India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెదక్ జిల్లా కేంద్రంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామిని నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం సూచించింది. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో వేడుకల కార్యక్రమంలో జాతీయ పతాక ఆవిష్కరణ, గౌరవ వందనం, సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయన్నారు.
జనవరి 26, పంద్రాగస్టు 15కు ఇచ్చే అవార్డులలో అవకాశం కల్పించాలని నాల్గవ తరగతి పంచాయతీ రాజ్ ఉద్యోగుల సంఘం కలెక్టర్ రాహుల్ రాజ్ను కలిసి విజ్ఞప్తి చేశారు. పంచాయతీరాజ్ 4వ తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు సామ్యూల్, వెంకటేశం, మహమ్మద్ కురిషీద్, దుబా రాజమ్మ, సుజాతలు కలిసిన వారిలో ఉన్నారు. ప్రభుత్వ వివిధ శాఖలో పనిచేసే సిబ్బందికి సర్టిఫికెట్లు ఇచ్చినట్లు తమను గుర్తించాలని కోరారు.
మెదక్ను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ నగేశ్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్లో నషా ముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవం పురస్కరించుకొని జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞను చేయించారు. విద్యాశాఖ అధికారి రాధా కిషన్, ఎస్సీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి, బీసీ సంక్షేమ అధికారి జగదీశ్, జమల నాయక్, సీడీపీఓ హేమ భార్గవి ఉన్నారు.
మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నషా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. నషా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం పురస్కరించుకొని మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞను చేయించారు. అదనపు ఎస్పీ మహేందర్, పోలీస్ అధికారులు, DPO సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలలో సౌర విద్యుత్ ఏర్పాటుకు 3 రోజులలో నివేదికలు సమర్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ నగేశ్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఆర్డీవోలు రమాదేవి, జయచంద్ర రెడ్డి, మహిపాల్ రెడ్డి, డీఎం రెడ్ కో రవీందర్ చౌహన్, జిల్లా అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, వసతి గృహాలు, గురుకులాలలో సౌర విద్యుత్ ప్లాంట్ ఉండాలన్నారు.
లైంగికదాడికి గురైన బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటి నుంచి కేసు ట్రయల్, పరిహారం ఇప్పించేంతవరకు భరోసా సెంటర్ అండగా నిలుస్తుందని ఎస్పీ శ్రీనివాస్ రావు అన్నారు. మెదక్ పట్టణంలో గల భరోసా కేంద్రాన్ని ఏఎస్పీ మహేందర్తో కలిసి సందర్శించారు. లైంగిక, భౌతిక దాడులకు గురైన బాధితులకు భరోసా సెంటర్లో కల్పించే న్యాయ సలహాలు, సైకలాజికల్ కౌన్సెలింగ్, వైద్య పరంగా తీసుకుంటున్న చర్యలు, మహిళల కేసులపై అరా తీశారు.
అధిక వర్షాలపై కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులతో సమీక్షించారు. రానున్న 72 గంటల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో తగు ఆదేశాలు జారీ చేశారు. అధిక వర్షాలు వల్ల జిల్లాలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు పలు సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ నగేశ్ తదితరులు పాల్గొన్నారు.
రసాయన, ఔషధ పరిశ్రమలలో ప్రమాదాలు సంభవించకుండా తనిఖీలు నిర్వహించి నివేదికలు సమర్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఫ్యాక్టరీలు, రసాయన పరిశ్రమల్లో భద్రతపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. గత జూన్ 30న సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో సంభవించిన అతిపెద్ద విస్ఫోటనాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు.
ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవర్చుకోవాలని జిల్లా గ్రంథాలయాల సంస్థ ఛైర్ పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి
సూచించారు. నర్సాపూర్ శాఖ గ్రంథాలయంలో నేషనల్ లైబ్రరి డే నిర్వహించారు. ఫాదర్ ఆఫ్ లైబ్రరి సైన్స్గా పిలిచే పద్మశ్రీ S.R రంగనాధన్ జయంతి సంధర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మెదక్-కామారెడ్డి జిల్లా సరిహద్దుల్లో గల పోచారం ప్రాజెక్టు నీటిమట్టం మంగళవారం ఉదయం 20 అడుగులకు చేరింది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా కామారెడ్డి, లింగంపేట, గాంధారి నుంచి వస్తున్న వాగులు పారడంతో ప్రాజెక్టులోకి నీరు చేరుతుంది. ఓవర్ ఫ్లో కావడానికి మరో అర అడుగు దూరంలో ఉంది. 20.5 అడుగుల నీరు వస్తే ప్రాజెక్టు ఓవర్ ఫ్లో కానుంది. ప్రాజెక్ట్ నిండుకోవడంతో పర్యాటకుల సందడి నెలకొంది.
Sorry, no posts matched your criteria.