Khammam

News August 14, 2025

KMM: ఏడున్నర గంటల్లో 31.6 MM వర్షపాతం నమోదు

image

ఖమ్మం జిల్లాలో గురువారం ఉదయం 8:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 31.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రఘునాథపాలెం 7.1, సత్తుపల్లి 6.1, సింగరేణి 5.0, KMM(R) 3.5, తిరుమలాయపాలెం 3.0, వేంసూరు 2.5, కల్లూరు 2.0, కొణిజర్ల 1.4, పెనుబల్లి 0.8, KMM(U) 0.2 మిల్లీమీటర్లు నమోదైనట్లు పేర్కొన్నారు.

News August 14, 2025

మైనారిటీ గురుకుల సెక్రటరీని తొలగించాలి: ABVP

image

మైనారిటీ గురుకుల సెక్రటరీని తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలస్తీనా సంఘీభావ ర్యాలీలో పాల్గొన్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గీతాంజలి, ప్రణీత్, జిల్లా సభ్యులు పాల్గొన్నారు.

News August 14, 2025

రూరల్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

ఖమ్మం రూరల్ మండలంలోని కరుణగిరి బ్రిడ్జి సమీపాన ఆటోను బైక్ ఢీకొట్టిన ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తోపాటు ద్విచక్రవాహనదారుడు బుధవారం మృతిచెందారు. ఖమ్మం దానవాయిగూడెంకు చెందిన ఆటోడ్రైవర్ నరేశ్(28) కరుణగిరి వైపు వెళ్తుండగా మున్నేరు బ్రిడ్జి వద్దకు రాగానే ఓ బైక్‌ను బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆటో, బైక్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆటోడ్రైవర్ నరేశ్‌‌తో పాటు బైక్ డ్రైవర్ రాంచరణ్ సాయి(22, ఖమ్మం బొక్కలగడ్డ) మృతిచెందారు.

News August 14, 2025

ఖమ్మం: ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్లు

image

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశాలకు గడువును ఈ నెల 20 వరకు పొడిగించింది. సత్తుపల్లి జేవియర్ ప్రభుత్వ కళాశాలలోని అంబేడ్కర్ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ పూర్ణచందర్‌రావు ఈ విషయాన్ని తెలిపారు. ఇంటర్, డిప్లొమా, ఓపెన్ ఇంటర్, లేదా ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీలో ప్రవేశానికి అర్హులు. అలాగే, డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరాల విద్యార్థులు కూడా తమ ట్యూషన్ ఫీజులను ఈ నెల 20లోపు చెల్లించాలని ఆయన సూచించారు.

News August 14, 2025

జేవీఆర్, కిష్టారం ఓసీలలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

image

జిల్లాలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఓసీలలో బొగ్గు ఉత్పత్తి, ఓబీలు నిలిచినట్లు పీవోలు ప్రహ్లాద్, నరసింహారావు తెలిపారు. Jvr OCPలో 68 mm వర్షపాతం నమోదవగా.. 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 1.20 లక్షల క్యూబిక్ మిలియన్ల ఓబీ పనులు నిలిచాయి. అదేవిధంగా Kistaramఓసీలో 6 వేల టన్నుల‌ బొగ్గోత్పత్తి, 30 వేల క్యూబిక్ మిలియన్ల ఓబీ పనులు నిలిచాయి.

News August 14, 2025

ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన రద్దు

image

రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం ఖమ్మం జిల్లాలో జరిగే పర్యటనను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షాలు వస్తున్న నేపథ్యంలో ఈ పర్యటనను వాయిదా వేసినట్లు చెప్పారు. పాలేరు, మధిర, ఖమ్మం, సత్తుపల్లి నియోజకవర్గాల్లో గురువారం పర్యటన ఖరారు కాగా తాత్కాలికంగా రద్దు చేశారు.

News August 14, 2025

మున్నేరు ఉప్పొంగడంతో రాకపోకలు బంద్

image

ముదిగొండ మండలం పరిధిలోని పండ్రేగుపల్లి నుంచి రామకృష్ణాపురం దారిలో మున్నేరు నది పొంగిపొర్లుతోంది. దీంతో ఆ దారిలో రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి తులసీరామ్ తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించడంతో ప్రజల భద్రతకు తాము పర్యవేక్షిస్తున్నామని ఆయన వెల్లడించారు.

News August 14, 2025

ఖమ్మం జిల్లా నేటి వార్తా సమాచారం

image

☆ జిల్లాలో నేడు విద్యాసంస్థలకు సెలవు
☆ జిల్లాలో నేడు మంత్రి పొంగులేటి పర్యటన
☆ ఎర్రుపాలెంలో డిప్యూటీ సీఎం పర్యటన రద్దు
☆ నేడు జిల్లాకు అత్యంత భారీ వర్ష సూచన
☆ ఇవాళ వివిధ శాఖల అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష
☆ జిల్లావ్యాప్తంగా ఇవాళ గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు
☆ భారీ వర్షాలకు ఉప్పొంగుతున్న వాగులు, వంకలు
☆ ఖమ్మంలో మున్సిపల్ కమిషనర్ పర్యటన
☆ ఖమ్మం రూరల్ మారెమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు

News August 14, 2025

ఖమ్మం: భారీ వర్షాలు.. హెల్ప్‌లైన్ నంబర్లు

image

ఖమ్మంలో భారీ వర్షాల నేపథ్యంలో పోలీసులు అలర్ట్‌ ప్రకటించారు. వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని ప్రజలకు సూచించారు. అత్యవసర సమయాల్లో అందించేందుకు వివిధ హెల్ప్ లైన్ నంబర్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు పోలీసులు ప్రకటన విడుదల చేశారు. అత్యవసర సమయాల్లో డయల్‌ 100, పోలీస్ కంట్రోల్ సెల్ 8712659111, కలెక్టర్ ఆఫీస్ టోల్ ఫ్రీ 1077, సెల్ 9063211298 నంబర్లకు సంప్రదించవచ్చని తెలిపారు.

News August 14, 2025

నేడు ఖమ్మం జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు

image

భారీ వర్షాల నేపథ్యంలో ఆగస్టు14 గురువారం ఖమ్మం జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు యాజమాన్య విద్యాసంస్థలు తరగతులు నిర్వహించకూడదని ఆయన స్పష్టం చేశారు.