India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నల్గొండ జిల్లాలో మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ తర్వాత మూత్రపిండాల చికిత్స పొందుతున్న వారిలో అధికంగా ఈ జిల్లా వాసులే ఉన్నట్లు ఇటీవల నేమ్స్ ఆసుపత్రి బృందం నిర్వహించిన సర్వేలో తేలింది. జిల్లాలో పీపీపీ పద్ధతిలో 55 పడకల ద్వారా నిత్యం 472 మందికి డయాలసిస్ నిర్వహిస్తున్నారు. NLG పరిసర ప్రాంతాల్లో ఎక్కువమంది ఈ సమస్యతో బాధపడుతున్నారని తెలిసింది.
రోడ్డు బాలేదన్న వంకతో కొన్నేళ్లుగా మునుగోడు మండలం పలివెల గ్రామం మీదుగా ప్రతి రోజు HYDకు వెళ్లే బస్సు సర్వీసును బుధవారం ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. నిత్యం ఉదయం 8:30 గంటలకు NLG డిపో నుంచి బయలుదేరే ఆ బస్సు మునుగోడు మీదుగా కచలాపురం , పలివెల, కోతులారం, మల్లారెడ్డిగూడెం, సర్వేల్ నుంచి HYDకు వెళ్లేది. తిరిగి మధ్యాహ్న సమయంలో అదే గ్రామాల మీదుగా NLGకు చేరుకునేది.
నల్గొండ జిల్లా అనుముల మండల పరిధిలోని మారేపల్లి గ్రామంలో ఘనంగా ముత్యాలమ్మకు బోనాలు సమర్పించారు. డప్పు వాయిద్యాల నడుమ, మహిళలు, యువతులు ర్యాలీగా బోనాలు ఎత్తుకొని దేవాలయానికి వెళ్లారు. అమ్మవారికి చీర సారెలు పెట్టి, మేకలను కోసి మొక్కులు చెల్లించుకున్నారు.
NLG వైద్యఆరోగ్యశాఖ పరిధిలో పనిచేస్తున్న హెల్త్ అసిస్టెంట్ పురుషోత్తం రాజు(48) అనారోగ్యంతో 4 రోజుల క్రితం మృతి చెందారు. ఇటీవల పురుషోత్తమ రాజు సడెన్గా విధులకు హాజరు కాకపోవడం, అందుబాటులో లేకపోవడంతో మంగళవారం తోటి ఉద్యోగులు పానగల్ అలివేలుమంగాపురం కాలనీలో ఉన్న అతడి ఇంటికి వెళ్లి చూసి పోలీసులు సమాచారం ఇచ్చారు. తలుపులు పగలగొట్టి చూడడంతో అతడి మృతదేహం కుళ్ళిపోయి కనిపించింది.
నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు 11 గేట్లు ఎత్తి 81,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 1,26, 796 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులకుగాను ప్రస్తుతం 590.00 అడుగులుగా ఉంది.
ప్రతినెలా రూ.2,016లు. పక్కన సంతకాలు. అసలు ఈ ఫోటో ఏంటని అనుకుంటున్నారా. వృద్ధాప్య పింఛన్ ఇస్తూ ప్రతినెలా రాస్తున్న పుస్తకం ఇది. విషయం ఏంటంటే బుక్లోనేమో రూ.2,016 ఇస్తున్నామని రాస్తున్నారు. కానీ పేద వృద్ధులకు ఇచ్చేది మాత్రం రూ.2 వేలే. ఇది త్రిపురారం మండలంలోని పరిస్థితి. రూ.16 ఇవ్వమని ప్రశ్నిస్తే చిల్లర లేవు అంటూ ప్రతినెలా పేదల సొమ్ము మిగుల్చుకుంటున్నారు. మీ దగ్గర ఎలా ఉంది..?
అన్ని అవయవాలు ఉన్న వారే చిన్న చిన్న సమస్యలకే కుమిలిపోతూ వ్యసనాలకు బానిస అవుతున్నారు. అలాంటిది మిర్యాలగూడకి చెందిన కంచర్ల శ్రీనివాస పవన్కు పుట్టుకతోనే కుడి చేయి మణికట్టు వరకు మాత్రమే ఉంది. దివ్యాంగులకు నిర్వహించే పారా బ్యాడ్మింటన్ పోటీల గురించి తెలుసుకొని అందులో రాణించాడు. రాష్ట్ర స్థాయి పారా బ్యాడ్మింటన్ పోటీల్లో బంగారు పతకాలు సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.
రోడ్డు ప్రమాదంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన వంగపల్లి వద్ద మంగళవారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కిమ్యా నాయక్ భువనగిరిలో ఎక్సైజ్ కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తున్నారు. విధులు ముగించుకొని బైక్పై ఆలేరుకు వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా చోట్ల చెరువులు కబ్జాకు గురయ్యాయి. HYDలో హైడ్రా ఏర్పాటు చేసి ఆక్రమణపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండడంతో జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన వారు తమ దగ్గర కూడా అలాంటి వ్యవస్థను తేవాలని కోరుతున్నారు. హెచ్ఎండీఏ పరిధిలోని భువనగిరి, చౌటుప్పల్, భూదాన్పోచంపల్లి, బీబీనగర్, బొమ్మలరామారం, యాదగిరిగుట్ట, రాజాపేట, ఆలేరు మండలాల్లో పలు చెరువులు కబ్జాకు గురయ్యాయి.
NLG: ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పోలీసు అధికారులు సిబ్బంది పని చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు. ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నెలవారి నేర సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పెండింగ్ కేసులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరిస్తూ కేసుల సంఖ్యను తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.