Medak

News September 5, 2024

పంతం నెగ్గించుకున్న హరీశ్ రావు

image

సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పంతం నెగ్గించుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులకు అందించకపోవడంతో హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలు మేరకు గురువారం లబ్ధిదారులకు వాటిని పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడితే చెక్కుల పంపిణీ కోసం హైకోర్టు ఆశ్రయించాల్సి వచ్చిందని ఆయన అన్నారు.

News September 5, 2024

పుల్కల్: సింగూరు ప్రాజెక్టు భద్రమేనా..?

image

మంజీరా నదిపై నిర్మించిన సింగూరు ప్రాజెక్టు భద్రత పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండలం సింగూరులో 50 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ రిజర్వాయర్‌కు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు వాపోతున్నారు. తాజా వర్షాలతో భారీగా వరద నీరు పోటెత్తుతోంది. 29.917 టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్‌లో ప్రస్తుతం 27 టీఎంసీలకు చేరడంతో ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.

News September 5, 2024

పుల్కల్: సింగూరు ప్రాజెక్టు భద్రమేనా..?

image

మంజీర నదిపై నిర్మించిన సింగూరు ప్రాజెక్టు భద్రత పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండలం సింగూరులో 50 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ రిజర్వాయర్‌కు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు వాపోతున్నారు. తాజా వర్షాలతో భారీగా వరద నీరు పోటెత్తుతోంది. 29.917 టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్‌లో ప్రస్తుతం 27 టీఎంసీలకు చేరడంతో ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.

News September 5, 2024

MDK: మీ ఫేవరెట్ టీచర్ ఎవరు..? కామెంట్ చేయండి!

image

విద్యార్థుల్లో విజ్ఞాన వెలుగులు నింపుతూ, వారు ఉన్నత స్థాయికి చేరేలా నిరంతరం కృషి చేసే వారే గురువులు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లోని అన్ని విద్యాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సీనియర్ విద్యార్థులు టీచర్లుగా మారి జూనియర్లకు పాఠాలు బోధిస్తూ సందడి చేస్తున్నారు. మరి.. మీ ఫేవరేట్ టీచర్ ఎవరో కామెంట్ చేయండి. SHARE IT

News September 5, 2024

సిద్దిపేట: అనుమానిస్తున్నాడని భర్తను చంపేసింది

image

మద్దూరు మం. రేబర్తికి పరమేశ్వర్‌(40), భారతి దంపతులకు కొడుకు, కుమార్తె ఉన్నారు. HYDకి వల వచ్చి పరమేశ్వర్‌ డ్రైవర్‌గా, భారతి ప్రైవేటు జాబ్ చేస్తున్నారు. పరమేశ్వర్‌ నిత్యం భార్యను అనుమానిస్తూ వేధింపులకు చేయడంతో మాదాపూర్‌ PSలో పలుమార్లు ఫిర్యాదు చేసింది. ఈనెల 1న రాత్రి గొడవ జరగ్గా తల్లి, కుమారుడు కలిసి పరమేశ్వర్‌ తలపై కొట్టి చంపారు. ఈ విషయం కుమార్తె బంధువులకు చెప్పడంతో దారుణం బయటకొచ్చింది.

News September 5, 2024

మెదక్: ఇల్లు కూలి నిరాశ్రయులైన తల్లీకూతురు

image

రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇల్లు కూలిపోవడంతో నిరుపేద కుటుంబం నిరాశ్రయులుగా మారారు. గ్రామానికి చెందిన మల్లుపల్లి అనసూయ భర్త చనిపోగా ఒక కూతురుతో ఇంట్లో నివాసం ఉంటుంది. భారీ వర్షాలకు ఇల్లు కుప్పకూలడంతో ఇద్దరు నిరాశ్రయులయ్యారు. దాతలు ఎవరైనా ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వం సొంత ఇంటి నిర్మాణానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

News September 5, 2024

మెదక్ 53, సంగారెడ్డి 121, సిద్దిపేట 48 మంది ఉత్తమ టీచర్లు

image

ఉమ్మడి జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక చేశారు. వీరికి ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు జిల్లా కలెక్టరేట్లలో వారికి అవార్డులు, ప్రశంసా పత్రాలను అందజేయనున్నారు. వివిధ క్యాటగిరిల్లో కలిపి మెదక్ జిల్లాలో మొత్తం 53 మంది, సంగారెడ్డి జిల్లాలో 121, సిద్దిపేట జిల్లాలో 48 మందిని ఉత్తమ టీచర్లుగా ఎంపిక చేసినట్లు ఆయా జిల్లాల డీఈవోలు తెలిపారు.

News September 5, 2024

విద్యా వైద్యం పర్యవేక్షణకు టాస్క్‌ఫోర్స్: మంత్రి రాజనర్సింహ

image

పేదవాడికి ప్రాథమిక హక్కుగా అందాల్సిన విద్యా, వైద్యంపై జిల్లాస్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. బుధవారం మెదక్ కలెక్టరేట్లో మాట్లాడుతూ.. జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలన్నారు. అ భూ సమస్యల పరిష్కారానికి గ్రామస్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామన్నారు. జిల్లావ్యాప్తంగా ట్రామ, డయాలసిస్ కేంద్రాలు, నూతన మండలాల్లో PHCలు ఏర్పాటు చేయాలన్నారు.

News September 4, 2024

విద్య, వైద్యం పర్యవేక్షణకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు: మంత్రి దామోదర్

image

పేదవాడికి ప్రాథమిక హక్కుగా అందాల్సిన విద్యా, వైద్యంపై జిల్లాస్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. బుధవారం మెదక్ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అన్ని శాఖలపై సుదీర్ఘంగా సమీక్షించినట్లు తెలిపారు. త్వరలో మెదక్లో సిటీ స్కాన్‌తో పాటు మరో డయాలసిస్ కేంద్రం మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

News September 4, 2024

సంగారెడ్డి: ‘టీచర్లకు బోధనేతర పనులు అప్పగించొద్దు’

image

ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించవద్దని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని బీసీ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులను పూర్తిగా బోధనకు పరిమితం చేస్తే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. గురుకుల పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు టైం టేబుల్ అమలు చేయాలని కోరారు.