Medak

News September 22, 2025

MDK: శరన్నవరాత్రులకు సిద్ధమైన ఏడుపాయల క్షేత్రం

image

మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల శ్రీ వన దుర్గాభవాని మాత ఆలయంలోని గోకుల్ షెడ్‌లో మండపాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం విశేష పూజలతో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. తొలిరోజు అమ్మవారికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఉదయం 10 గంటలకు పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. తొలి రోజున బాలాత్రిపురసుందరి దేవి- శైలపుత్రీదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు.

News September 21, 2025

మెదక్: ‘అమెండ్‌మెంట్ ఉత్తర్వులు ఇప్పించాలి’

image

ఇన్ సర్వీస్ టీచర్స్‌కి టెట్ నుంచి మినహాయింపు ఇచ్చే విధంగా NCTE నిబంధనలు అమెండ్ మెంట్ ఉత్తర్వులు ఇప్పించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి MLC శ్రీపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు PRTU TS విజ్ఞప్తి చేసినట్లు అసోసియేట్ అధ్యక్షుడు మల్లారెడ్డి తెలిపారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని, సర్వీస్ రూల్స్ అమలుపరిచేలా తగిన సహకారం అందించాలన్నారు.

News September 21, 2025

మెదక్: ప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ: కలెక్టర్

image

పూలను పూజించి ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక అని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ స్త్రీ శక్తిని ప్రతిబింబించే పండుగగా నిలుస్తుందన్నారు. ఈసారి చెరువులు నిండుగా ఉన్నందున బతుకమ్మలు నిమజ్జనం చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జిల్లా ప్రజలందరికీ బతుకమ్మ సంబరాల సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు.

News September 21, 2025

మెదక్: ఇళ్ల నిర్మాణాలు మొదలు పెట్టండి: పీడీ

image

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు పనులు మొదలుపెట్టాలని హౌసింగ్ పీడీ మాణిక్యం సూచించారు. జిల్లాలో 9,156 ఇళ్లు మంజూరు కాగా, 5,511 ఇళ్ల పనులు మొదలయ్యాయన్నారు. ఇందులో ఐదు పూర్తి కాగా బెస్మెంట్ లేవల్‌లో 2,408, లెంటల్ లేవల్‌లో 295, స్లాబ్ లేవల్‌లో 124 ఉన్నాయన్నారు. 2,832 ఇళ్లకు బిల్ జనరేట్ కాగా 2,500 మందికి బిల్లులు జమ అయ్యాయని వివరించారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు.

News September 21, 2025

మెదక్: ‘జిల్లా వ్యాప్తంగా 503 కొనుగోలు కేంద్రాలు’

image

జిల్లా వ్యాప్తంగా 503 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. రైతులు నాణ్యత ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు పటిష్ట కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వానాకాలం ధాన్యం కొనుగోలు కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై వ్యవసాయ, పౌర సరఫరాలు, సహకార, వ్యవసాయ అధికారులతో సమీక్షించారు.

News September 21, 2025

మెదక్: రక్షణ జాగ్రత్తలు అవసరం: ఎస్పీ

image

దసరా పండగ పురస్కరించుకొని ఊర్లకు, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ప్రజల భద్రత, ఆస్తి రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బంగారు నగలు, నగదు, విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లో భద్రపరచడం మంచిదన్నారు. ఊర్లకు బయలుదేరే ముందు పక్కింటి, నమ్మదగిన వ్యక్తులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

News September 20, 2025

మెదక్: మంత్రిని కలిసిన ఆరోగ్యశ్రీ ఆస్పత్రి ప్రతినిధులు

image

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలను యథావిధిగా కొనసాగిస్తామని, ప్రభుత్వానికి తమ పూర్తి సహకారం ఉంటుందని హాస్పిటల్స్ ప్రతినిధులు హామీ ఇచ్చారు. వారు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటళ్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

News September 20, 2025

ఏడుపాయల ఉత్సవాలకు రావాలని కలెక్టర్‌కు ఆహ్వానం

image

పాపన్నపేట మండలం ఏడుపాయలలో కొలువైన శ్రీ వనదుర్గ భవాని మాత దేవస్థానంలో ఈనెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు హాజరు కావాలని కలెక్టర్ రాహుల్ రాజ్‌ను ఏడుపాయల ఆలయ కార్యనిర్వహణధికారి చంద్రశేఖర్ రెడ్డి, ఆలయ సిబ్బంది శ్రీనివాస్, ప్రధాన పూజారి శంకర్ శర్మ ఆహ్వానించారు. వేదపండితులు ఆశీర్వదించారు.

News September 20, 2025

మెదక్ పోలీస్ పరేడ్.. అదనపు ఎస్పీ సమీక్ష

image

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన పరేడ్‌కు అదనపు ఎస్పీ మహేందర్ హాజరయ్యారు. పోలీసుల క్రమశిక్షణ, శారీరక దారుఢ్యం, డ్రెస్ కోడ్‌ను ఆయన సమీక్షించారు. పరేడ్‌లు సిబ్బందిలో ఫిట్‌నెస్, క్రమశిక్షణ, టీమ్ స్పిరిట్‌ను పెంచుతాయని పేర్కొన్నారు.

News September 20, 2025

వారంలోనే అన్నదమ్ముల మృతి.. నిజాంపేటలో విషాదం

image

తమ్ముడి మరణం తట్టుకోలేక అన్న గుండెపోటుతో మరణించిన ఘటన నిజాంపేట మండలంలో విషాదం నింపింది. 15 రోజుల క్రితం మహమ్మద్ జాన్ మియా(87) చనిపోగా, ఆ బాధతో ఆయన అన్న మహమ్మద్ షాబుద్దీన్(90) శుక్రవారం మృతి చెందారు. వీరి మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.