Khammam

News July 2, 2024

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2024కు దరఖాస్తుల ఆహ్వానం

image

ఖమ్మం జిల్లాలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2024కు అర్హులైన ఉపాధ్యాయులు ఈనెల 15లోగా సంబంధిత వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి సోమ శేఖర శర్మ సోమవారం తెలిపారు. రెండు కాపీలను సంబంధిత మండల విద్యాశాఖ అధికారి ధ్రువీకరణతో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందించాలన్నారు.

News July 2, 2024

ఖమ్మం: నూతన చట్టం.. వన్ టౌన్‌లో మొదటి కేసు

image

నూతన చట్టాలు అమల్లోకి రాగా ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం బీఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత) కింద చీటింగ్ కేసు నమోదైంది. నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతన్న దొడ్డా సాయి అనే వ్యక్తిపై 318, 62 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే గంధసిరి చెందిన షేక్ సలీమ్ (31) అనే ట్రాక్టర్ డ్రైవర్ మమతా రోడ్డులో ఇసుకను ఆన్ లోడింగ్ చేస్తూ గుండెపోటుతో మృతి చెందిన ఘటనపై సెక్షన్ 194 కింద కేసు నమోదైంది.

News July 2, 2024

ఖమ్మం: ముగిసిన ఉపాధ్యాయ బదిలీలు

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. జిల్లాలోని 1,375 పోస్టులు ఖాళీగా ఉండగా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 1,105 మంది ఉపాధ్యాయులను బదిలీల ద్వారా భర్తీ చేశారు. మిగతా 270 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు బదిలీలతో మోక్షం లభించగా, విద్యార్థులకు న్యాయమైన బోధన అందే అవకాశం ఉందని విద్యాశాఖ చెబుతుంది.

News July 2, 2024

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు: మంత్రి పొంగులేటి

image

ఖమ్మం: ఇళ్లు లేని వారికి గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఆయన అన్నారు. సోమవారం గృహనిర్మాణాలపై సంబంధింత అధికారులతో నిర్వహించిన రివ్యూ సమావేశంలో మంత్రి మాట్లాడారు. 2024-2025 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ఇందిరమ్మ ఇళ్లకు పెద్ద పీట వేస్తామని స్పష్టం చేశారు.

News July 2, 2024

చిన్నారులకు అభయహస్తం అందించాలి: సీపీ

image

ఖమ్మం: తల్లిదండ్రులకు దూరమైన చిన్నారులకు అభయహస్తం అందించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. అపరేషన్ ముస్కాన్-10 కార్యక్రమంలో భాగంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టర్లను పోలీస్ కమిషనర్ సోమవారం ప్రారంభించారు. నేటి నుంచి నెల పాటు జరిగే కార్యక్రమంలో బాల కార్మికులు, భిక్షాటన చేస్తున్న చిన్నారులను, ట్రాఫికింగ్ ద్వారా బందీలైన వారిని గుర్తించి తల్లిదండ్రుల చెంతకు చేర్చాలన్నారు.

News July 1, 2024

ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణంపై అధ్య‌య‌నం

image

మధిర: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ఇత‌ర రాష్ట్రాల‌కు అధికారుల‌ను పంపించి అధ్య‌య‌నం చేయించి త్వ‌ర‌గా ప్ర‌భుత్వానికి నివేదిక ఇవ్వాల‌ని డిప్యూటి సీఎం భ‌ట్టి విక్ర‌మార్క హౌజింగ్ శాఖ అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్రంలో ఇండ్లు లేని పేద‌ల‌కు కాంగ్రెస్‌ ప్ర‌భుత్వం ఇండ్లు నిర్మించి ఇవ్వ‌డానికి ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి 3500 ఇండ్ల చొప్పున‌ బ‌డ్జెట్‌లో నిధులు కేటాయించింద‌న్నారు.

News July 1, 2024

రిటైర్మెంట్ వృత్తికే కానీ వ్యక్తిత్వానికి కాదు: సీపీ

image

ఖమ్మం: రిటైర్మెంట్ వృత్తికే కానీ వ్యక్తిత్వానికి కాదని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారులను సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పదవి విరమణ చేసిన ఉద్యోగులు ఇకపై కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవించి ఆయురారోగ్యాలతో సంతోషంగా గడపాలన్నారు.

News July 1, 2024

దేశంలోనే మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్ ముందంజ

image

భారజలం ఉత్పత్తి, ఎగుమతుల్లో దేశంలోనే మణుగూరు భారజల కర్మాగారం ప్రత్యేక గుర్తింపు కలిగి తలమానికంగా నిలుస్తోంది. భారజల కర్మాగారంలో ఉత్పత్తి అవుతున్న అక్సిజన్-18 ఎన్ రీచ్డ్ వాటర్ పరీక్షలు ఇటీవల ముంబై, అమెరికాలో నిర్వహించగా విజయవంతమయ్యాయి. ఎగుమతుల్లోనూ అగ్రస్థానంలో నిలిచిన ఈ కర్మాగారం నుంచి దక్షిణ కొరియాకు భారజలాన్ని ఎగుమతి చేసి గుర్తింపు తెచ్చుకుంది.

News July 1, 2024

బదిలీల కోసం ఎక్సైజ్ కానిస్టేబుల్స్ ఎదురు చూపు

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖలో సీఐలు, ఎస్ఐలకు స్థాన చలనం కలిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోను నూరుశాతం సీఐలు, ఎస్ఐలకు బదిలీలు జరిగాయి. ఏడేళ్లుగా ఖమ్మంలో 7, భద్రాద్రి జిల్లాలో 6 ఎక్సైజ్ స్టేషన్ లో పరిదిలో 38 మంది హెడ్ కానిస్టేబుల్స్, 133 కానిస్టేబుల్స్ విధులు నిర్వహిస్తున్నారు.

News July 1, 2024

కొనసాగుతున్న సొరంగం పనులు

image

సీతారామ ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను ఖమ్మం జిల్లా పాలేరు జలాశయానికి చేర్చి సుమారు 2.52లక్షల ఎకరాల సాగర్ ఆయకట్టు స్థిరీకరణతో పాటు కొత్త ఆయకట్టుకు నీరందించవచ్చన్న ఉద్దేశంతో పాలేరు లింక్ కెనాల్ నిర్మిస్తున్నారు. ఇందులో ఆఖరి ప్యాకేజీ అయిన నం.16లో 8KMల మేర సొరంగం కాలువ(టన్నెల్) తవ్వుతున్నారు. తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం వద్ద సొరంగం ప్రారంభమై కూసుమంచి మండలం పోచారం వద్ద ముగుస్తాయి.