India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామ శివారులో ఊరి కుక్కల దాడిలో జింక మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని వెటర్నరీ డాక్టర్ ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా రామాయంపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విద్యాసాగర్ మాట్లాడుతూ.. కుక్కల దాడిలోనే జింక మృతి చెందిందని తెలిపారు. పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశామని పేర్కొన్నారు.
మాదక ద్రవ్యాలు, మత్తు పదర్థాలు, గంజాయిని పూర్తి స్థాయిలో రూపుమాపాల్సిన అవసరం ఉందని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాదకద్రవ్యాలకు విద్యార్థులు, ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తు వైపు ముందుకు సాగాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.హుస్సేన్ పాల్గొన్నారు.
గ్రామ పాలనాధికారులుగా పని చేయడానికి ఆసక్తి కలిగిన మాజీ VRO/ VRAలు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఆసక్తి, అర్హత కలిగిన వారు ఈ నెల 16 లోపు గూగుల్ ఫామ్ (https://forms.gle/AL3S8r9E2Dooz9Rc7) నందు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. స్వయంగా సంతకం చేసిన కాపీని కలెక్టర్ కార్యాలయం(సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం)లో సమర్పించాలని అన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన నిజాంపేట మండలం నార్లపూర్ గ్రామ శివారులో గురువారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్లపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ రహమాన్ బైక్పై వెళ్తూ రోడ్డుపై ఉన్న వడ్ల కుప్పను ఎక్కించి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి ఆసుపత్రి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు.
తూప్రాన్ మున్సిపాలిటీకి ప్రాపర్టీ టాక్స్ వసూళ్లలో లక్ష్యాన్ని సాధించినందుకు బెస్ట్ అప్రిసియేషన్ అవార్డు దక్కింది. ఈరోజు హైదరాబాదులో సీడీఎంఏ అధికారి చేతుల మీదుగా బెస్ట్ అప్రిసియేషన్ అవార్డును కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి అందుకున్నారు. 2024-25 సంవత్సరానికి 82.17% ప్రాపర్టీ టాక్స్ వసూలు చేశారు. అవార్డు లభించినందుకు మేనేజర్ రఘువరన్, వార్డు అధికారులు, సిబ్బందిని అభినందించారు.
ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజనతో మోడల్ సోలార్ గ్రామాన్ని గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారుల ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ ఛాంబర్లో రెడ్కో జిల్లా మేనేజర్, జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, జెడ్పి సీఈఓ ఎల్లయ్య, ఎల్డిఎం నరసింహమూర్తి, ఎస్సీ ట్రాన్స్కో శంకర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 5వేల జనాభా గల గ్రామాన్ని ఎంపిక చేయాలన్నారు.
మెదక్ జిల్లా పంచాయతీ కార్యదర్శుల నూతన కార్యవర్గం(TPSF) గ్రామ కార్యదర్శులకు సంబంధించిన వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని జేపీఎస్, ఓపిఎస్ సెక్రటరీల పెండింగ్ వేతనాలు, గ్రామ పంచాయతీలో ఖర్చు చేసిన నిధులు సహా పలు అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ రెడ్డి, టీపీఎస్ఎఫ్ జిల్లా డివిజన్ నాయకులు పాల్గొన్నారు.
బీసీలకు 42% రిజర్వేషన్ విషయమై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘ఓబిసి ఆజాదీ సత్యాగ్రహ్’ దీక్షలు మూడో రోజుకు చేరాయి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణలోని పలువురు నాయకులు దీక్షలోని నాయకులను పరామర్శించి మద్దతు ఇచ్చినట్లు బీసీ నాయకులు గంగాధర్ తెలిపారు. పార్లమెంటులో బిల్లును పాస్ చేసి షెడ్యూల్ తొమ్మిదిలో పెట్టి ఎలాంటి ఆటంకాలు లేకుండా తిరిగి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ పంపించాలని డిమాండ్ చేశారు.
నిన్నటితో పదోతరగతి పరీక్షలు ముగిశాయి. దీంతో విద్యార్థులు ఫ్రీ బర్డ్స్ లాగా తిరగాలని భావిస్తారు. కాబట్టి తల్లిదండ్రులు వారి కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు బైకులు ఇవ్వొద్దని, స్నేహితులతో చెరువులకు వెళ్లకుండా చూడాలన్నారు. వారు ఈత నేర్చుకుంటానంటే పేరెంట్సే పర్యవేక్షించాలని, మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్నారో లేదా గమనిస్తూ ఉండాలంటున్నారు.
చేగుంట మండలం చిన్న శివనూర్కి చెందిన మెదక్ సంతోష్ గౌడ్ (25) నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు సంతోష్ను నార్సింగి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లిదండ్రులు ఓ శుభకార్యం కోసం మరో ఊరికి వెళ్లగా సంతోష్ ఈ దుర్ఘటనకు పాల్పడ్డాడు.
Sorry, no posts matched your criteria.