Medak

News August 14, 2025

మెదక్: ‘టీచర్ల నిబద్ధతతో పాఠశాలల్లో నూతన ఉత్సాహం’

image

FRS విధానం అమలుతో సమయపాలనలో క్రమశిక్షణ మరింత బలపడిందని డీఈవో రాధాకిషన్ తెలిపారు. టీచర్లు సమయానికి హాజరై, పాఠశాల సమయం ముగిసే వరకు నిబద్ధతతో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. FRS యాప్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలను 3, 4 రోజుల్లో పూర్తిస్థాయిలో పరిష్కరించనున్నట్టు DEO వెల్లడించారు. ఈ విధానం ద్వారా పాఠశాలల్లో పనితీరు, విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడుతున్నాయని తెలిపారు.

News August 14, 2025

సిద్దిపేట: రియల్ హీరో.. ప్రాణాలకు తెగించి విద్యుత్ పునరుద్ధరణ

image

సిద్దిపేటలోని నాగసముద్రం చెరువు మధ్యలో తెగిపోయిన లైన్‌ను పునరుద్ధరించేందుకు లైన్మెన్ హైముద్దీన్ సాహసం చేశాడు. తాడు సాయంతో చెరువు మధ్యలోకి వెళ్లి స్తంభం ఎక్కి కనెక్షన్ ఇచ్చి విద్యుత్‌ని పునరుద్ధరించారు. హైముద్దీన్ ధైర్య సాహసాన్ని మెచ్చి స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు.

News August 13, 2025

మెదక్: క్రీడల్లో ఉద్యోగుల ఉత్తమ ప్రతిభ: కలెక్టర్

image

మెదక్ జిల్లా కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని యువజన క్రీడల నిర్వహణ శాఖ నిర్వహించిన క్రీడల్లో ఉద్యోగులు ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. క్రీడల్లో పాల్గొని క్రీడాకారులను ఉత్తేజపరిచారు. క్రీడల్లో 1090 మంది ఉద్యోగులు నమోదు చేసుకున్నట్లు వివరించారు. ఆర్డీవో రమాదేవి, యువజన క్రీడల నిర్వహణ అధికారి దామోదర్ రెడ్డి పాల్గొన్నారు.

News August 13, 2025

మెదక్: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు మంత్రి వివేక్

image

మెదక్ జిల్లా కేంద్రంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామిని నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం సూచించింది. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో వేడుకల కార్యక్రమంలో జాతీయ పతాక ఆవిష్కరణ, గౌరవ వందనం, సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయన్నారు.

News August 13, 2025

మెదక్: అవార్డులలో అవకాశం కల్పించాలని కలెక్టర్‌కు వినతి

image

జనవరి 26, పంద్రాగస్టు 15కు ఇచ్చే అవార్డులలో అవకాశం కల్పించాలని నాల్గవ తరగతి పంచాయతీ రాజ్ ఉద్యోగుల సంఘం కలెక్టర్ రాహుల్ రాజ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. పంచాయతీరాజ్ 4వ తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు సామ్యూల్, వెంకటేశం, మహమ్మద్ కురిషీద్, దుబా రాజమ్మ, సుజాతలు కలిసిన వారిలో ఉన్నారు. ప్రభుత్వ వివిధ శాఖలో పనిచేసే సిబ్బందికి సర్టిఫికెట్లు ఇచ్చినట్లు తమను గుర్తించాలని కోరారు.

News August 13, 2025

‘మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మెదక్‌ను చేయాలి’

image

మెదక్‌ను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ నగేశ్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్లో నషా ముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవం పురస్కరించుకొని జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞను చేయించారు. విద్యాశాఖ అధికారి రాధా కిషన్, ఎస్సీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి, బీసీ సంక్షేమ అధికారి జగదీశ్, జమల నాయక్, సీడీపీఓ హేమ భార్గవి ఉన్నారు.

News August 13, 2025

మెదక్: నషా ముక్త భారత్ అభియాన్

image

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నషా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. నషా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం పురస్కరించుకొని మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞను చేయించారు. అదనపు ఎస్పీ మహేందర్, పోలీస్ అధికారులు, DPO సిబ్బంది పాల్గొన్నారు.

News August 13, 2025

మెదక్: 3 రోజులలో నివేదికలు సమర్పించాలి: కలెక్టర్

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలలో సౌర విద్యుత్ ఏర్పాటుకు 3 రోజులలో నివేదికలు సమర్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ నగేశ్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఆర్డీవోలు రమాదేవి, జయచంద్ర రెడ్డి, మహిపాల్ రెడ్డి, డీఎం రెడ్ కో రవీందర్ చౌహన్, జిల్లా అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, వసతి గృహాలు, గురుకులాలలో సౌర విద్యుత్ ప్లాంట్ ఉండాలన్నారు.

News August 13, 2025

మెదక్: బాధితులకు అండగా భరోసా సెంటర్: ఎస్పీ

image

లైంగికదాడికి గురైన బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటి నుంచి కేసు ట్రయల్, పరిహారం ఇప్పించేంతవరకు భరోసా సెంటర్ అండగా నిలుస్తుందని ఎస్పీ శ్రీనివాస్ రావు అన్నారు. మెదక్ పట్టణంలో గల భరోసా కేంద్రాన్ని ఏఎస్పీ మహేందర్‌తో కలిసి సందర్శించారు. లైంగిక, భౌతిక దాడులకు గురైన బాధితులకు భరోసా సెంటర్లో కల్పించే న్యాయ సలహాలు, సైకలాజికల్ కౌన్సెలింగ్, వైద్య పరంగా తీసుకుంటున్న చర్యలు, మహిళల కేసులపై అరా తీశారు.

News August 12, 2025

మెదక్: అధిక వర్షాలపై కలెక్టర్ సమీక్ష

image

అధిక వర్షాలపై కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులతో సమీక్షించారు. రానున్న 72 గంటల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో తగు ఆదేశాలు జారీ చేశారు. అధిక వర్షాలు వల్ల జిల్లాలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు పలు సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ నగేశ్ తదితరులు పాల్గొన్నారు.