Medak

News September 7, 2024

సిద్దిపేట జిల్లాలో దారుణం.. చెత్తకుప్పలో శిశువు

image

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. సిద్దిపేట మెదక్ రహదారి పక్కన అప్పుడే పుట్టిన శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. తిమ్మాపూర్ గ్రామ శివారులోని గోదాంల వద్ద చెత్తకుప్పలో పడవేశారు. అటుగా వెళ్తున్న స్థానికులు చూసి వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వగా.. ఆస్పత్రికి తరలించారు.

News September 7, 2024

నర్సాపూర్: చెరువులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

image

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రుస్తుంపేట గ్రామంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన అశోక్ మృతదేహం బయటపడింది. శుక్రవారం చేపల వేటకు వెళ్లిన అశోక్ చెరువులో గల్లంతయ్యారు. నర్సాపూర్ ఫైర్ సిబ్బంది కే ప్రశాంత్, నాగరాజు, మధు, రమేశ్, వెంకటేశ్‌లు చెరువులో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహం తరలించారు.

News September 7, 2024

ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎస్పీ

image

వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను, ఈద్ – మిలాద్- ఉన్ -నబీ, ఇతర పండగలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. వినాయక చవితి మండపాల నిర్వాహకులకు, పీస్ కమిటి సభ్యులకు సూచనలు చేస్తూ ఒక మతాన్ని ఇంకో మతం వారు ఆదరించుకుంటూ పండుగలు జరుపుకునే సంస్కృతి మెదక్ జిల్లాలో ఉన్నదన్నారు.

News September 6, 2024

ఉమ్మడి మెదక్ జిల్లా ఖోఖో సబ్ జూనియర్ జట్ల ఎంపిక

image

తూప్రాన్ పట్టణంలోని సెయింట్ ఆర్నాల్డ్ హైస్కూల్‌లో 9న ఉమ్మడి మెదక్ జిల్లా సబ్ జూనియర్ ఎంపిక నిర్వహిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ మహేందర్ రావు, పోచప్ప, నాగరాజు తెలిపారు. 13 నుంచి 15 వరకు ఖమ్మం జిల్లా కల్లూరు మినీ స్టేడియంలో 34 సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనే బాల బాలికల మెదక్ జిల్లా జట్ల ఎంపికలు చేపడుతున్నట్లు వివరించారు. వివరాలకు 98665 46563 సంప్రదించాలని సూచించారు.

News September 6, 2024

రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు: హరీశ్ రావు

image

తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని.. కలిసి పోరాటం చేద్దాం అని రాష్ట్ర రైతులకు హరీశ్ రావు పిలుపునిచ్చారు. రుణమాఫీ కాలేదని ఆత్మహత్య చేసుకున్న రైతు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రిలో సందర్శించారు. రుణమాఫీ కాలేదన్న కారణంతో మేడ్చల్‌కు చెందిన రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర రైతాంగం పక్షాన రాజీలేని పోరాటం చేస్తాం అని స్పష్టం చేశారు.

News September 6, 2024

రైతు సురేందర్ రెడ్డికి హరీశ్‌రావు నివాళి

image

మేడ్చల్‌లో ఆత్మహత్య చేసుకున్న దుబ్బాక రైతు సురేందర్ రెడ్డి మృతదేహానికి ఈరోజు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఎమ్మెల్యేలు హరీశ్‌రావు,సబితా ఇంద్రారెడ్డి, తలసాని, సునీతాలక్ష్మారెడ్డి, ముఠాగోపాల్, మల్లారెడ్డి నివాళులర్పించారు. బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు.కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుని,ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని కోరారు.రుణమాఫీ కాలేదన్న కారణంతో రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు.

News September 6, 2024

మట్టి విగ్రహాల వాడకంతో కుల వృత్తులకు మేలు: మంత్రి పొన్నం

image

హైదరాబాద్లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘మట్టి విగ్రహం మహా విగ్రహం మట్టి వినాయక పంపిణీ’ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అందరి జీవితాల్లో ఎలాంటి విఘ్నాలు లేకుండా శుభం కలిగేలా ఆ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం ఉండాలని అన్నారు. మట్టి విగ్రహాలు వాడడం వల్ల కుల వృత్తులు బాగుపడతాయని అన్నారు.

News September 6, 2024

MDK: విషాదం.. బ్యాంకు స్లిప్పే సూసైడ్ లెటర్..!

image

HYD మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధి అగ్రికల్చర్ కార్యాలయం ఆవరణలో ఈరోజు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామ <<14033756>>రైతు సురేందర్ రెడ్డి<<>> ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఆత్మహత్యకు గల కారణాలను ఆయన SBI బ్యాంకుకు సంబంధించిన స్లిప్పుపై రాశాడు. ‘చిట్టాపూర్ బ్యాంకులో రుణమాఫీ కాలేదు, నా చావుకు కారణం మా అమ్మ.. చిట్టాపూర్ బ్యాంకు’ అని రాసి ఉరేసుకుని చనిపోయాడు.

News September 6, 2024

విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసే హ్యాకథాన్

image

ఉద్యోగాల సాధనకు, ఇంజినీరింగ్ విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు హ్యాకథాన్ దోహదపడుతుందని టీసీఎస్ కన్సల్టెంట్ దిబికర్ పాణిగ్రాహి అన్నారు. నర్సాపూర్లోని బీవీఆర్ ఐటీ కళాశాలలో జాతీయస్థాయి 24 గంటల డీమార్ట్ హ్యాకథాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కోడింగ్ నైపుణ్యాలను ప్రామాణికంగా అంచనా వేయడానికి వచ్చిన కొత్త సాంకేతికతే హ్యాకథాన్ అన్నారు. వ్యవసాయ, ఆరోగ్య, విద్య రంగాల్లో ఉపయోగపడుతుందన్నారు.

News September 5, 2024

పంతం నెగ్గించుకున్న హరీశ్ రావు

image

సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పంతం నెగ్గించుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులకు అందించకపోవడంతో హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలు మేరకు గురువారం లబ్ధిదారులకు వాటిని పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడితే చెక్కుల పంపిణీ కోసం హైకోర్టు ఆశ్రయించాల్సి వచ్చిందని ఆయన అన్నారు.