Khammam

News April 9, 2026

ఖమ్మం: మాతా-శిశు మరణాలు లేని జిల్లాగా మార్చాలి: కలెక్టర్

image

సురక్షిత మాతృత్వంతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో సురక్షిత మాతృత్వ దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. గర్భిణులకు సకాలంలో వైద్య పరీక్షలు అందించి, హైరిస్క్ కేసులపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. ఈ ఏడాది చివరినాటికి జిల్లాలో మాతృ, శిశు మరణాలను సున్నా స్థాయికి తగ్గించడమే లక్ష్యంగా వైద్యారోగ్య శాఖ సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.

News April 9, 2026

ఖమ్మం: మాతా-శిశు మరణాలు లేని జిల్లాగా మార్చాలి: కలెక్టర్

image

సురక్షిత మాతృత్వంతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో సురక్షిత మాతృత్వ దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. గర్భిణులకు సకాలంలో వైద్య పరీక్షలు అందించి, హైరిస్క్ కేసులపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. ఈ ఏడాది చివరినాటికి జిల్లాలో మాతృ, శిశు మరణాలను సున్నా స్థాయికి తగ్గించడమే లక్ష్యంగా వైద్యారోగ్య శాఖ సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.

News April 9, 2026

ఖమ్మం: మాతా-శిశు మరణాలు లేని జిల్లాగా మార్చాలి: కలెక్టర్

image

సురక్షిత మాతృత్వంతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో సురక్షిత మాతృత్వ దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. గర్భిణులకు సకాలంలో వైద్య పరీక్షలు అందించి, హైరిస్క్ కేసులపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. ఈ ఏడాది చివరినాటికి జిల్లాలో మాతృ, శిశు మరణాలను సున్నా స్థాయికి తగ్గించడమే లక్ష్యంగా వైద్యారోగ్య శాఖ సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.

News April 9, 2026

ఖమ్మం: మాతా-శిశు మరణాలు లేని జిల్లాగా మార్చాలి: కలెక్టర్

image

సురక్షిత మాతృత్వంతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో సురక్షిత మాతృత్వ దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. గర్భిణులకు సకాలంలో వైద్య పరీక్షలు అందించి, హైరిస్క్ కేసులపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. ఈ ఏడాది చివరినాటికి జిల్లాలో మాతృ, శిశు మరణాలను సున్నా స్థాయికి తగ్గించడమే లక్ష్యంగా వైద్యారోగ్య శాఖ సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.

News April 8, 2026

ఖమ్మం: జనగణన పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్

image

జిల్లాలో జనగణన-2027 ప్రక్రియను పకడ్బందీగా, ఖచ్చితత్వంతో పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. హౌస్ లిస్టింగ్ బ్లాక్‌లను గుర్తించి వెంటనే పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. ప్రతి బ్లాక్‌కు భౌతిక తనిఖీలు నిర్వహించాలని సూచించారు. అనంతరం ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.

News April 8, 2026

గడువులోగా గురుకుల పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

image

ఖమ్మం రూరల్ పోన్నేకల్‌లో నిర్మిస్తున్న యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల పనులను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం పరిశీలించారు. పనుల నాణ్యత, మౌలిక వసతులపై అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు ఆధునిక సదుపాయాలతో కూడిన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి భవనాలను అందుబాటులోకి తెచ్చేలా పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

News April 8, 2026

కలెక్టరేట్‌లో సైరన్, సీసీ కెమెరాలపై కలెక్టర్ ఆరా

image

ఖమ్మం కలెక్టరేట్‌ ఆవరణలోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి బుధవారం క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా గోడౌన్‌ సీళ్లను పరిశీలించి, భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. సీసీ కెమెరాలు, అగ్నిమాపక పరికరాల పనితీరును స్వయంగా తనిఖీ చేసిన ఆయన, భద్రతా సిబ్బంది విధుల్లో ఎటువంటి అలసత్వం వహించకూడదని ఆదేశించారు. అత్యవసర సైరన్‌ పనితీరును కూడా ఆయన పరీక్షించారు.

News April 8, 2026

ఖమ్మం కార్పొరేషన్‌లో అవినీతి జలగలు

image

3 లక్షల జనాభా ఉన్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో అడుగడుగునా అవినీతి రాజ్యమేలుతోంది. IAS అధికారి అభిషేక్ కమిషనర్‌గా ఉన్నప్పటికి పాలనపై పట్టు లేకపోవడంతో రెవిన్యూ, శానిటేషన్, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో కొందరు అధికారులు, సిబ్బంది.. కాంట్రాక్టర్లతో కలిసి అడ్డగోలుగా సంపాదిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పాలకవర్గం పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తుండటంతో KMCపై కలెక్టర్ దృష్టి పెట్టాలని నగరవాసులు కోరుతున్నారు.

News April 8, 2026

ఖమ్మం: 11న ఫూలే జయంతిలో పాల్గొనండి: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో ఏప్రిల్ 11న నిర్వహించే జ్యోతిబా ఫూలే జయంతి వేడుకల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కోరారు. ఉదయం 10 గంటలకు శ్రీశ్రీ సర్కిల్ వద్ద ఉన్న ఫూలే విగ్రహానికి పూలమాలలు అర్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, సంఘాల నాయకులు పాల్గొనాలని సూచించారు.

News April 8, 2026

ఖమ్మం జిల్లాలో 5నియోజకవర్గాలు 8అవుతున్నాయా.. !?

image

పునర్విభజనలో ఖమ్మం నియోజకవర్గాల సంఖ్య 8కి చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాలేరులో కూసుమంచి, తిరుమలాయపాలెం, KMM(R), ఏదులాపురం, నేలకొండపల్లి(C)లో NKP, ముదిగొండ, చింతకాని, KMM 1లో KMM అర్బన్ (C), KMM(2) రఘునాథపాలెం(C), మధిర(C) MDR, ఎర్రుపాలెం, బోనకల్, వైరా(C) వైరా, కొణిజర్ల, తల్లాడ, కల్లూరు(C)లో KLR, ఏన్కూరు, కామేపల్లి, సింగరేణి, సత్తుపల్లి(C)లో SPL, వేంసూరు, పెనుబల్లి ఉంటాయని ప్రచారం జరుగుతోంది.