Nalgonda

News October 5, 2025

ప్రజావాణి కార్యక్రమం రద్దు: జిల్లా కలెక్టర్

image

జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.
ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత తిరిగి యధావిధిగా ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈ సమయంలో ప్రజలు ఫిర్యాదుల కోసం కలెక్టరేట్‌కు రావద్దని సూచించారు.

News October 4, 2025

NLG: జడ్పీ పీఠంపై కాంగ్రెస్ కసరత్తు!

image

NLG జడ్పీ ఛైర్మన్ ఈసారి ఎవరవుతారన్నది ఆసక్తికరంగా మారింది. జిల్లాలోని 33 ZPTC స్థానాల్లో ST మహిళలకు పెద్దవూర, డిండి స్థానాలు రిజర్వు కాగా, DVK, పీఏపల్లి, కొండమల్లేపల్లి స్థానాలు ST జనరల్‌కు రిజర్వ్ అయ్యాయి. ఈ 5 స్థానాలతో పాటు జనరల్, జనరల్ మహిళలకు కేటాయించిన స్థానాల్లోనూ ST మహిళలు పోటీ చేసే అవకాశం ఉంది. ఈ స్థానాల్లో పోటీ చేసేందుకు తీవ్ర పోటీ నెలకొంది.

News October 4, 2025

NLG: జిల్లాలో జోరుగా వరి కోతలు

image

జిల్లాలో వానాకాలం వరి కోతలు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 5.05 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో నాన్ ఆయకట్టు ప్రాంతంలో సుమారు 3 లక్షల ఎకరాలు వరి సాగయింది. అయితే నాన్ ఆయకట్టులో జూన్ మొదటి వారంలోని బోరుబావుల కింద వరి నారు పోసుకున్న రైతులు జులైలో నాట్లు వేసుకున్నారు. ముందస్తుగా సాగుచేసిన వరి చేలను మూడు రోజుల నుంచి రైతులు ముమ్మరంగా కోస్తున్నారు.

News October 4, 2025

నల్గొండ: గుండెపోటుతో యువకుడి అకాల మరణం

image

ఉల్సాయిపాలెంలో విషాదం నెలకొంది. కేతావత్ నరేష్ నాయక్ (35) ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు గుండెపోటుతో హఠాణ్మరణం చెందారు. పిన్న వయస్కుడైన నరేష్ నాయక్ మరణంతో కుటుంబం మొత్తం తీవ్ర క్షోభలో మునిగిపోయింది. యువకులు ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకుండా, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, ఏ చిన్న తేడా వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు.

News October 4, 2025

చండూరు పేరు వెనుక చండికాదేవి చరిత్ర

image

చండూరుకి ఆ పేరు చండికాదేవి పేరు నుంచే ఏర్పడిందని పూర్వికులు చెబుతున్నారు. 1930కి పూర్వం నేటి కనకదుర్గ ఆలయం వద్ద చండికా యాగం జరిగినట్లు గ్రామ చరిత్ర చెబుతోంది. కనకదుర్గమ్మను అప్పట్లో చండికాదేవిగా కొలిచేవారని ప్రముఖ కవి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి ధృవీకరించారు. పూర్వం ఇక్కడ దసరా పండుగను కులమతాలకు అతీతంగా ఊరేగింపులు, విందు వినోదాలతో ఘనంగా నిర్వహించేవారు. మీ ఊరి పేరు వెనుక ఇలాంటి చరిత్ర ఉందా..?

News October 4, 2025

కనగల్: నీటి సంపులో పడి బాలుడి మృతి

image

కనగల్ మండలం పగిడిమర్రిలో పండుగ రోజు విషాదం అలుముకుంది. ఇంటి ఆవరణలోని నీటి సంపులో పడి హర్షద్ రామ్ (3) అనే బాలుడు మృతి చెందాడు. ఇటికాల రామలింగం-శ్రీలత దంపతుల కుమారుడైన హర్షద్ రామ్.. బొమ్మ పిస్టోల్ సంపులో పడగా, దానిని తీసేందుకు యత్నించి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. గమనించే లోపే ఊపిరాడక మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

News October 3, 2025

NLG: మద్యం టెండర్‌లకు మందకొడిగా దరఖాస్తులు..!

image

మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ నల్గొండ జిల్లాలో మందకొడిగా సాగుతుంది. 154 మద్యం దుకాణాలకు గత నెల 26 నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. అనూహ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన రావడంతో ప్రభుత్వం ఆశించినమేర దరఖాస్తులు రావడం లేదు. 26వ తేదీ నుంచి నేటి వరకు 8 దరఖాస్తులే వచ్చాయి. పాత వారితోపాటు కొత్త వ్యక్తులు బరిలో ఉంటారని భావించినప్పటికీ దరఖాస్తుల సంఖ్య తక్కువగానే ఉంటుంది. ఈనెల 18 దరఖాస్తులకు చివరి తేదీ.

News October 3, 2025

NLG: నిమ్మకాయల ధర పతనం

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిమ్మకాయలకు ధర లేక రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ముఖ్యంగా NLG, SRPT జిల్లాలో రైతులు అధికంగా నిమ్మ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతాలలో ఈసారి భారీగా నిమ్మ దిగుబడులు పెరిగాయి. పది రోజుల నుంచి నిమ్మ ధరలు సగానికి సగం పడిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బస్తా ధర రూ.300లకే మించి రావడం లేదని తెలిపారు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలంటున్నారు.

News October 2, 2025

NLG: 6.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం.. 375 కేంద్రాలు!

image

వానాకాలం వరిధాన్యం కొనుగోళ్లకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో ఈ సీజన్‌లో 375 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కాగా ఈ సంవత్సరం జిల్లాలో 6,30,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేశారు. సన్న, దొడ్డు ధాన్యానికి వేరువేరుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

News October 2, 2025

‘గాంధీ మహాత్ముడు కూడా దైవ స్వరూపమే’

image

చిట్యాల మండలం పెద్దకాపర్తి గాంధీ గుడిని VJA-HYD జాతీయ రహదారి పై ప్రయాణించే వారు భక్తితో దర్శిస్తుంటారు. గుడికి వచ్చిన భక్తులకు కంకణధారణ, అర్చన చేసి హారతి ఇచ్చి, డ్రై ఫ్రూట్స్ ను ప్రసాదంగా అందిస్తామని ఆలయ పురోహితులు కూరెళ్ళ నరసింహాచారి తెలిపారు. గాంధీ కూడా దైవ స్వరూపమేనని అన్నారు. దర్శనం అనంతరం కాసేపు గుడి వద్దే కూర్చుని భక్తులు ధ్యానం చేసి వెళ్తుంటారని చెప్పారు.