Khammam

News April 1, 2025

రేపటి నుంచి క్రయవిక్రయాలు ప్రారంభం..!

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ బుధవారం పునః ప్రారంభం కానున్నదని మార్కెట్ శాఖ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వారాంతపు సెలవు, ఉగాది, రంజాన్ సెలవుల అనంతరం రేపటి నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు పునః ప్రారంభం అవుతాయని చెప్పారు. కావున ఈ విషయాన్ని జిల్లా రైతు సోదరులు గమనించి తమ పంటను వ్యవసాయ మార్కెట్ కు తీసుకొని అమ్మకాలు జరుపుకోవాలని పేర్కొన్నారు.

News April 1, 2025

గ్రూప్‌–1,2,3,4లో సత్తాచాటిన యువకుడు

image

కామేపల్లి యువకుడు గ్రూప్‌–1,2,3,4 ఫలితాల్లో సత్తాచాటాడు. గోవింద్రాల బంజరకు చెందిన గంగారపు సత్యనారయణ – జ్యోతిర్మయి దంపతుల కుమారుడు రత్నేశ్వరనాయుడు ఇటీవల విడుదలైన గ్రూప్‌-1లో రాష్ట్ర స్థాయిలో 277వ ర్యాంక్‌, జోనల్‌స్థాయిలో 120వ ర్యాంక్‌ సాధించారు. ఆయన ఖమ్మంలోని కమర్షియల్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. కోర్టులో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చినా జాయిన్ కాలేదు.

News April 1, 2025

భూకంప జోన్-3లో భద్రాచలం

image

భూకంపాలు ఏర్పడే జోన్-3 పరిధిలో భద్రాచలం ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ ప్రాంతంలో తీవ్రత 0.125గ్రావిటీగా ఉంటుందని తెలిపారు. దీంతో భూకంపాలు స్వల్పంగా వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. గత 56ఏళ్లలో ఈ ప్రాంతంలో 199సార్లు భూకంపాలు వచ్చాయన్నారు. 1969లో పర్ణశాలలో వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైంది. 2024 DEC 4న కూడా ఇక్కడ భూమి స్వల్పంగా కంపించింది.

News April 1, 2025

భద్రాచలం: కోర్టు సినిమా హీరో రోషన్‌ను అభినందించిన టీపీసీసీ సభ్యుడు.!

image

భద్రాచలం నివాసి రషీద్ తనయుడు హీరో రోషన్ చలనచిత్ర రంగంలో వేగంగా అడుగులు వేస్తున్నారు. అనేక చిన్న చిత్రాల్లో నటించిన అతడు తాజాగా కోర్టు సినిమా ద్వారా హీరోగా అరంగ్రేటం చేశారు. అల్పబడ్జెట్ చిత్రంగా రూపొందించి హిట్ సాధించడం పట్ల టీపీసీసీ సభ్యులు బుడగం శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు. రోషన్‌కు తల్లిదండ్రులతో పాటు భద్రాచలంలోని ప్రముఖుల అండదండలు మెండుగా ఉన్నాయని ఆయన తెలిపారు.

News April 1, 2025

ఖమ్మం: కోట మైసమ్మ తల్లిని దర్శించుకున్న అసిస్టెంట్ కమిషనర్

image

కామేపల్లి మండలం కొత్తలింగాల కోటమై సమ్మ దేవాలయంలో అమ్మవారిని ఖమ్మం దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వీర స్వామి సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమిషనర్‌కు ఈవో నల్లమోతు శేషయ్య, జూనియర్ అసిస్టెంట్ బి.వరప్రసాద్, అర్చకులు బాచి మంచి పుల్లయ్య శర్మ సాంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. భక్తులు, గ్రామస్థులు విరివిగా పాల్గొన్నారు.

News March 31, 2025

KMM: రంజాన్ వేడుకల్లో డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!

image

ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలోని ముస్లిం కాలనీలో గల మైనార్టీ సెల్ నాయకుడు షేక్ గౌస్‌ ఉద్దీన్ నివాసంలో జరిగిన రంజాన్ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర డీప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరీ సోదరీమణులకు భట్టి రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

News March 31, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆}ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ∆} ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} పెనుబల్లి నీలాద్రి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరాలో ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ పర్యటన 

News March 31, 2025

మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారం

image

మానసిక దివ్యాంగురాలిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన అశ్వారావుపేట మండలంలో జరిగింది. ఎస్ఐ యయాతి రాజు వివరాలు.. ఆసుపాకకు చెందిన దివ్యాంగురాలు తన తల్లితో పాటు కలిసి ఉంటుంది. శనివారం తల్లి బయటకు వెళ్లడంతో ఒంటరిగా ఉన్న దివ్యాంగురాలిపై అదే గ్రామానికి చెందిన వెంకటేశ్ అమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె కేకలు వేయడంతో చుట్టు పక్కలవారు రావడంతో వెంకటేశ్ పరారయ్యాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

News March 30, 2025

గాంధీ భవన్‌లో ఉగాది వేడుకల్లో Dy.CM భట్టి

image

హైదరాబాద్ గాంధీ భవన్‌లో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.

News March 30, 2025

ఖమ్మం: 488 కేంద్రాలు.. ఆశలన్నీ బోనస్ పైనే!

image

ఉమ్మడి జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మంలో 2.10 లక్షల ఎకరాల్లో వరికి 344, భద్రాద్రి కొత్తగూడెంలో 65వేల ఎకరాలకు గాను 144 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సీజన్‌లోనూ సన్నాలకు బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినా, వానాకాలం బోనస్ కొంతమేర పెండింగ్‌లో ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. త్వరలో జమవుతాయని అధికారులు చెబుతున్నారు. దీనిపై మీ కామెంట్

error: Content is protected !!