Karimnagar

News April 12, 2025

KNR: ప్రశాంతంగా ముగిసిన బ్యాంకింగ్ ఉచిత శిక్షణ పరీక్ష

image

బీసీ స్టడీ సర్కిల్ కరీంనగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత శిక్షణ బ్యాంకింగ్ పరీక్ష శనివారం ప్రశాంతంగా ముగిశాయి. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు గంట ముందే చేరుకున్నారు. జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 01:00 గంటల వరకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించారు. బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ.. ఉచిత శిక్షణ పరీక్షకు మొత్తం 67 మంది హాజరైనట్టు తెలిపారు.

News April 12, 2025

కరీంనగర్: ఉద్యోగం పేరుతో మోసం.. కేసు నమోదు

image

విదేశాలలో ఉద్యోగం పేరుతో యువకుడిని మోసంచేసిన వ్యక్తిపై కేసునమోదుచేసినట్లు 2టౌన్ సీఐ సృజన్‌రెడ్డి తెలిపారు. KNRభగత్‌నగర్‌కు చెందిన మెహర్‌తేజను HYDకు చెందిన ప్రశాంతరాథోడ్ బ్యాంకాక్‌లో బిజినెస్ ప్రాసెస్ ఉద్యోగం ఇప్పిస్తానని కొంత డబ్బుతీసుకొని బ్యాంకాక్ పంపించాడు. అక్కడ మోసపూరిత సంస్థలో చేర్పించి పాస్పోర్ట్ తీసుకొని నిర్బంధించారని, అక్కడి పోలీసుల సహాయంతో వచ్చానని ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నాడన్నారు.

News April 12, 2025

భగ్గుమంటున్న కరీంనగర్

image

కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా మానకొండూర్ మండలంలో 42.3°C నమోదు కాగా, గంగాధర 41.5, జమ్మికుంట 41.2, చిగురుమామిడి, గన్నేరువరం 40.8, రామడుగు 40.7, చొప్పదండి 40.6, హుజూరాబాద్, కొత్తపల్లి, సైదాపూర్ 40.2, తిమ్మాపూర్, కరీంనగర్ 40.0, కరీంనగర్ రూరల్ 39.7, వీణవంక 39.5, శంకరపట్నం 39.1, ఇల్లందకుంట 38.4°C గా నమోదైంది.

News April 12, 2025

పెద్దపల్లి: బాలికపై యువకుడి అత్యాచారయత్నం.. అరెస్టు

image

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం జరిగింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రాములపల్లిలో జరిగింది. ఎస్ఐ సనత్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నవదీప్ (22) గురువారం మధ్యాహ్నం అత్యాచారయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. తల్లి ఫిర్యాదుతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. శుక్రవారం నిందితుడిని కోర్టు ఎదుట హాజరుపరిచామని పేర్కొన్నారు.

News April 12, 2025

KNR: నేడు మద్యం దుకాణాలు బంద్: సీపీ

image

కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్స్ పాపులు, బార్లు, క్లబ్, మద్యం డిపోలు మూసివేస్తున్నట్లు కరీంనగర్ సీపీ గౌస్ ఆలం తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా శాంతిభద్రతల దృష్ట్యా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆదేశాలను ఎవరైన ఉల్లంఘిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News April 11, 2025

జమ్మికుంట: క్వింటా పత్తి ధర రూ.7,650

image

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర ఈరోజు కూడా పెరిగింది. గురువారం క్వింటా పత్తి ధర రూ.7,600 పలకగా.. ఈరోజు ₹50 పెరిగి రూ.7,650 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. శుక్రవారం యార్డుకు రైతులు 193 క్వింటాళ్ల విడిపత్తి విక్రయానికి తీసుకురాగా.. గరిష్ఠంగా రూ.7,650, కనిష్ఠంగా రూ.7,300 ధర పలికింది. గోనె సంచుల్లో 13 క్వింటాలు తీసుకురాగా.. రూ.5,800 నుంచి రూ.6,400 వరకు పలికింది.

News April 11, 2025

KNR: మహాత్మ జ్యోతిరావు ఫూలే విగ్రహానికి నివాళులర్పించిన కలెక్టర్

image

మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, బిసి విద్యార్థి సంఘ నాయకులు, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

News April 11, 2025

రేపు కరీంనగర్‌కు రానున్న కేటీఆర్

image

కరీంనగర్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారని గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్‌లోని చింతకుంట బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వరంగల్ సభ నేపథ్యంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్లు కమలాకర్ తెలిపారు. బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పార్టీ కార్యాలయంలోనే కొనసాగుతాయని చెప్పారు.

News April 11, 2025

KNR జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రత.. 11 మండలాల్లో 40°C పైగా నమోదు

image

కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా జమ్మికుంట, మానకొండూర్ మండలాల్లో 41.4°C నమోదు కాగా, ఇల్లందకుంట, గన్నేరువరం 41.2, తిమ్మాపూర్ 41.1, కరీంనగర్ రూరల్ 41.0, చిగురుమామిడి 40.9, కరీంనగర్ 40.4, గంగాధర, వీణవంక, కొత్తపల్లి 40.3, రామడుగు 39.9, శంకరపట్నం 39.8, సైదాపూర్ 39.7, హుజూరాబాద్ 39.5, చొప్పదండి 38.4°C గా నమోదైంది.

News April 11, 2025

కరీంనగర్: తీవ్ర రక్తస్రావంతో చికిత్స పొందుతూ గర్భిణి మృతి

image

కరీంనగర్ మాతా శిశు కేంద్రంలో చికిత్స పొందుతూ సంధ్య అనే గర్భిణి మృతి చెందినట్లు టూ టౌన్ పోలీసులు తెలిపారు. మంచిర్యాల జిల్లాకు చెందిన సంధ్య తీవ్ర రక్తస్రావంతో అక్కడి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని, మెరుగైన వైద్యం కోసం నగరంలోని మాతాశిశు ఆసుపత్రికి వచ్చింది. కాగా తీవ్ర రక్తస్రావంతో మృతి చెందినట్లు మృతురాలి భర్త జగదీశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.