Karimnagar

News August 20, 2025

KNR: సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాల గడువు పొడిగింపు

image

SRR ప్రభుత్వ కళాశాలలో నిర్వహిస్తున్న క్యాండిల్ మేకింగ్, బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ సర్టిఫికేట్ కోర్సులకు ప్రవేశాల గడువు ఈ నెల 31 వరకు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ తెలిపారు. ఆసక్తి గల మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని నమోదు చేసుకోవాలని కోరారు. ఈ సర్టిఫికేట్ కోర్సులు ప్రాక్టికల్ నైపుణ్యాలు, సృజనాత్మకత అభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాలను కల్పించే విధంగా రూపొందించబడిందన్నారు.

News August 20, 2025

KNR: SRR కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

image

డిగ్రీలో మిగిలిపోయిన సీట్లను స్పాట్ ద్వారా భర్తీ చేయడానికి త్వరలో ఉన్నత విద్యా మండలి దోస్త్ ద్వారా షెడ్యూలు విడుదల చేయనుందని SRR కళాశాల ప్రిన్సిపల్ కె.రామకృష్ణ, దోస్త్ కోఆర్డినేటర్ డా.ఆర్.రామకృష్ణ తెలిపారు. SRR కళాశాలలో వివిధ కోర్సులకు పరిమిత సంఖ్యలో సీట్లు ఖాళీగా ఉన్నాయని త్వరలో విడుదలయ్యే దోస్త్ స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ ప్రకారం ఖాళీలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు.

News August 20, 2025

KNR: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు పెంచాలి: కలెక్టర్

image

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని కలెక్టర్ పమేలా సత్పతి వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం వైద్యారోగ్య శాఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. నవంబర్ నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జరిగిన ప్రసవాలపై సమీక్షించారు. గంగాధర పీహెచ్సీలో 28 ప్రసవాలు జరగడంపై అభినందించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ పాల్గొన్నారు.

News August 19, 2025

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: KNR కలెక్టర్

image

ప్రభుత్వ పాఠశాలల్లో మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. మంగళవారం చింతకుంట మండలం శాంతినగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. తరగతి గదులు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, మధ్యాహ్నం భోజనం, బోధన మెటీరియల్, రీడింగ్ కార్నర్‌ను పరిశీలించారు.

News August 19, 2025

కరీంనగర్: ఆటో-ట్రాక్టర్ ఢీ.. వృద్ధురాలు మృతి

image

కొత్తపల్లి మండలం ఓడ్డపల్లి స్టేజి వద్ద ఆటోను ట్రాక్టర్ ఢీకొనడంతో ఓ వృద్ధురాలు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కరీంనగర్ నుంచి సిరిసిల్ల వెళ్తున్న ఆటోను వెనక నుంచి ట్రాక్టర్ ఢీకొట్టడంతో జడల బక్కవ్వ మృతి చెందినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు పోలీసులు వివరించారు.

News August 19, 2025

KNR: మోడల్ స్కూల్ విద్యార్థుల SUPER ఆలోచన!

image

ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల విద్యార్థులు అన్ని రంగాల్లోనూ ముందుండేలా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. చిగురుమామిడి మం. ముల్కనూర్ మోడల్ స్కూల్ విద్యార్థినులు స్నేహిత ప్రోగ్రాంలో భాగంగా ‘గుడ్ టచ్ బ్యాడ్ టచ్’ రెస్పాండింగ్ డాల్ ప్రాజెక్టును రూపొందించారు. దీనిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముందు ప్రదర్శించారు. ఇందులో కొన్ని మార్పులు సూచిస్తూ కలెక్టర్ విద్యార్థులను అభినందించారు.

News August 19, 2025

KNR: ‘సర్వాయి పాపన్న ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి’

image

KNR కలెక్టరేట్ ఆడిటోరియంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్వాయి పాపన్న చిత్రపటానికి కలెక్టర్ పమేలా సత్పతి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సామాజిక సమానత్వానికి కృషి చేసిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని అందరూ ముందుకు సాగాలని అన్నారు.

News August 19, 2025

కరీంనగర్: RTC ప్రత్యేక టూర్ ప్యాకేజీ

image

KNR-2 డిపో ప్రత్యేక టూర్ ప్యాకేజీని ఏర్పాటు చేసినట్లు DM శ్రీనివాస్ తెలిపారు. టూర్ ప్యాకేజీలో అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారం, సామర్లకోటలోని వివిధ దర్శనీయ స్థలాల సందర్శనకు సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేశామన్నారు. ఆగస్ట్ 21న రా.10 గం.కు KNR నుంచి బయలుదేరి తిరిగి AUG 24న KNR చేరుకుంటుందని చెప్పారు. పెద్దలకు రూ.3,300, పిల్లలకు రూ.2,500ల టికెట్ అన్నారు. వివరాలకు 9398658062ను సంప్రదించాలన్నారు.

News August 19, 2025

పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలి: కరీంనగర్ కలెక్టర్

image

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని కరీంనగర్ శిశు గృహాల్లో పెరుగుతున్న 3 ఏళ్ల పాపను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చేతుల మీదుగా USAకు చెందిన దంపతులకు దత్తత ఇచ్చారు. వీరికి ఇది వరకే బాబు జన్మించగా ఆడశిశువు దత్తత కోసం దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం విచారించి ఆడ శిశువును కలెక్టర్ సోమవారం దత్తత ఇచ్చారు. పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలని కలెక్టర్ అన్నారు.

News August 18, 2025

కరీంనగర్: లారీ ఢీకొని వ్యక్తి మృతి

image

నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. చాకుంత గ్రామానికి చెందిన హస్తపురం రవి, బొమ్మకల్ ఫ్లైఓవర్‌పై నడుచుకుంటూ వెళుతుండగా, వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన రవి అక్కడికక్కడే మృతి చెందాడు. నిర్లక్ష్యంగా లారీ నడిపిన డ్రైవర్ కృష్ణకుమార్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.