Nalgonda

News October 8, 2025

నామినేషన్ల దాఖలులో ‘కోడ్’ పాటించాలి: నల్గొండ ఎస్పీ

image

స్థానిక సంస్థల ఎన్నికలలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేయనున్న అభ్యర్థులు విధిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్పష్టం చేశారు. నామినేషన్ల దాఖలు సందర్భంగా నిర్వహించే ఊరేగింపు కార్యక్రమాలకు అభ్యర్థులు ముందుగా పోలీసు శాఖ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ఎస్పీ కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News October 8, 2025

NLG: ఎంపీడీఓ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు

image

నల్గొండ జిల్లాలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు సర్వం సిద్ధమైందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. గురువారం నుంచి అక్టోబర్ 11 సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశామని, ఎన్నికల కోడ్, 100 మీటర్ల పరిధి నిబంధనలను తప్పక పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

News October 8, 2025

స్థానిక ఎన్నికలకు నల్గొండలో సర్వం సిద్ధం

image

రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 9న మొదటి విడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిణి ఇలా త్రిపాఠి తెలిపారు. బుధవారం HYD నుండి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని, కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీసీలో ఆమె ఈ విషయాన్ని తెలియజేశారు.

News October 8, 2025

నల్గొండ: స్కిల్ కాంపిటీషన్‌కు రిజిస్ట్రేషన్‌ చేసుకోండి

image

ప్రపంచ స్కిల్‌ కాంపిటీషన్‌లో (World Skill Competition) పాల్గొని, అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి యువత ఈ నెల 15లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. 6 నుంచి 24 ఏళ్ల వయస్సు వారు, నైపుణ్యం కలిగిన నిరక్షరాస్యులు కూడా అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు http://www.skillindiadigital.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News October 8, 2025

NLG: పత్తి కొనుగోళ్లకు సమాయత్తం

image

పత్తి కొనుగోళ్లకు నల్గొండ జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఈ నెల 21 నుంచి కొనుగోళ్లు చేపట్టేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల ఇప్పటికే సీసీఐ, మార్కెటింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిన్నింగ్ వ్యాపారులు, CCI మధ్య నిబంధనలపై ఒప్పందం కుదరడంతో సంక్షోభం తొలగిపోయింది. జిల్లాలో ఈ సీజన్లో 5.64 లక్షల ఎకరాలకు పైగా పత్తి సాగైంది.

News October 8, 2025

NLG: వరుస వర్షాలతో తెల్ల బంగారానికి తెగుళ్లు!

image

జూన్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు జిల్లాలో సాధారణ వర్షం 526.6 మిల్లీమీటర్లు కాగా 670.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అతివృష్టి కారణంగా జిల్లాలో రైతులు సాగు చేసిన వరి పత్తి పంటలు చాలావరకు దెబ్బతిన్నాయి. పత్తి ఏరే సమయంలో గత రెండు మూడు రోజుల నుంచి జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పత్తి చేలు ఎర్ర భారీ తెగుళ్ల బారిన పడ్డాయి.

News October 8, 2025

NLG: నేడే కీలక తీర్పు.. జిల్లాలో ఉత్కంఠ

image

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కీలకమైన హైకోర్టు తీర్పు నేడు వెలువడనుంది. దీంతో నల్గొండ జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. ఈ తీర్పు జిల్లాలోని 33 జడ్పీటీసీ, 33 ఎంపీపీ పదవుల భవితవ్యాన్ని, అలాగే 353 ఎంపీటీసీ స్థానాలు, 869 గ్రామ సర్పంచుల స్థానాల ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయనుంది. కోర్టు తీర్పు కోసం జిల్లాలోని రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

News October 7, 2025

నల్గొండ: మైనర్‌ హత్యాచారం.. పోక్సో కేసు నమోదు

image

నల్గొండ మండలంలో బాలిక హత్యాచార ఘటనపై పోక్సో కేసు నమోదైంది. ట్రాక్టర్ డ్రైవర్ కృష్ణ బాలికను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి గదికి తీసుకెళ్లి హత్యాచారం చేశాడని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు తక్షణమే నిందితుడు కృష్ణతో పాటు అతని స్నేహితుడిపై పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తును వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు.

News October 7, 2025

NLG: అధిక వడ్డీ దందా.. తెర వెనుక మరో వ్యక్తి..!

image

పెద్దఅడిశర్లపల్లి మండలం పలుగుతండాకు చెందిన బాలాజీ నాయక్ <<17937867>>అధిక వడ్డీ<<>> ఆశ చూపి రూ.కోట్లు వసూలు చేసి పరారీలో ఉండగా అతని ఇంటిపై బాధితులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దందా వెనుక మధు అనే మరో యువకుడు ఉన్నట్లు తెలుస్తోంది. బాలాజీ నాయక్‌తో కలిసి మధు అనే యువకుడు గ్రామీణ ప్రజలే లక్ష్యంగా ఈ దందా నడిపినట్లు సమాచారం. బాలాజీ కంటే మధునే ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు.

News October 7, 2025

నల్గొండలో ఉర్సు.. ఏర్పాట్లు పరిశీలన

image

నల్గొండలో ఈ నెల 9 నుంచి జరిగే హజరత్ లతీఫ్ షా వలీ ఉర్స్-ఏ-షరీఫ్ వలి ఉత్సవాల ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు.