India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు. నల్గొండ మండలంలోని చర్లపల్లి బైపాస్ను NAM, రోడ్డు భవనాల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే నేషనల్ హైవే, స్టేట్ హైవేలను గుర్తించి ప్రమాదాల నివారణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
సూర్యాపేట జిల్లా మాధవరం గ్రామ శివారులో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళుతున్న కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో ఆ మార్గంలో ఎలాంటి వాహనాలు లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. గాయాలైన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా 2024 ఉత్తమ ఛాయాచిత్ర పోటీల్లో తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో గెలుపొందారు. ఈ నేపథ్యంలో శనివారం ఉమ్మడి నల్గొండ జిల్లా హాన్స్ ఇండియా ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల శ్రీనివాస్ను నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, డీపీఆర్ఓ వెంకటేశ్వర్లు శాలువా కప్పి అభినందించారు.
రుణమాఫీ కాని రైతులు వ్యవసాయశాఖ కార్యాలయాల్లోని గ్రీవెన్స్ సెల్లలో పెద్ద ఎత్తున దరఖాస్తులు అందజేస్తున్నారు. ఇప్పటి వరకు మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేసింది. అయితే వివిధ కారణాల వల్ల జిల్లాలు అనేక మంది రైతులకు రుణమాఫీ కాలేదు. శుక్రవారం నాటికి జిల్లాలోని అన్ని మండలాలకు సంబంధించి 5,840 దరఖాస్తులు వచ్చినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.
అచ్యుతాపురం సెజ్లోని ఫార్మా కంపెనీలో ఇటీవల పేలుడు సంభవించి 17 మంది మృతిచెందారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనే అత్యధిక ఫార్మా పరిశ్రమలున్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆ కంపెనీల్లో పనిచేసే కార్మికుల భద్రతపై ఆందోళన నెలకొంది. చౌటుప్పల్, బీబీనగర్, BNR, బొమ్మలరామారం, పోచంపల్లి, త్రిపురారం, MLGలో సుమారు 100 వరకు ఫార్మా పరిశ్రమలున్నాయి. ప్రమాదాలు జరగకముందే కార్మికుల భద్రతపై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.
ఎత్తిపోతల పథకాలకు అవసరమైన భూములకై వెంటనే భూసేకరణ ప్రతిపాదనలను పంపించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అయన లిఫ్ట్ ఇరిగేషన్ల భూసేకరణపై నీటిపారుదల, రెవెన్యూ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని అన్ని డివిజన్ల పరిధిలో చేపట్టనున్న లిఫ్ట్ ఇరిగేషన్లకు సంబంధించి అవసరమయ్యే భూముల పూర్తి వివరాలతో ప్రతిపాదనలు పంపించాలన్నారు.
ప్రస్తుత 2020 రెవెన్యూ చట్టం వల్ల కలిగే ఇబ్బందులను తొలగించి రైతులకు ఉపయోగకరమైన చట్టాన్ని తీసుకొచ్చేందుకుగాను ప్రభుత్వం నూతన ఆర్ఓఆర్ 2024 చట్టం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం NLG కలెక్టరేట్లో “తెలంగాణ హక్కుల రికార్డు బిల్లు- 2024” ముసాయిదా పై ఏర్పాటు చేసిన సదస్సు, చర్చ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
తెలంగాణ ఉద్యమకారుడు, BRS నేత జిట్టా బాలకృష్ణ రెడ్డి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి బండి సంజయ్, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తెలంగాణ ఉద్యమంలో జిట్టా తనదైన పాత్ర పోషించారు. గత నాలుగు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
నల్గొండ జిల్లాలో హిజ్రాల ఆగడాలు శ్రుతి మించుతున్నాయి. నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో టోల్ ప్లాజాల వద్ద హిజ్రాలు తిష్ట వేసి తమను బెదిరించి రూ.50 నుంచి రూ.100 వరకు వసూలు చేస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు. డబ్బులు ఇవ్వకపోతే దుర్భాషలాడుతున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు స్పందించి వసూళ్లకు పాల్పడుతున్న హిజ్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
వాతావరణంలో మార్పులు, అధ్వానపు పారిశుద్ధ్య పరిస్థితులతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో విషజ్వరాలు, డెంగ్యూ, మలేరియా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నల్గొండ, సూర్యాపేటల్లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు, భువనగిరిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో ఈ ఏడాది 416 డెంగ్యూ కేసులు నమోదు కాగా.. నల్గొండ జిల్లాలో 340 కేసులు నమోదైనట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.
Sorry, no posts matched your criteria.