Khammam

News July 30, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TOP HEADLINES

image

*ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్ కార్యాలయంలో రైతు రుణమాఫీ కార్యక్రమం
*దమ్మపేట వాగులో పడి ఏడేళ్ల బాలుడు మృతి
*దుమ్ముగూడెం ఏజెన్సీలో పర్యటించిన భద్రాద్రి జిల్లా కలెక్టర్
*పార్టీ మార్పు పై క్లారిటీ ఇచ్చిన భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు
*అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలపై ప్రస్తావించిన ఎమ్మెల్యే రాగమయి
*భద్రాచలం గోదావరి వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక

News July 30, 2024

సత్తుపల్లి ఎమ్మెల్యే కుమార్తెలకు సీఎం అభినందనలు

image

తన చిత్రాన్ని గీసి బహుకరించిన సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి దయానంద్ కుమార్తెలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. కుమార్తెలు నీలోత్పల, విపంచి, విరాజీలు స్వయంగా గీసిన సీఎం చిత్రాన్ని హైదరాబాదులోని ఆయనకు అందజేశారు. వారి నైపుణ్యానికి మెచ్చిన సీఎం ప్రశంసించారు. వారివెంట మంత్రి పొంగులేటి ఉన్నారు.

News July 30, 2024

ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నాం: మంత్రి తుమ్మల

image

ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈరోజు అసెంబ్లీ ప్రాంగణంలో రుణమాఫీ రెండో విడత విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. రైతుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుందని తెలిపారు. ఏ రైతు కూడా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవద్దు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని చెప్పారు.

News July 30, 2024

కొత్తగూడెం: బాలికను వేధిస్తున్న ఉపాధ్యాయుడికి దేహశుద్ధి

image

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు కామ ముసుగులో దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకెళ్తే.. ఇల్లందు పట్టణంలోని గిరిజన వసతి గృహంలో 9వ తరగతి చదువుతున్న బాలికను ఓ ఉపాధ్యాయుడు వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో మంగళవారం సదరు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో ఉపాధ్యాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

News July 30, 2024

రుణమాఫీ చాలా సంతోషాన్ని ఇచ్చింది: డిప్యూటీ సీఎం

image

రెండో విడత రుణమాఫీ చాలా సంతోషాన్ని ఇచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నాయని మంగళవారం మీడియాతో తెలిపారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో చెప్పినట్టు మాఫీ చేస్తున్నామన్నారు. డిక్లరేషన్ ప్రకటించినప్పుడు చాలామంది అనుమానాలను వ్యక్తం చేశారన్నారు. బీఆర్ఎస్ రూ.లక్ష రుణమాఫీ నాలుగు విడతలుగా చేసిందని.. చివరి విడత సగం వదిలేసిందన్నారు.

News July 30, 2024

కన్నుల పండుగ భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 4 గంటలకే అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

News July 30, 2024

త్వరలోనే ఇంటి నుంచి ఇంటికి కార్గో సేవలు: ATM/KMM

image

కార్గో సేవలను క్షేత్రస్థాయిలో విస్తరించేందుకు TGSRTC ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇంటి నుంచి ఇంటికి లాజిస్టిక్ విభాగాన్ని అభివృద్ధి చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల ఆదేశించారు. ఈ తరహా విధానాన్ని తొలుత హైదరాబాద్‌లో ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం రీజియన్‌లో కార్గో సేవలను బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ATM(కార్గో) పవన్ తెలిపారు.

News July 30, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి పత్తి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పత్తి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ.7,200 జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత రోజు (శుక్రవారం) కంటే ఈరోజు పత్తి ధర రూ.5లు తగ్గినట్లు చెప్పారు. కాగా, వ్యవసాయ మార్కెట్లో రైతులకు అసౌకర్యం కలిగించకుండా, క్రయవిక్రయాలు జరపాలని మార్కెట్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

News July 30, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి మిర్చి ధర

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో వరుస సెలవుల అనంతరం మంగళవారం క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు క్వింటా ఏసీ మిర్చి ధర రూ.19,400 జెండా పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. గత వారం మిర్చి ధర రూ.19,300 ఉండగా ఈరోజు రూ.100 పెరిగినట్లు వ్యాపారస్థులు తెలిపారు. రైతుల తమ సరుకు మార్కెట్ తరలించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు.

News July 30, 2024

KMM: కొడుకుని PSకు తీసుకు వెళుతున్నారని గుండెపోటుతో తల్లి మృతి

image

కొడుకును పోలీసులు తీసుకెళ్తాన్నారనే భయంతో ఓ తల్లి గుండె ఆగిపోయింది. స్థానికుల కథనం ప్రకారం.. కొత్తగూడెం రామవరం 6వ వార్డులో కొందరు యువకులు మద్యం తాగుతున్నారు. అదే సమయంలో పెట్రోలింగ్‌కి వచ్చిన పోలీసు సిబ్బంది సంజయ్, అతడి స్నేహితులను తీసుకెళ్తున్నారు. అందులో చంద్రకళ కొడుకును చూసి తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలింది. బంధువులు, స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది.