Medak

News September 15, 2024

దుబ్బాక: చెరువులో పడి బాలుడి మృతి

image

దుబ్బాక మండలం అప్పనపల్లిలో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కొమురవెల్లి మండలం గౌరాయపల్లికి చెందిన బండి నవీన పిల్లలతో కలిసి అప్పనపల్లి తల్లిగారింటికి వచ్చింది. తల్లి రేణుక, మరదలు కావ్య, కుమారుడు సాయి (7)తో కలిసి నవీన చెరువు వద్దకు దుస్తులు ఉతికేందుకు వెళ్లారు. చెరువు కట్టపై ఆడుకుంటున్న సాయి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

News September 15, 2024

MDK: సమన్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యం: మంత్రి

image

అన్ని వర్గాలకు సమన్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నూతన టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి, సీనియర్ నాయకులు తాడూరి శ్రీనివాస్ గౌడ్, సిద్దిపేట ఇన్‌ఛార్జ్ పూజల హరికృష్ణతో కలిసి ఆయన గాంధీభవన్‌కు బయలుదేరారు.

News September 15, 2024

అమీన్ పూర్: ఆన్ లైన్ టాస్క్‌ పేరుతో రూ.4.6 లక్షల స్వాహా

image

ఉద్యోగం చేసుకుంటూ ఆన్ లైన్ ఇచ్చే టాస్క్‌లో పూర్తి చేస్తే కమిషన్ వస్తుందంటూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి సైబర్ మోసగాడు రూ.4.6 లక్షల కాజేశాడు. సిఐ నాగరాజు కథనం ప్రకారం.. కృష్ణారెడ్డి పేటలో నివాసం ఉండే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు మార్చి 18న మెసేజ్ వచ్చింది. ఆన్‌లైన్‌లో నగదు చెల్లిస్తే టాస్కులు ఇస్తామని ఆశ చూపారు. దఫా దఫాలుగా డబ్బులు చెల్లించాడు. కమిషన్ రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News September 15, 2024

ఆర్సీపురం: గుండెపోటుతో యువకుడు మృతి

image

గుండెపోటుతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన రామచంద్రపురంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. సిర్గాపూర్ మండలం సుర్త్యా నాయక్ తాండకు చెందిన జైపాల్ (28) కుటుంబ సభ్యులతో ఆర్సీపురంలో ఉంటున్నారు. అయితే స్థానిక వినాయక మండపంలో శనివారం రాత్రి డాన్స్ చేసి నీరసించిపోయి. ఇంటికి వచ్చి నిద్రించాడు. ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.

News September 15, 2024

సిద్దిపేట: నేటి నుంచి సిటీ పోలీస్ యాక్ట్ అమలు

image

నేటి నుంచి ఉమ్మడి జిల్లాలోని ఈనెల 30 వరకు పోలీస్ కమిషనర్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని సిద్దిపేట CP అనురాధ తెలిపారు. జిల్లాలోని పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు, సభలు నిర్వహించకూడదని అన్నారు. అలాగే సౌండ్ వినియోగంపై ఉన్న నిషేధాజ్ఞలు పొడిగిస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాలు చేసుకోవాలని సూచించారు.

News September 15, 2024

ప్రైవేట్ టీచర్ల పట్ల సీఎం రేవంత్ తీరు సరిగాదు: హరీశ్ రావు

image

సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేట్ ఉపాధ్యాయుల గురించి తక్కువ చేసి మాట్లాడడం తగదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలోనీ పోలీస్ కన్వెన్షన్ హల్‌లో ట్రస్మా జిల్లాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవం, ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం కేవలం ప్రభుత్వ టీచర్లను మాత్రమే సన్మానించిందని ఆరోపించారు. గురువులంత సమానమేనని, ప్రైవేట్ ఉపాధ్యాయులను కూడా సన్మానించాలని సూచించారు.

News September 14, 2024

బేస్ బాల్ క్రీడల్లో సత్తా చాటిన సిద్దిపేట జిల్లా జట్టు

image

నిర్మల్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న 5వ తెలంగాణ స్టేట్ జూనియర్ ఇంటర్ బేస్ బాల్ ఛాంపియన్ షిప్ క్రీడల్లో సిద్దిపేట జిల్లా జట్టు దూసుకుపోతున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నిమ్మ రంగారెడ్డి, మధు యాదవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రవీణ్ గౌడ్ తెలిపారు. నిర్మల్ జట్టుపై 1:7 తేడాతో, మేడ్చల్ జట్టుపై 1:3 తేడాతో సిద్దిపేట జట్టు గెలుపొంది ఫ్రీ క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నట్లు వివరించారు.

News September 14, 2024

అలజడి సృష్టించే వారిని ఉక్కుపాదంతో అణిచి వేయండి: మంత్రి పొన్నం

image

ఐక్యతకు హైదరాబాద్‌ ప్రతీకగా నిలుస్తోందని, ఎక్కడైనా అలజడులు సృష్టిస్తే కఠినంగా వ్యవహరించాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశించారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా వర్గవిభేదాలు సృష్టిస్తూ సోషల్‌ మీడియా ద్వారా రెచ్చగొట్టే, అపోహలు సృష్టించే వారిని ఉక్కుపాదంతో అణిచి వేయాలన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, కలెక్టర్‌, సీపీతో కలిసి మాట్లాడారు.

News September 14, 2024

నర్సాపూర్: చెరువులో ట్రాక్టర్ కడగడానికి వెళ్లి యువకుడు మృతి

image

వినాయక నిమజ్జనం కోసం ట్రాక్టర్ కడగడానికి చెరువు వద్దకు వెళ్లిన ఓ యువకుడు చెరువులో పడి మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన నర్సాపూర్‌లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిమజ్జనం వేడుకల సందర్భంగా మండలంలోని ఆవంచ గ్రామానికి చెందిన గంట శ్రీను తన స్నేహితులతో కలిసి చెరువు వద్దకు ట్రాక్టర్ కడగడానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందగా ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

News September 14, 2024

గజ్వేల్: ఆవాలతో అద్భుత గణపతి చిత్రం

image

వినాయక నవరాత్రుల్లో భాగంగా అవాలను ఉపయోగించి గణపతి చిత్రాన్ని గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి. భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, సేవారత్న, కళారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అత్యద్భుతంగా చిత్రించి శనివారం రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ భగవంతుణ్ణి ఏ విదంగా పూజించిన పొందే ప్రతిఫలం అద్బుతమన్నారు.