India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మంజీరా నది ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ఘనపూర్ ఆనకట్ట ప్రాంతాన్ని మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు సందర్శించారు. అదేవిధంగా వన దుర్గ మాత ఆలయ ముందు ప్రవహిస్తున్న మంజీరా నీటి ఉద్దృతిని పరిశీలించారు. నది వద్ద నీటి మట్టం, ప్రవాహ వేగం, సేఫ్టీ బారికేడ్లు, రక్షణ గురించి తెలుసుకున్నారు. ఆలాగే పేరూరు ఎల్లాపూర్ బ్రిడ్జిని పరిశీలించారు. సింగూర్ గేట్లు ఎత్తడంతో ప్రవాహం కొనసాగుతుంది.
సీపీఎస్ రద్దు కోసం సెప్టెంబర్ 1న జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఎల్.మల్లారెడ్డి పిలుపునిచ్చారు. హవేలీఘనపూర్ మండల వనరుల కేంద్రంలో ఎంఈఓ నాచారం మధుమోహన్ ధర్నాకు వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. మెదక్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు పాల్గొనాలని కోరారు. బాధ్యులు నరేందర్ రెడ్డి, శ్రీనివాస్, రాజేందర్ రెడ్డి, శశి కుమార్ రెడ్డి, శివరాజ్ తదితరులున్నారు.
మెదక్ జిల్లా శివంపేట మండలంలో తెగిపోయిన గుండ్లపల్లి చెరువును కలెక్టర్ రాహుల్ రాజ్ మంగళవారం పరిశీలించారు. చెరువు కట్ట తెగిపోవడంతో పంట పొలాల్లోకి వరద నీరు చేరి పంట పొలాల్లో ఇసుక మీటలు వేయడంతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్.. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుల పంట నష్టం వివరాలను సేకరించి వారికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయాన్ని, వనదుర్గా ప్రాజెక్ట్ వరద పరిసర ప్రాంతాలను మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి పరిశీలించారు. అధికారుల సూచనల మేరకు విధులు నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్, సందీప్ రెడ్డి తదితరులు ఉన్నారు.
చిన్నశంకరంపేట మండలంలోని ఎస్ కొండాపుర్ మధిర గ్రామమైన ప్యాటగడ్డలో డెంగ్యూతో మాడబోయిన స్వామి (20) చికిత్స పొందుతూ మృతి చెందాడు. రెండు రోజుల క్రితం జ్వరంతో బాధపడుతున్న యువకుడిని మెదక్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. డెంగ్యూ వ్యాధితో ప్లేట్ లెట్స్ తగ్గాయని వైద్యులు తెలిపారు. చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉదయం 8 గంటల వరకు కురిసిన వర్షపాతం వివరాలు.. అత్యధికంగా కాగజ్ మద్దూర్ 62.8 మిమీలు, దామరంచ 59.3, మిన్పూర్, నర్సాపూర్ 53.3, మాసాయిపేట్ 50, వెల్దుర్తి 46, శివంపేట్ 43.5, నార్లాపూర్ 43.3, కొల్చారం 41, చిప్పలతుర్తి 40.8, రామాయంపేట 37.8, ఇస్లాంపూర్ 34.5, చేగుంట 31.3 మిమీల వర్షం కురిసింది.
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతులు యూరియా కోసం పాట్లు పడుతున్నారు. ఉదయం లేవగానే సొసైటీ, ఫర్టిలైజర్ షాప్ల వద్ద క్యూలైన్ కట్టినప్పటికీ ప్రయోజనం ఉండడం లేదు. సరిపడా యూరియా రైతులకు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలు ఎదుగుదలకు వచ్చాక యూరియా పిచికారి చేయకపోతే పంట ఎదగదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని వేడుకుంటున్నారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ నివాళులు అర్పించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. బీసీ బడుగు, బలహీన వర్గాల ఐక్యం కోసం సర్దార్ సర్వాయి పాపన్న చేసిన సేవలను కొనియాడారు. ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీపీఆర్ఓ రామచంద్ర రాజు తదితరులు ఉన్నారు.
జిల్లా పోలీసులు సివిల్ విషయాలలో తల దుర్చావద్దని ఎస్పీ డీవీ శ్రీనివాస రావు సూచించారు. సోమవారం మాట్లాడుతూ.. ఎవరైన సివిల్ తగాదాల్లో తలదూర్చితే శాఖ పరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఇది వరకు సివిల్ తగాదాలో పోలీసుల ద్వారా జిల్లాలో ఏవరైనా బాధించినట్లయితే పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 87126 57888 లేదా నేరుగా ఎస్పీకి ఫిర్యాదు చేయాలని సూచించారు.
నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డీవీ శ్రీనివాస రావు సూచించారు. వర్షాల వల్ల జిల్లాలో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున ఏ ఆపద వచ్చిన లోకల్ పోలీస్ అధికారులు, డయల్ 100, పోలీస్ కంట్రోల్ రూం 87126 57888 నంబర్కు సమాచారం అందించాలని తెలిపారు.
Sorry, no posts matched your criteria.