Medak

News April 8, 2025

మెదక్: నేటి నుంచి పదోతరగతి మూల్యాంకనం

image

రామచంద్రపురం మండలంలోని సెయింట్ ఆర్నాల్డ్ పాఠశాలలో నేటి నుంచి నిర్వహించే టెన్త్ క్లాస్ సమాధాన పత్రాల మూల్యాంకనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన  మాట్లాడుతూ.. 1,222 మంది ఉపాధ్యాయులు  మూల్యాంకనంలో పాల్గొంటారన్నారు. టెన్త్ మూల్యాంకన కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

News April 8, 2025

ఇంటర్ వాల్యుయేషన్ పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్

image

మెదక్ బాలుర జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల వాల్యుయేషన్ కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం పరిశీలించారు. వాల్యూయేషన్ సెంటర్లో మౌలిక వసతులు గురించి సెంటర్ ఇన్‌ఛార్జ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మెదక్ జిల్లా కేంద్రంలో మొదటి సారిగా వాల్యుయేషన్ నెల రోజులుగా నడుస్తుందన్నారు. కలెక్టర్ వెంట డిఐఈఓ మాధవి ఉన్నారు.

News April 7, 2025

MDK: ఆలయాల్లో చోరీకి పాల్పడుతున్న ఇద్దరి అరెస్ట్

image

దేవాలయాలలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని గుమ్మడిదల పోలీసులు అరెస్ట్ చేశారు. జిన్నారం సీఐ నయుముద్దీన్ వివరాలు.. మెదక్ జిల్లా శివంపేట (M) శభాష్ పల్లికి చెందిన ఫయాజ్(30) సంజీవ్(27) కలిసి గుమ్మడిదల, రామ్ రెడ్డి బావి, కానుకుంట, నల్లవల్లి గ్రామాలలో రాత్రి వేళలో తిరుగుతూ ఊరి బయట ఉన్న దేవాలయాలను ఎంచుకొని హుండీలలో చోరీకి పాల్పడుతున్నట్లు చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

News April 7, 2025

మెదక్: సన్నబియ్యం పంపిణీని వేగవంతం చేయాలి: కలెక్టర్

image

రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం పాపన్నపేట పాతూరులోని పౌర సరఫరాల శాఖ గోదాంలోని నిల్వ ఉన్న బియ్యం నాణ్యతను కలెక్టర్ పరిశీలించారు. అంగన్వాడీ, హాస్టల్స్‌కు సరఫరా చేసే బియ్యం, రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీకి సంబంధించిన వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

News April 6, 2025

మెదక్: కోదండ రామాలయంలో కలెక్టర్ పూజలు

image

మెదక్ కోదండ రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జగదానంద కారకుడు, జగదభిరాముడి జీవితం సమాజానికి ఆదర్శమన్నారు. కోదండ రాముని ఆశీర్వాదంతో జిల్లా ప్రజలు ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో ఉండాలని కలెక్టర్ కోరుకున్నట్లు వివరించారు. ఆలయ ప్రధాన అర్చకులు మధుసూదనచారి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

News April 6, 2025

మెదక్: ఇద్దరు యువకుల గల్లంతు

image

మెదక్ మండలం బాలానగర్ మత్తడిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గ్రామస్థుల వివరాల ప్రకారం.. తుడుం నవీన్(21), తుడుం అనిల్(22) శనివారం సాయంత్రం స్నానానికి వెళ్లారు. ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు వెతకగా ఈరోజు ఉదయం చెరువు కట్టపై చెప్పులు, బట్టలు కనిపించాయి. దీంతో యువకుల కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.

News April 6, 2025

మెదక్: విద్యుత్ షాక్‌తో ఒకరి మృతి

image

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన ఘటన కొల్చారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ గౌస్ తెలిపిన వివరాలు.. వరిగుంతం గ్రామానికి చెందిన పోచయ్య(39) నూతనంగా నిర్మిస్తున్న ఇంటికి నీరు పడుతున్నాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో గాయాలపాలయ్యాడు. ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 6, 2025

మెదక్: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

image

విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందిన ఘటన కొల్చారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ గౌస్ తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని వరిగుంతం గ్రామానికి చెందిన పోచయ్య (39) తాను నూతనంగా నిర్మిస్తున్న ఇంటి గోడపై నీరు పడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి గాయాలపాలయ్యాడు. ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు తెలిపారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 5, 2025

మెదక్: బాలికను వేధించిన యువకుడిపై పోక్సో కేసు నమోదు

image

పదో తరగతి చదువుతున్న బాలికను ప్రేమించాలని వేధించిన వ్యక్తిపై మెదక్ రూరల్ PSలో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వివరాలు.. మెదక్ మండలానికి చెందిన విద్యార్థిని మక్తభూపతి పూర్ పాఠశాలలో పదో తరగతి చివరి పరీక్ష రాసి స్వగ్రామానికి వెళ్తోంది. ఈ క్రమంలో ఖాజిపల్లికి చెందిన అనిల్ కుమార్ తనను ప్రేమించాలంటూ వేధించాడు. అమ్మాయి తల్లి దండ్రులకు తెలపగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News April 5, 2025

మెదక్: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

జాతీయ రహదారిపై స్కూటీని లారీ ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన రామాయంపేట మండలంలో జరిగింది. ఎస్ఐ బాలరాజు తెలిపిన వివరాలు.. దేవునిపల్లి గ్రామానికి చెందిన సాకేత్ (19) గురువారం రాత్రి తన స్నేహితులతో కలిసి స్కూటీపై వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో సాకేత్ అక్కడికక్కడే మృతి చెందాడు. శుక్రవారం బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.