India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రైతులు పండించిన పంటలకు మద్దతు ధర లభించేలా చర్యలు చేపట్టాలని అ. కలెక్టర్ శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వానాకాలం ధాన్యం కొనుగోలు, కపాస్ కిసాన్ యాప్పై నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో మాట్లాడారు. పత్తి కొనుగోలు సేవలపై రైతులకు సమాచారం అందించారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించి సందేహాలు ఉంటే రైతులు టోల్ఫ్రీ నంబర్ 18005995779 లేదా వాట్సాప్ నంబర్ 8897281111ను సంప్రదించాలని కోరారు.

ఎర్రుపాలెం మండలం సకినవీడు గ్రామంలో దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన శాఖమూరి పద్మ (60)ను ఆమె మనవడు శాఖమూరి చీరాల సాయి శుక్రవారం హతమార్చినట్లు చర్చించుకుంటున్నారు. పద్మ నిద్రిస్తుండగా ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఖమ్మం: ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని మాస్టర్ ట్రైనర్/ జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్రీరామ్ అన్నారు. బుధవారం డీపీఆర్సీ భవనంలో నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులకు, మాస్టర్ ట్రైనర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరు తమకు కేటాయించిన హ్యండ్ బుక్ ఒకటికీ రెండుసార్లు పరిశీలించాలని, ముఖ్యమైన నిబంధనలు మార్క్ చేసి పెట్టుకోవాలని సూచించారు.

గతేడాది మాదారం నుంచి ఖమ్మం విధులకు వెళ్తున్న ఖమ్మం యూనిట్కు చెందిన హోంగార్డు చందర్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. కాగా హోంగార్డు కుటుంబానికి యాక్సెస్ బ్యాంక్ సాలరీ అకౌంట్తో వచ్చే ప్రయోజనాలు, ప్రమాద బీమా సొమ్ము రూ.34 లక్షల చెక్కు మంజూరైంది. బుధవారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హోంగార్డు కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు.

నిర్ణీత లక్ష్యం మేరకు రైస్ డెలివరీ పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. బుధవారం అదనపు కలెక్టర్, కలెక్టరేట్లో పెండింగ్ రా రైస్ డెలివరీపై రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. జిల్లా నుంచి గత ఖరీఫ్ సీజన్ పెండింగ్ ఉన్న 11 వేల 500 మెట్రిక్ టన్నులు రా రైస్, 3500 మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ రాబోయే 20 రోజులలో ఎఫ్సీఐకు సరఫరా చేయాలని సూచించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసింది. 42% రిజర్వేషన్ కల్పించడంతో అత్యధిక స్థానాల్లో పోటీ చేసేందుకు అవకాశం దక్కింది. ఖమ్మం జిల్లాలో ZPTC, MPTC, MPP, సర్పంచ్, వార్డుల సభ్యులకు కలిపి రిజర్వేషన్ల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి. STలకు 1,391, SCలకు 1,111, BCలకు 1,783, జనరల్ 1,823 స్థానాలను కేటాయించారు. దీంతో ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీసీలు ఉత్సాహం చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఖమ్మం జిల్లాలో జులై 10 నాటికి ఉన్న ఓటర్ల జాబితాను కలెక్టర్ అనుదీప్ ప్రకటించారు. జిల్లాలో పురుషుల ఓటర్లు కంటే మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారని తెలిపారు. పురుషులు 3,88,243, మహిళలు 4,14,425, ఇతరులు 22 మంది, మొత్తం 8,02,690 మందికి ఓటు వేయడానికి అవకాశం ఉందని తెలిపారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్కు అనుగుణంగా నామినేషన్, పరిశీలన, పోలింగ్ తేదీలు నిర్ణయించామని పేర్కొన్నారు.

ఖమ్మం జిల్లాలో 5,214 గ్రామ పంచాయతీ పోలింగ్ స్టేషన్లు 737 కేంద్రాల్లో ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. 20 జెడ్పీటీసీలు, 283 ఎంపీటీసీలు, 1580 ఎంపీటీసీ పోలింగ్ స్టేషన్లు, 593 ఎంపీటీసీ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే 40 జోనల్ అధికారులు, 20 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్లు, 16 SST టీములు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.

ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడానికి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ అనుదీప్ కోరారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడారు. ఎన్నికలను పారదర్శకంగా, నియమావళి ప్రకారం, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు.

స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. OCT 9న MPTC, ZPTC ఎన్నికలకు ఎన్నికల సంఘం మొదటి విడత నోటిఫికేషన్ జారీ చేయనుంది. OCT, NOV నెలల్లో MPTC, ZPTC, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లాలో రెండు విడతల్లో MPTC, ZPTC ఎన్నికలు, మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేశారు.
Sorry, no posts matched your criteria.