Khammam

News August 31, 2024

సెప్టెంబర్ నెలకు సంబంధించి సదరం స్లాట్ బుకింగ్ ఓపెన్

image

ఖమ్మం జిల్లాలో సెప్టెంబర్ నెలకు సంబంధించి సదరం స్లాట్ బుకింగ్ ను ఓపెన్ చేసినట్లు జిల్లా అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కాగా దివ్యాంగులు మీసేవ సెంటర్ వద్దకు వెళ్లి సదరం క్యాంపు కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని దివ్యాంగులు గమనించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

News August 30, 2024

నీటిపారుదల ప్రాజెక్టులో రూ.14వేల కోట్ల బిల్లుల పెండింగ్: మంత్రి పొంగులేటి

image

నీటిపారుదల ప్రాజెక్టులో ఏకంగా రూ.14 వేల కోట్ల బిల్లులు పెండింగులో ఉన్నాయని రెవెన్యూ మంత్రి పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబం కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టులు కట్టి, వేల కోట్లు దోచుకుందని ఆరోపించారు. పెండింగ్ బిల్లుల్లో పారదర్శకంగా ఉన్నవాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తామన్నారు. దేవాదుల ప్రాజెక్టుపై తమ ప్రభుత్వం పూర్తి దృష్టి పెట్టిందని పేర్కొన్నారు.

News August 30, 2024

కొడుకు మరణ వార్త విని తల్లి మృతి

image

కొడుకు మరణ వార్త విని ఆ బాధను తట్టుకోలేక తల్లి మరణించిన సంఘటన శుక్రవారం చండ్రుగొండ మండలం తుంగారం గ్రామపంచాయతీ వెంగళరావు కాలనీలో చోటుచేసుకుంది. గూగుల్ సాగర్ (21) పురుగుల మందు తాగి గురువారం మరణించారు. ఈ వార్త విన్న తల్లి తట్టుకోలేక శుక్రవారం హఠాన్మరణం చెందారు. తల్లి కొడుకుల మృతి పట్ల ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News August 30, 2024

7 వ్యవసాయ మార్కెట్ కమిటీలను ప్రకటించిన మంత్రి తుమ్మల

image

7 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు చైర్ పర్సన్లను, వైస్ చైర్ పర్సన్లను, నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మహబూబ్ నగర్, వెలగటూరు, గాంధరి , సదాశివనగర్, ఎల్లారెడ్డి, నేలకొండపల్లి, మద్దులపల్లి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు.

News August 30, 2024

KTDM: సింగరేణి కార్మికులకు శుభవార్త

image

సింగరేణి కార్మికులకు యాజమాన్యం శుభవార్త చెప్పింది. సంస్థలో పనిచేస్తున్న 2,364 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దాూర్లుగా (శాశ్వత ఉద్యోగులు) క్రమబద్ధీకరిస్తున్నట్టు సంస్థ ఎండీ ఎన్.బలరామ్ తెలిపారు. సెప్టెంబరు 1వ తేదీ నుంచి వారిని జనరల్ మజూర్లుగా గుర్తించబోతున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు త్వరలోనే అధికారికంగా ఉత్తర్వులు రానున్నాయి.

News August 30, 2024

రేపు డయల్ యువర్ DM కార్యక్రమం: RM KMM

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా అన్ని డిపోల పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి డయల్ యువర్ DM కార్యక్రమం రేపు నిర్వహించాల్సిందిగా రీజినల్ మేనేజర్ సరిరామ్ ఆదేశించారు. రేపు సాయింత్రం 3 నుంచి 4 గంటల వరకు స్థానిక డిపో మేనేజర్లకు కాల్ చేసి సమస్యలను దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరారు…
ఖమ్మం: 9959225958
మధిర: 9959225961
సత్తుపల్లి: 9959225962
భద్రాచలం: 9959225960
కొత్తగూడెం: 9959225959
మణుగూరు: 9959225963

News August 30, 2024

అక్రమంగా తరలిస్తున్న 378 తాబేళ్ల పట్టివేత

image

చింతూరు మండలం లక్కవరం అటవీ ప్రాంతం నుంచి వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 378 తాబేళ్లను అటవీ అధికారులు పట్టుకొన్నారు. శుక్రవారం తెల్లవారు జామున పెట్రోలింగ్ చేస్తుండగా పట్టుకున్నట్లు సుకుమామిడి రేంజ్ ఆఫీసర్ సత్యనారాయణరావు తెలిపారు. అనంతరం ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని కేసు నమోదు చేసినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.

News August 30, 2024

ప్రైవేట్ సెక్యూరిటీ వేతనంపై డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు

image

తెలంగాణలో నాలుగు లక్షల మంది ప్రైవేట్ ఏజెన్సీలో పని చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సెక్యూరిటీ ఏజెన్సీలు అనేక మందికి ఉపాధి కల్పించడం సంతోషకరమని చెప్పారు. ఫిజికల్ సెక్యూరిటీలో పనిచేసే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కనీస వేతనం చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సెక్యూరిటీ సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.

News August 30, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మూడు రోజులు సెలవు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మూడు రోజులపాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 31, సెప్టెంబర్ ఒకటి తేదీల్లో వారంతపు సెలవులు కాగా.. సెప్టెంబర్ 2 అమావాస్య సందర్భంగా సెలవు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. తిరిగి సెప్టెంబర్ 3 నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు యథావిధిగా కొనసాగుతాయని అన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని పేర్కొన్నారు.

News August 30, 2024

పక్షవాతంతో బాధపడుతూ మహిళ ఆత్మహత్య

image

ఇల్లందు మండల పరిధిలోని నారాయణపురం గ్రామానికి చెందిన ముక్తి వీరమ్మ(55) ఆరు నెలలుగా పక్షవాతంతో బాధపడుతోంది. జీవితంపై విరక్తితో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.