Medak

News August 18, 2025

మెదక్: హెల్ప్ డెస్క్ ద్వారా వినతుల స్వీకరణ: కలెక్టర్

image

మెదక్ కలెక్టరేట్‌లో సోమవారం జరిగే ప్రజావాణి దరఖాస్తులు హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే తీసుకోనున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. వర్షాలు, వరదల వల్ల జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో విధుల్లో నిమగ్నమై ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తమ వ్యక్తిగత, ఇతర సమస్యలపై వినతి పత్రాలు వచ్చేందుకు వచ్చే ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. కలెక్టరేట్లో డెస్క్ అందుబాటులో ఉంటుందన్నారు.

News August 18, 2025

మెదక్: అత్యధికంగా తూప్రాన్‌లో 179.5 మిమీలు

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షపాతం వివరాలు.. అత్యధికంగా ఇస్లాంపూర్‌లో 179.5 మిమీలు కురిసింది. కౌడిపల్లిలో 172.5, పెద్ద శంకరంపేటలో 165.5, దామరంచలో 160.8, మాసాయిపేటలో 148.8, శివంపేటలో 147, వెల్దుర్తిలో 143.8, కొల్చారంలో 137.5, కాళ్లకల్‌లో 130, బోడగట్టులో 126.3, నర్సాపూర్‌లో 126.3 మిమీ వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.

News August 18, 2025

మెదక్: బోనస్ డబ్బుల కోసం వేటింగ్

image

రాష్ట్ర ప్రభుత్వం సన్నాలకు బోనస్ ప్రకటించిన విషయం విధితమే. ఈ మేరకు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతులు పండించిన సన్నధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. బోనస్ నేటికీ రైతుల ఖాతాలో జమ కాలేదు. కొనుగోలు జరిపి దాదాపు 5 నెలలు గడుస్తున్నప్పటికీ బోనస్ పడకపోవడంతో రైతులు ఆందోళన గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల ఖాతాలో బోనస్ జమ చేయాలని వేడుకుంటున్నారు.

News August 17, 2025

పంచాయతీ రాజ్ అధికారులతో మంత్రి సమావేశం

image

పంచాయితీ రాజ్ శాఖ జిల్లా అధికారులతో మంత్రి దామోదర్ రాజనరసింహ సమావేశం నిర్వహించారు. అందోల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పంచాయత్ రాజ్ శాఖ అధ్వర్యంలో చేపడుతున్న నూతన రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, పునర్ నిర్మాణ పనులపై సమీక్షించారు. యుద్ధ ప్రతిపాదిక పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

News August 17, 2025

మెదక్: గణేశ్ మండపాల వివరాలు ఆన్‌లైన్ తప్పనిసరి: ఎస్పీ

image

రానున్న గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మెదక్ ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గణేశ్ మండప నిర్వాహకులు, సభ్యులు, కమిటీ సభ్యులు, పోలీస్ శాఖ వారు రూపొందించిన వెబ్సైట్ https://policeportal.tspolice.gov.in/index.htmలో వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.

News August 17, 2025

ఈనెల 19న మెదక్ స్టేడియంలో అథ్లెటిక్స్ పోటీలు

image

జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెదక్ స్టేడియంలో ఈనెల 19న ఉ.10కు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు జరుగుతాయని అధ్యక్ష, కార్యదర్శులు వెంకటరమణ, మధుసూదన్ తెలిపారు. అండర్ 14, 16, 18, 20 బాల బాలికలకు మూడు విభాగాల్లో రన్స్, త్రోస్, జెమ్స్‌లో ఈ ఎంపికలు జరుగుతాయన్నారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈనెల 31న మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలో జిల్లా తరఫున పాల్గొంటారు.

News August 17, 2025

MDK: ‘హైకోర్టు తీర్పు అమలుకు సహకరించాలి’

image

2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని SGTU రాష్ట్రశాఖ డిమాండ్ చేసింది. ఆదివారం నర్సాపూర్ ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలుచేయాలని ప్రభుత్వాన్ని కోరాలని వినతి చేశారు. రాష్ట్రశాఖ ప్రధాన కార్యదర్శి అరికెల వెంకటేశం, కార్యదర్శి సత్యం, జిల్లా అధ్యక్షుడు జింక అశోక్, ఉపేందర్, యాదగిరి, రాము పాల్గొన్నారు.

News August 17, 2025

మెదక్ జిల్లాలో వర్షపాతం అప్డేట్!

image

మెదక్ జిల్లాలో గత 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలో అత్యధికంగా టేక్మాల్ 14.8, అత్యల్పంగా తూప్రాన్‌లోని ఇస్లాంపూర్ 0.8 మిమీ వర్షపాతం రికార్డు అయింది. అటు చిప్పల్తుర్తి(నర్సాపూర్)13.3, బుజారంపేట్(కౌడిపల్లి), శివంపేట్10.0, నర్సాపూర్ 8.0, చిట్కుల్ (చిలప్ చెడ్), మనోహరాబాద్ 4.0, నాగపూర్ (హవేలి ఘనపూర్) 4.0 మిమీ వర్షపాతం నమోదైంది.

News August 17, 2025

MDK: వేడి చేసిన నీటినే తాగండి: ఈఈ

image

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు తాగునీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సీహెచ్.నాగభూషణం సూచించారు. మిషన్ భగీరథ గ్రిడ్ ద్వారా సరఫరా అవుతున్న నీరు శుద్ధి చేసి క్లోరినేషన్ అయినప్పటికీ, వర్షాల కారణంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని అన్నారు. ప్రతి ఒక్కరూ తాగునీటిని వేడి చేసి మాత్రమే తాగాలని ఆయన సూచించారు.

News August 16, 2025

మెదక్: రైతులకు డీఏవో దేవ్ కుమార్ సూచనలు

image

భారీ వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ సూచించారు. పంట పొలాల్లో నీరు నిలిచి ఉంటే కాలువల ద్వారా బయటకు పంపాలని సూచించారు. నాట్లు వేయని రైతులు వర్షాలు తగ్గిన తర్వాత నాట్లు వేసుకోవడానికి సిద్ధం కావాలని కోరారు. సమయం తక్కువగా ఉంటే వెదజల్లే పద్ధతిలో విత్తనాలు వేసుకోవచ్చని సూచించారు. అలాగే, కలుపు నివారణ చర్యలు తీసుకోవాలని రైతులకు తెలిపారు.