Nalgonda

News August 23, 2024

యాదాద్రి క్షేత్రంలో నేడు చండీ హోమం

image

యాదగిరిగుట్ట శ్రీవారి కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్దిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉ.9గం లకు మహా చండీ హోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. హోమంలో రూ.1250 టికెట్ పొంది భక్తులు పాల్గొనవచ్చు. హోమంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి అభిషేక లడ్డు, శాల్ల, కనుమ ప్రసాదంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరారు.

News August 23, 2024

ఆర్ఓఆర్ చట్టం 2024పై ప్రజాభిప్రాయ సేకరణ: కలెక్టర్ తేజస్ నంద్ లాల్

image

నూతన రెవెన్యూ చట్టం ఆర్వోఆర్– 2024 ముసాయిదా అమలుపై ఇవాళ కలెక్టరేట్ కార్యాలయంలో చర్చ వేదిక నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ గురువారం తెలిపారు. అన్నీ వర్గాల నుంచి విస్తృత అభిప్రాయాలు స్వీకరించాలనే లక్ష్యంతో చర్చ కార్యక్రమం నిర్వహణ చేపట్టనున్నట్ల పేర్కొన్నారు. ప్రజా ప్రతినిదులు, న్యాయవాదులు సీనియర్ పాత్రికేయులు సూచనలు అందించాలని తెలిపారు.

News August 22, 2024

యాదాద్రిలో పూజలు, హరీశ్ రావుపై పోలీసులకు ఫిర్యాదు 

image

యాదగిరిగుట్ట ఆలయంపైన మాడవీధుల్లో మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎమ్మెల్యే లు పూజలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆలయ ఈవో భాస్కరరావు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. అనుమతి లేని ప్రదేశంలో బీఆర్ఎస్ నేతలు బయటి పూజారులతో మాడవీధుల్లో పూజలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సెక్షన్ 7 రిలీజియన్ యాక్ట్- 1988 ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నారు.

News August 22, 2024

NLG: పంచాయతీ పోరుకు పల్లెలు సై

image

పంచాయతీ పోరుకు పల్లెలు సై అంటున్నాయి. అసెంబ్లీ ఓటరు జాబితాను జీపీకి కన్వర్ట్ చేయాలని సర్కారు ఆదేశాలతో సర్పంచ్ బరిలో నిలిచే ఆశావహులు తెరపైకి వస్తున్నారు. సేవా కార్యక్రమాలతో ప్రజల మధ్యలో ఉంటున్నారు. రిజర్వేషన్ల లెక్క తేలక ముందే.. బరిగీసి కొట్లాడేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఆపద సమయంలో నేనున్నానంటూ ఆర్థిక సాయం చేస్తూ పోటీదారులతో బలాబలాలు తేల్చుకునే పనిలో నిమగ్నమవుతున్నారు.

News August 22, 2024

NLG: పర్యావరణహితుడు .. మన సైదులు!

image

చౌటుప్పల్ కు చెందిన నిల్లిగొండ సైదులు ఏటా మట్టి గణేశ్‌ విగ్రహాలను తయారు చేస్తూ పర్యావరణ పరిరక్షణకు తమవంతుగా కృషి చేస్తున్నారు. బీఎస్సీ చదివి స్వయం ఉపాధిగా కులవృత్తిని ఎంచుకున్న సైదులు.. సొంతూరిలో కుండలతో పాటు గ్రామ దేవతల విగ్రహాలు, పూజకు అవసరమయ్యే వస్తువులను మట్టితో తయారు చేస్తూ పర్యావరణహితుడిగా పేరు పొందాడు. ఈ ఏడాది 20 వేల మట్టి గణపతి విగ్రహాలను తయారు చేసినట్లు తెలిపారు.

News August 22, 2024

నిండుకుండలా సాగర్ జలాశయం..

image

సాగర్ జలాశయ నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరి నిండుకుండలా కనిపిస్తోంది. బుధవారం శ్రీశైలం జలాశయం నుంచి 47,650 క్యూసెక్కుల వరదనీరు సాగర్ జలాశయానికి చేరింది. సాగర్ నుంచి కుడి కాల్వ ద్వారా 8144 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 8280, ప్రధాన విద్యుత్ కేంద్రం ద్వారా 28826, SLBC ద్వారా 1800, వరద కాలువ ద్వారా 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

News August 22, 2024

వ్యభిచార గృహంపై దాడి.. ముగ్గురి అరెస్ట్

image

వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేసి ఇద్దరు విటులను, నిర్వాహకురాలిని అరెస్ట్ చేశారు. ఎస్ఐ ముత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం.. HZNR పట్టణంలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు బుధవారం పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు వ్యభిచార గృహంపై దాడి చేసి ఇద్దరు విటులను, నిర్వాహకురాలిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఐదు సెల్ ఫోన్లు, 3 మోటారు సైకిళ్లు. రూ.1700 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

News August 22, 2024

శాండ్ టాక్స్ ద్వారానే బుక్ చేసుకోవాలి: కలెక్టర్

image

ఇసుక అవసరమైన వారు శాండ్ ట్యాక్స్ ద్వారా బుక్ చేసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. బుధవారం ఆయన నల్లగొండ నుంచి గుర్రంపోడు వెళ్తూ మార్గమధ్యలో మావిళ్లగూడెం, పర్వతగిరి గ్రామాల మధ్య వెళ్తున్న ఇసుక ట్రాక్టర్లను ఆపి అనుమతులు, లైసెన్స్, తదితర రశీదులను తనిఖీ చేశారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

News August 22, 2024

గుణాత్మక విద్యపై అధికారులతో కలెక్టర్ సమావేశం

image

నియోజక వర్గాల వారిగా ఎంపిక చేసిన ప్రత్యేక పాఠశాలల్లో గుణాత్మక విద్య అందించడం ద్వారా ఈ సంవత్సరం 10వ తరగతి ఫలితాలలో కనీసం 50 శాతం మంది విద్యార్థులు 10కి10 జీపీఏ సాధించేలా చూడాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఉదయాదీత్య భవన్లో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఎంపిక చేసిన పాఠశాలల్లో గుణాత్మక విద్యపై జిల్లా అధికారులు, సంబంధిత ఎంఈఓ, హెచ్ఎం, టీచర్లతో సమావేశం నిర్వహించారు.

News August 21, 2024

గ్రామస్థుల ఫిర్యాదు.. సస్పెండ్ చేయాలని నల్గొండ కలెక్టర్ ఆదేశం  

image

కొప్పోలులో పశు వైద్య ఉపకేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. లైవ్ స్టాక్ అసిస్టెంట్ మట్టయ్య విధులకు సరిగా రావడం లేదని, పశువులకు చికిత్స అందించడం లేదని గ్రామస్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ తక్షణమే లైవ్ స్టాక్ అసిస్టెంట్ మట్టయ్యను విధుల నుంచి సస్పెండ్ చేయాలని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారిని ఆదేశించారు.