Khammam

News April 5, 2025

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రాద్రి పర్యటన రద్దు

image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రాద్రి పర్యటన రద్దయింది. మిథిలా స్టేడియంలో సీతారాముల కళ్యాణం రేపు ఉదయం వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. స్వామి వారి కళ్యాణంలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ నేడు భద్రాద్రికి రావాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన పర్యటన రద్దయినట్లు ఓ ప్రకటన జారీ అయ్యింది.

News April 5, 2025

మధిర: రైలు నుంచి జారిపడి వ్యక్తి దుర్మరణం

image

గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా మధిర మండలంలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. మధిర-తొండల గోపురం రైల్వేస్టేషన్ మధ్య గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి ఏపీలోని పల్నాడు జిల్లా గురజాలకు చెందిన గడ్డం మహేశ్వరరావు మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

News April 5, 2025

మత్స్యకారులకు అండగా ఇందిరమ్మ ప్రభుత్వం: మంత్రి

image

ఖమ్మం: మత్స్యకారులకు అండగా ఇందిరమ్మ ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రి కూసుమంచిలోని తన క్యాంపు కార్యాలయంలో గిరిజన మత్స్యకారులకు వలలు పంపిణీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.

News April 4, 2025

KMM: నూతన రేషన్ కార్డులను వేగవంతం చేయాలి: CS

image

రేషన్ షాపులకు సన్న బియ్యం రవాణా వేగవంతం చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రి నిర్వహించిన వీసీలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పాల్గొన్నారు. రూ.13 వేల కోట్లు ఖర్చు చేసి 30 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని పేదలకు అందజేస్తున్నట్లు మంత్రి చెప్పారు. అటు నూతన రేషన్ కార్డుల దరఖాస్తుల స్క్రూటినీ వేగవంతం చేయాలని CS శాంతి కుమారి సూచించారు.

News April 4, 2025

ఎక్స్‌గ్రేషియా చెక్కు అందజేసిన ఖమ్మం CP

image

ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో భాధ్యతలు నిర్వహిస్తున్న ఇటీవల హెడ్ కానిస్టేబుల్ బి.పాపా మరణించారు. కాగా హెడ్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు రూ.8 లక్షల భద్రత ఎక్స్‌గ్రేషియా చెక్కు మంజూరైంది. శుక్రవారం ఖమ్మం సీపీ సునీల్ దత్ బాధిత కుటుంబానికి మంజూరైన చెక్కును అందజేశారు. శాఖాపరంగా ఎటువంటి సహాయ సహకారాలు అందించేందుకైనా పోలీస్ అధికారులు అందుబాటులో ఉంటారని సీపీ పేర్కొన్నారు.

News April 4, 2025

ఖమ్మం: ఫెయిల్ అయిన వారికి మరో ఛాన్స్

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో B.A, B,COM, B.B.A, BSC,BCA కోర్సుల1,3,5 సెమిస్టర్ పరీక్షలు మరోసారి నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. కొద్దినెలల క్రితం ఈ పరీక్షలు నిర్వహించగా ఉత్తీర్ణత శాతం తక్కువగా రావడంతో ఆయా సెమిస్టర్ల పరీక్షలు మరోసారి నిర్వహించాలనే వినతుల దృష్ట్యా సానుకూల నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల3వ వారం నుంచి నిర్వహించే డిగ్రీ కోర్సుల 2,4,6వ సెమిస్టర్ పరీక్షలతోపాటు నిర్వహించనున్నారు.

News April 4, 2025

KMM:ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ. 16 లక్షల స్వాహా..  

image

ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను మోసం చేసి రూ.16 లక్షలు కాజేసిన ఘటన ఖమ్మం నగరంలో చోటుచేసుకుంది. సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం వివేకానంద కాలనీకి చెందిన గుదిబండ్ల ఆదిలక్ష్మి మామిళ్ళగూడెంకి చెందిన పలువురు యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని రూ. 16 లక్షల పైగా మోసం చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐ దర్యాప్తు అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు

News April 4, 2025

ఖమ్మం జిల్లాలో నేటి నేటి ముఖ్యాంశాలు

image

∆} నేలకొండపల్లి మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} మధిర మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల పర్యటన ∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యాటక

News April 4, 2025

పింఛన్ కోసం వచ్చే మహిళను గర్భవతిని చేశాడు..!

image

పింఛన్ కోసం వచ్చిన చెవి, మూగ మహిళను ఓ వ్యక్తి గర్భవతిని చేసిన ఘటన తిరుమలాయపాలెం మండలంలో జరిగింది. సుబ్లేడులో మినీ ఏటీఎం నిర్వహిస్తున్న కామళ్ల వీరవయ్య వద్దకు ఆయన బంధువైన మహిళ పింఛన్ కోసం వచ్చేది. ఈ క్రమంలో వీరయ్య అమెను నమ్మించి గర్భవతిని చేశాడు. విషయం తెలిసి బాధితురాలి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వీరయ్యను రిమాండ్‌కు తరలించారు.

News April 4, 2025

అమ్మాయి పుడితే పండగ చేసుకోవాలి: ఖమ్మం కలెక్టర్

image

అమ్మాయి పుడితే ఇంటిల్లిపాది పండగ చేసుకోవాలని, అదృష్టం ఉన్న వాళ్లకు మాత్రమే ఆడపిల్లలు పుడతారని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. కామేపల్లి(మం) కొత్త లింగాలలో ఉండేటి అమృత-సుధాకర్ దంపతులకు ఇటీవల ఆడపిల్ల పుట్టగా, కలెక్టర్ విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి పాప తల్లిదండ్రులతో పాటు అత్తా, మామలను కలిసి స్వీట్ బాక్స్, ఫ్రూట్స్, సర్టిఫికేట్ అందజేశారు. అనంతరం తల్లిదండ్రులను సత్కరించారు.

error: Content is protected !!