India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రజావాణి దరఖాస్తులను ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్.. అదనపు కలెక్టర్లతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు.

ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గెజిట్ విడుదల చేశారు. అటు గ్రామపంచాయతీ వార్డుల రిజర్వేషన్లను కూడా ఖరారు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. మొత్తం 20 మండలాల్లోని 461 గ్రామ పంచాయితీలకు వార్డుల వారీగా రిజర్వేషన్ల వివరాలను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు కావడంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది.

చింతకాని మండలంలోని నరసింహపురం గ్రామానికి చెందిన జక్కుల వేణు, చింతకాని గ్రామానికి చెందిన పొనుగోటి ఉపేందర్ గ్రూప్-2లో ప్రతిభా చాటి ఎక్సైజ్ శాఖలో ఎస్సైలుగా ఎంపికయ్యారు. మధ్యతరగతి రైతు కుటుంబాల నుంచి వచ్చి, తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూనే కష్టపడి ఈ విజయాన్ని సాధించారు. వారి విజయం పట్ల గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేసి, అభినందనలు తెలిపారు.

ఖమ్మం జిల్లాలో సోమవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నట్లు మంత్రి పిఏ రాఘవరావు తెలిపారు. ఎదులాపురం మున్సిపాలిటీ, నేలకొండపల్లి, కూసుమంచి మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. అనంతరం పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు గమనించాలని పేర్కొన్నారు.

ఖమ్మం ZP ఛైర్మన్ పదవికి కూసుమంచి, T.PLM, సత్తుపల్లి, కొణిజర్ల మండలాల్లో గెలిచే ZPTCలకే వచ్చే అవకాశం ఉంది. KMM ZP ఛైర్మన్ పదవిని ST జనరల్కు కేటాయించారు. ఖమ్మం జిల్లాలో 20 ZPTCలు ఉన్నాయి. కూసుమంచి, కొణిజర్ల ST జనరల్, T.PLM, సత్తుపల్లి ST మహిళకు కేటాయించారు. ప్రత్యక్షంగా ఇక్కడి నుంచే ZP ఛైర్మన్ గిరికి వెళ్లనున్నారు. ఇక పరోక్షంగా మహిళలే జడ్పీ ఛైర్పర్సన్గా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.

ఖమ్మం జిల్లాలో ఆయా మండలాల జడ్పీటీసీ రిజర్వేషన్ స్థానాలను కలెక్టర్ అనుదీప్ ఫైనల్ చేశారు. కూసుమంచి ST, T.PLM ST(W), సత్తుపల్లి ST(W), కొణిజర్ల ST, కల్లూరు SC(W), ఎర్రుపాలెం SC, ముదిగొండ SC, తల్లాడ SC(W), బోనకల్ BC(W), KMM(R) BC(W), పెనుబల్లి BC(W), వైరా BC, NKP BC, వేంసూరు BC, మధిర BC(W), R.PLM BC, చింతకాని, ఏన్కూరు జనరల్, కామేపల్లి, సింగరేణి జనరల్(W)గా ఖరారయ్యాయి.

ఖమ్మం జిల్లాలో ఎంపీపీ రిజర్వేషన్ స్థానాలను జిల్లా కలెక్టర్ అనుదీప్ ఖరారు చేశారు. మండలాల వారిగా.. సత్తుపల్లి ST, కొణిజర్ల ST(W), పెనుబల్లి ST, ముదిగొండ SC, తల్లాడ SC(W), చింతకాని SC, T.PLM SC(W), బోనకల్ BC, KMM(R) BC, వైరా BC, NKP BC, వేంసూరు BC(W), మధిర BC(W), కూసుమంచి BC(W), కల్లూరు BC(W), ఎర్రుపాలెం జనరల్(W), రఘునాథపాలెం జనరల్, సింగరేణి జనరల్, ఏన్కూరు ST(W), కామేపల్లి STగా ఖరారైంది.

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియకు తెరపడింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో, గతంతో పోలిస్తే వారికి ఎక్కువ స్థానాలు దక్కాయి. జిల్లాలోని 20 జడ్పీటీసీ, 283 ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అత్యంత కీలకమైన జడ్పీ ఛైర్మన్ పీఠం ఎస్టీ అభ్యర్థికి దక్కింది. ఈ రిజర్వేషన్ల ప్రక్రియతో గ్రామాల్లో ఎన్నికల సందడి షురూ అయింది.

నైపుణ్యం ఉంటే ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తాయని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. ఖమ్మం ఐటిఐ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఆధునాతన సాంకేతిక కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత ATC కేంద్రం ద్వారా అందించే నైపుణ్య కోర్సులు, అందుబాటులో ఉన్న పరికరాలు ప్రపంచ స్థాయిలో పోటి పడేలా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్వచ్ఛంద సేవ కార్యక్రమాలను నిర్వహించడానికి యువజన సంఘాల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మేరా భారత్ డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ తెలిపారు. సంఘంలోని సభ్యుల వయసు 18- 29 సం.రాల లోపు ఉండాలని చెప్పారు. ఖమ్మంలోని పాత బస్టాండ్ సమీపంలో గల మేరా యువ భారత్ కార్యాలయంలో SEP 30 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.