Mahbubnagar

News September 24, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు !

image

❤ప్రజావాణి..సమస్యలపై ఫోకస్
❤దామరగిద్ద:చిరుత కోసం బోన్ ఏర్పాటు
❤GDWL:టీచర్లు కావాలంటూ ఆందోళన
❤ఉమ్మడి జిల్లాలో దంచి కొట్టిన వర్షం
❤WNPT: ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి కూతురు మృతి
❤రేపు U-14,17 ఫుట్ బాల్ జట్ల ఎంపిక
❤క్రీడా రంగానికి రూ.1,41,40,000 నిధులు
❤సమస్యలు పరిష్కరించండి: వ్యవసాయ విస్తరణాధికారులు
❤లేబర్ కోడ్స్ రద్దు చేయండి:CITU,IFTU
❤ప్రతి సోమవారం మండలంలో ప్రజావాణి: కలెక్టర్లు

News September 23, 2024

నవోదయలో ప్రవేశాలకు మరోసారి గడువు పెంపు

image

వట్టెం జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశం కొరకు దరఖాస్తు గడువును మరోమారు పొడిగించినట్లు మండల విద్యాధికారి రామ్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల సౌకర్యార్థం అక్టోబర్ 7వరకు పొడిగించినట్లు తెలిపారు. ఆసక్తిగలవారు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News September 23, 2024

లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: ఎస్పీ జానకి

image

కోర్టు కేసులతో రణ రంగం మాదిరి కొట్లాడే కన్నా..’జాతీయ లోక్ అదాలత్’ లో రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవటమే నయమని మహబూబ్ నగర్ ఎస్పీ జానకి సోమవారం అన్నారు. జిల్లా కేంద్రంలో ఈనెల 28న నిర్వహించబోయే జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీఎస్పీ, సీఐలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. రాజీకి అవకాశం ఉన్న కేసును జాబితాను సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు.

News September 23, 2024

వనపర్తి: రోడ్డు ప్రమాదంలో మృతులు వేరే

image

శ్రీరంగాపురం సమీపంలో ఇవాళ ఉదయం డీసీఎం, బైక్ ఢీకొన్న ఘటనలో తల్లీకూతురు మృతిచెందిన విషయం తెలిసింది. SI వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు.. నాగరాల గ్రామానికి చెందిన పురందేశ్వర్.. భార్య పిల్లలతో కలిసి బైక్‌పై శ్రీరంగాపురం వెళ్తుండగా ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో పురందేశ్వర్ భార్య స్వాతి(26), కూతురు అశ్విత(3) అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఘటనపై కేసు నమోదైంది.

News September 23, 2024

ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది: మాజీ గవర్నర్

image

నాగర్ కర్నూల్ పట్టణంలోని హిమాలయ హోటల్లో సోమవారం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ శతజయంతి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ గవర్నర్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ఉజ్వల భవిష్యత్తు ఉపాధ్యాయులపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

News September 23, 2024

బీసీలకు 56% రిజర్వేషన్లు కేటాయించాలి: మాజీ మంత్రి

image

HYDలో బీసీ రాజకీయ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కులాల వారిగా జనాభా లెక్కలు సేకరించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 56% రిజర్వేషన్లు కేటాయించాలని, బీసీలకు 90 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలుచేయాలి, కేంద్ర ప్రభుత్వం కులాలవారీగా జనాభా లెక్కలు సేకరించాలని డిమాండ్ చేశారు.

News September 23, 2024

వనపర్తి మహిళకు గిన్నిస్ బుక్ రికార్డు.. ప్రశంసలు

image

మహిళా మనోవికాస్ వ్యవస్థాపకురాలు మాధవి సూర్యభట్ల రెండోసారి గిన్నిస్ బుక్ రికార్డుకెక్కారు. మాధవి నేతృత్వంలో 450 మంది మహిళలు 58,112 క్రోంచట్ స్క్వేర్స్‌ను అతి తక్కువ సమయంలో రూపొందించి ప్రదర్శించి గిన్నిస్ బుక్ రికార్డు సాధించారు. ఈ గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన ఈ బృందంలో వనపర్తికి చెందిన మారం ప్రశాంతి ఉండటం పట్ల జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెపిపారు.

News September 23, 2024

రేపు U-14, 17 జిల్లాస్థాయి ఫుట్ బాల్ జట్ల ఎంపిక

image

జడ్చర్లలోని బాదేపల్లి జెడ్పీహెచ్ఎస్ ప్రాంగణంలో మంగళవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి అండర్-14,17 ఫుట్ బాల్ బాల, బాలికల జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి శారదాబాయి తెలిపారు. U-14 విభాగానికి 01.01.2011, U-19 విభాగానికి 01.01.2008 తర్వాత జన్మించిన వారు అర్హులని, బోనోఫైడ్, ఆధార్ కార్డు జీరాక్సులతో హాజరుకావాలని కోరారు.

News September 23, 2024

ఉమ్మడి జిల్లా నేటి వర్షపాత వివరాలు ఇలా…

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా సోమవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా యంగంపల్లిలో మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వనపర్తి జిల్లా కేతేపల్లిలో 32.5 మిల్లీమీటర్లు, మహబూబ్నగర్ జిల్లా మాచుపల్లిలో 27.5 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా ఉట్కూరులో 22.0 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా తొత్తినోన్దొడ్డిలో 13.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News September 23, 2024

మన ఉమ్మడి పాలమూరు U-19 జట్టు ఇదే!

image

మహబూబ్‌నగర్‌లోని ఎండీసీఏ మైదానంలో ఆదివారం జిల్లా క్రికెట్ సంఘం (MDCA) ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ ఆధ్వర్యంలో జట్టును ఎంపిక చేశారు. అబ్దుల్ రాఫె, మహ్మద్ షాదాబ్, అభిలాష్ గౌడ్, హెచ్.రాథోడ్, ఎండీ ముఖీత్, శశాంక్, మనోజ్, రాజు, రాంచరణ్, డి.అభినవ్, కనిష్క్, నగేశ్, వివేక్, జె.అంకిత్ రాయ్, ఎస్. అభినయ్ తేజ, చరణ్, అర్జున్, సాత్విక్ రెడ్డి, అర్షద్ అహ్మద్, జి.దినేశ్, కేవీ శ్రీహర్ష, కె.రాభి ఎంపికయ్యారు.