Khammam

News August 25, 2025

ప్రతి దరఖాస్తుకు తప్పనిసరిగా సమాధానం అందించాలి: జిల్లా కలెక్టర్

image

ప్రజావాణిలో ప్రజలు ఇచ్చిన ప్రతి దరఖాస్తుకు తప్పనిసరిగా సమాధానం అందించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ సూచించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. తమ పరిధిలో చేయగలిగిన పనిని వెంటనే పూర్తి చేయాలని, లేని పక్షంలో దానికి గల కారణాలను, నిబంధనలను వివరిస్తూ సమాధానం ఇవ్వాలని అధికారులను సూచించారు.

News August 25, 2025

ఖమ్మం Dy. కమిషనర్‌గా శ్రీనివాసరావు

image

ఖమ్మం నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్‌గా K. శ్రీనివాసరావును ప్రభుత్వం నియమించింది. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. నగరపాలక సంస్థ పరిధిలో ప్రజల సమస్యల పరిష్కారంతోపాటు నగర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. డిప్యూటీ కమిషనర్‌కు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

News August 25, 2025

జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిగా మహమ్మద్ ముజాహిద్

image

ఖమ్మం జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిగా సోమవారం మహమ్మద్ ముజాహిద్ భాద్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించారు. ఈ సందర్భంగా మైనార్టీ సంక్షేమ అధికారికి జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు.

News August 25, 2025

విగ్రహం తరలించే రూట్ మ్యాప్ ఫైనల్ చేసుకోవాలి: సీపీ

image

నిమజ్జనం రోజు ఊరేగింపు కార్యక్రమం, చివరి పూజ సూర్యాస్తమం కంటే ముందే ప్రారంభించాలని ఉత్సవ కమిటీ సభ్యులకు సీపీ సునీల్ దత్ సూచించారు. నిమజ్జనం నాడు విగ్రహం తరలించే వాహనాలు ముందుగా బుక్ చేసుకోవాలని, విగ్రహం తరలించే రూట్ మ్యాప్ ఫైనల్ చేసుకోవాలని చెప్పారు. వినాయక మండపం సమీపంలో ఎక్కడైనా మద్యం బెల్ట్ షాపు ఉంటే, అబ్కారీ శాఖ అధికారులు కట్టడి చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.

News August 25, 2025

ప్రతి గణేష్ మండపానికి ఉచిత విద్యుత్: జిల్లా కలెక్టర్

image

ప్రతి గణేష్ మండపానికి లైన్‌మెన్ ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇస్తారని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. సోమవారం గణేష్ ఉత్సవాల నిర్వహణ, నిమజ్జన ఏర్పాట్లపై సీపీ సునీల్ దత్, అదనపు కలెక్టర్ శ్రీజ, కల్లూరు డివిజన్ సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా వైభవోపేతంగా జరగాలని అధికారులను ఆదేశించారు.

News August 25, 2025

39 మంది కానిస్టేబుళ్లకు ఉద్యోగోన్నతులు.. సీపీ అభినందన

image

ఖమ్మం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న 39 మంది కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుల్స్‌గా పదోన్నతి పొందారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ స్వయంగా వారికి ఉద్యోగోన్నతుల చిహ్నాన్ని అలంకరించి అభినందించారు. కానిస్టేబుళ్లు విధి నిర్వహణలో చూపిన క్రమశిక్షణ, నిబద్ధత, సేవాస్ఫూర్తికి గుర్తింపుగా ఈ పదోన్నతి లభించిందని అన్నారు. ఉద్యోగోన్నతి పొందిన వారు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు.

News August 25, 2025

KMM: ఉపాధ్యాయ పదోన్నతుల జాబితా సిద్ధం

image

ఖమ్మం జిల్లాలో ఎస్టీల నుంచి ఎస్ఏ(స్కూల్ అసిస్టెంట్లు)లుగా పదోన్నతి పొందే వారి జాబితాను విద్యాశాఖ సిద్ధం చేసింది. ఈ మేరకు జిల్లాలో 1: 3 నిష్పత్తిలో సుమారు 600 మంది ఎస్టీలు ఉండగా 1:1 నిష్పత్తిలో వివిధ సబ్జెక్ట్‌లు సంబంధించి 207 మందితో తుది జాబితా తయారు చేశారు. కాగా ఈరోజు ఈ 207 మందికి వెబ్ ఆప్షన్లు మొదలుకానున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

News August 25, 2025

ఖమ్మం: వేధిస్తున్నాడని భర్తని చితకబాదిన భార్య

image

మద్యం తాగి భర్త వేధిస్తున్నాడని భార్య చితకబాదిన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వీఎంబంజర్ గ్రామానికి చెందిన పర్వతం గంగరాజు, లక్ష్మికి 25 ఏళ్ల కిందట వివాహమైంది. భర్త రోజూ తాగి లక్ష్మిని వేధిస్తున్నాడు. వేధింపులు తాళలేక లక్ష్మి ఆదివారం భర్తను చితకబాదింది. గంగరాజుకు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News August 25, 2025

ఖమ్మంలో మట్టి గణపయ్య విగ్రహాలు పంపిణీ

image

ఖమ్మం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు నుంచి గణపయ్య ఉచిత విగ్రహాల పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు కమిషనర్ 8 వేల మట్టి విగ్రహాలను కేఎంసీకి తెప్పించారు. ఆదివారం రాత్రికి విగ్రహాలు కేఎంసీకి చేరుకున్నాయి. అన్ని ప్రాంతాల్లో వీటిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరం నగరంలో మట్టి విగ్రహాలు ఏర్పాటు చేసి పర్యావరణం పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్ అధికారులు కోరారు.

News August 25, 2025

ఖమ్మం: ఈ నెల 30 చివరి తేదీ..!

image

డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్లు పొందడానికి ఈనెల 30 వరకు గడువు ఉందని ప్రాంతీయ అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ గుగులోతు వీరన్న తెలిపారు. ఆదివారం ఎస్ఆర్అండ్‌బీజీఎన్ఆర్ కళాశాలలో జరిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అతి తక్కువ ఫీజులతో బీఏ, బీకాం, బీఎస్సీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.