India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కరాటేలో శిక్షణ పొందిన పున్న శ్రీజన్, మాకం అఖిల్, తుటిక జయ సాయి కార్తీక్ తమ ప్రతిభతో గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించి దేశానికి గౌరవం తెచ్చారని మాస్టర్ టీ. చైతన్య తెలిపారు. చెన్నైలో వరల్డ్ కరాటే మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వీరు ఈ ఘనత సాధించారు. గిన్నిస్ అధికార ప్రతినిధి రిషినాథ్ చేతుల మీదుగా మాస్టర్ చైతన్య మెడల్, సర్టిఫికెట్ అందుకున్నారు.

బెస్ట్ అవైలబుల్ విద్యార్థులను ఓ స్కూల్ యాజమాన్యం బయటే నిలిపేసింది. మూడేళ్లుగా బకాయిలు నిలిపివేయడంతో తప్పని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బతుకమ్మ చీరలకు నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం, విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం నిర్లక్ష్యం చేస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ తన వద్ద పెట్టుకున్న సీఎం రేవంత్ స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

నల్గొండ జిల్లా కట్టంగూరు మండలంలో వీధి కుక్కల బెడద తీవ్రంగా పెరిగిందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్కలు గుంపులుగా తిరుగుతుండటంతో రోడ్లపై ప్రయాణించాలంటే చిన్నారులు, మహిళలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉందని తెలిపారు. అధికారులు స్పందించి, కుక్కల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కోరారు.

నల్గొండ మండలం కొత్తపల్లిలోని డీ-37 కాలువలో జారిపడి మహిళ మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. అదే సమయానికి అటుగా వెళుతున్న గ్రామస్థులు పెరిక రాము, పాలడుగు నాగార్జున ఆమెను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దురదృష్టవశాత్తు ఆమె అప్పటికే మృతి చెందింది. మృతురాలి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందించే ‘ఎగ్ బిర్యానీ’ మున్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. భోజనాన్ని మరింత రుచికరంగా మార్చేందుకు, వారానికి రెండుసార్లు ఎగ్ బిర్యానీ ఇస్తామని మొదట్లో అట్టహాసంగా ప్రకటించారు. జిల్లాలోని 2,093 కేంద్రాల్లో ఈ పథకం ప్రారంభమైన కొద్ది రోజులకే అటకెక్కింది. మసాలా దినుసుల కోసం ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో సరఫరా నిలిచిపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమలులో ఉన్నందున ప్రతి సోమవారం నిర్వహించే పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం యథావిధిగా గ్రీవెన్స్ డే కార్యక్రమం కొనసాగుతుందని ఎస్పీ స్పష్టం చేశారు.

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. రిజర్వేషన్ల అంశంపై ఈ నెల 8న హైకోర్టు వెల్లడించబోయే తీర్పు కోసం రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల పనులు ఊపందుకున్నాయి. ఈ ఎన్నికల్లో కేవలం 9 పార్టీలకే ఎన్నికల సంఘం గుర్తింపు ఇవ్వగా, వాటికి సంబంధించిన ఓటర్ల జాబితాలను ముద్రించి అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

జిల్లాలో బోనస్ డబ్బుల కోసం రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఈ ఏడాది వానకాలం సీజన్ కోతల ప్రక్రియ ప్రారంభమైనా గత యాసంగి బోనస్ను విడుదల చేయకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతేడాది యాసంగి సీజన్లో 17.835 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు విక్రయించారు. వీరికి బోనస్ రూపంగా రూ.8.91 కోట్లను వారి ఖాతాలో చేయాల్సి ఉన్నా నేటి వరకు ప్రభుత్వ బోనస్ డబ్బులు చెల్లించలేదని రైతులు తెలిపారు.

జిల్లాలో ప్రభుత్వ శాఖల అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది ప్రజలకు జవాబుదారీగా ఉండడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్షల్లో జీతాలు తీసుకుంటూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వారికి కంప్లైంట్ ఇవ్వాలన్నా, వారి నుంచి సమాచారం తెలుసుకోవాలన్నా.. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తడం లేదని ప్రజలు వాపోతున్నారు.

కట్టంగూరు మండల కేంద్రంలో వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డు లేక రైతులు ఏటా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతంలో వరి, పత్తి పంటలను పెద్ద ఎత్తున రైతులు సాగు చేస్తున్నారు. మండలంలో 22 గ్రామపంచాయతీలకు సంబంధించిన రైతులు తమ పంట ఉత్పత్తులను విక్రయించేందుకు స్థానికంగా మార్కెట్ యార్డు లేకపోవడంతో దళారులను ఆశ్రయిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. అధికారులు స్పందించి ఇక్కడ సబ్ మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలని కోరారు.
Sorry, no posts matched your criteria.