India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కూసుమంచి మండలం కొత్తతండాలో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ క్షేత్రంలో తండ్రి రాంబాబు ట్రాక్టర్తో దుక్కి దున్నుతుండగా దానిపై కూర్చున్న ఆరేళ్ల బాలుడు భువనేశ్వర్ ప్రమాదవశాత్తు రోటవేటర్లో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్లెదుటే కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. దీంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
ఖమ్మం జిల్లాలో ఘన చరిత్ర కలిగిన నేలకొండపల్లి మండల కేంద్రం నేటికీ మున్సిపాలిటీకి అవకాశం ఉన్నప్పటికీ గ్రామ పంచాయతీగానే కొనసాగుతుంది. మున్సిపాలిటీగా రూపాంతరం చెందితే కేంద్ర నిధులు కూడా వచ్చే అవకాశం ఉందని మహనీయులు చరిత్ర కలిగిన నేలకొండపల్లి స్వరూపం పూర్తిగా మారే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. మున్సిపాలిటీ చేయాలన్న ఆలోచన పాలకుల మనసులో ఉన్నా ఆచరణలో ముందుకు వెళ్లడం లేదని తెలుస్తోంది.
కూసుమంచి మండలం పాలేరు జలాశయం నీటి మట్టం గణనీయంగా తగ్గింది. నిన్నటి వరకు వరదల కారణంగా పరవళ్లు తొక్కగా, వర్షాలు తగ్గడంతో పాటు సాగర్ డ్యాం నుంచి నీటి రాక తక్కువగా ఉంది. పాలేరు జలాశయం నుంచి ఎడమ కాల్వకు 4 వేల క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. దీంతో 23 అడుగుల గరిష్ఠ నీటి మట్టానికి ప్రస్తుతం 19.5 అడుగులకు తగ్గింది.
ప్రతి నెల నాలుగో శనివారం నిర్వహించే బ్యాగ్లెస్ డే కార్యక్రమంలో భాగంగా ఖమ్మం ఇందిరానగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సందర్శించారు. విద్యార్థులు కాగితపు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలకగా, కలెక్టర్ ఆనందం వ్యక్తం చేశారు. పిల్లలు తయారు చేసిన గ్రీటింగ్ కార్డులు, పతంగులు, పోస్టర్లు, పజిల్స్, పేపర్ ఆకృతులను పరిశీలించి, నృత్యం, గానం,ప్రసంగాలు,సాంస్కృతిక ప్రదర్శనలను ఆస్వాదించారు.
ఖమ్మం జిల్లాలో సెప్టెంబర్ 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇన్ఛార్జ్ న్యాయమూర్తి ఉమాదేవి తెలిపారు. క్రిమినల్, సివిల్ ఇతర కేసులను జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా జరిగే లోక్ అదాలత్లో ప్రజలు కేసులను శాంతియుత వాతావరణంలో పరిష్కరించుకోవాలని సూచించారు.
ఖమ్మం జిల్లాలో శనివారం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బ్యాగ్లెస్ డే అమలు జరిగిందని ఇకపై ప్రతి నెలా 4వ శనివారం ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. విద్యార్థులు పుస్తకాలు, బ్యాగులు లేకుండా పాఠశాలకు హాజరై వివిధ సృజనాత్మక, సామాజిక చైతన్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు అని, పిల్లలలో సామాజిక అవగాహన పెంపొందించడమే లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు.
మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని ప్రజలకు ఖమ్మం కలెక్టర్ అనుదీప్ సూచించారు. శనివారం ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మట్టి, పిండితో వినాయక విగ్రహాలు తయారు చేసిన విద్యార్థులను ఆయన అభినందించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో పర్యావరణానికి హాని కలిగించే పద్ధతులను మానుకొని, మట్టి గణపతులకు ప్రాధాన్యమివ్వాలని అన్నారు.
CPI రాష్ట్ర సమితి కార్యదర్శివర్గ సభ్యుడిగా జిల్లాకు చెందిన బాగం హేమంతరావు ఎన్నికయ్యారు. మూడు రోజులపాటు మేడ్చల్ జిల్లా గాజులరామవరంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలో ఈ ఎన్నిక జరిగింది. నేలకొండపల్లి మండలం మోటాపురంలో రైతు కుటుంబంలో జన్మించిన బాగం హేమంతరావు విద్యార్థి ఉద్యమంలో పనిచేశారు. ఎఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి, ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.
ఖమ్మం నగరంలో శనివారం చిన్నారులు తమ చిట్టి చేతులతో ఎకో ఫ్రెండ్లీ గణనాధులను తయారు చేసి అందరికీ స్ఫూర్తినిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు ఎకో ఫ్రెండ్లీ గణపయ్యనే పూజించాలని తెలియజేస్తూ చిన్నారులు ఉత్సాహంగా ఎకో ఫ్రెండ్లీ గణపతులను తయారు చేశారు. వివిధ రూపాలలో వినాయక ప్రతిమలను అందంగా రూపొందించారు. మట్టి గణపయ్యను శోభాయమానంగా తీర్చిదిద్దారు.
విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడమే నో బ్యాగ్ డే ముఖ్య ఉద్దేశ్యమని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. నోబ్యాగ్ డే కార్యక్రమంలో భాగంగా శనివారం ఖమ్మం ఇందిరనగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆయన సందర్శించారు. సమూహ కార్యకలాపాల్లో పాల్గొనడంతో విద్యార్థుల సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.