India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కులమతాలకు అతీతంగా అందరూ కలిసి ఘనంగా జరుపుకునే పండుగల్లో గణేష్ నవరాత్రి వేడుక ఒకటని చెప్పవచ్చు. మధిర మండలం రాజీవ్ నగర్లో ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి ఉత్సవ వేడుకల్లో ముస్లిం దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం షేక్ నాగుల్ మీరా – బీజాన్ దంపతులు గణనాథుడికి కుంకుమ పూజ నిర్వహించారు. దాంతో కులమతాలకు అతీతంగా పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం జిల్లా టేకులపల్లి మోడల్ కెరీర్ కేంద్రంలో ఉద్యోగ మేళాను గురువారం నిర్వహిస్తున్నారు. ఓ ఫైనాన్స్ సంస్థలో లోన్ ఆఫీసర్ పోస్టులు మొత్తం 100 ఖాళీలు భర్తీ ఏర్పాటు చేస్తున్నారు. 18 నుంచి 28 ఏళ్లు విద్య హర్షత్ ఇంటర్ మీడియట్ పూర్తి చేసిన, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు. ఉ.10 గంటలలోగా హాజరు కాగలరని ఉపాధి కల్పన అధికారి మాధవి ఓ ప్రకటనలో తెలిపారు.
మున్నేరు, ఆకేరు, పాలేరు వరదలతో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు కేంద్ర బృందం బుధవారం ఖమ్మం జిల్లాకు రానుంది. ఈ సందర్భంగా వివిధ విభాగాల అధికారులు 9 మందితో ఈ బృందం నేడు ఢిల్లీ నుంచి వస్తోంది. ఈ బృందంలోని అధికారులు రెండు బృందాలుగా ఏర్పడి నష్టాన్ని పరిశీలిస్తారు. ఒక బృందం దెబ్బతిన్న పంటలను, మరో బృందం రోడ్లు, ఎన్నెస్పీ కాలువలు, వంతెనలను పరిశీలించనుంది.
దుమ్ముగూడెం మండలం తూరుబాక ప్రధాన రహదారిపై బుధవారం గోదావరి వరద నీరు చేరింది. దీంతో స్థానిక ప్రజలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గోదావరి నీటిమట్టం గణనీయంగా పెరుగుతుండడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారి వద్ద అధికారులు రాకపోకలను నిలిపివేశారు. గోదారి నీరు చేరిన రహదారులను దాటే ప్రయత్నం చేసి ప్రమాదాలకు గురి కావద్దని అధికారులు సూచించారు.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరదలతో జరిగిన పంట నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులు చేపట్టిన సర్వే ఓ కొలిక్కి వస్తోంది. సర్వేలో భాగంగా 12,014 మంది రైతులకు చెందిన 15,058 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు మంగళవారం నాటికి గుర్తించారు. ఇందులో వరి 10,844 ఎకరాలు ఉంది. మధిర, కూసుమంచి మండలాల్లో సర్వే కొనసాగుతుండగా మరో రెండు, మూడు రోజుల్లో నష్టంపై స్పష్టత రానుంది.
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం కొత్త లింగాలకి చెందిన బాలికపై లైంగిక దాడి కేసులో ఇద్దరు నిందితులు ఏ1. పండగ నాగేంద్రబాబు(22) ఏ2. పండగ రాంబాబు(24)లకు శిక్ష విధిస్తూ తీర్పు వెలువడింది. ఏ1.కు 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.50 వేలు జరిమానా.. ఏ2.కు 10 సంవత్సరాల శిక్ష విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా న్యాయాధికారి కె. ఉమాదేవి మంగళవారం తీర్పు చెప్పారు. ఆటోలో వెళ్తున్న బాలికను అడ్డగించి అత్యాచారం చేశారు.
> వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన > భద్రాచలం వద్ద కొనసాగుతున్న గోదావరి ఉధృతి > కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం > సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద పర్యటన > మధిర మండలంలో మంచినీటి సరఫరా బంద్ > పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు >ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల పర్యటన >మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న చర్యలు
భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం గడిచిన గంట నుంచి నిలకడగా కొనసాగుతోంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 5 గంటలకు 50.5 అడుగుల వద్ద ఉన్న గోదావరి నీటిమట్టం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇక గోదావరి ప్రవాహం పెరిగే అవకాశం లేదని, ఒకవేళ పెరిగినా స్వల్పంగా పెరిగి, అనంతరం తగ్గుముఖం పడుతుందని విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం నగరంలోని టేకులపల్లి ప్రభుత్వ ఐటిఐ కళాశాల మోడల్ కెరీర్ నందు ఈనెల 12న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మాధవి తెలిపారు. స్పందన స్పీహూర్తి ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ నందు ఖాళీగా ఉన్న 100 పోస్టులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 18-29 ఏళ్ళు కలిగి, ఇంటర్ విద్యార్హత కలిగిన వారు అర్హులు అన్నారు. ఉ.10 గంటలకు జరిగే జాబ్ మేళాలో విద్యార్హత పత్రాలతో హాజరు కావాలన్నారు.
గోదావరి శాంతించాలని జాలర్లు దక్షిణ గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నదికి చీర, జాకెట్, పసుపు, కుంకుమ సమర్పించారు. ఇదిలా ఉండగా మ.2 గంటలకు 47.1 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరుకుంది. 48 అడుగుల చేరుకుంటే రెండో ప్రమాద హెచ్చరిక అమలు చేశారు. సాయంత్రం 48 అడుగులకు దాటడంతో ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరిక అమలులో ఉంది.
Sorry, no posts matched your criteria.