India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెదక్ మండలం మాచవరం ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలుగా వై. సుకన్య శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. హవేలిఘనపూర్ మండలం కూచన్పల్లి ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేసిన ఆమె పదోన్నతిపై వెళ్లారు. అయితే ర్యాలమడుగు గ్రామానికి చెందిన సుకన్య మాచవరం పాఠశాలలోనే చదువుకున్నారు. అదే పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు చేపట్టడం విశేషం.
పనుల జాతరను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. శుక్రవారం హవేలిగణపూర్ మండలం చౌట్లపల్లిలో పనుల జాతర నిర్వహించారు. మండల స్పెషల్ ఆఫీసర్ విజయ లక్ష్మి, ఎంపీడీఓ ఏపీఓ, గ్రామస్థులు పాల్గొన్నారు. ఆసక్తి గల లబ్దిదారులు పశువుల కొట్టాలు, వ్యక్తిగత సోక్ పిట్ల కోసం దరఖాస్తులను అందజేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు(నరేగ) పనుల జాతరలో అర్హులైన వారందరూ తప్పనిసరిగా పాల్గొనాలన్నారు.
మెదక్ ఆర్టీసీ డిపోలో శనివారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మెదక్ ఆర్టీసీ డిపో మేనేజర్ సురేఖ శుక్రవారం తెలిపారు. రేపు ఉదయం11 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రయాణికులు తమ సందేహాల నివృత్తికి 7842651592 నంబర్కు కాల్ చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సౌకర్యాలపై సలహాలు, సూచనలు ఇవ్వవచ్చని డీఎం పేర్కొన్నారు.
మెదక్ జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉన్నందున్న పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు ఇతర కార్యక్రమలు చేపడితే కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దుష్ప్రచారం, ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధమైన పోస్టులు పెట్టేవారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల గడువును ఈనెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా ఇంటర్ అధికారి మాధవి తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు నేరుగా తమకు నచ్చిన కళాశాలలకు వెళ్లి దరఖాస్తులు చేసుకోవచ్చని ఆమె సూచించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ కళాశాలలో నాణ్యమైన విద్యతో పాటు మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని ఆమె వివరించారు.
ఇన్ స్పైర్ నామినేషన్లను గడువులోగా పూర్తి చేయాలని మెదక్ డీఈఓ రాధా కిషన్ సూచించారు. అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ సుదర్శనమూర్తి, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఏఎస్ఓ నవీన్ కలిసి అన్ని మండలాల విద్యాధికారులు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు వర్చువల్ పద్ధతిలో అవగాహన కల్పించారు. నామినేషన్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయడం ద్వారా విద్యార్థుల నూతన ఆవిష్కరణలను వెలుగులోకి తీసుకురావాలని తెలిపారు.
మెదక్ జిల్లా ఖజానా శాఖ సహాయ సంచాలకులుగా(ఏడీ) అనిల్ కుమార్ మరాటి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన అంతకుముందు కలెక్టర్ రాహుల్ రాజ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ట్రెజరీ కార్యకలాపాలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బందితో సమన్వయంగా విధులు నిర్వహిస్తానని అనిల్ తెలిపారు. ఎస్టీఓ వేణుగోపాల్, జూనియర్ అకౌంటెంట్ యాదగిరి తదితరులున్నారు.
మెదక్ జిల్లాలో ఇప్పటివరకు సగం చెరువులు మాత్రమే అలుగు పారుతున్నాయని ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసరావు అన్నారు. జిల్లాలో మొత్తం 2,632 చెరువులున్నాయని, అందులో 25-50 % 63, 50-75% 290, 75-100% 705 చెరువులు నిండాయన్నారు. 1574 చెరువులు అలుగులు పారుతున్నాయని వివరించారు. మెదక్ ప్రాంతంలో ఇంకా చెరువుల్లోకి నీరు రావాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.
492 పంచాయతీలలో పనుల జాతర-2025 ఘనంగా నిర్వహించాలని డీఆర్డీఓ శ్రీనివాస్ రావు తెలిపారు. పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు, పూర్తి కావాల్సిన పనులకు శంకుస్థాపనలు చేయాలని సూచించారు. శాసనసభ్యులు, శాసన మండల సభ్యులు, పార్లమెంట్ సభ్యుల చేతుల మీదుగా లబ్ధిదారులకు మంజూరి పత్రాలు అందజేస్తామన్నారు. పనుల జాతరలో భాగంగా 22న ముఖ్యంగా పశువుల పాకలు, గొర్రెల షెడ్లు, కోళ్ల ఫామ్ షెడ్లు ప్రారంభించాలని పేర్కొన్నారు.
భర్త మరణంతో కుటుంబ పోషణ భారమై భార్య ఆత్మహత్యకు పాల్పడినట్లు తూప్రాన్ ఎస్ఐ శివానందం తెలిపారు. తూప్రాన్కు చెందిన గజ్జల బాబుకు సంధ్యతో వివాహం జరిగింది. ఆర్థిక ఇబ్బందులతో 4 నెలల క్రితం బాబు ఆత్మహత్య చేసుకున్నాడు. బాబు మరణంతో భార్య సంధ్య(34)కు కుటుంబ పోషణ భారమైంది. ఈ క్రమంలో 13న ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.