India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నల్గొండలోని చెర్లపల్లి బైపాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. బైక్, డీసీఎం ఢీకొనడంతో బైక్పై ప్రయాణిస్తున్న అన్నదమ్ములకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం ఇవ్వగా, వారిని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఒకరు మరణించారు.
నల్గొండ జిల్లాలోని పలు మండలాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. దీనితో పలు ప్రాంతాల్లో రోడ్లు, వీధులు జలమయమయ్యాయి. గుడిపల్లి మండలం సింగరాజుపల్లిలో అత్యధికంగా 62.8 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. అత్యల్పంగా త్రిపురారం మండలం మాటూరు, దామరచర్ల మండలం తిమ్మాపురం, కట్టంగూర్ మండలం అయిటిపాములలలో 0.8 మి.మీ. వర్షం కురవగా, నల్గొండలో 44.8 మి.మీ. వర్షపాతం నమోదయింది.
ఈ సంవత్సరపు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఎలాంటి లోపాలు లేకుండా వేడుకలు జరగాలని ఆమె చెప్పారు. విజయవంతం కావడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కోరారు.
జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శివశంకర్ రెడ్డి గురువారం నల్గొండలోని పలు హోటళ్లు, బేకరీలు, మాంసాహార దుకాణాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. హానికారక, నిషేధిత రంగులు వాడుతున్న వారికి నోటీసులు జారీ చేశారు. అనుమానాస్పద పదార్థాలపై ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ వాహనంతో తక్షణ పరీక్షలు నిర్వహించినట్లు శివశంకర్ రెడ్డి తెలిపారు. పాల నాణ్యతను కూడా పరిశీలించినట్లు తెలిపారు.
డిండిలోని డీఎన్టీ కాలనీకి చెందిన పెండ్ర రూప (26) వివాహం కావడం లేదని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని ఎస్సై బాలకృష్ణ తెలిపారు. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.
పై చిత్రంలో కనిపిస్తున్న జిల్లోజు పూలమ్మ, జిల్లోజు రాములు అక్కాతమ్ముళ్లు. పుట్టుకతోనే మూగవారు. వీరి స్వగ్రామం SLG(M) ఇటుకులపహాడ్. బాల్యంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. వృద్ధాప్యంతో ఇబ్బందిపడుతున్నా నేటికీ పింఛను రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, కలెక్టర్ స్పందించి వారికి పింఛను మంజూరు చేయాలని కోరుతున్నారు.
ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు మిర్యాలగూడలో సాండ్ బజార్ను ఏర్పాటు చేశారు. చింతపల్లి ఎక్స్ రోడ్డు వద్ద కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్యే బీఎల్ఆర్ ప్రారంభించారు. అందుబాటు ధరలో నాణ్యమైన ఇసుకను అందించడమే లక్ష్యమని వారు పేర్కొన్నారు.
NLG జిల్లాలో మత్స్యకారులకు పంపిణీ చేయాల్సిన ఉచిత చేప పిల్లల సరఫరా కోసం ప్రభుత్వం ఇప్పటికి టెండర్లు పిలవలేదు. 3 నెలలు కావొస్తున్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకపోవడంతో ఈసారి చేప పిల్లల పంపిణీ లేనట్టేనని మత్స్యకారులు అంటున్నారు. జిల్లా వ్యాప్తంగా డిపార్ట్మెంట్ చెరువులు, రిజర్వాయర్లు, గ్రామపంచాయతీ చెరువులు, కుంటలు కలిపి మొత్తం 1160కి పైగానే ఉన్నాయి. 60వేల మంది చేపల పెంపకం పై ఆధారపడి జీవిస్తున్నారు.
నకిరేకల్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని ఈ నెల 13న నాటికి 20 శాతానికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. కేతేపల్లి ఎంపీడీవో కార్యాలయంలో నియోజకవర్గం ఎంపీడీవోలు, తహశీల్దార్లు, ఏపీఎంలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఇళ్ల నిర్మాణానికి ఇసుక, మెటల్, ఇతర ముడి పదార్థాల సమస్యలు తలెత్తకుండా తహశీల్దార్లు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.
ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల ద్వారా అన్ని రకాల వైద్య సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.
బుధవారం ఆమె మాన్యం చెల్క పట్టణ వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపి, ఏఎన్సీ, మందుల స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. అలాగే టెస్టులు, ఇతర రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఆయా చికిత్సలకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Sorry, no posts matched your criteria.