Khammam

News August 5, 2025

భద్రాద్రిలో దారుణం.. యువకుడి సజీవ దహనం

image

భద్రాద్రి(D) గుండాల మండలంలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. వెన్నెలబైలుకు చెందిన పర్సిక రాజు (35) తన బైకుపై తన పొలం వద్దకు వెళ్తుండగా, బైక్‌కు హైటెన్షన్ విద్యుత్ లైన్ తీగలు తగిలాయి. దీంతో బైకుకు మంటలు చెలరేగి రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజు మృతితో కుటుంబంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి.

News August 5, 2025

BREAKING: భద్రాద్రి జిల్లాలో రైతు సజీవదహనం

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పొలం వద్దకు బైక్‌పై వెళ్తున్న ఓ రైతు విద్యుత్ తీగలు తగిలి సజీవదహనమయ్యాడు. వన్నెలబైలు గ్రామానికి చెందిన రాజు (35) తన పొలానికి బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో దారిలో వేలాడుతున్న విద్యుత్ తీగలు అతడికి తగిలాయి. విద్యుదాఘాతంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బైక్‌తో సహా రాజు అక్కడికక్కడే సజీవదహనమయ్యాడు.

News August 5, 2025

KMM: ముర్రు పాలు.. తల్లీబిడ్డకు శ్రీరామరక్ష

image

‘ముర్రు పాలు.. తల్లీబిడ్డకు శ్రీరామరక్ష’ అని వైద్యులు చెబుతున్నారు. శిశువుకు జన్మించిన వెంటనే లభించే ఈ తొలిపాలను ప్రకృతి ప్రసాదించిన మొదటి టీకాగా అభివర్ణిస్తారు. ముర్రుపాలలో పోషకాలు, యాంటీబాడీలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించి, ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది వేస్తాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న తల్లిపాల వారోత్సవాల్లో ఈ అంశాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

News August 5, 2025

ఢిల్లీకి తరలి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

image

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం బీసీ మహాధర్నాకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం తక్షణమే ఆమోదించి చట్టంగా రూపొందించాలని డిమాండ్ చేశారు. బీసీల పట్ల కేంద్రం మొండి వైఖరి ప్రదర్శిస్తుందన్నారు.

News August 5, 2025

అందుబాటులో నులిపురుగుల నివారణ మాత్రలు: DMHO

image

ఖమ్మం జిల్లాలో అవసరమైన మేర నులిపురుగుల నివారణ మాత్రలను అందుబాటులో ఉన్నాయని DMHO డా. కళావతిబాయి తెలిపారు. 1339 మంది ఆశావర్కర్లు, 1750 అంగన్వాడీ టీచర్లు, 1260  వైద్య సిబ్బంది, 1618 పాఠశాల జూనియర్ కళాశాలల ప్రతినిధులు నులి పురుగుల నివారణ కార్యక్రమంలో పాల్గోంటున్నారని చెప్పారు. ఆగస్టు 11న నులి పురుగుల నివారణ మందులు వేయాలని, ఆగస్టు 11న వేయని వారికి ఆగస్టు 18న మాప్ అప్ డే సందర్భంగా వేయాలన్నారు.

News August 5, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} తిరుమలయపాలెంలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
∆} నేలకొండపల్లి రైతు వేదికలో రైతులకు అవగాహన కార్యక్రమం
∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు
∆} బోనకల్ మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} ఖమ్మం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక ప్రజలు

News August 5, 2025

స్వాతంత్ర్య వేడుకలకు ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డితో కలిసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ప్రతి శాఖ నుంచి ప్రశంసాపత్రాల పంపిణీ కోసం నిర్దిష్టమైన సంఖ్యలో మాత్రమే దరఖాస్తులు రావాలని సూచించారు. ప్రశంసా పత్రాలు నిజంగా పనిచేసే సిబ్బందికి దక్కేలా చూడాలన్నారు.

News August 5, 2025

నులి పురుగుల నివారణకు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

నులి పురుగుల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నులి పురుగుల నివారణకు చేపట్టే అల్బెండజోల్ మందుల పంపిణీ కార్యక్రమంపై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఆగస్టు 11న జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకొని జిల్లాలో 19 సం.రాల వయస్సు లోపు ఉన్న పిల్లలందరికి తప్పనిసరిగా మాత్రలు అందించాలన్నారు.

News August 4, 2025

ప్రజావాణి దరఖాస్తులు సత్వర పరిష్కారం: కలెక్టర్

image

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరెట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. జిల్లాలో ఈ-ఆఫీస్ ద్వారా ఆన్ లైన్‌లో ఫైల్ మూమెంట్ జరగాలని అధికారులకు సూచించారు. అటు మంత్రుల పర్యటనకు జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. 

News August 4, 2025

రోడ్డు ప్రమాదాలను అరికట్టే దిశగా చర్యలు: CP

image

ఖమ్మం: రోడ్డు ప్రమాదాలను అరికట్టే దిశగా మరింత పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. సోమవారం సీపీ వీడియో కాన్ఫరెన్స్‌లో పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. నేరాలు నియంత్రణ, చోరీ సొత్తు రికవరీల్లో వేగం మరింత పెంచాలని, ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.