Medak

News April 15, 2025

మెదక్: కొడుకుతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం

image

కుమారుడితో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నర్సాపూర్‌లో జరిగింది. ఎస్ఐ లింగం వివరాలు.. నర్సాపూర్‌కు చెందిన మన్నె జయమ్మ నాలుగేళ్ల కొడుకుతో రాయరావు చెరువులోకి దిగుతుండగా వాచ్‌మెన్ రమేశ్ గమనించి విషయాన్ని పోలీసులకు చెప్పాడు. పోలీసులు చెరువు వద్దకు వెళ్లి తల్లి, కొడుకును రక్షించి PSకు తరలించారు. కుటుంబ కలహాలతోనే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుందని జయమ్మ తెలిపిందని ఎస్ఐ వెల్లడించారు.

News April 15, 2025

కొమురవెల్లి మల్లన్న హుండీ ఆదాయం ఎంతంటే..?

image

SDPT: కొమురవెల్లి మల్లికార్జున స్వామి వార్షిక ఆదాయం ఆలయ ఈవో అన్నపూర్ణ ఒక ప్రకటనలో వెల్లడించారు. 2024-25 సంవత్సర నికర ఆదాయం రూ. 20,97,93,956 వచ్చిందన్నారు. గత సంవత్సరం నికర ఆదాయం కంటే రూ. 2,23,29,490 అధికంగా సమకూరిందన్నారు. వార్షిక ఆదాయం రూ.45,81,77,096 కోట్లు వచ్చిందన్నారు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఏఈవో బుద్ధి శ్రీని వాస్, పాల్గొన్నారు.

News April 14, 2025

మనోహరాబాద్: యువతి అదృశ్యం..!

image

మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామానికి చెందిన యువతి అదృశ్యమైనట్లు మనోహరాబాద్ ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు. ‘కాళ్లకల్‌కు చెందిన మన్నె నాగలక్ష్మి (19) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అత్వెల్లి వద్దగల నేషనల్ మార్ట్‌లో పనిచేసేందుకు ఆదివారం ఉదయం ఇంటి నుంచి వెళ్ళింది. రాత్రి ఇంటికి రాకపోగా, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని’ చెప్పారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు

News April 14, 2025

మెదక్: అంబేడ్కర్‌ను యువత ఆదర్శంగా తీసుకోవాలి: ఏఎస్పీ

image

అంబేడ్కర్ ఆశయాల సాధన దిశగా నేటి యువత ఆయనను ఆదర్శంగా, స్ఫూర్తిగా తీసుకోని ముందుకు సాగాలని అదనపు ఎస్పీ మహేందర్ అన్నారు. మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది, రాజకీయ నేత, సంఘ సంస్కర్త అని అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారన్నారు.

News April 14, 2025

మెదక్: వివాహిత మిస్సింగ్.. కేసు నమోదు

image

ఇంటి నుంచి వెళ్లిన ఒక వివాహిత కనిపించకుండా పోయిన ఘటన శివంపేట మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మధుకర్ రెడ్డి తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని సికింద్లాపూర్‌కి చెందిన శ్యామల శనివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి కనిపించకుండా పోయింది. ఎక్కడ వెతికిన ఆచూకీ లభించకపోవడంతో భర్త సత్తయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 14, 2025

గుమ్మడిదల: భార్యతో గొడవ పడి ఆత్మహత్య

image

భార్యతో గొడవ పడి భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన బీర్ల నాగరాజు (30) కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన అనితతో 15 నెలల క్రితం వివాహమైంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో నాగరాజు మనస్తాపానికి గురై వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.

News April 14, 2025

మెదక్: పిల్లలపై నిరంతరం అప్రమత్తంగా ఉండండి

image

మరికొద్ది రోజుల్లో విద్యార్థులకు 2 నెలల వేసవి సెలవులు రానున్నాయి. దీంతో సెలవుల్లో పిల్లలు నదులు, చెరువుల్లో ఈత కొట్టడానికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకునే అవకాశం ఉంది. కనుక తల్లిదండ్రులు పిల్లల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. వారిపై ఎప్పటికీ అప్పుడు నిఘా ఉంచాలి. అలాగే ఎండలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

News April 14, 2025

మెదక్: రాజీవ్ యువ వికాస్.. నేడే చివరి తేదీ

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పించడం కోసం చేపడుతున్న రాజీవ్ యువ వికాసం కోసం నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. నేటితో చివరి తేదీ ముగుస్తున్నందున సోమవారం సాయంత్రం 5 గంటలలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని కార్యాలయంలో ధ్రువ పత్రాలు సమర్పించాలని సూచించారు. సెలవు రోజులు అయినప్పటికీ దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్ కొనసాగుతుందని అన్నారు.

News April 14, 2025

నేటి నుంచి అల్లాదుర్గం బేతాళస్వామి జాతర

image

అల్లాదుర్గం బేతాళ స్వామి జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. జాతరకు చుట్టు పక్కల ప్రాంతాల నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రతో పాటు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారు. రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా బేతాళస్వామి దేవాలయాన్ని అల్లాదుర్గంలో 4 వందల ఏళ్ల క్రితమే నిర్మించినట్లు సమాచారం.

News April 13, 2025

సిద్దిపేట: బాలల అశ్లీల వీడియోలు పోస్ట్.. యువకుడి అరెస్ట్

image

సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూసినా, ఇతరులకు షేర్ చేసినా శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని దుబ్బాక పోలీసులు తెలిపారు. మిరుదొడ్డి మండలానికి చెందిన యువకుడు అశ్లీల చిత్రాలు చూస్తూ SMలో పోస్ట్ చేశాడు. గుర్తించిన సైబర్ సెక్యూరిటీ అధికారులు అతడిని రిమాండ్ చేసి.. ఫోన్, సిమ్ కార్డ్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. లైక్‌ల కోసం వీటిని పోస్ట్ చేయొద్దని, SMని మంచికోసం వాడాలని సూచించారు.