Khammam

News August 31, 2025

అన్నదాతను ముంచిన వర్షం

image

భారీ వర్షాలతో ఖమ్మం జిల్లాలో 3,644 ఎకరాల మేర పంటలకు నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో 33% పైగా 2,893 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని గుర్తించారు. వరి 1,950 ఎకరాలు, పత్తి 330, పెసర 613 ఎకరాల్లో నష్టపోయినట్లు తెలిపారు. అత్యధికంగా కూసుమంచి మండలంలో 1,875 ఎకరాల్లో వరి, 320 పత్తి, పెసర 160 ఎకరాల పంటను రైతులు నష్టపోయారు.

News August 31, 2025

ఖమ్మం: ‘3 నుంచి PACS ద్వారా యూరియా పంపిణీ’

image

పాలేరు నియోజకవర్గంలో రైతులకు యూరియా పంపిణీ PACS కేంద్రాలు, ఉప కేంద్రాల ద్వారానే జరుగుతుందని అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. సెప్టెంబర్ 3 నుంచి పంపిణీ ప్రారంభమవుతుందన్నారు. ప్రతి 2500 ఎకరాలకు ఒక సబ్ సెంటర్ ఏర్పాటు చేసి, వ్యవసాయ అధికారులను ఇన్‌ఛార్జిలుగా నియమించినట్టు తెలిపారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News August 30, 2025

నూతన కార్డు దారులకూ రేషన్ బియ్యం: DSM శ్రీలత

image

ఖమ్మం జిల్లాలో నూతన కార్డుదారులకు కూడా సెప్టెంబర్ నెలలో రేషన్ బియ్యం అందించనున్నట్లు సివిల్ సప్లై జిల్లా మేనేజర్ జీ.శ్రీలత తెలిపారు. నేలకొండపల్లి మండల కేంద్రంలోని మండల లెవల్ స్టాక్ పాయింట్‌ను శనివారం ఆమె ఆకస్మికంగా తనీఖీ చేశారు. ఈ సందర్భంగా గోడౌన్‌లోని బియ్యం నిల్వలను పరిశీలించి, బియ్యం దుకాణాలకు సరఫరా విషయంపై అధికారులకు పలు సూచనలు చేశారు.

News August 30, 2025

PACS ద్వారా యూరియా సరఫరాకు చర్యలు: కలెక్టర్

image

పాలేరు నియోజకవర్గంలో రైతులకు యూరియాను సక్రమంగా అందజేయడానికి PACS ద్వారా సరఫరాకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. శుక్రవారం కూసుమంచిలోని రైతు వేదికలో పాలేరు నియోజకవర్గ పరిధిలోని ప్యాక్స్ ద్వారా యూరియా సరఫరాపై ఆయన వ్యవసాయ శాఖ అధికారులు, ప్యాక్స్ డైరెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. యూరియా పంపిణీలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు.

News August 29, 2025

ఖమ్మం: రైల్వే స్టేషన్ సమస్యలపై బీజేపీ చీఫ్‌కు వినతి

image

చింతకాని మండలం నాగులవంచ రైల్వే స్టేషన్‌ ఉన్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు ఖమ్మం జిల్లా బీజేపీ నేతలు వినతిపత్రం అందజేశారు. రైల్వేస్టేషన్లో ప్రయాణికులు కూర్చోవడానికి బళ్లలు, మంచినీటి సదుపాయాలు, విద్యుత్తు లైట్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డి, తదితరులున్నారు.

News August 29, 2025

సెప్టెంబర్‌ 1 నుంచి రేషన్‌ షాపుల బంద్‌ పాటిస్తాం

image

డీలర్లకు నెలలు తరబడి పెండింగ్ ఉన్న కమీషన్‌ను ఈనెల 31వ తేదీ వరకు విడుదల చేయాలని రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బానోతు వెంకన్న, షేక్ జానీమియ కోరారు. లేనిపక్షంలో సెప్టెంబర్ 1నుంచి రేషన్ షాపులు బంద్ చేస్తామని ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. 1వ తేదీన తహసీల్ ఎదుట, 2న ఆర్డీఓ కార్యాలయాల ఎదుట, 3వ తేదీన కలెక్టరేట్ ఎదుట ధర్నా చేయడమే కాక 4న అసెంబ్లీ ముట్టడి చేపడతామని తెలిపారు.

News August 29, 2025

మాస్టర్ల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

image

పీఎం ధర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. అనంతరం 63 మంది మాస్టర్‌లకు శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. జిల్లాలో 9 మండలాల పరిధిలో 35 గ్రామాలలో అమలుచేసే గిరిజన జనాభాకు అందుబాటులో ఉన్న వనరులు పరిశీలించారు. ఇంకా ఏమేమి వసతులు కావాలో ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సూచించారు.

News August 29, 2025

ప్రభుత్వ నిబంధనల ప్రకారం దత్తత తీసుకోవాలి: కలెక్టర్

image

పిల్లలు లేనివారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాత్రమే పిల్లలను దత్తత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కేరా నిబంధనల ప్రకారం దత్తత ప్రక్రియ జరగాలని ఆయన స్పష్టం చేశారు. బంధువుల పిల్లలైనా, ఇతరుల పిల్లలైనా నిబంధనలను పాటించకుండా దత్తత తీసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టవిరుద్ధంగా పిల్లలను పెంచుకోవడం, దత్తత ఇవ్వడం లేదా తీసుకోవడం నేరమని పేర్కొన్నారు.

News August 29, 2025

ఖమ్మం: డెంగీ ఏలిషా యంత్రాల టెండర్లకు ఆహ్వానం

image

ఖమ్మం జిల్లాకు 5 డెంగీ ఏలిషా వాషర్, రీడర్ యంత్రాలను సరఫరా చేయడానికి టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు DMHO కళావతి బాయి తెలిపారు. ఆసక్తిగల సరఫరాదారులు జిల్లా కలెక్టరేట్‌లోని వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయంలో ఆగస్టు 31వ తేదీ లోపు తమ టెండర్లను సమర్పించాలని పేర్కొన్నారు. సెప్టెంబర్ 1న మధ్యాహ్నం 3 గంటలకు వాటిని ఫైనల్ చేయనున్నట్లు ఆమె వివరించారు.

News August 28, 2025

పగిడేరు వాగు వరద ఉద్ధృతిని పరిశీలించిన సీపీ

image

కొణిజర్ల మండలం లాలాపురం- తీగలబంజారా వద్ద గల పగిడేరు వాగు వరద ప్రవాహన్ని గురువారం సీపీ సునీల్ దత్ పరిశీలించారు. వరద తీవ్రతను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జలమయమైన రోడ్లు, వంతెనలు దాటే ప్రయత్నం చేయవద్దన్నారు. అత్యవసర సమయాల్లో డయల్‌ 100, 1077కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆ మార్గంలో రాకపోకలు సాగించకుండా నిరోధించాలని ఆదేశించారు.