India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టేకులపల్లి ప్రభుత్వ ఐటీఐ మోడల్ కెరీర్ సెంటర్లో ఈ నెల 23న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి మాధవి తెలిపారు. ప్రైవేట్ కంపెనీలో ఖాళీగా ఉన్న 47 పోస్టుల భర్తీకి ఏదైనా డిగ్రీ అర్హత కలిగి, 25-45 సం. వయస్సు కలిగిన మహిళా అభ్యర్థులు అర్హులని చెప్పారు. ఆసక్తిగల మహిళా అభ్యర్థులు జాబ్ మేళాకు విద్యార్హత పత్రాలతో హాజరు కావాలన్నారు.
ప్రజలందరికీ దేశానికి ఉపయోగపడే చట్టాలు చేయాల్సిన పార్లమెంట్, చట్టపరమైన విధానాలను తప్పించుకునే దిశగా బిల్లులు తీసుకొస్తోందని CPI(M) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం ఖమ్మంలో జరిగిన దొంగల కోటయ్య సంస్కరణ సభలో తమ్మినేని పాల్గొని మాట్లాడారు. ప్రతిపక్షాలను అణచివేసే చర్యల్లో భాగమే 130 రోజుల కస్టడీ బిల్లు అని తమ్మినేని పేర్కొన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పార్లమెంట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ఆర్థిక, అభివృద్ధి అంశాలపై ఇరువురు విస్తృతంగా చర్చించారు. ఈ భేటీలో ఎంపీలు పొరిక బలరాం నాయక్, రామసహాయం రఘురాం రెడ్డి, డాక్టర్ మల్లు రవి కూడా పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు, పథకాలు, ఆర్థిక సహాయంపై డిప్యూటీ సీఎం వివరించారు.
ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి గురువారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్రమంత్రికి పలు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద అన్ని జిల్లాలకు ప్రాజెక్టులు మంజూరు చేయాలని కోరారు. నీటిపారుదల, సంరక్షణ చర్యలు చేపట్టాలని, స్థిరమైన గ్రామీణాభివృద్ధికి సహకారం అందించాలన్నారు.
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లు మంత్రి క్యాంప్ కార్యాలయం అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటలకు తల్లాడ, కల్లూరు, సత్తుపల్లి మండలంలో మంత్రి పర్యటిస్తారని చెప్పారు. మధ్యాహ్నం 2 గంటలకు కూసుమంచి మండలం జీళ్లచెరువులో వెంకటేశ్వర స్వామి గుడికి, అంతర్గత సీసీ రోడ్లకు శంకుస్థాపన చేయనున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరత లేకుండా చూడాలని, యూరియా నిల్వలు కావాల్సిన మేర అందుబాటులో ఉంచి రైతులకు సకాలంలో అందజేయాలని బీఆర్ఎస్ లోక్సభ మాజీ పక్షనేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు కోరారు. ఒక రైతు బిడ్డగా పార్లమెంట్లో రైతుల సమస్యల కోసం పోరాటం చేశానని గుర్తు చేశారు.
జిల్లాలో బుధవారం ఉదయం 8:30 నుంచి గురువారం ఉదయం 8:30 వరకు 8.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఖమ్మం రూరల్ 3.4, కామేపల్లి, చింతకాని, వైరా 1.2, ఏన్కూరు 1.0, నేలకొండపల్లి మండలంలో 0.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. అటు ఇతర మండలాల్లో ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదని పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లా జల వనరుల శాఖలో ఖాళీగా ఉన్న స్థానాల్లో డీఈఈలు, ఈఈలకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తిరుమలాయపాలెం డీఈఈ రమేశ్రెడ్డికి పాలేరు ఈఈగా, ఖమ్మం సీఈ కార్యాలయంలో డీఈ కె.శోభారాణికి అదే కార్యాలయంలో డీసీఈగా, సత్తుపల్లి ఈఈ ఎస్.శ్రీనివాస్రెడ్డికి కల్లూరు డీఎస్ఈగా, మధిర డీఈఈ రాంప్రసాద్కు మధిర ఈఈగా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఖమ్మం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పిం చేలా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు గురువారం ఉదయం వరకు సీనియారిటీ జాబితాలో ఉన్న ఎస్ఏలు వెన్ఆప్షన్లు పెట్టుకోవాలని సూచించింది. జోనల్ స్థాయిలో 1,300 మందికి అవకాశముండగా, ఖమ్మం జిల్లాలో 70 మంది హెచ్ఎంలుగా పదోన్నతి పొందనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఎస్ఓటీలకు ఎస్ఏలుగా పదోన్నతి కల్పించనున్నారు.
ఖమ్మం జిల్లాలో చేప పిల్లల పంపిణీకి అంతా సిద్ధమైంది. సెప్టెంబర్ ఒకటో తేదీన సరఫరాదారుల నుంచి వచ్చిన టెండర్లు పరిశీలించి, వారి అర్హతలను బట్టి ఖరారు చేయనున్నారు. ఖమ్మం జిల్లాలో రిజర్వాయర్లు, కుంటలు కలిపి 882 ఉండగా, వీటికి 3.49 కోట్ల ఉచిత చేప పిల్లలను సరఫరా చేస్తారు. మూడు నెలలు ఆలస్యమైనా ప్రభుత్వం తమను గుర్తించి ఉచిత చేప పిల్లల సరఫరాకు టెండర్లు విడుదల చేయడంపై మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.