India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహబూబ్నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా చిన్నచింతకుంటలో 67.5 మిల్లీ మీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. మూసాపేట మండలం జానంపేట 47.3, కౌకుంట్ల 45.5, హన్వాడ 44.0, కోయిలకొండ (M) పారుపల్లి 41.3, గండీడ్ (M) సల్కర్ పేట 40.8, బాలానగర్ 37.8, మహబూబ్ నగర్ అర్బన్ 36.5 భూత్పూర్ 36.3, నవాబుపేట 31.8, మిడ్జిల్ 34.0, దేవరకద్ర 30.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
✒శిథిలావస్థలో ఉన్న ఇండ్లు, మట్టీ గోడల ఇండ్లలో ఉండరాదు.
✒అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దు.
✒తడిసిన విద్యుత్ స్థంబాలను, గోడలను తాకరాదు.
✒ఇనుప వైర్లపై బట్టలు ఆరబెట్టరాదు.
✒రైతులు బావులు, బోర్ల వద్ద స్టార్టర్, ఫ్యూజ్ బాక్స్లను తాకరాదు.
✒చిన్నపిల్లలు, ఈత రాని వారు చెరువుల్లో ఈతకు లేదా చేపల వేటకు వెళ్లరాదు.
✒వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి.
నిరంతర వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డి.జానకి విజ్ఞప్తి చేశారు. వర్షాల వల్ల వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తునందున ఏ ఆపద వచ్చిన వెంటనే లోకల్ పోలీస్ అధికారులకు లేదా డయల్-100 లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 87126 59360కు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పోలీస్ శాఖ పరంగా తగిన ఏర్పట్లతో పోలీస్ అధికారులను, సిబ్బందిని సిద్ధం చేశామన్నారు.
SHARE IT
✒గణేష్ మండపాల పూర్తి బాధ్యత మండపాల నిర్వహకులదే
✒ DJలు అనుమతి లేదు
✒మండపాల వద్ద సీసీ కెమెరాలు ఉండాలి
✒ రా.10 గంటల వరకే స్పీకర్లు
✒అసభ్యకరమైన నృత్యాలు, అన్యమతస్తులను కించపరిచే విధంగా ప్రసంగాలు/పాటలు పూర్తిగా నిషేధం
✒24 గంటలు వాలంటీర్ ఉండాలి
✒పాయింట్ పుస్తకం ఏర్పాటు చేసుకోవాలి
ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధిత పోలీసు అధికారులను లేదా Dial 100 నంబర్ను సంప్రదించాలని జిల్లా ఎస్పీ డీ.జానకి తెలిపారు.
మహబూబ్నగర్లోని బీసీ స్టడీ సర్కిల్లో GROUPS-(I, II, III, IV), RRB& SSC, బ్యాంకింగ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్లకు ఈనెల 25 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని బీసీ అభివృద్ధి అధికారిణి ఇందిర Way2Newsతో తెలిపారు. మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట విద్యార్థులకు రిజర్వేషన్, డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపికలు చేస్తామన్నారు. ఇప్పటికే దరఖాస్తుల గడువు ముగిసింది.
ఈ ఏడాదికి గాను ఓపెన్ SSC, INTERలో చేరేందుకు దరఖాస్తుల గడువు రేపటితో ముగుస్తుందని ఉమ్మడి పాలమూరు జిల్లా ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ శివయ్య Way2Newsతో తెలిపారు. ఈనెల 18లోగా (ఫైన్ లేకుండా) ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని, SSCకి 14 సం||లు, INTERకి 15 సం||ల కనీస వయసు ఉండాలన్నారు. అడ్మిషన్ అయిన వారికి ఉచిత పుస్తకాలు, తరగతులు నిర్వహిస్తామని, ఉమ్మడి జిల్లాలో SSC- 81, INTER- 107 సెంటర్లు ఉన్నాయన్నారు.
మహబూబ్నగర్ జిల్లాల్లో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా బాలానగర్ మండలం ఉడిత్యాలలో 36.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. నవాబుపేట 33.5, మిడ్జిల్ 28.0, భూత్పూర్ 16.3, కోయిలకొండ మండలం పారుపల్లి 13.0, నవాబుపేట 12.8, మహబూబ్నగర్ అర్బన్ 10.8, హన్వాడ 10.0, రాజాపూర్ 8.3, మహమ్మదాబాద్ 8.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
గడిచిన 24 గంటల్లో మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలో అత్యధికంగా మిడ్జిల్ మండలంలో 14.2 మి.మీ వర్షపాతం నమోదయింది. అత్యల్పంగా బాలానగర్ మండలంలో 0.3 మి.మీ వర్షపాతం కురిసింది. కౌకుంట్ల చిన్న చింతకుంట రాజాపూర్ మహమ్మదాబాద్ మండలాలలో ఎటువంటి వర్షపాతం నమోదు కాలేదు. నేడు రేపు కూడా జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని పాలమూరు ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం ఆమె MBNR జిల్లాలోని చిన్న చింతకుంటలో పర్యటించారు. రూ.18 లక్షల ఎంపీ నిధులతో నిర్మించనున్న రెండు కమ్యూనిటీ హాళ్ల పనులకు స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. వాల్మీకి దేవాలయం, మాతా గంగా భవాని ఆలయాల్లో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒక్కో నియోజకవర్గానికి రూ.65 లక్షల చొప్పున నిధులు అందిస్తున్నట్లు తెలిపారు.
MBNRలోని DSA స్టేడియంలో అథ్లెటిక్స్ ఎంపికలు రేపు ఉ. 9:00 గం.కు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్ చంద్ర Way2Newsతో తెలిపారు. అండర్-14, 16, 18,& 20 బాల బాలికలకు విభాగాల్లో ఎంపికలు ఉంటాయని, ఆసక్తిగల విద్యార్థులు టెన్త్ మెమో, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్తో అథ్లెటిక్ కోచ్ సునీల్ కుమార్కు రిపోర్ట్ చేయాలన్నారు. మిగతా వివరాలకు 94406 56162, 98497 06360 సంప్రదించాలన్నారు. SHARE IT
Sorry, no posts matched your criteria.