Khammam

News September 30, 2025

మూడో విడతలో జీపీ ఎన్నికలు జరిగే మండలాలు

image

ఖమ్మం జిల్లాలో నవంబర్ 8న జరిగే 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు 7 మండలాల్లో జరుగుతాయని అధికారులు తెలిపారు. రఘునాథపాలెం- 37 GPలు- 308 వార్డులు, కొణిజర్ల- 27 GPలు- 254 వార్డులు, వైరా- 22 GPలు- 200 వార్డులు, ఎర్రుపాలెం- 31 GPలు- 284 వార్డులు, మధిర- 27 GPలు- 236 వార్డులు, బోనకల్- 22 GPలు- 210 వార్డులు, చింతకాని- 26 GPలు- 248 వార్డులు. మొత్తం 192 గ్రామపంచాయతీ, 1,740 వార్డుల్లో ఎన్నికలు జరుగుతాయి.

News September 30, 2025

రెండో విడతలో జీపీ ఎన్నికలు జరిగే మండలాలు

image

ఖమ్మం జిల్లాలో నవంబర్ 4న జరిగే 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు 7 మండలాల్లో జరుగుతాయని అధికారులు తెలిపారు. ఏన్కూరు- 21 GPలు – 216 వార్డులు, తల్లాడ- 27 GPలు- 252 వార్డులు, కల్లూరు- 23 GPలు- 214 వార్డులు, పెనుబల్లి- 33 GPలు- 298 వార్డులు, సత్తుపల్లి- 21 GPలు- 208 వార్డులు, వేంసూరు- 26 GPలు- 244 వార్డులు, సింగరేణి- 41 GPలు- 356 వార్డులు. మొత్తం 196 గ్రామపంచాయతీ, 1,788 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి.

News September 30, 2025

మొదటి విడతలో జీపీ ఎన్నికలు జరిగే మండలాలు

image

ఖమ్మం జిల్లాలో అక్టోబర్ 31న జరిగే మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు 6 మండలాల్లో జరుగుతాయని జిల్లా అధికారులు తెలిపారు. కూసుమంచి- 41 GPలు- 364 వార్డులు, తిరుమలాయపాలెం- 40 GPలు-356 వార్డులు, ఖమ్మం రూరల్- 21 GPలు-202 వార్డులు, ముదిగొండ- 25 GPలు- 246 వార్డులు, నేలకొండపల్లి- 32 GPలు- 300 వార్డులు, కామేపల్లి-24 GPలు- 218 వార్డులు. మొత్తం 183 గ్రామపంచాయతీ, 1,686 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.

News September 30, 2025

రెండో విడతలో ఎన్నికలు జరిగే మండలాలు ఇవే

image

ఖమ్మం జిల్లాలో రెండో విడతలో MPTC, ZPTC ఎన్నికలు జరిగే మండలాల వివరాలు ఇలా ఉన్నాయి. రఘునాథపాలెం మండలం- 13, కొణిజర్ల-15, సింగరేణి-16, వైరా-10, ఏన్కూరు-10, కల్లూరు-13, తల్లాడ-16, పెనుబల్లి-15, సత్తుపల్లి-13, వేంసూరు-13. రెండో విడతలో మొత్తం 10 స్థానాల్లో జడ్పీటీసీ, 134 స్థానాల్లో ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి.
☆ రెండవ విడత MPTC, ZPTC ఎన్నికల పోలింగ్ తేదీ: OCT 27

News September 30, 2025

మొదటి విడతలో ఎన్నికలు జరిగే మండలాలు ఇవే

image

ఖమ్మం జిల్లాలో మొదటి విడతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగే మండలాలను జిల్లా అధికారులు ప్రకటించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల వారీగా.. కామేపల్లి మండలం- 12, బోనకల్-13, చింతకాని- 14, మధిర- 12, ముదిగొండ-17, ఎర్రుపాలెం-14, ఖమ్మం రురల్ మండలం-14, కూసుమంచి-17, నేలకొండపల్లి-18, తిరుమలాయపాలెం-18.. మొత్తం 10 జడ్పీటీసీ, 149 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు.

News September 30, 2025

ఖమ్మం: నేటి నుంచి ఆరు రోజుల పాటు సెలవులు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు నేటి(మంగళవారం) నుంచి ఆరు రోజులపాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. 30న దుర్గాష్టమి, OCT 1న మహర్నవమి, 2న విజయదశమి& గాంధీ జయంతి, 3, 4, 5 తేదీల్లో వారాంతపు సెలవులు కారణంగా వరసగా 6 రోజులు సెలవులు ఉంటాయన్నారు. తిరిగి 6వ తేదీ నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని చెప్పారు. ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించాలని పేర్కొన్నారు.

News September 30, 2025

ఖమ్మం జిల్లాలో మూడు దశల్లో ఎన్నికలు : కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో 183 గ్రామాలకు మొదటి దశలో, 196 గ్రామాలకు రెండవ దశలో, 192 గ్రామాలకు మూడో దశలో ఎన్నికలు జరుగుతాయని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు సిద్దం చేశామని, సిబ్బందికి ఎన్నికల విధుల నిర్వహణ పట్ల శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. అటు ఎన్నికల శిక్షణా కార్యక్రమాలకు హాజరుకాని సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.

News September 30, 2025

రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థ ఏర్పాటుపై అవగాహన

image

రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థ ఏర్పాటుపై అవగాహన కలిగి ఉండి అర్హత కలిగిన గృహ వినియోగదారులు ఏర్పాటు చేసుకునే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలిసి అధికారులతో పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బీజిలి యోజనపై సమీక్ష నిర్వహించారు. ఇంటిపై కప్పుపై సౌర ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే ఇంటి యజమానులకు విద్యుత్ ఖర్చు తగ్గుతుందన్నారు.

News September 29, 2025

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను తూ.చ. తప్పకుండా పాటించాలి: కలెక్టర్

image

స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై అధికారులతో సమీక్షించారు. MPTC, ZPTC స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో మండల ప్రత్యేక అధికారులు కీలకపాత్ర పోషించాలన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను తూ.చ. తప్పకుండా పాటించాలన్నారు. అటు వానాకాలం ధాన్యం కొనుగోలుకు పటిష్ట కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు.

News September 29, 2025

నిబంధనలను తూ.చ. తప్పకుండా పాటించాలి: SEC

image

ఖమ్మం: ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలను తూ.చ. తప్పకుండా పాటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని సూచించారు. సోమవారం CEC నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఎంసిసి నిబంధనల ప్రకారం తీసుకోవాల్సిన చర్యలను చేపట్టి రిపోర్ట్ అందించాలని చెప్పారు. సోషల్ మీడియా ద్వారా ఉల్లంఘనలు చేస్తే వారిపై ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.