Medak

News April 6, 2026

MDK: అర్హులందరికీ సంక్షేమ పథకాలు చేరాలి: కలెక్టర్

image

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి, నివేదికలను త్వరితగతిన అందించాలని సూచించారు.

News April 6, 2026

మెదక్: ప్రజావాణిలో 98 దరఖాస్తుల స్వీకరణ

image

ప్రజావాణిలో వచ్చిన విజ్ఞప్తులకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈవో ఎల్లయ్యలతో కలిసి కార్యక్రమం నిర్వహించారు. ప్రజల సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని సూచించారు. మొత్తం 98 దరఖాస్తులు స్వీకరించారు.

News April 6, 2026

MDK: నేరుగా పోలీసులను సంప్రదించండి: డీఎస్పీ

image

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్ బాధితుల ఫిర్యాదులను స్వీకరించి, వేగంగా స్పందించి న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను వ్యక్తిగతంగా తెలుసుకుని, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలకు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైన చోట ఎస్‌హెచ్‌ఓలతో ఫోన్‌లో మాట్లాడి మార్గదర్శనం చేశారు.

News April 6, 2026

మెదక్‌లో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

image

బీజేపీ మెదక్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు వల్దాస్ మల్లేశ్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను నిర్వహించారు. ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. భారతమాత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సతీష్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్ పాల్గొన్నారు.

News April 6, 2026

మెదక్ జిల్లా భట్రాజు సంఘం అధ్యక్షునిగా మోహన్ రాజు

image

మెదక్ జిల్లా భట్రాజు సంఘం అధ్యక్షునిగా మోహన్ రాజు ఎన్నికయ్యారు. మెదక్‌లో జరిగిన సర్వ సభ్య సమావేశంలో ఎన్నికలు జరిగాయి. గౌరవ అధ్యక్షునిగా సుధాకర్ రాజు, బీవీకే రాజు, సుదర్శన్ రాజు, చంద్ర శేఖర్ రాజు, నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా వెంకట నరసింహ రాజు, కోశాధికారిగా పూర్ణ చందర్ రాజు, ఉపాధ్యక్షులుగా రాజ్ కుమార్ రాజు, రామ రాజు, కార్యదర్శులుగా పృథ్విరాజు, మోహన్ రాజు, ప్రచార కార్యదర్శిగా వికాస్ ఎన్నికయ్యారు.

News April 6, 2026

మెదక్: ఈవీ వాహనాల ప్రభావం.. తగ్గిన రిజిస్ట్రేషన్లు

image

మెదక్ జిల్లాలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో వాహనాల రిజిస్ట్రేషన్లు సుమారు 2 శాతం తగ్గినట్లు జిల్లా రవాణా అధికారి వెంకటస్వామి తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 12,058 రిజిస్ట్రేషన్లతో రూ.52.72 కోట్లు, 2024-25లో 12,210 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.53.88 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఈవీల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతుండటమే ఈ తగ్గుదలకు కారణమని తెలుస్తోంది.

News April 6, 2026

మెదక్: ఈవీ వాహనాల ప్రభావం.. తగ్గిన రిజిస్ట్రేషన్లు

image

మెదక్ జిల్లాలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో వాహనాల రిజిస్ట్రేషన్లు సుమారు 2 శాతం తగ్గినట్లు జిల్లా రవాణా అధికారి వెంకటస్వామి తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 12,058 రిజిస్ట్రేషన్లతో రూ.52.72 కోట్లు, 2024-25లో 12,210 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.53.88 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఈవీల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతుండటమే ఈ తగ్గుదలకు కారణమని తెలుస్తోంది.

News April 6, 2026

మెదక్: ఈవీ వాహనాల ప్రభావం.. తగ్గిన రిజిస్ట్రేషన్లు

image

మెదక్ జిల్లాలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో వాహనాల రిజిస్ట్రేషన్లు సుమారు 2 శాతం తగ్గినట్లు జిల్లా రవాణా అధికారి వెంకటస్వామి తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 12,058 రిజిస్ట్రేషన్లతో రూ.52.72 కోట్లు, 2024-25లో 12,210 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.53.88 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఈవీల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతుండటమే ఈ తగ్గుదలకు కారణమని తెలుస్తోంది.

News April 6, 2026

మెదక్: ఈవీ వాహనాల ప్రభావం.. తగ్గిన రిజిస్ట్రేషన్లు

image

మెదక్ జిల్లాలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో వాహనాల రిజిస్ట్రేషన్లు సుమారు 2 శాతం తగ్గినట్లు జిల్లా రవాణా అధికారి వెంకటస్వామి తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 12,058 రిజిస్ట్రేషన్లతో రూ.52.72 కోట్లు, 2024-25లో 12,210 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.53.88 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఈవీల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతుండటమే ఈ తగ్గుదలకు కారణమని తెలుస్తోంది.

News April 6, 2026

మెదక్: ఈవీ వాహనాల ప్రభావం.. తగ్గిన రిజిస్ట్రేషన్లు

image

మెదక్ జిల్లాలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో వాహనాల రిజిస్ట్రేషన్లు సుమారు 2 శాతం తగ్గినట్లు జిల్లా రవాణా అధికారి వెంకటస్వామి తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 12,058 రిజిస్ట్రేషన్లతో రూ.52.72 కోట్లు, 2024-25లో 12,210 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.53.88 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఈవీల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతుండటమే ఈ తగ్గుదలకు కారణమని తెలుస్తోంది.