Khammam

News September 19, 2024

పినపాక: గుర్తు తెలియని మృతదేహం లభ్యం

image

కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం గ్రామపంచాయతీ పరిధిలోని రావిగూడెం శివారులో ఓ చెట్ల పొదల మధ్య గుర్తుతెలియని మగ మృతదేహాన్ని స్థానికులు గమనించారు. మృతుడు గోదావరి వరదనీటిలో కొట్టుకొచ్చినట్టుగా అనుమానిస్తున్నారు. విషయాన్ని పోలీసులకు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 19, 2024

కనుల పండువగా భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో గురువారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ చేశారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.

News September 19, 2024

ఖమ్మం: వేర్వేరు కారణాలతో ముగ్గురి సూసైడ్

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలిలా.. ఖమ్మంలో ఇంటర్ చదువుతున్న యువతి మనస్తాపం చెంది సూసైడ్ చేసుకోగా.. కూసుమంచి మండలం జుజ్జువరావుపేటకు చెందిన యువతి ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెంది పురుగు మందు తాగింది. కాగా, ఆదిత్య టౌన్‌షిప్‌కి చెందిన వెంకటరాజా(61) కుటుంబ సభ్యులు మందలించడంతో బుధవారం ఇంట్లో ఉరేసుకున్నాడు.

News September 19, 2024

నేడు పాలేరు పాతకాలువకు నీరు విడుదల

image

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో కూసుమంచి మండలం పాలేరులోని పాత కాలువ గండీ పనులను ఇరిగేషన్ అధికారులు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేశారు. ఈ రోజు మధ్యాహ్నం పాత కాలువకు ఐబీ ఆఫీసర్లు నీటిని విడుదల చేయనున్నారు. ఖరీఫ్ సీజన్లో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో నీటిని విడుదల చేయనున్నారు. పాలేరు పాతకాలువ పరివాహకంలో 60 వేల ఎకరాల వరిసాగు ఉంది.

News September 19, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} వివిధ శాఖల అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} నేటి నుంచి పోలీసులకు ఫైరింగ్ శిక్షణ
∆} బూర్గంపహాడ్‌లో అఖిలపక్ష సమావేశం
∆} అశ్వారావుపేటలో ఎమ్మెల్యే పర్యటన
∆} సత్తుపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} భద్రాచలంలో ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు పర్యటన
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ

News September 19, 2024

KU: 26 వరకు డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు

image

KU పరిధిలో డిగ్రీ మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని యూనివర్సిటీ అధికారులు సూచించారు. ఫీజు చెల్లించడానికి ఈ నెల 26 వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆలస్య రుసుముతో అక్టోబర్ 4 వరకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి సకాలంలో ఫీజు చెల్లించాలన్నారు.

News September 19, 2024

బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన జిల్లా కలెక్టర్

image

బూర్గంపహాడ్‌లోని ఆసుపత్రిని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వార్డులు పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులను వివరాలు, సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించారు. ఆసుపత్రి సిబ్బందికి తగు సూచనలు చేశారు. నూతనంగా నిర్మించిన టాయిలెట్లు డిజైన్ పరిశీలించారు. ఆయన వెంట తహశీల్దార్ ముజాహిద్, ఆస్పత్రి సూపర్డెంట్ ముక్తేశ్వరరావు ఉన్నారు.

News September 18, 2024

కొత్తగూడెం: ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన అధికారి

image

కొత్తగూడెం కలెక్టరేట్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.1 లక్షా 14 వేలు లంచం తీసుకుంటున్న హార్టికల్చర్ అధికారి సూర్యనారాయణను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డ్రిప్ ఇరిగేషన్‌కు సంబంధించిన సబ్సిడీ పొందెందుకు సర్టిఫై కోసం లంచం తీసుకుండగా ఏసీబీ దాడులు నిర్వహించింది. సూర్యనారాయణను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ వెల్లడించారు.

News September 18, 2024

19.8 అడుగుల వద్ద నిలకడగా ప్రవహిస్తున్న గోదావరి

image

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 19.8 అడుగుల వద్ద నిలకడగా ప్రవహిస్తోందని సీడబ్ల్యుసీ అధికారులు ప్రకటించారు. కొద్ది రోజులుగా వర్షాలు లేకపోవడంతో గోదావరి వద్ద నీటి మట్టం తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం భద్రాచలం గోదావరిలో పటిష్ఠ బందోబస్తు నడుమ వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి.

News September 18, 2024

MSME పాలసీ పటిష్ఠం చేయాలని నిర్ణయం: డిప్యూటీ సీఎం భట్టి

image

రాష్ట్రంలో MSME పాలసీ పటిష్ఠం చేయాలని నిర్ణయించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా తెలంగాణలో MSME పాలసీ తీసుకొచ్చామని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ MSME పాలసీ లేదన్నారు. ఆర్థిక వ్యవస్థకు చిన్న, సూక్ష్మ పరిశ్రమలు కీలకమని చెప్పారు. భారీ పరిశ్రమలతో పాటు MSMEలకు తమ సర్కారు అనుకూల వాతావరణం కల్పిస్తామని పేర్కొన్నారు.