Khammam

News June 30, 2024

ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు సహకరించాలి:  జిల్లా కలెక్టర్

image

ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు సహకరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో బ్యాంకర్లు, జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రైతులు తమ రుణాలను రెన్యూవల్ చేసుకునే అంశంపై వారికి అవగాహన కల్పించాలని చెప్పారు. అదే విధంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ బ్యాంకర్లు ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

News June 29, 2024

ములకలపల్లిలో బైక్ సీటు కింద నుండి పాము

image

ములకలపల్లిలో బైక్ సీటు కిందకు పాము దూరింది. శనివారం సాయంత్రం మండల కేంద్రంలో రోడ్డు పక్కన ఓ ప్రభుత్వ ఉద్యోగి తన ద్విచక్ర వాహనాన్ని నిలిపాడు. పని ముగించుకొని బైక్ వద్దకు వస్తుండగా సీటు కింది నుంచి మెల్లగా పాము బయటకు రావడం గమనించాడు. స్థానికులు వచ్చి దానిని వానకోయిల(విషరహితం)గా గుర్తించారు. తర్వాత పాము కిందకు దిగి రోడ్డు పక్కకు వెళ్లిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

News June 29, 2024

ఆ పంచాయతీలు ఎప్పటికైనా భద్రాచలంలో కలపాల్సిందే: మంత్రి తుమ్మల

image

రాష్ట్ర విభజన నేపథ్యంలో భద్రాచలం నుంచి విడిపోయి ముంపు గ్రామాల పేరుతో ఆంధ్రలో విలీనమైన 5 పంచాయతీలు తిరిగి భద్రాచలంలో కలపాల్సిందే అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. కన్నాయిగూడెం, పిచ్చుకులపాడు , ఎటపాక, పురుషోత్తమ పట్నం, గుండాల పంచాయతీలు ముంపునకు గురి కావన్నారు. అయినా పోలవరం ముంపు పేరుతో ఆంధ్రాలో విలీనం చేశారని, ఆ పంచాయతీలను ఎప్పటికైనా భద్రాచలంలో కలపాల్సిందేనని స్పష్టం చేశారు.

News June 29, 2024

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 13 మంది పదవీ విరమణ

image

TGSRTC ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజనల్ వ్యాప్తంగా ఈరోజు 13 మంది పదవీ విరమణ పొందారు. కండక్టర్, డ్రైవర్, ADC, DCగా ఆర్టీసీకి సేవ చేసినందుకు రీజనల్ మేనేజర్ వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. రిటైర్మెంట్ తర్వాత జీవితాన్ని సంతోషంగా గడపాలని వారందరికీ పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు.

News June 29, 2024

చింతూరు నదిలో గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం

image

చింతూరు మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలోని సీలేరు నదిలో శుక్రవారం సాయంత్రం ఓ బాలుడు గల్లంతైన విషయం తెలిసిందే. కాగా శనివారం మృతదేహం లభ్యమైంది. గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చిన సింకు(7) శుక్రవారం సీలేరు నదికి తోటి పిల్లలతో కలిసి వెళ్లి గల్లంతయ్యాడు. మృతదేహాన్ని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

News June 29, 2024

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నాం: డా.మాలతి

image

వర్షాకాలం వ్యాధులు వ్యాపించే సమయం ఆసన్నమైందని , జిల్లాలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు ప్రణాళికలు తయారుచేసి అమలు చేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.మాలతి తెలిపారు. ఇప్పటికే జిల్లాలో రాఫిడ్ యాక్షన్ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో మందుల కొరత లేదని అన్నారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

News June 29, 2024

నేర విచారణలో జాప్యం వహిస్తే సహించేది లేదు: ఎస్పీ

image

నేర విచారణలో జాప్యం వహిస్తే సహించేది లేదని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో నిర్వహించిన నెలవారీ సమీక్ష సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. జులై ఒకటో తేదీ నుంచి అమలు కానున్న మూడు కొత్త క్రిమినల్ చట్టాల పట్ల పోలీసు శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

News June 29, 2024

భూములు కోల్పోయిన రైతులకు అండగా ఉంటాం: మంత్రి తుమ్మల

image

జూలూరుపాడు, ఏన్కూర్ మండలంలో సీతారామ ప్రాజెక్టుకు వ్యవసాయ భూములను కోల్పోయిన రైతులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. రైతు కుటుంబాల్లో నిరుద్యోగ యువతకు ప్రైవేట్ ఉద్యోగం వచ్చే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు.

News June 29, 2024

ఖమ్మం లాడ్జిలో వ్యక్తి సూసైడ్ 

image

ఖమ్మంలోని మయూరి లాడ్జిలో ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. మహబూబాబాద్‌ జిల్లా మర్రిపేటకు చెందిన ఎర్రసాని శ్రీనివాస్‌ రెడ్డి లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాస్ రెడ్డి ఫోటో గ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. సామాజిక కార్యకర్త అన్నం శ్రీనివాసరావు మృతదేహాన్ని ఖమ్మం ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 29, 2024

డీఎస్ పార్థివ దేహానికి నివాళులర్పించిన డిప్యూటీ సీఎం

image

గుండెపోటుతో మరణించిన కాంగ్రెస్ సీనియర్ లీడర్ ధర్మపురి శ్రీనివాస్ పార్థివదేహానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం డీఎస్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదేవిధంగా డీఎస్ సేవలను డిప్యూటీ సీఎం కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు.