India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా శంకరపట్నం మండలంలో 39.3°C నమోదు కాగా, చిగురుమామిడి 39.2, గన్నేరువరం 38.9, జమ్మికుంట 38.7, మానకొండూరు, గంగాధర 38.5, తిమ్మాపూర్ 38.4, రామడుగు, కరీంనగర్ 38.3, కరీంనగర్ రూరల్ 38.2, వీణవంక 37.8, సైదాపూర్ 37.6, చొప్పదండి 37.0, హుజూరాబాద్ 36.7, కొత్తపల్లి 36.6, ఇల్లందకుంట 36.5°C గా నమోదైంది.
అంబేడ్కర్ జయంతి సందర్భంగా కోర్టు చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ అలం పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ చేసిన సేవలను వారు కొనియాడారు. ఆయన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు. వారి వెంట జిల్లా అధికార యంత్రాంగం, పోలీస్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
KNR జిల్లాలో ఎండ తీవ్రత పెరిగింది. గడచిన 24 గంటల్లో జిల్లా మొత్తం 40°C పై ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా మానకొండూర్ మండలంలో 43.0°C నమోదు కాగా, గంగాధర 42.9, రామడుగు 42.8, జమ్మికుంట 42.7, చిగురుమామిడి 42.6, కరీంనగర్ 42.5, వీణవంక 41.6, గన్నేరువరం 41.5, తిమ్మాపూర్ 41.4, ఇల్లందకుంట, కరీంనగర్ రూరల్ 41.2, చొప్పదండి 40.9, శంకరపట్నం 40.5, కొత్తపల్లి 40.4, హుజూరాబాద్ 40.3, సైదాపూర్ 40.2°C గా నమోదైంది.
వేములవాడలోని ఓ ఫంక్షనల్ వద్ద ఆదివారం సాయంత్రం వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. నాగయ్యపల్లికి చెందిన చెట్టిపల్లి పరశురాం (39)ను గుర్తుతెలియని వ్యక్తులు హతమర్చారు. మృతుడు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
చొప్పదండి పట్టణం బీసీ కాలనీకి చెందిన గాజుల కనకలక్ష్మి (55) శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్సై మామిడాల సురేందర్ తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు తమ తల్లిని చంపి మెడలో ఉన్న రెండు తులాల బంగారు పుస్తెలతాడు ఎత్తుకుపోయారని కూతురు నాగమణి ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
KNR జిల్లాలో ఎండ దంచికొడుతోంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా జమ్మికుంట మండలంలో 42.3°C నమోదు కాగా, మానకొండూర్ 42.3, గంగాధర 42.1, రామడుగు 41.9, తిమ్మాపూర్ 41.6, KNR 41.5, చొప్పదండి 41.4, చిగురుమామిడి 41.2, KNR రూరల్ 41.0, శంకరపట్నం, గన్నేరువరం 40.9, కొత్తపల్లి 40.5, వీణవంక 40.4, హుజూరాబాద్ 40.3, సైదాపూర్, ఇల్లందకుంట 39.6°C గా నమోదైంది. కాగా, మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు.
రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత స్తబ్దుగా ఉన్న BRS రజతోత్సవ సభ ఏర్పాటు చేస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. KNR, HZBD ఎమ్మెల్యేలు, చొప్పదండి, మానకొండూరు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సభకు భారీగా తరలివెళ్లి పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా సమాయత్తమవుతున్నారు. ఇది స్థానిక పోరుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. ఈ సభ బీఆర్ఎస్కు కీలకం కానుంది.
శంకరపట్నంలో శనివారం సాయంత్రం ఓ లారీ RTC బస్సును ఢీకొనడంతో అది వెళ్లి కారును ఢీకొంది. తాడికల్ గ్రామ శివారులోని జాతీయ రహదారిపై KNR నుంచి WGL వైపు వెళ్తున్న మెట్పల్లి డిపో RTC బస్సు ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేస్తుండగా లారీ ఢీకొట్టింది. అదే సమయంలో HZBD నుంచి KNR వైపు ఎదురుగా వస్తున్న ఓ కారును ఈ బస్సు ఢీకొంది. బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. వారందరూ సురక్షితంగా బయటపడ్డారు.
రాజన్న సిరిసిల్ల(D) చందుర్తి(M)లోని ఓ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆంగ్లంలో అడిగిన ప్రశ్నకు చాలా ఆసక్తికర సమాధానం రాసింది. ఈరోజు ఇంగ్లిష్ ప్రశ్నాపత్రంలో ‘మీ అమ్మకు నచ్చినది, నచ్చని వాటి గురించి రాయండి’ అని అడిగారు. అమ్మకు నానమ్మ, తాతయ్య నచ్చరని ఓ విద్యార్థిని సమాధానం రాయడంతో పేపర్ దిద్దిన టీచర్ ఆశ్చర్యపోయారు. నేటికాలంలో కోడళ్ళకు అత్తమామల పట్ల ఎలాంటి భావన ఉందో ఈ లేఖ తెలియజేస్తోంది.
వేలాది జనం భూస్వామ్య వ్యవస్థపై జగిత్యాలలో 1978 సెప్టెంబరు 9న రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభనే జగిత్యాల జైత్రయాత్రగా చరిత్రపుటల్లో లిఖించి ఉంది. ఈ సభకు ప్రజాయుద్ధనౌక గద్దర్ హాజరై తన ఆటపాటలతో జనాన్ని ఉర్రూతలూగించారు. రైతుకూలీ సంఘాలు పీపుల్స్ వార్గా, మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందడానికి జగిత్యాల జైత్రయాత్ర బీజం వేసిందని చెబుతుంటారు. తెలంగాణ విప్లవోద్యమ చరిత్రకు ఇది ఊపునిచ్చింది.
Sorry, no posts matched your criteria.