India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని 18వ డివిజన్లో ఇటీవల నిర్మాణం పూర్తి చేసుకున్న డ్రైనేజీని మంగళవారం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య పరిశీలించారు. డ్రైనేజీ పనుల్లో నాణ్యత వంటి అంశాలను కమిషనర్ సమీక్షించారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రైనేజీ వ్యవస్థను బలపరచడమే మున్సిపాలిటీ ప్రధాన లక్ష్యమని చెప్పారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు.
ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలల్లోనీ విద్యార్థులు, ఉపాధ్యాయులకు FRS ద్వారా హాజరు కట్టుదిట్టంగా నమోదు చేయాలని అదనపు కలెక్టర్ డా.శ్రీజ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో FRS విధానంలో హాజరు నమోదుపై విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. విద్యా శాఖ పరిధిలో వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోవాలని, పాఠశాలల వారీగా పారిశుద్ధ్య నిర్వహణ మెరుగు పర్చాలని పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లాలో నిన్న ఉదయం 8.30 నుంచి నేడు ఉదయం 8 గంటల వరకు 21 మండలాల్లో 295 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెప్పారు. అత్యధికంగా బోనకల్ మండలంలో 30.5 మి.మీ కాగా అత్యల్పంగా తిరుమలాయపాలెం 4.8 మి.మీగా నమోదైంది. చింతకాని 24.4 మి.మీ, వేంసూరు 23.1 మి.మీ, మధిర 21.3 మి.మీ, తల్లాడ 6.3 మి.మీ, ఖమ్మం(U) 6.7 మి.మీగా వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెప్పారు. వర్షాల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
కాకతీయ యూనివర్సిటీ నేటితో 50వ వసంతంలోకి అడుగుపెడుతోంది. 1976 ఆగస్టు 19న స్థాపించిన కేయూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా, విద్యారంగంలోనూ గొప్ప పేరు సంపాదించుకుంది. అయితే, ఈ స్వర్ణోత్సవాల వేళ కూడా కొన్ని సమస్యలు వెంటాడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 4 విభాగాలుగా మొదలై ప్రస్తుతం 28 విభాగాలకు విస్తరించిన కేయూలో ఇప్పటికీ కొన్ని సమస్యలు వెంటాడటం కలవరపెడుతోంది.
ఖమ్మం జిల్లాలోని రైతులు ప్రస్తుత అవసరానికి మాత్రమే యూరియా కొనుగోలు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం తెలిపారు. ప్రస్తుతం 2,700 మెట్రిక్ టన్నుల యూరియా ఉందని, రైతులు ప్రస్తుత అవసరానికి మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. ఎకరానికి ఒకేసారి కాకుండా 15 రోజులకు 2 సార్లు చల్లితే మంచి ఫలితాలు వస్తాయన్నారు.
జిల్లాలో సమృద్ధిగా యూరియా అందుబాటులో ఉందని, గత సంవత్సరం కంటే నేటికి 3250 మెట్రిక్ టన్నుల యూరియా అదనంగా రైతులకు సరఫరా చేశామని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్ నుంచి టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో యూరియా లభ్యత, సరఫరాపై సంబంధిత జిల్లా, మండల వ్యవసాయ అధికారులు, ఏఈఓలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, మార్క్ ఫెడ్ అధికారులు, పోలీస్ అధికారులతో ఆయన సమీక్షించారు.
గత సంవత్సర అనూహ్య వరదలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు జాగ్రత్తలు, పటిష్ఠ చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో ఆకేరు, మున్నేరు వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గత సంవత్సర అనూహ్య వరదల దృష్ట్యా ముందస్తుగానే వరద పరిస్థితి తెలుసుకొని, సహాయక చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు.
రాత్రి వేళలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టే దిశగా మరింత పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని సీపీ సునీల్ దత్ పోలీస్ అధికారులను ఆదేశించారు. అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ ప్రసాద్రావు పర్యవేక్షణలో జిల్లాలో డ్రంక్& డ్రైవ్, వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. JAN-AUG 17 వరకు నిర్వహించిన డ్రంక్&డ్రైవ్ తనిఖీల్లో 10,141 మంది వాహనదారులు పట్టుబడగా,వారిపై పోలీసులు వివిధ కోర్టుల్లో ఛార్జ్షీట్లు దాఖలు చేశారు.
వానాకాలం పంట సాగుకు అవసరమైన యూరియా రైతులకు చేరేలా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం HYD నుంచి యూరియా, ఎరువుల లభ్యతపై మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ అనుదీప్ పాల్గొన్నారు. జిల్లాలో యూరియా కొరత లేదని ఈ సందేశం ఫీల్డ్ లెవల్ లో వెళ్లాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
మధిర పట్టణ సమగ్ర అభివృద్ధి పనులపై మున్సిపల్ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం సచివాలయంలో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. మధిర మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నెలా ఒకసారి మున్సిపల్ ఇంజినీర్ ఇన్చీఫ్, 15 రోజులకు చీఫ్ ఇంజినీర్ స్థాయి అధికారులు పనులను పరిశీలించాలని ఆదేశించారు
Sorry, no posts matched your criteria.