India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏడుపాయల పరిసర ప్రాంతాలను మెదక్ జాయింట్ కలెక్టర్ నగేశ్ సందర్శించి వరద పరిస్థితిని పర్యవేక్షించారు. సింగూర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో మంజీరా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఏడుపాయల అమ్మవారి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని జాయింట్ కలెక్టర్ నగేశ్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ప్రభుత్వ, ప్రైవేట్ డీఈడీ కళాశాలలలో భర్తీ కాకుండా మిగిలిపోయిన సీట్లకు స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నట్లు మెదక్ ప్రభుత్వ డైట్ ప్రిన్సిపల్ ప్రొ.డి.రాధాకిషన్ తెలిపారు. ఈనెల 19, 20 తేదీల్లో అడ్మిషన్ పొందాలన్నారు. డీసెట్-2025లో క్వాలిఫై అయిన అభ్యర్థులు డీఎల్ఈడీ, డీపీఎస్ఈ కోర్సులలో మార్గదర్శకాల ప్రకారం సంబంధిత కేటగిరిలో ఖాళీలను బట్టి ప్రవేశం పొందవచ్చని పేర్కొన్నారు.
మెదక్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొన్ని ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అత్యధికంగా శివంపేటలో 128 మిమీలు, నర్సాపూర్లో 108.8, కాగజ్ మద్దూర్లో 98.8, పెద్ద శంకరంపేటలో 89, బోడగట్టు ఈఎస్ఎస్ 74.5, కాళ్లకల్ 68 మిమీలు, మిగతా చోట్ల ఇంతకన్నా తక్కువ వర్షపాతం నమోదయింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెదక్ జిల్లాలో వెయ్యి కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆనంతరం జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మంత్రి మాట్లాడారు.
మెదక్ జిల్లా ఇంటర్మీడియట్ టాపర్ ఉప్పరి విక్రమ్కు మంత్రి వివేక్ వెంకటస్వామి నగదు పురస్కారం అందజేశారు. చిన్నశంకరంపేట మోడల్ కళాశాలకు చెందిన విక్రమ్ ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించి పురస్కారాన్ని అందుకున్నాడు. పంద్రాగస్టు వేడుకల్లో కలెక్టర్ రాహుల్ రాజు, ఎమ్మెల్యే రోహిత్ రావు సమక్షంలో మంత్రి వివేక్ రూ.10 వేల నగదు, ప్రశంసా పత్రాన్ని బహూకరించారు. ప్రిన్సిపల్ వాణీ కుమారిని కలెక్టర్ అభినందించారు.
మెదక్ జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి(డీపీఆర్ఓ) కే. రామచంద్ర రాజు జిల్లా ఉత్తమ అధికారిగా ఎంపికయ్యారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా మెదక్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర కార్మిక, ఉపాధి, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. ఏడాదికిపైగా మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ పౌర సంబంధాల శాఖ అధికారిగా ఉత్తమ సేవలు అందిస్తున్నారు.
మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకట్రావు నగర్ కాలనీలో బుధవారం పేకాట ఆడుతూ పట్టుబడ్డ ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ ఎస్పీ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. టాస్క్ఫోర్స్ పోలీసులు చేసిన దాడిలో బాగంగా పట్టుబడ్డ కానిస్టేబుల్స్ అంజనేయులు, సురేశ్పై శాఖపరమైన చర్యలో భాగంగా సస్పెండ్ చేస్తు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పోలీసులు క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
అంతర్జాతీయ పాఠశాలల వాలీబాల్ పోటీల్లో పాల్గొనేందుకు పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో మెదక్ జిల్లా జట్టు ఎంపిక చేశారు. క్రీడా సమాఖ్య మెదక్ జిల్లా(SGF) కార్యదర్శి ఆర్. నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించగా 110 మంది బాలికలు, 150 మంది బాలురు పాల్గొన్నారు. ఇందులో 8 మంది బాలురు, 8 మంది బాలికలతో జిల్లా జట్టును ఎంపిక చేశారు. క్లబ్ బాధ్యులు మధుసూదన్ రావు, డా. కొక్కొండ ప్రభు, పీడీలు మాధవరెడ్డి, శ్రీధర్ ఉన్నారు.
అత్యవసర సేవలు అందించేందుకు అందుబాటులో ఉండాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. గురువారం పెద్దశంకరంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రికార్డులు, ల్యాబ్, ఫార్మసీలను తనిఖీ చేసి, లేబర్ రూంను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. వర్షాల కారణంగా గర్భిణులను ఈడీడీకి పది రోజుల ముందు సమీప ఆస్పత్రులకు తరలించాలని ఆదేశించారు.
రేగోడ్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ సందర్శించారు. పలు ఆరోగ్య సంబంధిత రికార్డులను పరిశీలించి, ఆసుపత్రిలో జరుగుతున్న పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఫీవర్ సర్వేను నిర్వహించి డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదు కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డా.శ్వేతా, నవ్య, ప్రొ. హరిప్రసాద్ పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.