India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మంచు కురిసే సరిహద్దుల్లో మాతృభూమికి కాపలాగా నిలిచే సైనికుడు రాఖీ వేళ చెల్లెళ్లపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. కశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న నల్గొండకు చెందిన లక్ష్మణ్ తన చెల్లెళ్లతో రాఖీ కట్టించుకునేందుకు ప్రత్యేక సెలవుపై రాష్ట్రాలు దాటి స్వగ్రామానికి చేరుకున్నారు. సరిహద్దుల్లో దేశాన్ని రక్షిస్తూనే రాఖీ వేడుక కోసం రాష్ట్రాలు దాటి వచ్చిన లక్ష్మణ్కు రాఖీ కట్టిన చెల్లెళ్లు ఆనందంతో మురిసిపోయారు.
రాఖీ పండుగ వేళ నల్గొండ జిల్లాలో ఆసక్తికర సంఘటన జరిగింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ నకిరేకల్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి డ్యూటీలో ఉన్న సిబ్బందికి రాఖీ కట్టింది. తాటికల్లు గ్రామంలోని బాట పంచాయితీ వివాదంలో తన భర్త ముచ్చపోతుల వెంకన్నపై జంజిరాల వెంకటయ్య కుటుంబ సభ్యులు దాడి చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదును త్వరగా పరిశీలించి తమకు న్యాయం చేయాలని ఆమె పోలీసులను కోరింది.
జిల్లాలో గ్రామపంచాయతీ కార్యదర్శుల ఫేక్ అటెండెన్స్ వ్యవహారం ప్రకంపనలు రేపుతుంది. తప్పుడు పద్ధతిలో అటెండెన్స్ వేసిన 69 మంది కార్యదర్శులకు జిల్లా పంచాయతీ అధికారి నోటీసులు జారీ చేశారు. వాటికి కార్యదర్శులు కూడా సమాధానం ఇచ్చారు. ఆ నివేదిక అంతా కలెక్టర్కు సమర్పించనున్నారు. CCLA నిబంధనల ప్రకారం సస్పెండ్ చేయవచ్చని తెలుస్తుంది. ఇంక్రిమెంట్ కట్ చేసి ఇతర క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంది.
పంచాయతీ కార్యదర్శులు రోజు ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా హాజరు వేస్తారు. వారి హాజరును పరిశీలించాల్సింది ఆయా మండల కేంద్రాల్లో పనిచేస్తున్న ఎంపీఓలు. సదరు అధికారి రోజు రెండు, మూడు గ్రామాలు వెళ్లి పరిశీలించాలి. కానీ జిల్లాలో అధికారులు ఫేక్ అటెండెన్స్లు గుర్తించకపోవడం విశేషం. ఎవరూ పట్టించుకోకపోవడంతో కార్యదర్శులు ఫేక్ అటెండెన్స్కు పాల్పడినట్లు తెలుస్తుంది.
జిల్లాలో కురిసిన అకాల వర్షానికి వేలాది ఎకరాల్లో పంటలకు తీరని నష్టం వాటిల్లింది. అనేక గ్రామాల్లో పత్తి, వరి పంటలు నీటి మునిగాయి. కొన్ని గ్రామాల్లో అయితే పత్తి పంట చెరువును తలపించేలా మారాయని రైతులు తెలిపారు. NKL(M) చందుపట్లకు చెందిన ముగ్గురు తాపీ మేస్త్రీలు ఊట్కూరులో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు ముగించుకొని బైక్ పై తిరిగి వెళుతుండగా కాజువే పై వరద నీటిలో కొట్టుకుపోగా స్థానికులు రక్షించారు.
జిల్లాలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం పూర్తయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొత్త రేషన్ కార్డులు పంపిణీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కొత్త కార్డులకు SEP నెల నుంచి సన్న బియ్యం ఇవ్వనున్నట్లు డీఎస్ఓ వెంకటేశ్వర్లు తెలిపారు. రేషన్ కార్డులు లేని అర్హులు మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని.. ఆయా దరఖాస్తులను పరిశీలించి అర్హతల ప్రకారం కొత్త కార్డు మంజూరు చేస్తామన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ బాక్సులను గుజరాత్ రాష్ట్రం నుంచి తెప్పిస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో గ్రామ పంచాయతీ ఎన్నికలు వరుసగా నిర్వహించే అవకాశం ఉన్నందున నల్గొండ జిల్లాలో ఉన్న బ్యాలెట్ బాక్సులు సరిపోయే అవకాశం లేదు. దీంతో గుజరాత్ నుంచి 4,280 బ్యాలెట్ బాక్సులను తెప్పించారు. వాటిని శుక్రవారం నల్గొండ జిల్లా పరిషత్ పాత భవనంలో భద్రపరిచారు.
ఇంటి వద్దకే కార్గో సేవలు పేరుకే పరిమితమయ్యాయని వినియోగదారులు అంటున్నారు. ప్రైవేట్ కాంట్రాక్టర్ల చేతిలో కార్గో సేవలు అస్తవ్యస్తంగా తయారయ్యాయని చెబుతున్నారు. NLG బస్టాండ్లో ఏర్పాటు చేసిన కార్గో సేవలు ఒకప్పుడు ప్రజలకు సులభతరంగా ఉండగా.. ఇప్పుడు మొక్కుబడిగా మారాయన్న ఆరోపణలున్నాయి. ఒక్కో బుకింగ్కు గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందని కస్టమర్లు అంటున్నారు. చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
SLBC సొరంగం పనులను తిరిగి ప్రారంభించడానికి వేగవంతంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. చక్ర ఏరియాలో ఎస్ఎల్బీసీ సొరంగంపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనులను తిరిగి ప్రారంభించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ, ఈ ప్రాజెక్టు పనులను త్వరలో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
కనగల్(M) దర్వేశిపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారు శుక్రవారం భక్తులకు వరలక్ష్మి దేవిగా దర్శనమిచ్చారు. ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు నాగోజు మల్లాచారి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు శ్రవణ్ కుమార్, దామోదర్ రావు, మహేశ్వరరావు, ఫణి, చంద్రయ్య, ఉపేందర్ రెడ్డి, ఆంజనేయులు, నాగరాజు, శ్రీకర్ పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.