Khammam

News April 4, 2025

పింఛన్ కోసం వచ్చే మహిళను గర్భవతిని చేశాడు..!

image

పింఛన్ కోసం వచ్చిన చెవి, మూగ మహిళను ఓ వ్యక్తి గర్భవతిని చేసిన ఘటన తిరుమలాయపాలెం మండలంలో జరిగింది. సుబ్లేడులో మినీ ఏటీఎం నిర్వహిస్తున్న కామళ్ల వీరవయ్య వద్దకు ఆయన బంధువైన మహిళ పింఛన్ కోసం వచ్చేది. ఈ క్రమంలో వీరయ్య అమెను నమ్మించి గర్భవతిని చేశాడు. విషయం తెలిసి బాధితురాలి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వీరయ్యను రిమాండ్‌కు తరలించారు.

News April 4, 2025

అమ్మాయి పుడితే పండగ చేసుకోవాలి: ఖమ్మం కలెక్టర్

image

అమ్మాయి పుడితే ఇంటిల్లిపాది పండగ చేసుకోవాలని, అదృష్టం ఉన్న వాళ్లకు మాత్రమే ఆడపిల్లలు పుడతారని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. కామేపల్లి(మం) కొత్త లింగాలలో ఉండేటి అమృత-సుధాకర్ దంపతులకు ఇటీవల ఆడపిల్ల పుట్టగా, కలెక్టర్ విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి పాప తల్లిదండ్రులతో పాటు అత్తా, మామలను కలిసి స్వీట్ బాక్స్, ఫ్రూట్స్, సర్టిఫికేట్ అందజేశారు. అనంతరం తల్లిదండ్రులను సత్కరించారు.

News April 4, 2025

ధాన్యానికి రూ.500 బోనస్ చరిత్ర: మంత్రి పొంగులేటి

image

రాష్ట్రంలో ప్రజలు మార్పు కావాలనే ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారని, కాంగ్రెస్ పాలనలో రైతును రాజు చేయడమే తమ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలో మంత్రి ధాన్యం కనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి, మాట్లాడారు. దేశచరిత్రలోనే మొదటిసారిగా ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చామని తెలిపారు. కార్యక్రమంలో నేతలు, అధికారులు పాల్గొన్నారు.

News April 4, 2025

ఖమ్మం ఖిల్లా రోప్ వే ప్రాజెక్టుకు రూ.29 కోట్లు

image

ఖమ్మం నగరంలోని ఖిల్లాపై రోప్ వే ప్రాజెక్టుకు జిల్లా యంత్రాంగం రూ.29 కోట్లు మంజూరు చేసింది. తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఇంజినీరింగ్ విభాగం ఖర్చుల అంచనాలను సిద్ధం చేసింది. ఇందులో ఖిల్లాపై రోప్ వే వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఖిల్లా మెట్ల మార్గం కుడి వైపున రెండు అంతస్తుల బేస్ స్టేషను ఏర్పాటు చేయడంతో పాటు రోప్ వేలో 200-250 మంది బరువును తట్టుకునే సామర్థ్యమున్న 275 మీటర్ల తీగలను ఏర్పాటు చేయనున్నారు.

News April 4, 2025

ఖమ్మంలో నేడు మంత్రి తుమ్మల పర్యటన

image

మంత్రి తుమ్మల నాగేశ్వరావు శుక్రవారం ఖమ్మం నగరంలో పర్యటించనున్నారని మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ముందుగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో మేయర్ పునకోల్లు నీరజతో కలిసి పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు గమనించి సకాలంలో హాజరుకావాలని సూచించారు.

News April 4, 2025

ఖమ్మం జిల్లాలో TODAY ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం: చెల్లని చెక్కు కేసులో 6నెలల జైలు శిక్ష.. ∆} ఖమ్మం: సన్న బియ్యం పంపిణీ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం: బీజేపీ ∆} HCU భూములపై రాజ్యసభలో ఎంపీ వద్దిరాజు విజ్ఞప్తి ∆} కామేపల్లి: అమ్మాయి పుడితే పండగ చేసుకోవాలి: ఖమ్మం కలెక్టర్ ∆} ఖమ్మంలో జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ యాత్ర ∆} ఖమ్మం: సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి: తుమ్మల ∆}KMM: తలతాకట్టు పెట్టెనా పథకాలు అమలు చేస్తాం: పొంగులేటి.

News April 3, 2025

25,65,000 రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశాం: పొంగులేటి

image

ఖమ్మం: 25,65,000 మంది రైతన్నలకు 20 వేల 687 కోట్ల రూపాయలతో 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దేశ చరిత్రలో మద్దతు ధరతో పాటు క్వింటాల్ కు ₹500 బోనస్ చెల్లిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. అటు గత వానాకాలం పంటకు దాదాపు 1700 కోట్ల రూపాయలు బోనస్ అందించామని తెలిపారు. సంవత్సరానికి సరిపడా సన్న రకం బియ్యం నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

News April 3, 2025

అగ్ని ప్రమాదంలో వ్యక్తి సజీవ దహనం

image

అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంట <<15975525>>పెద్దిరెడ్డిగూడెం <<>>పంచాయతీ టిడి బంజరలో విషాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అంటుకొని ఇంట్లో నిద్రిస్తున్న పెరాలసిస్ బాధితుడు గౌస్ పాషా(35) సజీవ దహనం అయ్యాడు. మరో రెండు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఫైర్ సిబ్బంది స్పందించకపోవడంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని స్థానికులు తెలిపారు. పంచాయతీ ట్రాక్టర్‌తో మంటలను అదుపు చేశామన్నారు.

News April 3, 2025

ఖమ్మం మార్కెట్‌కు భారీగా మిర్చి

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం మిర్చి పోటెత్తింది. నాలుగు రోజుల సెలవుల అనంతరం మార్కెట్ ప్రారంభమవడంతో 70వేలకు పైగా మిర్చి బస్తాలతో మార్కెట్‌ నిండిపోయింది. మిర్చి ధర గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బాగా తగ్గడమే కాక.. కొద్దిరోజులుగా మరింత పతనమవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇరవై రోజుల వ్యవధిలోనే క్వింటాకు రూ.2వేల మేర ధర తగ్గింది.

News April 3, 2025

ఖమ్మం జిల్లాకు వర్ష సూచన

image

ఖమ్మం జిల్లాలోని ఈ నెల 5వరకు పలు చోట్ల ఈదురు గాలులతో పాటు తేలికపాటి వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశముందని వెల్లడించింది. దీంతో జిల్లాలో నమోదయ్యే 40-41 డిగ్రీల ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పడతాయని భావిస్తున్నారు. దీంతో పంటలు నాశనమవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

error: Content is protected !!