Khammam

News August 13, 2025

ఖమ్మం నగరంలో డెంగీ పంజా..!

image

ఖమ్మం నగరంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఒక పక్క వైరల్ ఫీవర్లు.. మరోపక్క డెంగీ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సీజన్ ఆరంభంలోనే 10 కేసులు నమోదయ్యాయి. KMC అధికారులు అప్రమత్తమై 21 హట్ స్పాట్‌లు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో దోమల నివారణకు ప్రత్యేక పరిశుభ్రతా కార్యక్రమాలు చేపడుతున్నారు. సీజనల్ వ్యాధులు అడ్డుకోవాలంటే ప్రజలు వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

News August 13, 2025

ఖమ్మం: గంజాయి స్మగ్లింగ్‌.. ఇద్దరికి 20 ఏళ్ల జైలు శిక్ష

image

గంజాయిని తరలిస్తున్న ఇద్దరు నిందితులకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2 లక్షల జరిమానా విధిస్తూ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఉమాదేవి తీర్పు చెప్పారు. 2021 ఏప్రిల్ 28న జల్సాలకు అలవాటు పడిన మల్లేశ్, గడ్డం భువన్ అనే ఇద్దరు వ్యక్తులు ఖమ్మం వీవీ పాలెం వద్ద గంజాయి తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.

News August 13, 2025

ఖమ్మం: భాదితులకు భరోసాగా సఖి కేంద్రాలు: జిల్లా కలెక్టర్

image

అన్యాయానికి గురైన బాధితులకు భరోసా కేంద్రాలు రక్షణ కల్పిస్తాయని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. మంగళవారం ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని సఖి కేంద్రం, వన్ స్టాప్ సెంటర్, షీ టీమ్, భరోసా కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మహిళల రక్షణ, సమాజంలో వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో సఖి కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.

News August 13, 2025

ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశాలు

image

ఖమ్మం కలెక్టరేట్‌లో మంగళవారం విద్యా శాఖ సమావేశాన్ని నిర్వహించారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ ద్వారా టీచర్లు, విద్యార్థుల హాజరు తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. 3రోజుల్లో ఎన్‌రోల్‌మెంట్ పూర్తి చేయాలని, అధిక విద్యార్థులున్న 237పాఠశాలల్లో టీచర్ కొరత రాకుండా చూడాలని సూచించారు. యూడీఐఎస్‌సీ పోర్టల్‌ను 15రోజుల్లో అప్‌డేట్ చేయాలని, ప్రతి నెల బ్యాగ్‌లెస్ డే నిర్వహించాలన్నారు.

News August 12, 2025

లాభాల్లో దూసుకెళ్తున్న మహిళా మార్ట్

image

ఖమ్మం నగరంలోని మహిళామార్ట్ లాభాల్లో దూసుకెళ్తుంది. ఈ ఏడాది మే 28న మార్ట్ మొదలు కాగా రెండు నెలల్లోనే వ్యాపారం రూ.17 లక్షలు దాటింది. ఈ తరహా మార్ట్ రాష్ట్రంలో ఇదే మొదటిది. దీనిని గత కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ రూ.30 లక్షల సెర్ప్ నిధులతో నిర్మించారు. మార్ట్ జిల్లాలో SHG సభ్యులకు ఊతంగా మారింది. అలాగే ప్రస్తుతం వందలాది కుటుంబాలకు జీవనోపాధిని కల్పిస్తుంది.

News August 12, 2025

ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల ఆప్డేట్

image

ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లపై ప్రజలు గంపెడాశలతో ఉన్నారు. ఐదు నియోజకవర్గాలకు మొదటి విడతలో ప్రభుత్వం 16,153 ఇళ్లను మంజూరు చేసింది. ఇప్పటివరకు 12, 173 ఇళ్లకు ముగ్గుపోశారు. 6,630 బేస్‌మెంట్, 664 గోడలు, 418పై కప్పు పూర్తైయ్యాయి. 90 శాతం మందికి రూ. 61 కోట్లు వారి ఖాతాల్లో జమైనట్లు తెలిసింది. లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ, బిల్లుల మంజూరులో జాప్యం జరుగుతుందని లబ్ధిదారులు వాపోతున్నారు.

News August 12, 2025

రాజీవ్ స్వగృహ టౌన్‌షిప్ వేలానికి ప్రభుత్వం నిర్ణయం

image

గృహ నిర్మాణ శాఖ ప్రతిపాదనల మేరకు ఖమ్మం రూరల్ పోలేపల్లిలోని రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో నిర్మించిన, నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనాలను బహిరంగ వేలం వేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు, బిల్డర్లతో కలిసి బ్లాకులను పరిశీలించి, వేలం నిర్వహణకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.

News August 12, 2025

ఖమ్మం: ఉద్యోగార్థులు, ఉద్యోగులకు వారధిగా DEET

image

ఖమ్మం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు డా.పి. శ్రీజ, పి.శ్రీనివాస్ రెడ్డి.. డీఈఈటీ యాప్‌పై సోమవారం అధికారులకు అవగాహన కల్పించారు. నిరుద్యోగులు యాప్ ద్వారా రెస్యూమ్ అప్‌లోడ్ చేస్తే మార్కెట్ అవసరాలకు అనుగుణమైన అవకాశాలు లభిస్తాయని చెప్పారు. యువతకు యాప్‌పై అవగాహన కల్పించాలన్నారు. అలాగే రోడ్డు పనుల్లో మిషన్ భగీరథ పైపులు దెబ్బతినకుండా జాయింట్ సర్వే చేయాలని ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ అధికారులకు ఆదేశించారు.

News August 11, 2025

మద్యం దుకాణంలో కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

image

నేలకొండపల్లి మండలం కోనాయిగూడెంలో కరెంట్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బొడ్డు పిచ్చయ్య (54) మద్యం మత్తులో స్థానిక దుకాణం రేకులను తొలగించి మద్యం సీసా తీసుకునే ప్రయత్నం చేస్తుండగా, ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News August 11, 2025

ప్రజావాణి అర్జీలను పరిష్కరించండి: కలెక్టర్ అనుదీప్

image

ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు వేగంగా స్పందించాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న 292 సీఎం ప్రజావాణి దరఖాస్తులను, ప్రజాప్రతినిధులు సమర్పించిన 46 దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.