Nalgonda

News October 7, 2025

NLG: ఏడు నెలల్లో మూడు హత్యలు

image

కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న నల్గొండలో హత్యలు కలకలం రేపుతున్నాయి. ఏప్రిల్ 11న రామగిరిలోని గీతాంజలి అపార్ట్‌మెంట్‌లో మణికంఠ కలర్ ల్యాబ్ యజమాని గద్దపాటి సురేష్ దారుణ హత్యకు గురయ్యాడు. ఆగస్టు 27న కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి జూనియర్ కాలేజ్ ఎదురుగా నాంపల్లి మండలానికి చెందిన చింతకింది రమేష్‌ను మర్డర్ చేశారు. తాజాగా డైట్ కాలేజ్ సమీపంలో బాలికను హతమార్చారు. శాంతి భద్రతలు కాపాడాలని పట్టణవాసులు కోరుతున్నారు.

News October 7, 2025

NLG: మార్క్ చూపించేలా.. అభ్యర్థుల ఎంపిక!

image

స్థానిక ఎన్నికలపై జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తున్నది. రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో తమ మార్క్ చూపించేలా ఆ పార్టీ అభ్యర్థుల ఎంపిక మొదలుపెట్టింది. ZPTC అభ్యర్థులను PCC ఖరారు చేయనున్న నేపథ్యంలో ఒక్కోస్థానానికి ముగ్గురేసి బలమైన అభ్యర్థులతో జాబితా సిద్ధం చేస్తున్నారు. ఈ జాబితా పరిశీలించాక PCC అభ్యర్థులను ఖరారు చేయనున్నది. సర్పంచి, MPTC స్థానాలకు అభ్యర్థుల ఎంపిక జిల్లా స్థాయిలోనే జరగనుంది.

News October 7, 2025

రాష్ట్రంలోనే మొదటి స్థానంలో దేవరకొండ ఆర్టీసీ డిపో

image

దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ ఆక్యుఫెన్సీ రేషియోలో రాష్ట్రంలో మొదటి స్థానంలో దేవరకొండ ఆర్టీసీ డిపో నిలిచిందని మేనేజర్ రమేశ్ బాబు తెలిపారు. డిపోలో సోమవారం రాత్రి నిర్వహించిన సంబరాలల్లో ఆయన పేర్కొన్నారు. అనంతరం సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి, ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ పడాల సైదులు, కృష్ణయ్య,దీప్లాల్, పాపరాజు, సమాద్ సిబ్బంది పాల్గొన్నారు.

News October 6, 2025

దేవరకొండ ప్రమాదంలో మృతుడు చారగొండ వాసి

image

దేవరకొండ మండలం కొండభీమనపల్లి వద్ద బైక్, లారీ ఢీకొని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మృతుడు నాగర్ కర్నూల్ జిల్లా చారగొండకు చెందిన కొట్ర శివగా గుర్తించినట్లు సీఐ వెంకటరెడ్డి తెలిపారు. మహిళ వివరాలు తెలియలేదని చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ చారకొండ వైపు వెళుతుండగా, శివ దేవరకొండ వెళుతున్నాడని స్థానికులు తెలిపారు.

News October 6, 2025

NLG: బాగా చదువుకోవాలి: కలెక్టర్

image

త్రిపురారంలో ఉన్న తెలంగాణ గిరిజన బాలికల సంక్షేమ మినీ గురుకులాన్ని, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా గిరిజన బాలికల సంక్షేమ మినీ గురుకులాన్ని తనిఖీ చేసి సెలవుల తర్వాత పాఠశాలకు వచ్చిన విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. వారి పేర్లు, వివరాలు, ఇష్టం ఉన్న సబ్జెక్టులు తదితర అంశాలను ముచ్చటించారు. బాగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు.

News October 6, 2025

దేవరకొండ విద్యార్థులకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్

image

కరాటేలో శిక్షణ పొందిన పున్న శ్రీజన్, మాకం అఖిల్, తుటిక జయ సాయి కార్తీక్ తమ ప్రతిభతో గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించి దేశానికి గౌరవం తెచ్చారని మాస్టర్ టీ. చైతన్య తెలిపారు. చెన్నైలో వరల్డ్ కరాటే మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వీరు ఈ ఘనత సాధించారు. గిన్నిస్ అధికార ప్రతినిధి రిషినాథ్ చేతుల మీదుగా మాస్టర్ చైతన్య మెడల్, సర్టిఫికెట్ అందుకున్నారు.

News October 6, 2025

NLG: బెస్ట్ అవైలబుల్‌ స్కీం విద్యార్థులు బడి బయటే..!

image

బెస్ట్ అవైలబుల్ విద్యార్థులను ఓ స్కూల్ యాజమాన్యం బయటే నిలిపేసింది. మూడేళ్లుగా బకాయిలు నిలిపివేయడంతో తప్పని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బతుకమ్మ చీరలకు నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం, విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం నిర్లక్ష్యం చేస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ తన వద్ద పెట్టుకున్న సీఎం రేవంత్‌ స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

News October 6, 2025

NLG: కుక్కల స్వైర విహారం.. ప్రజల్లో భయాందోళన

image

నల్గొండ జిల్లా కట్టంగూరు మండలంలో వీధి కుక్కల బెడద తీవ్రంగా పెరిగిందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్కలు గుంపులుగా తిరుగుతుండటంతో రోడ్లపై ప్రయాణించాలంటే చిన్నారులు, మహిళలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉందని తెలిపారు. అధికారులు స్పందించి, కుక్కల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కోరారు.

News October 5, 2025

నల్గొండ: కాలువలో జారిపడి మహిళ మృతి

image

నల్గొండ మండలం కొత్తపల్లిలోని డీ-37 కాలువలో జారిపడి మహిళ మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. అదే సమయానికి అటుగా వెళుతున్న గ్రామస్థులు పెరిక రాము, పాలడుగు నాగార్జున ఆమెను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దురదృష్టవశాత్తు ఆమె అప్పటికే మృతి చెందింది. మృతురాలి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 5, 2025

NLG: మున్నాళ్ల ముచ్చటగానే ‘ఎగ్ బిర్యానీ’

image

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందించే ‘ఎగ్ బిర్యానీ’ మున్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. భోజనాన్ని మరింత రుచికరంగా మార్చేందుకు, వారానికి రెండుసార్లు ఎగ్ బిర్యానీ ఇస్తామని మొదట్లో అట్టహాసంగా ప్రకటించారు. జిల్లాలోని 2,093 కేంద్రాల్లో ఈ పథకం ప్రారంభమైన కొద్ది రోజులకే అటకెక్కింది. మసాలా దినుసుల కోసం ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో సరఫరా నిలిచిపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.