

News August 20, 2025

KNR: ‘కలెక్టరేట్‌, ఆసుపత్రిలో పరిశుభ్రతపై దృష్టి పెట్టాలి’

image

కలెక్టరేట్‌తో పాటు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఈ రెండు కార్యాలయాలను సందర్శించిన ఆయన, పారిశుద్ధ్య నిర్వహణను పర్యవేక్షించారు. ఎక్కడైనా చెత్త కనిపించకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, పారిశుద్ధ్య పనులను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని కమిషనర్ హెచ్చరించారు.

News August 20, 2025

KNR: ప్రభుత్వం స్కూల్లో ఫ్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్

image

అంగన్వాడీ కేంద్రాలను ఫ్రీ ప్రైమరీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాల్లో 34 పాఠశాలలను గుర్తించి వాటిలోని అంగన్వాడీ కేంద్రాలను తరలించి ఫ్రీ ప్రైమరీ విద్య అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా KNR జిల్లాలో ఇల్లందకుంట మం. వాగొడ్డు రామన్నపల్లి, వీణవంక మం. దేశాయిపల్లి, తిమ్మాపూర్ మం. గొల్లపల్లి, గంగాధర మం. సర్వారెడ్డిపల్లి పాఠశాలలను ఎంపిక చేశారు.

News August 20, 2025

KNR: ‘పారిశ్రామిక రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి’

image

స్థానిక SRR కళాశాలలో కామర్స్ & బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగం వారు కామర్స్ విద్యార్థులకు ప్రొఫెషనల్ కోర్సులైన సీఏ, సీఎంఏల పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రతినిధి గుర్రం అశోక్ కుమార్ మాట్లాడుతూ.. డిగ్రీతోపాటు సీఏ, సీఎంఏ వంటి ప్రొఫెషనల్ కోర్సులను పూర్తి చేసిన కామర్స్ విద్యార్థులకు ప్రస్తుత వ్యాపార, పారిశ్రామిక రంగాలలో అత్యున్నత ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

News August 20, 2025

కరీంనగర్: వివాహిత అనుమానాస్పద మృతి

image

కరీంనగర్ భగత్ నగర్లో భావన(మానస) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. తన భర్త జ్ఞానేశ్వర్ అర్ధరాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి ఉరి వేసుకుని ఉందని, ఆసుపత్రికి తీసుకెళ్దామని ఆమెను కిందికి దించుతుండగా, అప్పటికే మృతి చెందిందని చెప్పారు. పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

News August 20, 2025

KNR: జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష

image

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఆంగ్లం బోధించే టీచర్లు ప్రత్యేకశ్రద్ధ చూపాలని కలెక్టర్ పమెలా సత్పతి KNR కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్షలో అన్నారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకచర్యల గురించి సమావేశం ఏర్పాటుచేశారు. పిల్లలతో ప్రతిరోజు ఓ పేజీ రాయించాలని 2పేజీలు చదివించాలని, అలాగే PHCలో ప్రసవాలసంఖ్యను పెంచాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.