Khammam

News October 14, 2025

ఆన్‌లైన్ మోసం.. రూ.30 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాడు అరెస్ట్

image

పార్ట్‌టైమ్ జాబ్, పెట్టుబడుల పేరుతో రూ.30 లక్షలు మోసం చేసిన సైబర్ నేరస్థుడిని ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వేంసూరుకు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి టెలిగ్రామ్‌లో పరిచయం అయ్యాడు. పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని అశ చూపి రూ. 30 లక్షలు ఇన్వెస్ట్ చేయించి మోసగించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీ నగర్‌లో ఉన్న నిందితుడిని పట్టుకొని రిమాండ్ చేశారు.

News October 14, 2025

15న సదరం డేటా ఎంట్రీ ఆపరేటర్ నియామకానికి రాత పరీక్ష

image

రెండు సదరం డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు ఔట్ సోర్సింగ్ ద్వారా నియామకానికి ఈనెల 15న రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. నేడు సాయంత్రం 5 గంటలలోగా ఖమ్మం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఈ నియామకాలకు సంబంధించి పూర్తి సమాచారం కోసం సూపరింటెండెంట్, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సంప్రదించాలన్నారు.

News October 14, 2025

‘పంట కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలి’

image

జిల్లాలో వానాకాలం సాగు ధాన్యం, పత్తి కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. సోమవారం ధాన్యం, పత్తి కొనుగోళ్లపై అదనపు కలెక్టర్లతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేయాలని, ఎటువంటి సమస్యలు రాకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరగాలని పేర్కొన్నారు.

News October 14, 2025

ఇందిరా మహిళా డెయిరీ సమగ్ర రిపోర్టు అందించాలి: కలెక్టర్

image

ఇందిరా మహిళా డెయిరీ సమగ్ర రిపోర్టు అందించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఇందిరా డెయిరీ, జాతీయ రహదారులు, ఉద్యోగుల అటెండెన్స్ వంటి అంశాలపై సమీక్షించారు. మధిర, ఎర్రుపాలెం మండలాల్లో చాలా తక్కువగా యావరేజ్ పాల ఉత్పత్తి జరుగుతుందని, దీనికి గల కారణాలను క్షేత్ర స్థాయిలో రివ్యూ చేయాలని అదనపు కలెక్టర్‌కు సూచించారు.

News October 14, 2025

తల్లాడ: ప్రేమ విఫలమైందని యువకుడి సూసైడ్

image

ప్రేమ విఫలమైందని పురుగు మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తల్లాడ మండలంలో చోటుచేసుకుంది. మల్సూరు తండా గ్రామానికి చెందిన మాలోతు మణికంఠ (19) నాలుగు రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News October 13, 2025

‘యంగ్ ఇండియా గురుకులాలను వేగవంతంగా నిర్మించాలి’

image

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా సమీకృత గురుకుల విద్యాలయ భవనాల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. సోమవారం యంగ్ ఇండియా గురుకులాల నిర్మాణం, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణం సంబంధించి బిల్లులు 24 గంటల లోపు క్లియర్ చేయాలని, పనులు ఎక్కడా ఆలస్యం కావడానికి వీలు లేదన్నారు.

News October 13, 2025

ఈవీఎం గోడౌన్ తనిఖీ చేసిన కలెక్టర్

image

జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం (EVM) గోడౌన్‌ను కలెక్టర్ అనుదీప్ సోమవారం నెలవారీ తనిఖీల్లో భాగంగా పరిశీలించారు.ఈవీఎం, వీవీ ప్యాట్‌లు ఉన్న గది సీల్‌ను కలెక్టర్ పరిశీలించారు. గోడౌన్‌లో ఫైర్ అలారం, అగ్నిమాపక యంత్రాల కండిషన్‌ను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం తనిఖీ రిజిస్టర్‌లో కలెక్టర్ సంతకం చేశారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఉన్నారు.

News October 13, 2025

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్

image

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు డా.శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డిలతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

News October 13, 2025

పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయి: సీపీ

image

పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. హెడ్ కానిస్టేబుళ్ల నుంచి ఏఎస్సైగా పదోన్నతి పొందిన పోలీస్ అధికారులు సోమవారం కమిషనరేట్లో పోలీస్ కమిషనర్‌ను కలిశారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన పోలీస్ అధికారులను పోలీస్ కమిషనర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రామానుజం తదితరులు పాల్గొన్నారు.

News October 12, 2025

వారినే వరించనున్న.. ఖమ్మం DCC, నగర అధ్యక్ష పదవి

image

ఖమ్మం DCC, నగర అధ్యక్షుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. ఈ మేరకు AICC పరిశీలకుడు మహేంద్రన్ నేతల అభిప్రాయాలు సేకరించారు. ఈనెల 19 వరకు నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశమై, దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆరేళ్ల తర్వాత ఈ పదవులకు దరఖాస్తులు స్వీకరిస్తుండటంతో ఆసక్తి నెలకొంది. పార్టీని మొదటి నుంచి నమ్ముకున్న వారికే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ పదవులు ఎవరికిస్తే బాగుంటుంది. కామెంట్.