Khammam

News April 6, 2025

లక్ష్య సాధనకు కృషి చేయాలి: ఖమ్మం కలెక్టర్

image

పోటీ పరీక్షల్లో అభ్యర్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి సాధనకు ప్రణాళికాయుతంగా కృషి చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం ఖమ్మం బీసీ స్టడీ సర్కిల్లో గ్రూప్-డీ, జూనియర్ లెక్చరర్, ఆర్ఆర్‌బీ, ఐడీబీసీ వంటి వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారితో ఆయన మాట్లాడారు. పరీక్షలకు ఎలా సన్నద్ధమవుతున్నారు, ఎలాంటి పుస్తకాలు కావాలి, ఇంకేమైనా అవసరాలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు.

News April 6, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ∆} ఖమ్మంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన

News April 6, 2025

నేడు భద్రాద్రికి సీఎం రేవంత్ రెడ్డి రాక

image

CM రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటన ఖరారైంది. ఆదివారం ఉదయం 10 గంటలకు హెలికాప్టర్‌లో సారపాకలోని గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు. 10:30కు భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకుంటారు. 11:10 నుంచి 12.30 వరకు మిథిలా స్టేడియంలో జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారు. 12:35కు సారపాకలో సన్నబియ్యం లబ్ధిదారుడి నివాసంలో భోజనం చేయనున్నారు. అనంతరం ఐటీసీ గెస్ట్ హౌస్ నుంచి HYDకు తిరుగుపయనమవుతారు.

News April 6, 2025

భద్రాచలంలో ఉదయం.. ముత్తారంలో సాయంత్రం కళ్యాణం

image

ముదిగొండ మండలం ముత్తారంలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఆదివారం సాయంత్రం రాములోరి కళ్యాణం జరగనుంది. భద్రాచలంలో ఉదయం సీతారామ కళ్యాణం జరగగా, ఇక్కడ మాత్రం సాయంత్రం వేళలో సీతారాముల కళ్యాణం జరగడం విశేషం. భద్రాచలంలో జరిగిన కళ్యాణం అక్షింతలను ముత్తారానికి తీసుకొచ్చి కళ్యాణ తంతు నిర్వహిస్తారు. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల నుంచి భక్తులు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలిరానున్నారు.

News April 6, 2025

లక్ష్యంతో ఉన్నత ఉద్యోగం సాధించాలి: ఖమ్మం కలెక్టర్

image

పోటీ పరీక్షలలో అభ్యర్థులు ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, వాటి సాధన దిశగా పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్, ఖమ్మం బైసాస్ రోడ్డులోని జలగం వెంగళరావు తెలంగాణ బిసీ స్టడీ సర్కిల్‌ను సందర్శించి, వివిధ పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్థులతో ముచ్చటించారు. అభ్యర్థులకు కలెక్టర్ పలు సలహాలు, సూచనలు ఇచ్చారు.

News April 5, 2025

BRS రజతోత్సవ సభ.. ఖమ్మం నేతలతో KCR MEETING

image

బీఆర్ఎస్ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభ నేపథ్యంలో ఈరోజు ఉమ్మడి ఖమ్మంతో పాటు మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల ముఖ్యనేతలతో పార్టీఅధినేత కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, బానోత్ మదన్ లాల్ నాయక్, హరిప్రియ నాయక్, మెచ్చా నాగేశ్వరరావు, కమల్ రాజ్ పాల్గొన్నారు.

News April 5, 2025

మార్పు మనతోనే ప్రారంభించాలి: ఖమ్మం కలెక్టర్

image

మనం ఆశించే మార్పు మన ఇంటి నుంచే ప్రారంభించాలనే సూక్తిని బాబు జగ్జీవన్ రామ్ పాటించారని, తన కుమార్తెను ఉన్నత విద్య చదివించారని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తెలిపారు. శనివారం స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేశారు.

News April 5, 2025

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రాద్రి పర్యటన రద్దు

image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రాద్రి పర్యటన రద్దయింది. మిథిలా స్టేడియంలో సీతారాముల కళ్యాణం రేపు ఉదయం వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. స్వామి వారి కళ్యాణంలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ నేడు భద్రాద్రికి రావాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన పర్యటన రద్దయినట్లు ఓ ప్రకటన జారీ అయ్యింది.

News April 5, 2025

మధిర: రైలు నుంచి జారిపడి వ్యక్తి దుర్మరణం

image

గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా మధిర మండలంలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. మధిర-తొండల గోపురం రైల్వేస్టేషన్ మధ్య గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి ఏపీలోని పల్నాడు జిల్లా గురజాలకు చెందిన గడ్డం మహేశ్వరరావు మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

News April 5, 2025

మత్స్యకారులకు అండగా ఇందిరమ్మ ప్రభుత్వం: మంత్రి

image

ఖమ్మం: మత్స్యకారులకు అండగా ఇందిరమ్మ ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రి కూసుమంచిలోని తన క్యాంపు కార్యాలయంలో గిరిజన మత్స్యకారులకు వలలు పంపిణీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.

error: Content is protected !!