India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మెదక్ పట్టణానికి చెందిన శైలేష్ పూన గ్రూప్-1లో డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. శైలేష్కు 503.5 మార్కులతో 41వ ర్యాంకు సాధించాడు. స్వర్ణకార కుటుంబానికి చెందిన పూన రవి తనయుడు శైలేష్ మాట్లాడుతూ.. తాను ఐఏఎస్ సాధించడమే లక్ష్యమని పేర్కొన్నాడు. తల్లిదండ్రులు, కుటుంబీకులు, బంధువులు సంతోషం వ్యక్తం చేశారు.

మెదక్కు చెందిన దొంత నిశ్రిత గ్రూప్-1 ఫలితాల్లో డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికైంది. సివిల్స్ లక్ష్యంగా కోచింగ్ తీసుకున్న ఆమె టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష రాసి 502.5 మార్కులతో 47వ ర్యాంకు సాధించింది. డీఎస్పీ ఉద్యోగం సాధించడంపై నిశ్రితకు కుటుంబ సభ్యులు, బంధువులు, పట్టణవాసులు అభినందనలు తెలిపారు.
నిశ్రిత తండ్రి నరేందర్ మెదక్ జిల్లా టీఎంజీఓ అధ్యక్షుడిగా ఉన్నారు.

జిల్లాలో మొత్తం 49 మద్యం దుకాణాలు ఉండగా వాటిలో బీసీ గౌడ సామాజిక వర్గానికి 9, ఎస్సీ సామాజిక వర్గానికి 6, ఎస్టీ సామజిక వర్గానికి 1 లాటరీ ద్వారా మద్యం షాపులను కలెక్టర్ రాహుల్ రాజ్ ఎంపిక చేశారు. మిగతా 33 షాపులు ఓపెన్ క్యాటగిరీలో ఉంచినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటిండెంట్ శ్రీనివాస్ రెడ్డి, సంక్షేమ శాఖ అధికారులు విజయలక్ష్మి, జగదీష్, నీలిమ తదితరులున్నారు.

మెదక్ జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణా, విక్రయాన్ని అరికట్టేందుకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో, పోలీసులు స్వాధీనం చేసుకున్న 5 కేసుల్లో 8.150 కేజీల గంజాయిని డ్రగ్స్ డిస్పాజబుల్ కమిటీ ఆధ్వర్యంలో దహనం చేశారు.

మెదక్ జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగే POల శిక్షణ కార్యక్రమానికి విద్యాశాఖ సిబ్బంది, టీచర్లు తప్పనిసరిగా హాజరుకావాలని DPO యాదయ్య సూచించారు. ప్రిసైడింగ్ అధికారులు MEOల ద్వారా సమాచారం తెలుసుకుని హాజరుకావాలని పేర్కొన్నారు. సంబంధిత శిక్షణ కేంద్రంలోనే PO ఆర్డర్ కాపీలు అందజేయనున్నట్లు వెల్లడించారు.

నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న పండరి విధి నిర్వహణలో ఉన్న సమయంలో బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జూన్ నెలలో మరణించారు. ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో మృతుడి భార్యకు విడో కార్పస్ ఫండ్ కింద రూ.లక్ష చెక్కును ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అందజేశారు. పండరి కుటుంబ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.

26న వీరనారి చాకలి ఐలమ్మ, 27న కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఈ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత అధికారులు, కుల సంఘాల బాధ్యులు సకాలంలో హాజరుకావాలని సూచించారు.

మెదక్ జిల్లాలో వానాకాలం పంటల వివరాల నమోదు ప్రక్రియ అంతమాత్రంగానే ఉంది. ఓవైపు ధాన్యం సేకరణకు పౌరసరఫరాలశాఖ సన్నాహాలు చేస్తుండగా.. మరోవైపు వ్యవసాయశాఖ అధికారులు పంటల నమోదు కొనసాగిస్తున్నారు. ఈ సీజన్లో జిల్లావ్యాప్తంగా 3.45 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పలు రకాల పంటలు సాగుచేశారు. పంటల సీజన్ పూర్తవుతున్నా ఇప్పటి వరకు కేవలం 25 శాతం మాత్రమే డిజిటల్ క్రాప్ సర్వే అయినట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.

నెలల తరబడి రేషన్ కమీషన్ చెల్లించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ డీలర్ల జీవితాలతో చెలగాటం ఆడటం దుర్మార్గం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పేదలకు రేషన్ బియ్యం పంపిణీ చేస్తూ, వారి ఆకలి తీర్చుతున్న రేషన్డీలర్లకు.. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల తీరుతో పస్తులుండే పరిస్థితి రావడం శోచనీయం అని పేర్కొన్నారు.

స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతుండగా ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. తాము పోటీ చేయాలనుకుంటున్న స్థానం రిజర్వేషన్ అనుకూలంగా వస్తుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ పదవుల మీద కన్నేసిన వారంతా రిజర్వేషన్ల ప్రకటన కోసం నిరీక్షిస్తున్నారు. రిజర్వేషన్లు ఖరారయ్యాక రాజకీయం వేడెక్కనుంది. ఈరోజు సాయంత్రం వరకు రిజర్వేషన్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Sorry, no posts matched your criteria.