India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏడుపాయల వన దుర్గాభవాని మాత ఆలయ హుండీని దేవాదాయ, ధర్మాదాయ శాఖ సమక్షంలో శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ సభ్యులు, ఆలయ సిబ్బంది సోమవారం లెక్కించారు. గడిచిన 46 రోజుల హుండీని లెక్కించగా రూ.26,59,009 ఆదాయం సమకూరింది. దేవదాయ శాఖ స్పెషల్ ఆఫీసర్ సులోచన, ఈఓ చంద్రశేఖర్, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. స్థానిక ఎస్సై శ్రీనివాస్ గౌడ్, సిబ్బంది ఆధ్వర్యంలో పర్యవేక్షణ కొనసాగింది.
జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టరే నగేష్ సూచించారు. సోమవారం మెదక్ కలెక్టరేట్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామంతపూర్లో 2025 -26 విద్యా సంవత్సరానికి 1వ తరగతి(ఇంగ్లీష్ మీడియం)లో ప్రవేశం కోసం లక్కీ డ్రా తీశారు.
పాపన్నపేట తహసీల్దార్ కార్యాలయంను మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం సందర్శించారు. భూభారతి దరఖాస్తులను పరిశీలించారు. ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్లో ఉన్నాయో తదితర వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తగు సూచనలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నమూనా భవనాన్ని పరిశీలించి, త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. తహశీల్దార్ సతీష్ కుమార్ తదితరులు ఉన్నారు.
వెల్దుర్తి పోలీస్ స్టేషన్ను సోమవారం మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లో నమోదు అవుతున్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలు రికార్డులను తనిఖీ చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టాలని, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల శ్రేయస్సు కోసం కీలక నిర్ణయం తీసుకుంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి SSC పబ్లిక్ పరీక్షల్లో 20% ఇంటర్నల్, ఎక్స్టర్నల్ 80% మార్కులు మూల్యాంకనానికి కేటాయించే విధానం కొనసాగనున్నట్లు DEO రాధాకిషన్ తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి యోగితా రాణి ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షా విధానంలో విద్యార్థులల్లో సమతుల్యతను తీసుకొస్తుందని పేర్కొన్నారు.
భవిత కేంద్రం రూపురేఖలు మార్చి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్ భవితా కేంద్రాన్ని DEO రాధా కిషన్తో కలిసి కలెక్టర్ సోమవారం సందర్శించారు. ముందుగా భవిత కేంద్రంలో విద్యార్థులకు అందుతున్న ఫిజియోథెరపీ, సౌకర్యాలను నిర్వాహకులు అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగ పిల్లల్లో సామర్థ్యాలు పెంచేందుకు భవిత కేంద్రాలు దోహదపడతాయన్నారు.
మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్కు ఓ దివ్యాంగురాలు రాఖీ కట్టింది. ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా ఓ దివ్యాంగురాలు వచ్చి తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరులో నెలకొన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి ఆమె తీసుకెళ్లారు. వెంటనే కలెక్టర్ స్పందించి నిబంధనలు, అర్హతలు పరిశీలించాలని డీఎల్పీఓను ఆదేశించారు. అనంతరం ఆమె రాఖీ కట్టేందుకు రాగా కలెక్టర్ కుర్చీలోంచి లేచి వచ్చి రాఖీ కట్టించుకున్నారు.
విద్యార్థుల శారీరక, మానసిక ఎదుగుదలను నిరోధించే నులి పురుగులను నిర్మూలించడమే లక్ష్యమని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్బంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల/ కళాశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. నులిపురుగులు చేరితే రక్తహీనత, ఆకలి మందగించడం, విరోచనాలు, బరువు తగ్గడం సమస్యలు ఎదురవుతాయన్నారు. జిల్లాలో 2,11,964 మందికి మాత్రలు వేస్తారు.
మెదక్ జిల్లాలో గత 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కౌడిపల్లి 25.0, చిలిప్ చెడ్ 19.5, మెదక్ (RDO ఆఫీస్)16.8, లక్ష్మాపూర్ ESS (రామాయంపేట) 12.5, చిప్పల్తుర్తి (నర్సాపూర్) 8.8, రామాయంపేట 7.8, బోడగట్ ESS (టేక్మాల్) 7.0, అల్లాదుర్గ్ 4.3, మిన్పూర్ ESS (పాపన్నపేట) 2.8, రాజ్పల్లి (మెదక్) 2.8, చేగుంట 2.0 మిమీ వర్షపాతం నమోదైంది.
మెతకుసీమను వర్షాలు మురిపించాయి. నిన్నటి వరకు లోటు వర్షపాతంలో ఉండగా నేడు సాధారణానికి మించి నమోదైంది. సాగుకు మరో వారం మాత్రమే గడవు ఉండగా రైతులు ముమ్మర నాట్లు వేస్తున్నారు. గడిచిన రెండు నెలల్లో లోటు వర్షపాతం నమోదుకాగా, గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోటును దాటేసింది. నిన్నటి వరకు 387 మిమీ వర్షం కురవాల్సి ఉండగా నేటికి 400 మిమీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలు సాగుకు జీవం పోశాయని రైతులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.