Khammam

News October 17, 2025

ఖమ్మం జిల్లాలో 1,164 మద్యం టెండర్ల దరఖాస్తులు

image

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మద్యం టెండర్ల కోసం గురువారం నాటికి 1,164 వచ్చినట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా 672 దరఖాస్తులు రాగా గురువారం ఒక్క రోజే 492 దరఖాస్తులు అందాయి. ఖమ్మం ఎక్సైజ్ 1 స్టేషన్ పరిధిలోని మద్యం దుకాణాలకు 395 దరఖాస్తులు రాగా, ఖమ్మం-2 ఎక్సైజ్ స్టేషన్‌కు 215, నేలకొండపల్లి-90, వైరా-81, మధిర-98, సత్తుపల్లి- 247, సింగరేణి-40 దరఖాస్తులు నమోదయ్యాయి.

News October 17, 2025

ఆ ఆసుపత్రుల్లో ఆశించిన పురోగతి లేదు: ఖమ్మం కలెక్టర్

image

మెరుగైన సేవలతో ప్రభుత్వ వైద్యం పట్ల నమ్మకం కలిగించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల పనితీరుపై సమీక్షించారు. వైద్య విధానం పరిషత్ ఆసుపత్రులలో ప్రసవాలు జులైలో 47 నుంచి సెప్టెంబర్ 74కు చేరాయని, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి ఆసుపత్రిలో మంచి ఫలితాలు రాగా, కల్లూరు, వైరా, సత్తుపల్లి , పెనుబల్లి, మధిర ఆసుపత్రులలో ఆశించిన పురోగతి లేదన్నారు.

News October 17, 2025

పత్తి విక్రయాల్లో స్లాట్‌ బుకింగ్‌ విధానం: ఖమ్మం కలెక్టర్‌

image

ఖమ్మం: పత్తి రైతులు ఇకపై స్లాట్ బుకింగ్ పద్ధతిలో పంటను విక్రయించుకోవచ్చని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. రైతులు కపాస్ కిసాన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, సమీప జిన్నింగ్ మిల్లులో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. 8–12% తేమ ఉన్న పత్తికి రూ.8110–7786 మద్దతు ధర లభిస్తుందని పేర్కొన్నారు. స్లాట్ రద్దును 24 గంటల ముందుగానే చేసుకోవచ్చని కలెక్టర్ వివరించారు.

News October 16, 2025

ఖమ్మం: ‘వైద్య పరీక్షలకు బయటకు పంపితే కఠిన చర్యలు’

image

ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై సమీక్షించారు. ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై విశ్వాసం పెరిగేలా మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రతి ఆసుపత్రిలో నెలకు కనీసం 200 ప్రసవాలు, ఓపీ కేసుల్లో 60% పరీక్షలు చేయాలన్నారు. వైద్య పరీక్షల కోసం రోగులను బయటకు పంపితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. అవసరమైన పరికరాల ప్రతిపాదనలు తక్షణమే పంపాలని ఆదేశించారు.

News October 16, 2025

రేపు ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన

image

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రేపు(శుక్రవారం) ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయం ఇంఛార్జి ఓ ప్రకటనలో తెలిపారు. మంత్రి ఉదయం 10:30 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. అనంతరం అధికారులతో నిర్వహించే సమీక్షలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఆయన పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

News October 16, 2025

నేర దర్యాప్తులో ఆధారాలు కీలకం: CP సునీల్ దత్

image

నేర దర్యాప్తులో ఆధారాలు చాలా కీలమని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. పోలీస్ కమిషనర్ కార్యాలయ ఆవరణలో గల భవనంలోని ఆధునికరించిన ఫింగర్ ఫ్రింట్ యూనిట్ కార్యాలయాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేర పరిశోధనలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటూ, ఫింగర్ ఫ్రింట్ యూనిట్లలోని కార్యాచరణను వేగవంతం చేయడానికి ఆటోమేటెడ్ సిస్టమ్లను ఉపయోగిస్తున్నారని అన్నారు.

News October 16, 2025

విద్యార్థులకు వ్యాస రచన పోటీలు: ఖమ్మం సీపీ

image

పోలీస్ ఫ్లాగ్ డేను పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆన్‌లైన్ వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. పోటీల్లో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ 3 భాషల్లో 6వ తరగతి నుంచి పీజీ వరకు ఉన్న విద్యార్థులు పాల్గొనవచ్చని చెప్పారు. ఆసక్తి గల విద్యార్థులు https://forms.gle/jaWLdt2yhNrMpe3eA లో మీ పేరు, విద్యార్హత, ఇతర వివరాలు నమోదు చేయాలని సూచించారు.

News October 16, 2025

ఖమ్మం: పెండింగ్‌ ఓటర్ల దరఖాస్తులు పరిష్కరించాలి

image

ఓటరు జాబితా, బూత్ స్థాయి అధికారుల నియామకంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సి.సుదర్శన్ రెడ్డి గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న ఓటరు దరఖాస్తులను ఏడు రోజుల్లోగా పరిష్కరించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను ఆయన ఆదేశించారు. బీఎల్‌ఓలకు గుర్తింపు కార్డులు, నూతన ఓటర్లకు ఐడీ కార్డులను త్వరగా పంపిణీ చేయాలని సీఈవో సూచించారు.

News October 16, 2025

టీటీడీ ఆలయానికి 20 ఎకరాల గుర్తింపు: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి స్థల అప్పగింత చర్యలు వెంటనే చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్, తెలంగాణ దేవాదాయ శాఖ స్థపతి ఎన్.వాళ్లినాయగం, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డిలతో కలిసి సమీక్షించారు. అల్లీపురం వద్ద 20 ఎకరాల స్థలం గుర్తించి, తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి కేటాయించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

News October 16, 2025

ఖమ్మం: భారంగా మారిన ఇసుక ధరలు.!

image

ఖమ్మం జిల్లాలో ఇసుక ధరలు భగ్గుమంటున్నాయి. బహిరంగ మార్కెట్లో టన్ను ఇసుక రూ.2,000 నుంచి 2,500 పలుకుతోంది. ఒక ఇంటి నిర్మానికి సుమారు 80 టన్నుల ఇసుక అవసరం అయితే దీనికే రూ.2 లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు వాపోతున్నారు. ధరలను నియంత్రించాల్సిన జిల్లా అధికారులు వారికేం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీ ప్రాంతంలో ఇసుక ధరలు ఎలా ఉన్నాయి. COMMENT