Nalgonda

News August 25, 2024

బోనాల వేడుకల్లో డోలి వాయించిన ఎమ్మెల్యే కుంభం

image

భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వలిగొండలో నిర్వహించిన బోనాల పండుగ ఉత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉత్సవాల్లో సాంప్రదాయ బద్దంగా డోలు వాయించి ప్రతీ ఒక్కరిని ఆకట్టుకున్నారు. వలిగొండ ప్రజలందరినీ చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. భక్తులు అమ్మవార్లకు బోనాలు సమర్పించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. డప్పు వాయిద్యాల మధ్య భారీ ఊరేగింపుతో వచ్చి గ్రామ దేవతలకు నైవేద్యాలను సమర్పించారు.

News August 25, 2024

అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి: మాజీ మంత్రి

image

సూర్యపేటలోని తాళ్లగడ్డలో కొలువుదీరిన శ్రీ ఇంద్రవెళ్లి ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగ సందర్బంగా అమ్మవారిని మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలకు ఆయురారోగ్యాలతో పాటు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించి పాడి పంటలతో తులతూగాలని చల్లని ఆశీస్సులు అందజేయాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.

News August 25, 2024

భువనగిరి: ఈనెల 27, 29న జిల్లాలో గవర్నర్ పర్యటన

image

భువనగిరి జిల్లాలో ఈ నెల 27, 29న రాష్ట్ర గవర్నర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతు జెండగే అధికారులను ఆదేశించారు. 29న రాష్ట్ర గవర్నర్ శ్రీ విష్ణుదేవ్ శర్మ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకుంటారని, అనంతరం 29న జైన దేవాలయాన్ని, సోమేశ్వర ఆలయాన్ని, స్వర్ణగిరి ఆలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో జరిగే సమావేశంలో పాల్గొననున్నారు.

News August 25, 2024

నల్గొండ: ప్రైవేట్ బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు

image

నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో 30 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. బస్సు జగిత్యాల నుంచి దర్శి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 25, 2024

నల్గొండలో విచ్చలవిడిగా నీటి వ్యాపారం

image

NLG మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు కొన్నేళ్ల నుంచి తాగునీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. డబ్బులు పెట్టి నీరు కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. నల్గొండలో మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు దాదాపు వందకు పైగానే ఉన్నాయి. ఇందులో ఏ ఒక్క ప్లాంట్‌కూ అనుమతులు లేవు. మున్సిపాలిటీ పరిధిలో 5 లక్షకు పైగా జనాభా ఉన్నా.. ఇప్పటికీ అనేక వార్డుల్లో పరిశుభ్రమైన నీరు సరఫరా జరగడం లేదు. తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

News August 25, 2024

BREAKING.. నల్గొండ: తల్లిని హత్య చేసి.. కుమారుడి సూసైడ్

image

నల్గొండ జిల్లా నిడమానూరులో విషాదం చోటుచేసుకుంది. ఓ కుమారుడు తల్లిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి సాయమ్మను కత్తితో పొడిచి అనంతరం శివ గొంతుకోసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబకలహాలతో తల్లిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

News August 25, 2024

గుర్రంపోడులో గుండెపోటుతో యువతి మృతి

image

గుండెపోటుతో యువతి మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో శనివారం జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. కవిత(18) రోజులాగే తల్లితో కలిసి ఆటోలో మిరపకాయలు కోయడానికి పనికి వెళ్లే క్రమంలో ఒక్కసారిగా కుప్ప కూలింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న 108 వాహన సిబ్బంది సీపీఆర్ చేసినా అప్పటికే పల్స్ పడిపోయింది. స్థానిక పీహెచ్సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

News August 25, 2024

నల్గొండ: రుణమాఫీ కాని వారు ఫిర్యాదు చేయండి

image

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 3 విడతలుగా రుణమాఫీ చేసింది. కాగా, కొంతమంది రైతులకు మాఫీ కాలేదు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా రుణమాఫీ కాని రైతుల నుంచి ఫిర్యాదులు సేకరిస్తోంది. దీని కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మండలాల వారిగా నోడల్ అధికారులను నియమించారు. బ్యాంకు ఖాతా, పాస్‌బుక్, ఆధార్ జిరాక్స్‌తో మండల/జిల్లా నోడల్ అధికారికి అందించేలా కార్యాచరణ రూపొందించారు.

News August 24, 2024

NLG: ప్రభుత్వ ఆసుపత్రిలో పడకలు పెంచండి సారూ.!

image

నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కుర్చీలో గర్భిణీ ప్రసవించిన ఘటనను వార్తల్లో చూసిన సామాన్య ప్రజలు ఆస్పత్రిలో ఇకనైనా మౌలిక వసతులు వెంటనే కల్పించాలని మాత శిశు సంరక్షణ కేంద్రంలోని వార్డులు, లేబర్ రూమ్‌లో పడకలు పెంచాలని కోరుతున్నారు. చిన్న పిల్లలకు జ్వరం సిరప్ 250 ఎంజీ అందుబాటులో లేవు యాంటీ బయాటిక్ సిరప్‌లు వారి వయస్సులకు తగ్గట్టుగా లేవు, బయట కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉందని సామాన్యులు అంటున్నారు.

News August 24, 2024

మద్దిరాల: వివిధ కేసుల్లో పట్టుబడిన మద్యం ధ్వంసం

image

మద్దిరాల పోలీస్ స్టేషన్ పరిధిలో 26 కేసుల్లో పట్టుబడిన మద్యంను పోలీసులు శనివారం సాయంత్రం ఐదు గంటలకు ధ్వంసం చేశారు ఎక్సైజ్ శాఖ అనుమతితో మద్యంతో పాటు బీర్లను బయట పారబోసినట్లు మద్దిరాల ఎస్సై తెలిపారు. అక్రమ మద్యం రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ సూపర్డెంట్ లక్ష్మా నాయక్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ మల్లయ్య ఉన్నారు.