Nalgonda

News August 11, 2025

నల్గొండ: క్రీడలు మానసికొల్లాసానికి ఎంతో దోహదపడతాయి: జిల్లా ప్రధాన జడ్జి

image

క్రీడలు మానసికొల్లాసానికి ఎంతో దోహదపడతాయని జిల్లా ప్రధాన జడ్జి ఎం.నాగరాజు అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్గొండ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం న్యాయవాదులకు మేకల అభినవ్ స్టేడియంలో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నిరంతరం బిజీగా ఉండే న్యాయవాదులకు క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కట్టా అనంతరెడ్డి పాల్గొన్నారు.

News August 11, 2025

దేవరకొండ: ‘ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవాలను విజయవంతం చేయాలి’

image

దేవరకొండలో ఏఐఎస్ఎఫ్ డివిజన్ ముఖ్య నాయకుల సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు వలమల్ల ఆంజనేయులు పాల్గొని మాట్లాడారు. దేశ స్వాతంత్య్రమే లక్ష్యంగా 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నగరంలో ఏర్పడిన మొట్టమొదటి విద్యార్థి సంఘంగా ఏఐఎస్ఎఫ్ చరిత్రలో నిలిచిందన్నారు. ఈనెల 12 నుంచి 31 వరకు జరిగే ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

News August 11, 2025

నల్గొండ: 108 అంబులెన్స్‌ల తనిఖీ

image

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు నల్గొండ DM&HO ఈరోజు జిల్లా కేంద్రంలోని 108 అంబులెన్స్‌లను తనిఖీ చేశారు. వివరాలు తెలుసుకుని, అంబులెన్స్‌ల సిబ్బంది పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు. అధికారులు, సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ డిప్యూటీ DM&HO వేణుగోపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, మధు, రవి, భగవాన్ ఉన్నారు.

News August 11, 2025

నల్గొండ జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

image

జిల్లాలోని అన్ని మండలాల ప్రత్యేక అధికారులు వారి పరిధిలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీలు, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలను తప్పనిసరిగా సందర్శించాలని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు.
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా పర్యటించాలన్నారు.

News August 11, 2025

NLG: రైతులకు సబ్సిడీ యంత్రాలు.. తగ్గనున్న ఖర్చుల భారం

image

జిల్లాలోని రైతులకు SMAM పథకం కింద 50 శాతం సబ్సిడీపై యంత్ర పరికరాలు అందించాలని వ్యవసాయశాఖకు ఆదేశాలు అందాయి. 2025- 26 సంవత్సరానికిగాను సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ స్కీం కింద అర్హులను ఎంపిక చేసి వ్యవసాయ యంత్ర పరికరాలు అందించనున్నారు. కేంద్రం సబ్సిడీపై అందించే పరికరాలతో ఎకరాకు రూ.10 నుంచి15 వేల వరకు అదనపు ఖర్చుల భారం తగ్గనుంది. రైతులు ఆర్థికాభివృద్ధికి ఈ పరికరాలు ఎంతో ఉపయోగకరం కానున్నాయి.

News August 11, 2025

NLG: సరికొత్తగా GP ఓటరు జాబితా

image

జిల్లాలో గ్రామ పంచాయతీల్లో సరికొత్త ఓటరు జాబితా సిద్ధమవుతోంది. గతంలో ఎంపీడీఓ పరిధిలో ఉన్న టీపోల్ ఆయా లాగిన్లో గ్రామాల కార్యదర్శులు ఓటర్ల వారీగా పంచాయతీ జాబితాలను అప్లోడ్ చేశారు. అయితే గత విధానాన్ని పంచాయతీరాజ్ శాఖ మార్పు చేసింది. జిల్లాలో 869 జీపీల్లో 10,53,920 మంది ఓటర్లున్నారు. కొత్తగా ప్రతి గ్రామానికి ఒక టీపోల్ లాగిన్ ఇచ్చి GP లాగిన్లో ఓటర్ల జాబితాను అప్లోడ్ చేయాలని ఆదేశించింది.

News August 10, 2025

నల్గొండ GOVT ఆస్పత్రిలో కలెక్టర్ తనిఖీ

image

నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. ఆదివారం ఆమె ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాజువాలిటీ, ఐసీయూ, ఏఎంసీయూ, సర్జికల్ వార్డు, మెడికల్ వార్డ్, రేడియాలజీ తదితర విభాగాలను తనిఖీ చేసి, డాక్టర్లు నర్సులతో మాట్లాడి ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.

News August 10, 2025

నల్గొండ: రెండో జత సకాలంలో అందేనా?

image

నల్గొండ జిల్లాలో సర్కార్ బడుల్లో ప్రవేశాల పెంపే లక్ష్యంగా యంత్రాంగం చర్యలు తీసుకుంది. గతేడాదితో పోల్చితే ఈసారి విద్యార్థుల సంఖ్య పెరిగింది. 2025-26 విద్యా సంవత్సరం మొదలై 2 నెలలు కావొస్తున్నా విద్యార్థులకు రెండో జత ఏకరూప దుస్తులు అందకపోవటం గమనార్హం. పాఠశాలల ప్రారంభ సమయంలో జత దుస్తులు పంపిణీ చేశారు. విద్యార్థులకు రెండు జతల ఏకరూప దుస్తులను ఆగస్టు 26 నాటికి అందించాలని విద్యాశాఖ గడువు నిర్దేశించింది.

News August 10, 2025

NLG: మరో మూడు రోజులే ఛాన్స్.. దరఖాస్తు చేయండి..!

image

కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులంతా రైతు బీమా పథకానికి ఈ నెల 13వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ తెలిపారు. ఈనెల 5వ తేదీ వరకు పాస్‌పుస్తకాలు పొందిన రైతులందరూ అర్హులని ఆయన పేర్కొన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను మండల కేంద్రాల్లోని ఏఈఓలకు అందజేయాలని ఆయన సూచించారు.

News August 10, 2025

నకిరేకల్‌లో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

image

నకిరేకల్ మండలం ఆర్లగడ్డలగూడెం గ్రామం వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. వేములపల్లి మండలం సల్కునూరుకి చెందిన నర్సింగ్ అంజమ్మ, రాఖీ కట్టేందుకు తన సోదరుడి ఇంటికి వచ్చిందని స్థానికులు తెలిపారు. రాత్రి 365వ నంబర్ హైవే దాటుతుండగా, నల్గొండ నుంచి నకిరేకల్ వైపు వెళ్తున్న మినీ గూడ్స్ వాహనం ఆమెను ఢీకొట్టింది. దీంతో అంజమ్మ అక్కడికక్కడే మృతి చెందింది.