India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టేకులపల్లికి చెందిన సాయికుమార్, వెంకటేశ్వర్లు ఆదివారం సాయంత్రం రాయపాడు సమీపంలో గల్లంతవగా ఇవాళ వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. సాయికుమార్ మృతదేహం బంగారుచిలక సమీపాన చింతకుంట వద్ద బోడిగుట్ట వాగు వద్ద లభించింది. వెంకటేశ్వర్లు మృతదేహం కిన్నెరసాని వాగు తోక బంధాల గ్రామ సమీపాన వాగు పక్కన ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఖమ్మం మున్నేరు వరద ముంపు ప్రాంతాలను మంగళవారం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ట్రైని కలెక్టర్లతో కలిసి జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సందర్శించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు బాధితులు ఇంట్లో సర్టిఫికెట్లు కొట్టుకుపోయాయని చెప్పగా, అధైర్య పడవద్దని, సర్టిఫికెట్లు అందిస్తామని చెప్పారు. డివిజన్ వారీగా ఎక్కువ వర్కర్లను పెట్టి త్వరగా శుభ్రపరచాలని అధికారులను ఆదేశించారు.
నేడు MHBD జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈక్రమంలో పురుషోత్తమాయగూడెం శివారులోని ఆకేరువాగులో కొట్టుకుపోయిన సింగరేణి మండలం గంగారం తండాకు చెందిన యువ శాస్త్రవేత్త అశ్విని, మోతిలాల్ కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించనున్నారు. ఉ10గం.కు అశ్విని, మోతిలాల్ చిత్రపటాలకు పూలమాలవేసి సీఎం నివాళులర్పిస్తారు. కాగా వీరు HYD వెళ్తుండగా ఆకేరువాగు వరద ప్రవాహానికి గల్లంతయిన విషయం తెలిసిందే.
ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల నిర్వహణ, నిమజ్జన ఏర్పాట్లపై రెవెన్యూ, పోలీస్, పంచాయతి రాజ్, అగ్నిమాపక, విద్యుత్, మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. గణేష్ మండపాలను తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అంతకుముందు వరద బాధిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భారీ వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. నష్టపోయిన వారి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు.
భారీ వర్షాలు, వరదల కారణంగా ఖమ్మం జిల్లాలోని విద్యా సంస్థలకు రేపు సెలవు ప్రకటించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు మంగళవారం సెలవు ఇస్తూ ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఖమ్మం జిల్లాలో సోమవారం కూడా అధిక వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు కేఎంసీ కార్యాలయంలో ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ కంట్రోల్ యూనిట్ ను ఏర్పాటు చేశారు. నగరంలో వర్షాల కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తితే కాల్ సెంటర్ నంబర్లు 7901298265, 9866492029 ను సంప్రదించాలని కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచినా వెంటనే ఈ నంబర్లకు సమాచారం అందించాలన్నారు.
ఖమ్మం జిల్లా నుండి హైదరబాద్కు ఆర్టీసీ బస్సులను నడుపుతున్నట్లు రీజనల్ మేనేజర్ సరిరామ్ తెలిపారు. జిల్లాలోని ఏడు డిపోల నుండి హైదరాబాదుకు బస్సులు నడుపుతున్నట్లు ఆయన తెలిపారు. నిన్న వర్షాల కారణంగా హైదరాబాద్ రూట్ ను రద్దు చేసిన అధికారులు తిరిగి ఈ రూట్లో బస్సులను పునరుద్ధరణ చేశారు.
ఖమ్మం నగరాన్ని అతలాకుతలం చేసిన మున్నేరు వరద కాస్త శాంతించింది. నిన్న వాగు సామర్థ్యం కంటే అత్యధికంగా వరద పెరిగి 36 అడుగుల ఎత్తుకు చేరుకోవడంతో పరీవాహక ప్రాంతాలు మొత్తం నీటిలో మునిగిపోయాయి. తాజాగా నీటిమట్టం 23.50 అడుగులకు చేరింది. సుమారు 12 అడుగులు మేర తగ్గింది.
భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం ఖమ్మం జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు యాజమాన్య విద్యాసంస్థలకు జిల్లాలో నెలకొన్న తుఫాను, భారీ వర్ష పరిస్థితుల దృష్ట్యా సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.