Khammam

News August 18, 2025

KMM: రోడ్డు ప్రమాదాలు అరికట్టే దిశగా పోలీస్ చర్యలు

image

ఇటీవల రాత్రివేళలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టే దిశగా ఖమ్మం పోలీస్ శాఖ మరింత పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టింది. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ ప్రసాద్ రావు పర్యవేక్షణలో సోమవారం పోలీసులు ఎక్కడికక్కడ మోహరించి డ్రంకన్ అండ్ డ్రైవ్, వాహన తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తుల ఫింగర్ ప్రింట్ మొబైల్ చెక్ ద్వారా వేలిముద్రలు సేకరించారు.

News August 18, 2025

‘ఉద్యమాల ద్వారానే విద్యారంగ సమస్యల పరిష్కారం’

image

ఉద్యమాల ద్వారానే విద్యారంగ సమస్యలు పరిష్కారం అవుతాయని PDSU రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వి అన్నారు. సోమవారం ఖమ్మం రామనరసయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నవంబర్ మూడో వారంలో ఖమ్మంలో PDSU రాష్ట్ర 23వ మహాసభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని కోరారు.

News August 18, 2025

పొంగులేటి క్యాంపు ఇన్ఛార్జి దయాకర్ రెడ్డి పై కలెక్టర్‌కు ఫిర్యాదు

image

ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని కూసుమంచిలోని పాలేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా తుంబూరు దయాకర్ రెడ్డి జాతీయ జెండా ఎగరేశారని బీఆర్ఎస్ నాయకుడు బానోత్ రవి(ఆర్మీ రవి) జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ప్రతి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది నియోజకవర్గ ప్రత్యేకాధికారిని అవమానించినట్లేననీ, ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

News August 18, 2025

స్టీల్, సిమెంట్ ధరలను నియంత్రించాలి: BSP

image

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, ఇటుక, స్టీల్, సిమెంట్ ధరలను నియంత్రించాలని BSP జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం తిరుమలాయపాలెం ఎంపీడీవో కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల సమస్యలపై అధికారులకు వినతి పత్రం అందించారు. నిరుపేదలు అప్పుల బారిన పడకుండా రూ.5 లక్షల లోపే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

News August 18, 2025

హక్కుల సాధనకు సంఘటితమవుదాం

image

విచ్ఛిన్నకర శక్తులకు శాంతి మార్గంలో తగిన గుణపాఠం చెప్పేందుకు తమ రాజ్యాంగ పరిరక్షణ వేదిక ముందుకు సాగుతోందని జాతీయ అధ్యక్షులు సయ్యద్ సాదిక్ అలీ అన్నారు. సోమవారం ఖమ్మం నిజాంపేట ప్రాంత నూతన కమిటీని ఎన్నుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీల పట్ల వివక్ష చూపుతోందని ఆరోపించారు. హక్కుల సాధనకు సంఘటితమవుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

News August 18, 2025

వందేళ్ల వృద్ధురాలి భౌతికకాయం దానం

image

మధిర పట్టణం బంజారా కాలనీకి చెందిన రమావత్ మంగమ్మ(100) సోమవారం మృతి చెందారు. ఈమె మృతదేహాన్ని వైద్య విద్యార్థుల బోధన-అభ్యసన అవసరాల నిమిత్తం ఖమ్మంలోని వైద్య కళాశాలకు అందించేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. మృతదేహాన్ని పలువురు సందర్శించి నివాళి అర్పించారు. ఈమె జీవితమంతా శ్రీరాముడి భక్తిలో గడిపి, స్థానిక ఆలయానికి ఎంతో సేవ చేశారని పలువురు గుర్తు చేసుకున్నారు.

News August 18, 2025

సీపీఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి: హేమంతరావు

image

సీపీఐ నాలుగో రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాగం హేమంతరావు కోరారు. సోమవారం వైరా మండలంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగస్టు 20 నుంచి 22 వరకు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలో ఈ మహాసభలు జరుగుతాయన్నారు. ఈ మహాసభలల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం చర్చించి నిర్ణయాలు తీసుకుంటామన్నారు.

News August 18, 2025

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

image

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డి‌లతో కలిసి ఆయన అర్జీలు స్వీకరించారు.

News August 18, 2025

‘సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలి’

image

ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు నిర్ణీత నమూనాలో సమర్పించాలని అదనపు కలెక్టర్ డా.పి. శ్రీజ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుపై సోమవారం అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 4,700 కు పైగా ప్రభుత్వ కనెక్షన్ లు ఉన్నాయనీ, 30 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవకాశాలు ఉన్నట్లు విద్యుత్ శాఖ అధికారులు అంచనా వేశారన్నారు.

News August 18, 2025

సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలి: కలెక్టర్

image

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు. సమానత్వం, స్వాభిమానం కోసం 400 సంవత్సరాల క్రితమే గొంతెత్తిన మహనీయుడని పేర్కొన్నారు.