Khammam

News August 23, 2025

ఖమ్మం మార్కెట్‌లో దొంగ సెస్ బిల్లుల కలకలం

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో నకిలీ సెస్ బిల్లులు కలకలం సృష్టించాయి. వివరాలిలా ఉన్నాయి.. మార్కెట్‌లో పత్తి వ్యాపారం చేసే ఒక ట్రేడర్, మరో వ్యాపారి సెస్ పుస్తకాలను దొంగిలించి, వాటిని నకిలీగా ముద్రించినట్లు తెలుస్తోంది. ఆ దొంగ బిల్లులను ఉపయోగించి, గుంటూరులోని ఒక ప్రముఖ సంస్థకు భారీ మొత్తంలో పత్తిని విక్రయించారు. బిల్లులు సరిపోలకపోవడంతో మార్కెట్‌లో విచారించగా, నకిలీ బిల్లుల బాగోతం వెలుగులోకి వచ్చింది.

News August 23, 2025

ఖమ్మం: విధుల బహిష్కరణ.. తాగునీటికి కటకటేనా?

image

జిల్లాలో మిషన్ భగీరథ కార్మికులు విధుల బహిష్కరణకు నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న మిషన్ భగీరథ సిబ్బంది 463 మందికి 3 నెలలుగా వేతనాలు రాకపోవడంతో చేసేదేం లేక శనివారం నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లు జేఏసీ నాయకుడు మద్దెల రవి ప్రకటించారు. దీంతో జిల్లాలు తాగునీటి సమస్య ఏర్పడనుందని పలువురు పేర్కొన్నారు. వెంటనే సిబ్బంది జీతాలు చెల్లించి విధులు బహిష్కరణ విరమించేలా చూడాలని కోరుతున్నారు.

News August 23, 2025

ఖమ్మం: సెప్టెంబర్ 1 నుంచి నుంచి రేషన్ బియ్యం పంపిణీ

image

జిల్లాలో వచ్చే నెల 1వ తేదీ నుంచి సన్న బియ్యం పంపిణీ మొదలుకానుంది. దీంతో ఇప్పటికే ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా చేస్తున్నారు. జిల్లాలో 748 రేషన్ షాపులు ఉండగా.. ఇప్పటి వరకు 150 దుకాణాల వరకు బియ్యం పంపించారు. జిల్లాలోని 21 మండలాల పరిధిలో జూన్, జులై, ఆగస్టు నెలల్లో 21,925 కొత్త కార్డులు మంజూరు చేయగా వీరికి వచ్చే నెల నుంచి బియ్యం పంపిణీ చేయనున్నారు.

News August 23, 2025

ఖమ్మం జిల్లాలో 80 మందికి HMలుగా పదోన్నతి

image

ఖమ్మం జిల్లాలోని వివిధ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లు(ఎస్ఏ)లుగా విధులు నిర్వర్తిస్తున్న 80 మందికి గ్రేడ్-2 హెచ్ఎంలుగా పదోన్నతి లభించింది. ఈమేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయగా పలువురు నూతన స్థానాల్లో బాధ్యతలు స్వీకరించారు. ఇక ఎస్జీటీలో స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతికి అర్హులైన ఉపాధ్యాయుల సీనియారిటీ, ఖాళీల జాబితాను ఈరోజు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

News August 22, 2025

‘భూమిచ్చిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు: Dy.Cm

image

విద్యుత్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన వారికి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది. శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క 320 మందికి నియామక పత్రాలు అందజేశారు. ‘ఆనాడు భూములు ఇచ్చింది ఇందిరమ్మే.. ఇవాళ మీకు ఉద్యోగాలు ఇస్తోంది మా ప్రభుత్వమే. 2013లో భూసేకరణ లాంటి గొప్ప చట్టాన్ని కాంగ్రెస్ తెచ్చింది. ఆ చట్టంతోనే ఇప్పుడు మీకు న్యాయం చేస్తున్నాం’ అని భట్టి పేర్కొన్నారు.

News August 22, 2025

ఫేక్ ప్రచారం చేసే కఠిన చర్యలు తప్పవు: ఖమ్మం సీపీ

image

ఫేక్ ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ఓ దిన పత్రికకు అర్ధం వచ్చేలా డేట్ లైన్ మార్ఫింగ్‌ చేసి తప్పుడు వార్త కథనాన్ని ప్రముఖ దిన పత్రికలో వచ్చిందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదుపై ఖమ్మం 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News August 22, 2025

విష జ్వరాలతో అప్రమత్తంగా ఉండండి: ఖమ్మం DMHO

image

సీజనల్ వ్యాధులు, జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం జిల్లా వైద్యాధికారి కళావతి బాయి సూచించారు. నీళ్లు నిల్వ ఉన్న చోట, మురుగు ప్రదేశాల్లో లార్వాను అభివృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు ఎవరైనా జ్వరంతో బాధపడుతుంటే స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

News August 22, 2025

కేంద్రంతో కొట్లాడైనా యూరియా అందిస్తాం: పొంగులేటి

image

ఖమ్మం: కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి కారణంగా రాష్ట్రానికి యూరియా కేంటాయింపుల్లో అన్యాయం జరుగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. కావాలనే తప్పుడు లెక్కలు చూపిస్తూ యూరియా కేటాయింపులు చేయడం లేదని, గట్టిగా అడిగితే అదిగో.. ఇదిగో ఇస్తున్నాం అంటూ కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. కేంద్రంతో కోట్లాడైనా సరే రైతులకు యూరియా సరఫరా చేస్తామని ఆయన పేర్కొన్నారు.

News August 22, 2025

ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన వాయిదా

image

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జరగనున్న పర్యటన వాయిదా పడిందని క్యాంపు కార్యాలయ సిబ్బంది తెలిపారు. కొన్ని అనివార్య కారణాల వల్ల మంత్రి పర్యటన వాయిదా పడిందని తదుపరి తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు.

News August 22, 2025

ఖమ్మం: ఈనెల 23న జాబ్ మేళా

image

టేకులపల్లి ప్రభుత్వ ఐటీఐ మోడల్ కెరీర్ సెంటర్‌లో ఈ నెల 23న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి మాధవి తెలిపారు. ప్రైవేట్ కంపెనీలో ఖాళీగా ఉన్న 47 పోస్టుల భర్తీకి ఏదైనా డిగ్రీ అర్హత కలిగి, 25-45 సం. వయస్సు కలిగిన మహిళా అభ్యర్థులు అర్హులని చెప్పారు. ఆసక్తిగల మహిళా అభ్యర్థులు జాబ్ మేళాకు విద్యార్హత పత్రాలతో హాజరు కావాలన్నారు.