Khammam

News July 9, 2024

నామినేటెడ్ పోస్టుల్లో ఖమ్మంకి పెద్దపీట..!

image

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడిచిన తర్వాత తొలిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా నామినేటెడ్ పదవుల నియామకాలు జరుపుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి జీవో నెంబర్ 442ను విడుదల చేసి, రెండు సంవత్సరాలు పదవుల్లో కొనసాగే విధంగా ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాకు నాలుగు పదవులు రాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఒక్క పదవి వచ్చింది.

News July 9, 2024

ఖమ్మం నగరంలో రేపు డిప్యూటీ సీఎం పర్యటన

image

ఖమ్మం నగరంలో బుధవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నట్లు స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా డిప్యూటీ సీఎం కలెక్టరేట్‌లో రైతు భరోసాపై నిర్వహించే సమావేశంలో హాజరవుతారని అన్నారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. ఈ విషయాన్ని జిల్లా అధికారులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గమనించాలని పేర్కొన్నారు.

News July 9, 2024

ఖమ్మం జిల్లాపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్  

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా భద్రాద్రి జిల్లాకు చెందిన కిన్నెరసాని, ఖమ్మం జిల్లాకు చెందిన కనకగిరి అటవీ ప్రాంతాలను చేర్చారు. కిన్నెరసాని అభయారణ్యానికి పెట్టింది పేరు. 635చ.కి.మీ.లో ఇది విస్తరించింది. కనకగిరి రిజర్వు ఫారెస్ట్ 20,923హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉంది. పాల్వంచలో త్వరలోనే సఫారీ, ట్రెక్కింగ్ ఏర్పాటు చేయనున్నారు.

News July 9, 2024

రేపు ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

image

తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాలో బుధవారం పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్‌ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 గంటలకు రఘునాథపాలెం మండలం వీ.వెంకటాయపాలెంలోని కలెక్టరేట్‌లో రైతు భరోసాపై జిల్లా స్థాయి వర్క్ షాప్‌కు హాజరవనున్నారని తెలిపారు.

News July 9, 2024

ఖమ్మం: జిల్లాలో సాగర్ కాలువలపై చోరీల కలకలం?

image

నాగార్జున సాగర్ ప్రధాన కాలువలపై ఉండే క్రాస్ రెగ్యులేటర్ల వద్ద షట్టర్లు ఎత్తేందుకు, దింపేందుకు ఉపయోగించే ఇత్తడి చక్రాలు చోరీకి గురవుతున్నాయని స్థానికులు తెలిపారు. ముదిగొండ, ఖమ్మం రూరల్ మండలాలు, తనికెళ్ల, ఏన్కూరు, కల్లూరు ప్రాంతాల్లో క్రాస్ రెగ్యులేటర్లున్నాయి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల అంతటా ఇదే పరిస్థితి నెలకొందని అధికారులు ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయగా కేసులు నమోదయ్యాయి.

News July 9, 2024

ఖమ్మం: TGSRTC ఎంప్లాయ్ వెల్ఫేర్ మెంబెర్స్‌తో RM సమావేశం

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజనల్ మేనేజర్ సరి రామ్ అన్ని డిపోల ఎంప్లాయ్ వెల్ఫేర్ మెంబెర్స్‌తో ఈరోజు సమావేశం నిర్వహించారు. డిపోలో ఉన్న సమస్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. డిపోలో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన రీజనల్ మేనేజర్‌కుTGSRTC ఎంప్లాయ్ వెల్ఫేర్ మెంబెర్స్ పూలబొకే అందజేశారు.

News July 9, 2024

ఉమ్మడి జిల్లాలో త్వరలోనే ‘రైతు భరోసా’

image

వానాకాలం పంటల నుంచే కౌలు రైతులకూ పెట్టుబడి సాయమందిస్తామని కాంగ్రెస్ సర్కారు స్పష్టం చేసింది. కౌలుదారులకు ‘రైతు భరోసా’పై మార్గదర్శకాలను త్వరలోనే రూపొందిస్తామని తెలిపింది. ఈమేరకు కౌలు రైతుల లెక్కలు తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం.. ఖమ్మం జిల్లాలో 3,42,803 మంది రైతులు, భద్రాద్రిలో 1.70 లక్షల మంది ఉన్నారు.

News July 9, 2024

సీతారాం ప్రాజెక్టు పంప్ హౌస్ కోసం చైనా ఇంజనీర్లు: మంత్రి

image

సీతారాం ప్రాజెక్టు పంప్ హౌస్ కోసం చైనా ఇంజనీర్లను రప్పిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. చైనా నుంచి ఇంజనీర్లు రాగానే వారం రోజుల్లోనే ట్రయల్ రన్ పూర్తి అవుతుందన్నారు. ఆగస్టు నెలలో గోదావరి జలాలను వైరా ప్రాజెక్ట్ కు గోదావరి జలాలు తరలింపు పూర్తి చేస్తామన్నారు. సాగర్ నుంచి నీళ్లు రాకపోయినా వైరా ప్రాజెక్ట్ , లంకాసాగర్ సత్తుపల్లి, సాగర్ కాలువలకు నీటిని పంపిస్తామన్నారు.

News July 9, 2024

భద్రాద్రి: డెంగ్యూతో డాక్టర్ మృతి

image

డెంగ్యూ వ్యాధితో డాక్టర్ మృతి చెందిన ఘటన మణుగూరు మండలంలో చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని పీవీ కాలనీకి చెందిన డాక్టర్ నాగవరపు దిలీప్ తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరారు. అక్కడ వైద్యులుపరీక్షలు నిర్వహించగా డెంగ్యూ నిర్ధారణ అయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో డాక్టర్ దిలీప్ మరణించారు.

News July 9, 2024

ఖమ్మం జిల్లాలో వరుస భూవివాదాలు

image

ఖమ్మం జిల్లాలో భూ వివాదాలకు పరిష్కారం దొరకడం లేదు. భూ వివాదం పరిష్కారం గాక, భూమిని దున్నుకోలేక , ఇతరుల చెరలో ఉన్న భూమిని విడిపించుకోలేక ఆత్మహత్య చేసుకుంటేనో లేదా ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే తప్ప పరిష్కార మార్గం దొరకదన్న భావన బలపడుతుండడం అత్యంత ప్రమాదకరం. ఈ నేపథ్యంలో జిల్లాలో వరుస ఘటనలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ క్రమంలో దీనిపై అధికారులు రైతంగానికి అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు.