Nalgonda

News March 31, 2025

నాంపల్లి: జాతీయ కమిషన్ సభ్యుడిగా శ్రీనివాస్ నియామకం

image

నిజాం వైద్య విజ్ఞాన సంస్థ, వైద్య అనుబంధ వృత్తి విజ్ఞాన కళాశాల ప్రిన్సిపల్ నాంపల్లి మండల కేంద్రానికి చెందిన శిరందాసు శ్రీనివాస్ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, వైద్య అనుబంధ వృత్తుల జాతీయ కమిషన్ సభ్యుడిగా ఎన్నికైయ్యారు. పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని నిరూపించారు. ఉన్నత శిఖరాలు అధిరోహించిన శిరందాసు శ్రీనివాస్‌కి నాంపల్లి మండల ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.

News March 30, 2025

NLG: జిల్లా ప్రజలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉగాది విషెష్

image

తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని నల్గొండ జిల్లా ప్రజలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లా ప్రజలకు అన్ని శుభాలు కలగాలని.. సుభిక్షంగా ఉండాలని పల్లెల్లో పట్టణాల్లో ప్రతి ఇల్లు కళకళలాడాలని పేర్కొన్నారు. షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని అభిలాషించారు.

News March 30, 2025

నేడు సన్నబియ్యం పథకం ప్రారంభం.. ఫస్ట్ వీరికే!

image

రాష్ట్రంలో ఉగాది పర్వదినం సందర్భంగా పేదలకు సన్నబియ్యం పథకాన్ని హుజూర్‌నగర్‌ వేదికగా CM రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. మొదటగా పట్టణంలోని రేషన్ కార్డుదారులు ధరావత్ బుజ్జీ, కర్ల రాధ, రజిత, సుశీల, షేక్ కరీమా, మమత, సుగుణ, కర్నా వెంకటపుష్ప, సరికొండ ఉమ, మండల పరిధిలోని చడపండు లక్ష్మి, భరతం కుమారి, కర్పూరపు లక్ష్మి, మాళోతు రంగా, గుండెబోయిన గురవయ్య, షేక్ రహిమాన్‌కు CM రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నారు.

News March 30, 2025

నేడు జిల్లాకు సీఎం.. షెడ్యూల్ ఇదే!

image

నేడు హుజూర్‌‌నగర్‌కు CM రేవంత్ రెడ్డి రానున్న విషయం తెలిసిందే. కాగా, షెడ్యూల్ ఇలా ఉంది.
☞5:00PM బేగంపేట ఏయిర్‌ పోర్టు నుంచి హెలికాప్టర్‌లో రాక
☞5:45PM హుజూర్‌నగర్ రామస్వామిగుట్ట వద్ద ల్యాండ్
☞5:45PM-6:05PM స్థానికంగా 2000 సింగిల్ బెడ్‌ రూం ఇళ్లను పరిశీలన
☞6:15PM హుజూర్‌నగర్‌ బహిరంగ సభలో ప్రసంగం
☞6:15PM-7:30PM వరకు సన్నబియ్యం పంపిణీ పథకం ప్రారంభం
☞7:30PM తిరిగి రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు ప్రయాణం

News March 30, 2025

నల్గొండ: బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ.

image

బ్యాంక్ ఉద్యోగ పరీక్షలకు సిద్ధం అవుతున్న బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిని కారి పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ శిక్షణను ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 8 వరకు అన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు.

News March 30, 2025

నల్గొండ: పదో తరగతి పరీక్షకు 41 మంది డుమ్మా

image

పదో తరగతి పరీక్షలు నల్గొండ జిల్లాలో 7వ రోజు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని 105 పరీక్ష కేంద్రాలలో సైన్స్ పేపర్- 2 (జీవశాస్త్రం) పరీక్ష నిర్వహించగా 18,666 మంది విద్యార్థులకు గానూ 18,625 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 41 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బీ.బిక్షపతి తెలిపారు.

News March 30, 2025

SRPT: 1500 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు: SP

image

సీఎం హుజూర్నగర్ పర్యటన సందర్భంగా సూర్యాపేట జిల్లా పోలీసులు అన్ని రక్షణ ఏర్పాట్లు చేశారని జిల్లా ఎస్పీ కే.నరసింహ తెలిపారు. హుజూర్నగర్లో ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను, మార్గాలను, సభా ప్రాంగణాన్ని, పార్కింగ్ ప్రదేశాలను, హెలిప్యాడ్ ప్రదేశాన్ని ఎస్పీ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1500 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

News March 30, 2025

NLG: పండుగ రోజుల్లోనూ పనిచేయనున్న కార్యాలయాలు

image

మార్చి 30, 31 తేదీల్లో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు యథావిథిగా పనిచేస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ఎల్ఆర్ఎస్ చెల్లించడానికి ఈనెల 31వ తేదీ వరకు ప్రభుత్వం 25 శాతం రాయితీ ప్రకటించినందున ప్రజల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాలు పనిచేయడంపై ఉత్తర్వులను జారీ చేసింది.

News March 29, 2025

యూట్యూబర్ శంకర్‌పై కేసు నమోదు

image

HYD అంబర్‌పేట పీఎస్‌లో యూట్యూబర్ శంకర్‌‌పై కేసు నమోదైంది. తనపై శంకర్ అత్యాచారం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 69, 79, 352, 351(4) BNS సెక్షన్ల కింద అంబర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని బాధితురాలు ఆరోపించింది. పెళ్లి విషయంలో బలవంతం చేసినందుకు శంకర్ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆ మహిళ తెలిపింది. కాగా, శంకర్‌ది నల్గొండ జిల్లా.

News March 29, 2025

నల్గొండ: ముగ్గురు పిల్లలు మృతి

image

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో <<15910567>>ముగ్గురు పిల్లలు మృతిచెందిన విషయం తెలిసిందే.<<>> RR జిల్లా తలకొండపల్లికి చెందిన చెన్నయ్య 2012లో నల్గొండ జిల్లా మందాపూర్‌ వాసి రజితను పెళ్లి చేసుకున్నాడు. గురువారం రాత్రి ఇంట్లో వారంతా భోజనం చేశారు. అయితే రజిత, పిల్లలు పెరుగు, పప్పుతో తినగా చెన్నయ్య మాత్రం పప్పుతో మాత్రమే తిన్నాడు. శుక్రవారం పొద్దున చూడగా పిల్లలు చనిపోయారు. రజితకు సీరియస్‌గా ఉందని ఆస్పత్రికి తరలించారు.