India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నేటి నుంచి 17 వరకు సంగ్రహణాత్మక మూల్యాంకనం-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి రాధా కిషన్ తెలిపారు. ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఈ నెల 9 నుంచి, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఈనెల 11 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. పరీక్షలు ఉదయం గం.9 నుంచి మధ్యాహ్నం గం.12 వరకు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.
SRD జిల్లా మొగుడంపల్లి మం. ధనశ్రీలో జరిగిన మహమ్మద్ అబ్బాస్ అలీ(25) <<16017699>>హత్య<<>> కేసును చిరాగ్పల్లి పోలీసులు ఛేదించారు. DSP రామ్మోహన్ రెడ్డి తెలిపిన వివరాలు.. తన తల్లిని అబ్బాస్ వేధిస్తున్నాడని ఈనెల 6న ఖలీల్ షా, తన స్నేహితుడు మమ్మద్ బిస్త్తో కలిసి హత్య చేశారు. అడ్డొచ్చిన షేక్ అక్బర్ అలీపై బాటిల్తో దాడి చేశారు. నిందితులు పారిపోతూ అటుగా వచ్చిన మరో వ్యక్తిని గన్తో బెదిరించి అతడి బైక్పై పారిపోయారు.
సిద్దిపేట జిల్లాలో బర్డ్ఫ్లూ భయం పట్టుకుంది. తొగుట మండలం కన్గల్లోని ఓ లేయర్ కోళ్ల ఫామ్లోని కోళ్లకు H5N1(బర్డ్ఫ్లూ) నిర్ధరణ కావడంతో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ప్రజలు ఆందోళన చెందొద్దని సూచించారు. బర్డ్ఫ్లూ వ్యాపించకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఫాంలోని కోళ్లను శాస్త్రీయ పద్ధతిలో భూమిలో పూడ్చివేయనున్నారు.
అల్లదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామానికి చెందిన నాయకిని సురేశ్ తన స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని కుంటలో ఎద్దులను కడగడానికి వెళ్లారు. ప్రమాదపుశాత్తు సురేష్ నీట మునిగినట్లు స్నేహితులు గ్రామస్తులకు తెలిపారు. గ్రామస్తులు అతడిని బయటకి తీసి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. కొడుకు మృతి పట్ల అనుమానం ఉందని తండ్రి నర్సింలు పోలీసులకు పిర్యాదు చేసారు. సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్కు పూర్వ వీఆర్వోలు వినతి పత్రం సమర్పించారు. వీఆర్వోలు, వీఆర్ఏలను జిపిఓలుగా తీసుకోవడానికి జారీచేసిన జీవో 129ను సవరణ చేసి పాత వీఆర్వోలను యధావిధిగా కామన్ సర్వీస్ ఇస్తూ నియామకం చేయాలని కోరారు. మెదక్లో సమావేశం నిర్వహించి 16లోగా గూగుల్ ఫారం నింపాలని జారీ చేసిన ఆదేశాలపై చర్చించారు. జీవో లోపాలను సవరిస్తూ పాత సర్వీస్ కౌంట్ చేస్తూ, యధావిధిగా తీసుకోవాలని కలెక్టర్ను కోరారు
మెదక్ జిల్లా శివంపేట మండలం బిజిలి పూర్లోని హనుమాన్ దేవాలయంలో నాగుపాము దర్శనమిచ్చింది. ఆలయంలోని శివలింగం వద్ద సుమారు గంట పాటు పడగ విప్పి నాగుపాము దర్శనం ఇవ్వడంతో గ్రామస్థులు సాక్షాత్తు శివుడు దర్శనమిచ్చాడని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంటపాటు శివుడి వద్ద పడగవిప్పి ఉండడంతో యువకులు నాగుపాము ఫోటోలు సెల్ ఫోన్లో చిత్రీకరించారు.
శామీర్పేట్లోని జీనోమ్ వ్యాలీ PS పరిధిలో లాల్గడి మలక్పేట్ హైవేపై సఫారీ కారు, డీసీఎం ఢీ కొన్నాయి. సఫారీ వాహనం సిద్దిపేట నుంచి నగరానికి వస్తుండగా డివైడర్కు తగిలి ఎదురుగా వస్తున్న డీసీఎంను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. ఏడుగురికి గాయాలయ్యాయి. మృతులు సిద్దిపేట జిల్లా వర్గల్కు చెందిన రాజు, తుర్కపల్లి పరిధి మురహరిపల్లికి చెందిన శ్రవణ్గా పోలీసులు గుర్తించారు.
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని ధనశ్రీ గ్రామంలో అబ్బాస్ (25)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన విషయం తెలిసిందే. అబ్బాస్ ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. ఆదివారం రాత్రి స్నేహితులతో విందుకు వెళ్లి గ్రామ శివారులో దాడికి గురయ్యాడు. దాడిలో అబ్బాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఎస్ఐ రాజేందర్ రెడ్డి విచారణ చేపట్టారు.
ముగ్గురు అనుమానాస్పద వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్ రెడ్డి, గౌరారం ఎస్ఐ కరుణాకర్ రెడ్డి తెలిపారు. వారిని విచారణ చేయగా రామాయంపేట నస్కల్కు చెందిన ఎధీజాజ్, సికింద్రాబాద్కు చెందిన హిదాయత్ అలీ, బాలాజీ నగర్కు చెందిన మద్దూరు లాలును అరెస్ట్ చేసి వారి నుంచి 30 బుల్లెట్లు, రివాల్వర్, సిమ్ కార్డులు, డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
భర్తతో గొడవ పడి భార్య ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నార్సింగి మండలంలోని వల్లూర్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ అహ్మద్ మోహినోద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. వల్లూరుకి చెందిన మౌనిక (30)భర్త సురేష్తో గొడవ పడి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందన్నారు. భర్త పనికి వెళ్లి వచ్చేసరికి మౌనిక ఈ దుర్ఘటనకు పాల్పడిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.