India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో ప్రజలు నూతన రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం అందించే పలు పథకాలు పొందాలంటే రేషన్ కార్డు ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో పథకాలకు అర్హులైనా.. రేషన్ కార్డు లేక అనర్హులుగా మగిలిపోతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. ప్రస్తుత ప్రభుత్వం త్వరలోనే రేషన్ కార్డులు జారీ చేస్తామనడంతో ఆశలు చిగురిస్తున్నాయి.
> ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
> రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్గా రాయల నాగేశ్వరరావు ప్రమాణస్వీకారం
> మణుగూరు: బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు
> ఉపాధ్యాయ బదిలీలపై ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష
> అశ్వరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే పర్యటన
> తిరుమలాయపాలెంలో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో సర్వే
> బూర్గంపాడులో విద్యుత్ సరఫరాకు అంతరాయం
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్న భర్తను ప్రియుడితో హత్య చేయించిందో భార్య. DSP షేక్ అబ్దుల్ రెహ్మాన్ ప్రకారం.. కొత్తగూడెం పట్టణం గౌతంపూర్కాలనీకి చెందిన రమేశ్కు ఈశ్వర్కుమార్(38)భార్యతో వివాహేతర సంబంధం ఉంది. విషయం తెలుసుకున్న ఈశ్వర్ భార్యతో గొడవపడే వాడు. దీంతో ప్రియుడితో కలిసి భర్త హత్యకు కుట్రపన్నింది. ఈనెల 6న ఈశ్వర్ను హత్య చేయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించగా వెలుగుచూసింది.
ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగుల బదిలీ ప్రక్రియ ఖమ్మం జిల్లాలో పారదర్శకంగా జరగాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. కలెక్టరేట్లో ఉద్యోగుల బదిలీ ప్రక్రియపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఉద్యోగ బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ బదిలీలకు అవకాశం ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. నాలుగు సంవత్సరాలు ఓకే చోట పనిచేసిన వారిని బదీలీ చేస్తామని, జూలై 9 నుండి 12 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
జాతీయ రహదారుల నిర్మాణానికి గడువులోగా భూ సేకరణ పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని సచివాలయం నుంచి రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నత స్థాయి అధికారులతో కలిసి సీఎం వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫిరెన్స్లోని ఖమ్మంలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల పాల్గొని భూ సేకరణ అంశంపై చర్చించారు.
ఆర్టీసీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైందని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లింక్లను నమ్మవద్దని ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజనల్ మేనేజర్ సరిరామ్ తెలిపారు. అధికారికంగా సంస్థ నోటిఫికేషన్ను త్వరలోనే రిలీజ్ చేస్తుందని తెలిపారు. అనవసరంగా మోసపూరిత లింకులను క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలను నమోదు చేయొద్దని సూచించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరుస ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. పొలాల దగ్గర గొడవలతో రైతులు గుండె చెడి పురుగు మందే పరమాన్నంగా భావిస్తున్నారు. కొందరు అధికారులు సైతం ఉద్యోగ విధుల్లో ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరగడం వంటి కారణాలతో ఆత్మహత్యలకు వరుస కడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వారం రోజుల వ్యవధిలోనే నలుగురు రైతులు ఆత్మహత్యకు ప్రయత్నించగా, ఇద్దరు అధికారులు సైతం ఉసురు తీసుకోవడానికి యత్నించారు.
అశ్వారావుపేట సర్కిల్లో పోలీసులను వరుసగా విషాదాలు వెంటాడుతున్నాయి. అశ్వారావుపేట ఎస్సై శ్రీనివాస్ ఆత్మహత్య ఘటనను మరువకముందే.. దమ్మపేట పోలీస్ స్టేషన్లో రెండో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న సీమా నాయక్ గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటనతో అశ్వారావుపేట సర్కిల్ పరిధిలోని పోలీసులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల కోసం చిల్లర వెతుక్కోవాల్సిన పనిలేదు అని ఇకపై ఫోన్ఫే , గూగుల్ ఫే, పేటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డు స్వైపింగ్ తదితర చెల్లింపు విధానాలతో ప్రయాణికులకు టికెట్లు జారీ చేయనున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజనల్ మేనేజర్ సరిరామ్ తెలిపారు. మరికొన్ని రోజుల్లో పూర్తిస్థాయిలో డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తోందన్నారు.
మున్సిపల్ చెత్త సేకరణ వాహనం డ్రైవర్గా పనిచేస్తున్న ఏ.కార్తీక్ (28) ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల కథనం ప్రకారం.. కొత్తగూడెం రామవరానికి చెందిన కార్తీక్ ఇల్లెందు మున్సిపాలిటీలో హరితహారంలో వర్కర్గా పనిచేస్తున్న రమేశ్ వద్ద ఉంటూ తడి, పొడి చెత్త సేకరణ వాహన డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పడుతున్న కార్తీక్.. మంగళవారం విధులు ముగించుకుని ఇంటికి వచ్చి ఉరివేసుకున్నాడు.
Sorry, no posts matched your criteria.